WestGodavari

News December 24, 2024

ప.గో: ఎమ్మెల్సీని అభినందించిన సీఎం చంద్రబాబు

image

తూర్పు పశ్చిమగోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం మర్యాదపూర్వక కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గోపి మూర్తిని అభినందించారు. అనంతరం ఉపాధ్యాయ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

News December 23, 2024

ప.గో: పార్సిల్‌లోని డెడ్‌బాడీని గుర్తించిన పోలీసులు

image

పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగు రోజుల నుంచి మిస్టరీగా ఉన్న ఉండి మండలం యండగండి పార్సిల్‌లో డెడ్ బాడీ కేసులో పురోగతి లభించింది. డెడ్‌బాడీ ఎవరిదీ అనేది సోమవారం పోలీసులు గుర్తించారు. కాళ్ల మండలం గాంధీనగర్ చెందిన బర్రె పర్లయ్యగా పోలీసులు గుర్తించారు. అసలు డెడ్‌బాడీని అందులో పార్శిల్ చేసి తులసి ఇంటికి ఎందుకు పంపారు? అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News December 23, 2024

ఉండి: శ్రీధర్ దొరికితేనే అన్నీ తేలుతాయి..!

image

ఉండిలో పార్శిల్లో డెడ్‌బాడీ కేసు ఓ కొలిక్కి రావడం లేదు. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న తులసి చెల్లెల భర్త శ్రీధర్ వర్మ మూడు పేర్లతో మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. తులసితో ఆస్తి తగాదాలు ఉన్న క్రమంలో అతనే ఓ మహిళ సాయంతో తులసి ఇంటికి డెడ్‌బాడీ పంపాడని సమాచారం. ఆ డెడ్‌బాడీ ఎవరిది? పార్శిల్ తీసుకెళ్లాలని ఆటో డ్రైవర్‌కు చెప్పిన మహిళ ఎవరు? అనే ప్రశ్నలకు శ్రీధర్ చిక్కితేనే సమధానం తెలుస్తుంది.

News December 23, 2024

సంక్రాంతికి రెడీ అవుతున్న కోళ్లు

image

కోడి పందేలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. సంక్రాంతి వస్తుందంటే మూడు రోజులు పందేలు జోరుగా సాగుతుంటాయి. గెలుపే లక్ష్యంగా కోళ్లను సిద్దం చేస్తున్నారు. బలమైన ఆహారాన్ని తినిపించడంతో పాటు, కొలనులలో ఈత కొట్టించడం, వాకింగ్ చేయించడం చేస్తున్నారు. భీమవరం, నరసాపురం, జంగారెడ్డిగూడెం, ద్వారకాతిరుమల, తాడేపల్లిగూడెంలో పందాలు జరుగుతుంటాయి. పందేలకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

News December 23, 2024

ద్వారకాతిరుమల: బాత్‌రూమ్‌లో అమ్మాయిల ఫొటోలు తీసిన ఆకతాయిలు

image

ద్వారకాతిరుమలలోని ఓ పాఠశాలలోని బాత్‌రూమ్‌కి వెళ్లిన తమను చెట్టుపైకి ఎక్కి ఇద్దరు వ్యక్తులు ఫొటోలు తీసినట్లు బాలికలు ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు పారిపోయారు. బాలికల ఇళ్లలో విషయం చెప్పగా.. తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. పాఠశాల విద్యా కమిటీ ఫిర్యాదుతో సందీప్ కుమార్, జోనుబోయిన జితేంద్రపై పోలీసులు ఆదివారం పోక్సో కేసు నమోదు చేశామన్నారు.

News December 23, 2024

ఏలూరు: ఇంటర్ బాలిక ప్రసవం.. మరో ట్విస్ట్

image

ఏలూరులోని మిషనరీ క్వారెంటైన్‌లో ఇంటర్ బాలిక ఈనెల 8న మగ బిడ్డకు జన్మనిచ్చి పైనుంచి విసిరేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎదురుగా ఉన్న స్కూల్ ఆఫీస్ బాయ్ అఖిల్(24), ట్యూషన్ చెప్పడానికి వచ్చిన నంద్యాల జిల్లా వాసి రాజీవ్(30) బాలికను లోబర్చుకుని అత్యాచారం చేశారనే అభియోగాలతో అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి కూడా బాలికపై అత్యాచారం చేశారని ఆరోపణలు వస్తున్నాయి.

News December 23, 2024

ఉండి: ‘పార్సిల్ మృతదేహం గుర్తించిన వారు డీఎస్పీకి సమాచారం అందించాలి’

image

ఉండి మండలం యండగండి గ్రామంలో పార్సిల్ వచ్చిన మృతదేహం ఈ నెల 16, 17 తేదీల్లో చనిపోయి ఉండవచ్చని, ఈ మృతదేహాన్ని గుర్తించిన వారు తమకు చెప్పాలని భీమవరం డీఎస్పీ జయసూర్య తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మృతదేహం ఒంటిపై నలుపు రంగు స్వెటర్ ఉందని అన్నారు. వయసు సుమారు 30 నుంచి 40 ఉండవచ్చని, ఎవరైనా మిస్ అయి ఉంటే డీఎస్పీ కార్యాలయంలోని 9154966497, 9440796648 నంబర్లకు సంప్రదించాలని కోరారు.

News December 22, 2024

నోరూరించే ప.గో జిల్లా వంటకాలు

image

గోదావరి జిల్లాలు అంటేనే నోరూరించే వంటకాలకు ఫేమస్. అందులోనూ సంక్రాంతి వచ్చేస్తోంది. దీంతో ప.గో జిల్లాలో పిండి వంటకాలకు గిరాకీ మరింత పెరిగింది. అరిసెలు, గవ్వలు, సకినాలు, చక్రాలు, సున్నండలు, పూతరేకులు, కాజాలు వంటివి ఇందులో ముఖ్యమైవని. ఇటు జిల్లాలో నాన్‌వెజ్ వంటకాలు మరో ఎత్తు. పందెం కోళ్లు, సీఫుడ్‌కు ఫిదా అవ్వాల్సిందే. మరి మన గోదావరి వంటకాల్లో మీకు నచ్చినది ఏదో కామెంట్ చేయండి.

News December 22, 2024

ఉండి: ఆ ఇద్దరూ దొరికితే వీడనున్న చిక్కుముడి

image

ఉండి మండలం యండగండిలో తులసి అనే మహిళ ఇంటికి డెడ్‌బాడీ పార్శిల్ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. ఆ మృతదేహం ఎవరిది? ఎందుకు పార్శిల్ చేశారనేది ఉత్కంఠగా మారింది. కాగా తులసి మరిది సిద్ధార్థ వర్మే నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తులిసి, ఆమె చెల్లికి ఉన్న ఆస్తి తగాదాలే ఇందుకు కారణమనే ప్రచారం సాగుతోంది. ఆటోలో మృతదేహాన్ని పార్శిల్‌కు అప్పగించిన మహిళ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

News December 22, 2024

ఏలూరు: యువతి తండ్రిని చిత్రహింసలు పెట్టి చంపాడు

image

ఏలూరు జూట్ మిల్లు సమీపంలో ఈ నెల 14న జరిగిన వెంకట కనకరాజు హత్య కేసు నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా కనకరాజుని హత్య చేస్తే అతని కూతురిని పెళ్లి చేసుకోవచ్చని నిందితుడు మామిడి నాని(23) భావించినట్లు పోలీసులు తెలిపారు. పదునైన చెక్కతో కనకరాజుని చిత్రహింసలు పెట్టి చంపినట్లు చెప్పారు. నానిపై గతంలోనూ ఓ మర్డర్ కేసు ఉందని, మరో హత్యాయత్నం కేసులోనూ నిందితుడని పేర్కొన్నారు.