WestGodavari

News January 26, 2025

ప.గో: జిల్లాకు హీరో వెంకటేశ్, మీనాక్షి చౌదరి

image

సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ మీట్ ఆదివారం భీమవరంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక ఎస్ఆర్‌కే ఇంజినీరింగ్ కళాశాలలో ఈవెంట్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మీట్‌కి హీరో వెంకటేశ్, హీరోయిన్లు, బుల్లిరాజు, మరికొంత మంది నటులు సందడి చేయనున్నారు. ఈ సినిమా రిలీజైన రోజే రూ.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిందని చిత్ర బృందం పేర్కొంది.

News January 26, 2025

భీమవరం: తుది జాబితా ఆమోదం: జేసీ

image

పశ్చిమ గోదావరి జిల్లాలోని భూముల మార్కెట్ విలువ పెంపునకు సమర్పించిన ప్రతిపాదనల తుది జాబితాను ఆమోదించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా భీమవరం కలెక్టరేట్‌లో జేసీ జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్స్ పరిధిలోని అధికారులతో సమావేశమై జిల్లాలోని భూముల విలువల పెంపుదలకు ప్రతిపాదనలను సమీక్షించి తుది ప్రతిపాదలను సమీక్షించి ఆమోదించారు.

News January 26, 2025

భీమవరం: గణతంత్ర వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన జెసీ 

image

భీమవరం కలెక్టరేట్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు పరిశీలించారు. ప్రభుత్వ పథకాలు ప్రతిబింబించేలా శకటాలు, స్టాల్స్ ఏర్పాట్లు చేయడం చేస్తున్నట్లు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రేక్షకులు వీక్షించేలా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

News January 26, 2025

కాళ్ళలో సీనియర్ ఓటర్లను సన్మానించిన తహశీల్దార్

image

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని శనివారం కాళ్ల హైస్కూల్లో నిర్వహించారు. తహశీల్దార్ జి. సుందర్ సింగ్ మాట్లాడుతూ ఓటరు నమోదు ఆవశ్యకతను, ఓటు హక్కు విలువలను వివరించారు.  సీనియర్ ఓటర్లైన వయోవృద్ధులను సత్కరించి, కొత్తగా ఓటు హక్కు పొందిన వారికి కొత్త ఓటు గుర్తింపు కార్డును పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఓటు ఆవశ్యకతపై ర్యాలీ నిర్వహించారు. వీఆర్వోలు శివనాగరాజు, రాజశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు.

News January 25, 2025

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించి ఎమ్మెల్యే రాధాకృష్ణ 

image

సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 1న తణుకులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దువ్వ గ్రామంలో పర్యటించారు. తణుకు మండలంలోని తేతలి తవ్వ గ్రామాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ స్థలాలను పరిశీలించనున్నారు. ఈ క్రమంలో శనివారం ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆయా ప్రాంతాల్లో పర్యటించి సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు.

News January 25, 2025

నూజివీడు: లారీ డ్రైవర్‌కు జైలు శిక్ష

image

ఓ లారీ డ్రైవర్‌కు మూడు నెలల జైలు శిక్ష, రూ. 200 జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మెజిస్ట్రేట్ శుక్రవారం తీర్పు వెలువరించారు. 2020లో బాపులపాడుకు చెందిన లెనిన్ ఆయన కుమార్తె శ్రీదేవీ బైకుపై వెళుతుండగా వారిని లారీ ఢీ కొట్టింది. దీంతో వారు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. దీనిపై అప్పట్లో హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో లారీ డ్రైవర్ ప్రభాకర్‌కు శిక్ష పడింది.

News January 25, 2025

పశువధను నిలిపివేయాలని కలెక్టర్‌కి మహిళలు విజ్ఞప్తి

image

తణుకు మండలం తేతలిలో లేహం ఫుడ్స్ పేరుతో నిర్వహిస్తున్న పశువధ కర్మాగారాన్ని మూసివేయాలని కోరుతూ స్థానిక మహిళలు జిల్లా కలెక్టర్ నాగరాణికు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రాత్రి తణుకులోని రామకృష్ణ సేవా సమితి భవనంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కలెక్టర్ నాగరాణిను కలిసిన వారు తణుకులో పశు వధ కర్మగారం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.

News January 25, 2025

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్..

image

ఫిబ్రవరి ఒకటో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తణుకు పట్టణంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి , జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి‌లతో కలిసి తేతలి, మండపాక లేఔట్లను, ఎస్ ఎన్ వి ఎం పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలోని హెలి ప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అన్నారు.

News January 24, 2025

ఏలూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

image

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద హైవేపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఇద్దరు స్నేహితులు విజయవాడ నుంచి ఏలూరు వైపు బైక్‌పై వెస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బైక్‌కు లారీ తగలడంతో అదుపుతప్పి ఇద్దరూ కిందపడ్డారు. క్రాంతికుమార్ తలపై నుంచి లారీ వెనక టైర్లు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఏలూరు జిల్లా పెదపాడు (మ)కడిమికొండ గ్రామ వాసిగా గుర్తించారు.

News January 24, 2025

ప.గో. త్వరలో ఆచంటలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు

image

ఆచంటలో రూ.కోటి వ్యయంతో త్వరలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఉక్కు భారీ పరిశ్రమల కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. గురువారం ఆచంట మండలం ఏ వేమవరం గ్రామంలో హాస్టల్ భవనాన్ని ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. డయాలసిస్ కేంద్రం ఏర్పాటు వల్ల కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. డయాలసిస్ కేంద్రం మంజూరులో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాత్ర ఎంతో ఉందన్నారు.