India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తణుకులో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. శనివారం తణుకు హైవేలో బైక్పై వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతదేహం నుజ్జునుజ్జైంది. పోలీసుల వివరాల ప్రకారం.. పెరవలి మండలం అన్నవరప్పడికి చెందిన వ్యాపారి సుబ్రహ్మణ్యం(45) మరణించాడు. రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి వృద్ధురాలు మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉండి మండలం యండగండిలో పార్శిల్లో డెడ్బాడీ మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. తులసి మరిది సిద్ధార్ధ వర్మే ప్రధాన సూత్రధారి అని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అతడు డెడ్బాడీ వచ్చినప్పటి నుంచి కనిపించకపోవడంతో పోలీసులు గాలిస్తున్నారు. డెడ్బాడీ ఎవరిది, ఆ పార్శిల్ తెప్పించింది ఎవరు అనే విషయాలు తెలియాలంటే సిద్ధార్ధ వర్మ దొరకాలి. పూర్తి వివరాలు తెలిపేందుకు మరో 2రోజులు పడుతుందని SP నయీం పేర్కొన్నారు.
ఈ నెల 27న నిర్వహించే జిల్లా యువ ఉత్సవాల్లో యువత తమ ప్రతిభ పాటవాలను నిరూపించుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడలు మంత్రిత్వ శాఖ, జిల్లా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ ఉత్సవ్ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆవిష్కరించారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యా ప్రమాణాల స్థాయి పెంచే విధంగా విద్యా శాఖాధికారులు కృషి చేయాలనీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ చెప్పారు. శనివారం జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ వెట్రి సెల్వీ పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు నియంత్రణకు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో విష జ్వరాలు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మాతా శిశు మరణాలు లేకుండా చూడాలన్నారు.
పీడీఎస్ బియ్యం అవకతవకలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. శనివారం భీమవరం మండలం నరసింహపురం వద్ద పలు రైస్ మిల్లులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు.
తణుకు జాతీయ రహదారిపై డిమార్ట్ సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామానికి చెందిన కూరగాయల వ్యాపారి అడ్డగర్ల సుబ్రహ్మణ్యం (45) బైక్పై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం మృతదేహం నుజ్జునుజ్జైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉండి(M) యండగండిలో పార్శిల్లో <<14930123>>డెడ్బాడీ <<>>ఘటన గంటకో మలుపు తిరుగుతోంది. ఓ ప్లేస్లో పార్శిల్ ఉందని ఆటో డ్రైవర్కు ఓ మహిళ కాల్ చేసి చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు అతను దానిని తీసుకెళ్లి తులసికి ఇచ్చాడని తెలుస్తోంది. కాగా పదేళ్ల కిందటే మిస్ అయిన తులసి భర్త, డెడ్బాడీ వచ్చిన తర్వాత మాయమైన తులసి చెల్లి భర్త ఎక్కడున్నారు? కాల్ చేసిన మహిళ, డెడ్బాడీ ఎవరిది అనే ప్రశ్నలకు జవాబు తెలియాల్సి ఉంది.
ఉండి మండలం యండగండిలో తులసి ఇంటికి వచ్చిన పార్శిల్లో గుర్తు తెలియని డెడ్బాడీ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సరికొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఈ డెడ్బాడీ పార్శిల్ వచ్చినప్పటి నుంచి తులసి చెల్లెలి భర్త కనిపించడం లేదు. అతను ఎక్కడికి వెళ్లాడో ఇంత వరకు ఎవరికీ తెలియలేదు. అసలు ఆ మృతదేహం ఎవరిదో కూడా ఇంకా తెలియకపోవడం సంచలనంగా మారింది.
ప.గో జిల్లాలో నిబంధనలు మీరి డ్రైవింగ్ చేస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. శుక్రవారం జిల్లా స్థాయి రహదారుల భద్రత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వాహనం నడిపేటప్పుడు అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, రూల్స్ పాటించుకుంటే చర్యలు తీసుకుంటామన్నారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో శుక్రవారం పలుచోట్ల మూవీ షూటింగుల సందడి చోటుచేసుకుంది. ఏలూరు నగరంలో హుషారు ఫేమ్ దినేష్ తేజ నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ జరుగుతుంది. అలాగే జంగారెడ్డిగూడెంలో నూతన నటీనటులతో రూపొందుతున్న చిత్రం షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. అలాగే అత్తిలి మండలం గుమ్మంపాడు- ఎర్రనీలిగుంట రోడ్డులో మేము ఫేమస్ ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతుంది.
Sorry, no posts matched your criteria.