India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరం శివారు పంపన వారి పాలెం పెట్రోల్ బంకు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనుమంట్ర గ్రామానికి చెందిన గుబ్బల వెంకటేశ్వరరావు మృతి చెందాడు. వెంకటేశ్వరరావు మోటార్ సైకిల్పై పెనుమంట్ర వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించామని ఇంటర్ బోర్డ్ ఆర్.ఐ.వో నరసింహం మంగళవారం తెలిపారు. వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తత్కాల్ స్కీము ద్వారా అవకాశం కల్పించామని చెప్పారు. ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సరాలకు చెందిన జనరల్ ఒకేషనల్ విద్యార్థులు రూ.3 వేలు ఫైన్తో పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు.
హైదరాబాదులో ప.గో.జిల్లాకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వీరవాసరం మండలం నవుడూరుకు చెందిన కె. భగవాన్ (26) తన రెంట్ హౌస్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భగవాన్కు ఫిబ్రవరి నెలలో వివాహం నిశ్చయమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన చావుకు ఎవరు కారణం కాదని లేఖ రాశాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
డెడ్బాడీ పార్శిల్ ఘటనలో రోజుకో కొత్త అంశం వెలుగు చూస్తోంది. పర్లయ్యను చంపిన శ్రీధర్ వర్మ.. ఆ డెడ్బాడీని ఓ చెక్కపెట్టెలో పెట్టి తులసి ఇంటికి పార్శిల్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్రీధర్ వర్మను విచారిస్తున్న పోలీసులు అతడి ఇంటిని పరిశీలించారు. అక్కడ మరో చెక్కపెట్టె, చేతబడి సామాన్లు దొరికినట్లు తెలుస్తోంది. దేనికోసం రెండో చెక్కపెట్టెను శ్రీధర్ రెడీ చేశాడని ఆసక్తి రేపుతోంది.
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలలో చేపట్టిన టాయిలెట్లు, త్రాగునీటి సౌకర్యం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆర్ డబ్ల్యూఎస్, ఐసిడిఎస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్మాణ పనులన్నీ తప్పనిసరిగా నాణ్యతతో ఉండాలన్నారు. పనులను సంబంధిత అధికారులు పర్యవేక్షించి, ధృవీకరించాలన్నారు.
పేదల ఇళ్లను తొలగించాలని చూస్తున్న ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కుట్రలను తిప్పికొట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం పాలకోడేరులో జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఏఎస్ఆర్ నగర్లో 140 మంది దశాబ్దాల క్రితం ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న వారి ఇళ్లను తొలగించాలని ఎమ్మెల్యే కుట్రలు చేయడం తగునా అని జక్కంశెట్టి ప్రశ్నించారు.
తులసిని హత్య కేసులో ఇరికించడానికే శ్రీధర్ వర్మ వ్యూహాత్మకంగా వ్యహరించినట్లు తెలుస్తోంది. కాళ్ల(M) గాంధీనగర్కు చెందిన <<14958481>>పర్లయ్య<<>> మద్యానికి బానిసై కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఎక్కడ ఎవరు తిండి పెడితే అక్కడే పర్లయ్య పనిచేసి అక్కడే నిద్రిస్తుంటాడు. శ్రీధర్ మొదటి భార్యది కూడా పర్లయ్య ఊరే కావడంతో శ్రీధర్కు ఈ విషయం తెలిసింది. దీంతో పర్లయ్యను చంపితే ఎవరికీ అనుమానం రాదని తన ప్లాన్ అమలు చేశాడు.
డెడ్బాడీ పార్శిల్ కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. ఇందులో <<14964154>>శ్రీధర్ వర్మనే <<>>కీలకమని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తులసి ఇంటికి వచ్చిన డెడ్బాడీ <<14958481>>పర్లయ్యది<<>> అని తేల్చారు. ఎర్ర కారులో వచ్చిన మహిళ ఆటో డ్రైవర్కు పార్శిల్ ఇచ్చి తులసికి ఇవ్వాలని చెప్పి వెళ్లిపోయింది. అసలు ఆమెకు శ్రీధర్కు లింక్ ఏంటి? హత్య తర్వాత ఇద్దరూ కలిసి కారులో పారిపోయారా? అనేది తెలియాలి.
ఉండి డెడ్బాడీ పార్శిల్ కేసులో సరికొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తులసి ఇంటికి వచ్చిన డెడ్బాడీ <<14958481>>పర్లయ్యదిగా<<>> గుర్తించిన విషయం తెలిసిందే. తన ఇంట్లో తాపీ పనుల కోసం పర్లయ్యను తులసి చెల్లెలి భర్త శ్రీధర్ వర్మ తీసుకెళ్లి హత్య చేసినట్లు సమాచారం. ఆ తర్వాత ఓ మహిళ సాయంతో ఈ డెడ్బాడీని తులసికి పంపాడు. ఆస్తి కోసమే ఈ నేరాన్ని తన వదిన, అత్తమామలపై నెట్టే ప్రయత్నంలో ఇలా చేసి ఉంటాడని అందరూ అనుమానిస్తున్నారు.
ఉండి మండలంలో సంచలనం రేపిన డెడ్బాడీ పార్శిల్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో కీలకంగా ఉన్న తులసి చెల్లెలి భర్త శ్రీధర్మ వర్మ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. తులసి ఇంటికి డెడ్బాడీ వచ్చినప్పటి నుంచి ఇతను కనపడకపోవడంతో ఈ కేసులో అన్ని వేళ్లు అతని వైపే చూపిస్తున్నాయి. దీంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలించగా అతను దొరికినట్లు తెలుస్తోంది. మరి అతను విచారణలో ఏం చెబుతాడనేది ఆసక్తిగా మారింది.
Sorry, no posts matched your criteria.