WestGodavari

News July 13, 2024

ప.గో: బైక్‌పై వస్తుండగా చెట్టు విరిగిపడి వ్యక్తి దుర్మరణం

image

పెరవలి మండలం ఖండవల్లిలోని పౌల్ట్రీ వద్ద చెట్టు విరిగి పడటంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. చాగల్లుకు చెందిన కువలేశ్ ఇరగవరం మండలం పేకేరులోని బంధువుల ఇంటికెళ్లాడు. తిరిగి బైక్‌పై ఇంటికి వస్తుండగా ఖండవల్లి వద్ద చెట్టు విరిగి అతడిపై పడింది. తలకు తీవ్ర గాయాలైన కువలేశ్‌ను తణుకు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News July 13, 2024

ప.గో, ఏలూరు జిల్లాల ఎస్పీలు బదిలీ

image

ప.గో, ఏలూరు జిల్లాల ఎస్పీలు అజిత వేజెండ్ల, మేరీ ప్రశాంతి బదిలీ అయ్యారు. కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్న ఆద్నాన్ నయీం అస్మీ పశ్చిమ గోదావరి జిల్లాకు.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ASPగా ఉన్న ప్రతాప్ శివకిషోర్ ఏలూరు ఎస్పీగా నియమితులయ్యారు. కాగా.. ప.గో ఎస్పీ అజిత వేజెండ్ల విశాఖపట్నం డిప్యూటీ కమిషనర్-1గా వెళ్తున్నారు.

News July 13, 2024

ప.గో.: ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య

image

ప.గో. జిల్లా వీరవాసరం మండలం పేర్కిపాలెం గ్రామానికి చెందిన ఆనంద్ కుమార్(19) శుక్రవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశంలో ఉంటున్నారు. నాయనమ్మ వద్ద ఉంటున్న ఆనంద్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 13, 2024

నరసాపురం: వశిష్ట వారధి టెండర్లు మళ్లీ వాయిదా

image

వశిష్ట వారధి టెండర్లు ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసినట్లు జాతీయ రహదారుల శాఖ ఈఈ శ్రీనివాసులు చెప్పారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల మధ్య రామేశ్వరం- నరసాపురం మండలం రాజులంక వద్ద వారధి నిర్మాణానికి గత ఏడాది ఆగస్టులో టెండర్లు పిలిచారు. భూసేకరణపై కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో టెండర్లు తెరవకుండా NH అధికారులు వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇదే కారణంతో వాయిదా వేయడం ఇది 11వ సారి.

News July 13, 2024

ఉండి ఎమ్మెల్యే RRR ఫిర్యాదు.. కేసు నమోదైన వారి వివరాలివే.!

image

తనను కస్టడీలో చంపేందుకు యత్నించారని ఉండి MLA శుక్రవారం గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైన విషయం తెలిసిందే. కేసులో నిందితులుగా ఉన్నది వీరే. A1: పీవీ సునీల్ కుమార్ (సీఐడీ విభాగం మాజీ చీఫ్) A2: పీఎస్ఆర్ ఆంజనేయులు (నిఘా విభాగం మాజీ చీఫ్) A3: YS జగన్ (వైసీపీ అధినేత, నాటి సీఎం) A4: ఆర్. విజయ పాల్ (నాటి అదనపు ఎస్పీ, సీబీసీఐడీ) A5: డాక్టర్ ప్రభావతి( నాటి గుంటూరు GGH సూపరింటెండెంట్), ఇతరులు.

News July 13, 2024

ప.గో.: రూ.7లక్షలకు బ్యాంక్‌లో ఉద్యోగమంటూ మోసం

image

ఏలూరుకు చెందిన ఓ వ్యక్తి కొందరితో ముఠాగా ఏర్పడి ఉమ్మడి ప.గో.లోని నిరుద్యోగులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడేనికి చెందిన డిగ్రీ చదివిన రాశికి బ్యాంక్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని రూ.7లక్షలు డిమాండ్ చేశారు. నమ్మి డబ్బు కట్టగా నకిలీ అపాయింట్ మెంట్ ఇచ్చి, శిక్షణ సైతం ఇచ్చారు. తీరా ఉద్యోగం లేదని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో దందా వెలుగులోకి వచ్చింది.

News July 13, 2024

ప.గో.: అంతర్జాతీయ స్థాయిలో కవి ప్రసాద్‌కు సత్కారం

image

అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో ‘పర్యావరణాని కోసం మొక్క నాటుదాం’ అనే అంశంపై కవితల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ కవి వీఎస్‌వీ ప్రసాద్‌కు ప్రథమ బహుమతి లభించింది. 350 మంది కవులు పాల్గొన్నారు. ‘తనుత్రాణం’ పేరుతో రచించిన కవితకు ప్రశంసలు లభించాయి.

News July 12, 2024

నరసాపురం: యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

నరసాపురం మండలం కొప్పర్రులో శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాలు.. నరసాపురం పట్టణానికి చెందిన వీర వెంకట సూర్యనారాయణ మూర్తి (62) భీమవరంలో బ్యాంక్‌ పనిమీద బైక్‌పై బయలుదేరాడు. కొప్పర్రు గ్రామానికి చేరుకోగానే వెనక నుంచి వచ్చిన లారీ ఢీ కొంది. దీంతో సూర్యనారాయణ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య సుబ్బలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు రూరల్ SI గుర్రయ్య తెలిపారు.

News July 12, 2024

పోలవరం: 7,080 క్యూసెక్కుల నీటి విడుదల

image

పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 7,080 క్యూసెక్కుల గోదావరి వరద జలాలను పోలవరం ప్రాజెక్ట్ కుడి కాలువకు విడుదల చేసినట్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పెద్దిరాజు శుక్రవారం తెలిపారు. పట్టిసీమలో గోదావరి నీటిమట్టం 15.387 మీటర్లకు చేరుకుందని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 20 పంపులు, 20 మోటార్లతో నీటిని విడుదల చేశామని వివరించారు.

News July 12, 2024

వరి రైతులతో ఏలూరు ఎంపీ సమావేశం

image

రాజమండ్రిలో అతిపెద్ద వరి ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాం, నిత్యం 3,000 టన్నుల నుంచి 3,500 టన్నుల ధాన్యం అవసరమవుతుందని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ అన్నారు. ఏలూరులో వరి రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వరి ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తారని, తడిసిన ధాన్యాన్ని కూడా వారే కొంటారని తెలిపారు. వరి రైతులకు ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కారించటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.