WestGodavari

News July 9, 2024

ఎక్సైజ్ శాఖ మంత్రిని కలిసిన ఏలూరు MP

image

విజయవాడలో రాష్ట్ర మైనింగ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను ఏలూరు MP పుట్టా మహేశ్ కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి మంగళవారం వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలను గురించి చర్చించారు.

News July 9, 2024

ఏలూరు: మూడేళ్ల తర్వాత అమ్మ చెంతకు

image

ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలానికి చెందిన ఓ బాలుడు 2021లో ఇంటినుంచి వెళ్లిపోయాడు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని హౌరా రైల్వేస్టేషన్లో తిరుగుతుండగా అక్కడి పోలీసులు చైల్డ్ కేర్ సంస్థలో చేర్చారు. ఈ క్రమంలో బాలుడిది ఏలూరు జిల్లాగా గుర్తించి ఇక్కడి అధికారులను సంప్రదించారు. కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాలతో ఐసీడీఎస్ అధికారులు రంగంలోకి దిగారు. బాలుడి తల్లిని బుట్టాయగూడెంలో గుర్తించి అప్పగించారు.

News July 9, 2024

నిడదవోలు: డిజిటల్ అసిస్టెంట్లకు న్యాయం చేస్తాం: మంత్రి

image

నిడదవోలులో నియోజకవర్గంలోని డిజిటల్ అసిస్టెంట్లు మంత్రిని కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ టెక్నికల్ అర్హతలను పరిగణనలోకి తీసుకొని జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించాలని విన్నవించారు. మంత్రి స్పందిస్తూ.. డిజిటల్ అసిస్టెంట్లకు పదోన్నతి అంశాన్ని మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లి తగిన న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు.

News July 9, 2024

ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కు ఘన స్వాగతం

image

ఏలూరు MP పుట్టా మహేశ్ కుమార్ యాదవ్‌కు కూటమి నేతలు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం పలికారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం తొలిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా స్వాగతం పలికేందుకు జిల్లా నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఎంపీ మహేశ్ అక్కడి నుంచి హనుమాన్ జంక్షన్ 4 రోడ్ల కూడలిలోని ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేస్తారు. తర్వాత పార్టీ ఏలూరు జిల్లా కార్యాలయంలో సమావేశంలో పాల్గొంటారు.

News July 9, 2024

ప.గో: అమ్మను అక్క వేధిస్తోందని చెల్లి ఫిర్యాదు

image

ఇంట్లోంచి తల్లి వెళ్లిపోవాలంటూ కుమార్తె వేధింపులకు గురి చేస్తున్నట్లు ప.గో జిల్లా వీరవాసరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. SI రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వీరవాసరానికి చెందిన వనువులమ్మకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కుమార్తె కొద్దిరోజులుగా తల్లి ఇంట్లోనే ఉంటూ ఆమెనే ఇంటి నుంచి వెళ్లిపోవాలని వేధిస్తోందని చిన్న కుమార్తె ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News July 9, 2024

విషాదం.. USలో చిట్యాల యువకుడి మృతి

image

గోపాలపురం మండలంలో విషాదం నెలకొంది. చిట్యాలకు చెందిన యువకుడు అమెరికాలో వాటర్ ఫాల్స్‌లో పడి మృతి చెందాడు. శ్రీనివాస్-శిరీష దంపతుల కుమార్తె అమెరికాలో ఉంటుండగా.. కుమారుడు అవినాశ్ MS చేసేందుకు అక్కడికి వెళ్లాడు. అక్క వాళ్ల ఇంట్లోనే ఉంటున్నాడు. వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లిన అవినాశ్.. నీట మునిగి మృతి చెందాడు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు తానా ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News July 9, 2024

ఏలూరు: UPDATE.. కారు దిగడంతో దక్కిన ప్రాణం

image

ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద <<13586316>>యాక్సిడెంట్‌లో<<>> ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. రాజమండ్రి రూరల్‌లోని రాజవోలుకు చెందిన భాగ్యశ్రీకి HYDలో ఇంటర్వ్యూ ఉండగా.. పేరెంట్స్ కమలాదేవి-నారాయణరావు, పిల్లలు నాగ నితీశ్, నాగషణ్ముక్‌తో కారులో వెళ్లారు. తిరిగి వస్తుండగా నారాయణరావు విజయవాడలో దిగేశారు. అంతలో యాక్సిడెంట్ జరిగి భాగ్యశ్రీ, కమల, నితీశ్ మృతి చెందారు. నాగశ్రీ భర్త నాగార్జున ప్రైవేట్ ఉద్యోగి.

News July 8, 2024

GREAT: ఒలింపిక్స్ క్రీడలకు తణుకు క్రీడాకారిణి

image

2024లో పారిస్‌లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు తణుకు పట్టణానికి చెందిన క్రీడాకారిణి ఎంపికైంది. తణుకు పట్టణానికి చెందిన దండి జ్యోతికశ్రీ గత 11 ఏళ్ల కాలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. ఈ నెల 26 నుంచి పారిస్‌లో ప్రారంభం కానున్న ఒలింపిక్స్ క్రీడల్లో 400 మీటర్ల రిలే అథ్లెటిక్స్ విభాగంలో తన సత్తా చాటనుంది.
☛ CONGRATS జ్యోతికశ్రీ

News July 8, 2024

తాడేపల్లిగూడెం: మహిళ డెడ్‌బాడీ కలకలం

image

తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల ప్రధానరహదారిలో ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో మృతిచెంది ఉండడాన్ని స్థానికులు సోమవారం సాయంత్రం గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలు ఆరుగొలను గ్రామానికి చెందిన జనపాముల సత్యవతి (48)గా పోలీసులు గుర్తించారు. ఈమెపై రూరల్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఇంతలోనే సత్యవతి మృతదేహం లభ్యం కావడంతో కుటుంబీకులు రోదిస్తున్నారు.

News July 8, 2024

ఏలూరు: అంగన్వాడీలో భోజనం చేసిన కలెక్టర్

image

ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దామరచర్లలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. స్వయంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం తప్పనిసరిగా పోషకాహారాన్ని అందించాలన్నారు. ఉదయం పాలు, మధ్యాహ్న భోజనంలో కూర, సాంబారు, కోడిగుడ్డు అందించాలన్నారు. ఆర్డీవో, ఎమ్మార్వో పాల్గొన్నారు.