WestGodavari

News December 17, 2024

బట్టి చదువులు వద్దు.. ఇష్టంతో చదువండి: కలెక్టర్

image

బట్టి చదువులకు స్వస్తి పలికి ఇష్టంతో చదివి ఉన్నత విద్యావంతులవ్వాలని జిల్లా కలెక్టర్ విద్యార్థులకు వివరించారు. మంగళవారం ఆచంట మండలం ఏ. వేమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. పదవ తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. ఈసందర్భంగా మధ్యాహ్నం భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీపీ సూర్య కుమారి, సర్పంచ్ జక్కంశెట్టి చంటి, ఆర్డిఓ దాసిరాజు, తాసిల్దార్ కనకరాజు పాల్గొన్నారు.

News December 17, 2024

చింతలపూడి: కుమార్తెను చూసి వస్తూ తండ్రి మృతి

image

చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చాట్రాయి మండలానికి చెందిన కాంతారావు (56) మృతి చెందాడని SI కుటుంబరావు సోమవారం తెలిపారు. SI వివరాల ప్రకారం.. మృతుడు ఫాతిమాపురం కుటుంబ ఫంక్షన్‌కు హాజరై.. మెట్టగూడెంలో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లి బైక్‌పై తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో తాలర్లపల్లి వద్ద కరెంటు పోల్‌ను ప్రమాదవశాత్తు ఢీకొట్టి మృతి చెందాడని, కేసు దర్యాప్తులో ఉందన్నారు.

News December 17, 2024

ఏలూరు: మహమ్మద్‌కు ఎంత కష్టమొచ్చిందో..!

image

ఏలూరు మినీ బైపాస్ వద్ద లారీకి ఉరేసుకొని మృతి చెందిన వ్యక్తి వివరాలను త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. CI వివరాల ప్రకారం.. మృతుడు బీహార్‌కు చెందిన మహమ్మద్ (25)గా గుర్తించామన్నారు. ఏలూరులో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, అతడు ఉరివేసుకునే ముందు ఫోన్‌లో సంభాషణలు జరిపాడని ఈ తరుణంలో ఉరేసుకున్నాడని ప్రాథమిక విచారణకు వచ్చామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News December 17, 2024

ఏలూరు: అనాథలైన ఆడబిడ్డలకు తండ్రిగా సీఐ కోటేశ్వరరావు బాధ్యత

image

ఏలూరు త్రీ టౌన్ పరిధిలో డిసెంబర్ 14న ఓ ఉన్మాది చేతిలో హత్యకు గురైన వెంకటరాజు సంతానమైన ముగ్గురు ఆడబిడ్డలకు సీఐ కోటేశ్వరరావు మరో తండ్రిగా నిలిచారు. అనాథలైన ఈ ముగ్గురి ఆడపిల్లలకు చదువు బాధ్యత తీసుకుంటానని తెలిపారు. పిల్లల బంగారు భవిష్యత్తుకు తన వ్యక్తిగత సహాయ సహకారాలు ఉంటాయన్నారు. బాగా చదువుకోవాలని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని బాలికలకు సూచించారు.

News December 17, 2024

ఏపీపీఎస్సీ పరీక్షలకు రంగం సిద్ధం: రెవెన్యూ అధికారి

image

ఏపీపీయస్సీ నిర్వహించే డిపార్ట్మెంట్ పరీక్షలు డిసెంబరు 18 నుంచి 23 వరకు జరగనున్నాయని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. భీమవరం డీఎన్ఆర్ అటానమస్ విభాగంలో ఆరు రోజులు పాటు పరీక్షలు జరగనున్నాయని, డిసెంబర్ 20 తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కాలేజీలో, డిసెంబర్ 22 మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో డిపార్ట్మెంట్ పరీక్షలు జరుగుతాయన్నారు.

News December 17, 2024

ప.గో: పేరుపాలెం బీచ్‌లో అద్భుతమైన దృశ్యం

image

మొగల్తూరు మండలంలోని ప్రముఖ పర్యాటక క్షేత్రం పేరుపాలెం బీచ్‌లో సోమవారం సాయంత్రం అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. సాయంత్రం ఐదు గంటల సమయంలో సూర్యాస్తమయం అవుతూ ఎర్రటి సూర్యుడి వెలుగు సముద్ర అలలుపై పడుతూ ప్రకృతి రమణీయ దృశ్యకావ్యం కనిపించింది. దీంతో బీచ్‌కు వచ్చిన పర్యాటకులు సెల్ఫోన్లో ఈ చిత్రాన్ని బంధించారు.

News December 16, 2024

సేవా కార్యక్రమాల్లో జిల్లా ప్రజలు భాగం కావాలి: కలెక్టర్

image

ప.గో జిల్లాలో రెడ్ క్రాస్ సభ్యత్వాలను ఎక్కువ మందితో చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాలలో జిల్లా ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. తద్వారా సమాజానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. అటు రెడ్ క్రాస్ సభ్యత్వాల పై ప్రజలకు మరింత చేరువుగా అవగాహన కల్పించాలన్నారు. అవసరమైన చర్యలు అధికారులకు సూచించారు.

News December 16, 2024

ప.గో జిల్లాలో పర్యాటక ప్రదేశాలను గుర్తించాలి: కలెక్టర్

image

ప.గో జిల్లాలో పర్యాటక ప్రదేశాలను గుర్తించాలని వాటిని అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సోమవారం సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారని, ఈ మేరకు ప్రతి అసెంబ్లీ పరిధిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 10 ఎకరాల భూమిని సేకరించాలని సూచించారు. ప్రతి నెల 1న ఇంటి వద్ద పెన్షన్లు అందించాలని సీఎం ఆదేశించారన్నారు.

News December 16, 2024

పిల్లల్లో ఆధ్యాత్మిక చింతన పెంపొందించాలి: కలెక్టర్

image

పిల్లల్లో ఆధ్యాత్మిక చింతన పెంపొందించే దిశగా దేవాలయాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులకు ఆదేశించారు. సోమవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సామూహిక వివాహాలు, అక్షరాభ్యాసాల నిర్వహణకు చర్యలు చేపట్టాలన్నారు. దేవాలయ భూములు పరిరక్షణకు, లీజు, కౌలు మొత్తాలు వసూలుకు అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ ఉన్నారు.

News December 16, 2024

పబ్లిక్ గ్రీవెన్స్‌డేకు ఆరు అర్జీలు: ఎస్పీ

image

పశ్చిమగోదావరి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డే కు ఆరు అర్జీలు అందాయని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అర్జీలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు. అర్జీలను సత్వరమే పరిష్కరించాలన్నారు.