WestGodavari

News September 15, 2024

ఉండ్రాజవరం: రూ.10 లక్షల కరెన్సీతో గణనాథుడికి అలంకరణ

image

గణేశ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులు వినూత్న రీతిలో విఘ్నేశ్వర స్వామిని అలంకరిస్తున్నారు. ఉండ్రాజవరం మండలం కె.సావరం గ్రామంలోని వరసిద్ధి కాలనీలో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయక స్వామికి రూ.10 లక్షల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరణ చేసి తమ భక్తిని చాటుకున్నారు. స్వామిని తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు.

News September 15, 2024

ప.గో.: ఒక్కరోజులో 2466 కేసులు రాజీ

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో శనివారం లోక్‌అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. కాగా రాత్రి 8 గంటల వరకు జరిగిన ఈ లోక్‌ అదాలత్‌లో 2466 కేసులు రాజీచేశామని న్యాయవాదులు తెలిపారు. పరిష్కరించిన కేసుల్లో 2149 క్రిమినల్‌, 193 సివిల్‌, 124 వాహన ప్రమాద బీమా కేసులు ఉన్నాయన్నారు. ఇవి కాకుండా 130 ప్రీలిటికేషన్‌ కేసులను పరిష్కరించినట్లు వివరించారు.

News September 15, 2024

పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ ఎంపికలు

image

పశ్చిమగోదావరి జిల్లా SGF ఆధ్వర్యంలో 2024- 25 విద్యా సంవత్సరానికి గాను అండర్- 14, అండర్- 17 విభాగాల్లో బాలబాలికలకు మండల స్థాయి ఎంపికలు అక్టోబర్ 19, 20, 21 తేదీల్లో, నియోజకవర్గ ఎంపికలు 23, 24 తేదీల్లో నిర్వహిస్తున్నామని జిల్లా SGF కార్యదర్శి మల్లేశ్వరరావు తెలిపారు. అండర్-14, అండర్-17 జూడో జట్ల ఎంపికలు 18న ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఉదయం 9 గంటల నుంచి జరుగుతాయని తెలిపారు.

News September 15, 2024

భీమవరంలో మహిళపై అత్యాచారం..UPDATE

image

భీమవరం టూటౌన్ పరిధిలో మహిళపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుణ్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 11న ఘటన జరగ్గా బాధితురాలు 12న ఫిర్యాదు చేసిందన్నారు. నిందితుడు సీహెచ్.మధుకుమార్‌ను పట్టణంలోని 18వ వార్డులోని అతని ఇంటి వద్ద శనివారం ఉదయం డీఎస్పీ ఆర్.జి.జయసూర్య ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారన్నారు.

News September 15, 2024

ఏలూరు: ఆన్‌లైన్‌లో మోసం.. డబ్బు రికవరీ

image

సైబర్ నేరాల్లో మోసపోయిన ఇద్దరికి న్యాయం జరిగింది. జంగారెడ్డిగూడేనికి చెందిన ఓ మహిళ సోషల్ మీడియా పోస్టులు చూసి ఆన్‌లైన్లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ వస్తుందని అనుకుంది. సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి రూ.90 వేల పెట్టుబడి పెట్టింది. ఏలూరు త్రీటౌన్ స్టేషన్ పరిధిలో మరోవ్యక్తి రూ.1.10 లక్షలు పెట్టుబడి పెట్టాడు. మోసపోయామని గుర్తించి సైబర్ క్రైమ్ 1930కు ఫిర్యాదుచేయగా పోలీసులు ఆ నగదు రికవరీ చేసి అందించారు.

News September 15, 2024

ప.గో: వరద బాధితుల సహాయార్థం రూ.120 కోట్లు విరాళం

image

ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ సంయుక్తంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.120 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వ కమిషనర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి.హరి కుమార్ తెలిపారు. శనివారం భీమవరంలో పెన్షన్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఏపీజేయూసీ ద్వారా విరాళాన్ని అందజేయనున్నట్లు వివరించారు. సీతారాం ఏచూరి మృతికి సంతాపం తెలిపారు. వీరా రావు, చిన్నయ్య పాల్గొన్నారు.‌

News September 14, 2024

ప.గో: వరద బాధితుల సహాయార్థం రూ.120 కోట్లు విరాళం

image

ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ సంయుక్తంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.120 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వ కమిషనర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి.హరి కుమార్ తెలిపారు. శనివారం భీమవరంలో పెన్షన్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఏపీజేయూసీ ద్వారా విరాళాన్ని అందజేయనున్నట్లు వివరించారు. సీతారాం ఏచూరి మృతికి సంతాపం తెలిపారు. వీరా రావు, చిన్నయ్య పాల్గొన్నారు.‌

News September 14, 2024

పాలకొల్లు: ఆరు నెలల గర్భిణీ ఉరేసుకుని ఆత్మహత్య

image

పాలకొల్లు మండలం భగ్గేశ్వరం గ్రామంలో శనివారం విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన రావూరి దేవి (23)ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దేవి ఆరు నెలల గర్భిణీ కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉండిపోయారు. అయితే అత్తింటి వారి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 14, 2024

ఏలూరు: ముగిసిన వైసీపీ నేత అంత్యక్రియలు

image

కామవరపుకోట మండలం కళ్ళచెరువు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ మేడవరపు అశోక్ అంత్యక్రియలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన భౌతిక కాయానికి పార్టీలకతీతంగా నాయకులు, ప్రజలు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంత్యక్రియల్లో వేలాది సంఖ్యలో ఆయన అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.

News September 14, 2024

భీమవరంలో తల్లిదండ్రులను మోసం చేసిన కొడుకు

image

తమ కొడుకే తమను మోసం చేశాడని భీమవరం నాచువారి సెంటర్‌కు చెందిన డోకల నాగన్న- అప్పాయమ్మ దంపతులు వాపోతున్నారు. బాధితుల వివరాల ప్రకారం.. సెంటర్లో తమకు ఉన్న సెంటున్నర స్థలంలో చిన్నపాక వేసుకుని పింఛన్‌ నగదుతో జీవనం సాగిస్తున్నారు. కాగా ఆ స్థలాన్ని వారి చిన్న కొడుకు సోమేశ్వరరావు బలవంతంగా రాయించుకొని వేరే వ్యక్తులకు అమ్మేశాడు. దీంతో వారు ఖాళీ చేయించడంతో రోడ్డునపడ్డారు. అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నారు.