India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప నూతన ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈనేపథ్యంలో ఆయనను టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తదితరులు వేర్వేరుగా కలిశారు. బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణపై చర్చించారు.

ఫిర్యాదుదారుల సమస్యలను తప్పనిసరిగా పరిష్కరించాలని జిల్లా SP విశ్వనాథ్ ఆదేశించారు. సోమవారం కడపలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు 149 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత పోలీసులకు వెంటనే పరిష్కారం చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వృద్ధులు, దివ్యాంగుల వద్దకు వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు.

దసరా సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణాన్ని నిరంతర నిఘాలో ఉంచినట్లు స్థానిక డీఎస్పీ భావన తెలిపారు. ఆదివారం జమ్మిచెట్టు ప్రాంతాన్ని, బాణాసంచా కాల్చే మార్కెట్ ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు. ప్రధాన ఆలయాలు, ఎగ్జిబిషన్ వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్లు, కంట్రోల్ రూంలు, శక్తి టీంలతో పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. అమ్మవారి తొట్టి మెరవని రోజున 150 మంది అదనపు సిబ్బందితో బందోబస్తు చేస్తున్నట్లు తెలిపారు.

పోరుమామిళ్లలో వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో దసరా ఉత్సవాలలో ఆదివారం వారాహీ దేవి అలంకారంలో వాసవి మాతా దర్శనమిచ్చారు. ఆలయంలో ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో వారాహి రూపాన్ని రంగవల్లికలతో తీర్చిదిద్దామని మహిళా మండలి అధ్యక్షురాలు పలుకూరి రాధా తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో దర్శించుకుని ఆకర్షణీయులయ్యారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు.

యోగి వేమన విశ్వవిద్యాలయంలో పీజీ కళాశాలలో ఎమ్మెస్సీ ఎర్త్ సైన్స్ విభాగంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ అప్లైడ్ జియాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంచాలకులు లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఈ కోర్సులో పట్టభద్రులైన విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ఇందుకు అర్హులన్నారు. ఆసక్తిగల విద్యార్థులు విశ్వవిద్యాలయానికి వచ్చి సంప్రదించాలన్నారు.

కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ శనివారం 50 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయర్స్తో సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలు, రోడ్డు సేఫ్టీ, డ్రగ్స్ అనర్థాలపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఇన్ఫ్లూయర్స్ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రీల్స్, పోస్టులు, కథనాలు సమాజ హితానికి ఉపయోగపడేలా రూపొందించాలి, హింస, కుల, మత వివేధాలను కలిగించే పోస్టులలు కనిపిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ శనివారం 50 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయర్స్తో సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలు, రోడ్డు సేఫ్టీ, డ్రగ్స్ అనర్థాలపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఇన్ఫ్లూయర్స్ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రీల్స్, పోస్టులు, కథనాలు సమాజ హితానికి ఉపయోగపడేలా రూపొందించాలి, హింస, కుల, మత వివేధాలను కలిగించే పోస్టులలు కనిపిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

వైవీయూ NSS వాలంటీర్లు విశ్వవిద్యాలయ స్థాయిలో ప్రతిభ చూపి వెస్ట్ జోన్ ప్రీ-రిపబ్లిక్ డే క్యాంప్నకు ఎంపికయ్యారు. ఎంపికైన వారి వివరాలు..
బి.ఈశ్వర్ (YVU)
బి. నవీన్ (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైదుకూరు)
పి.నీలమహేశ్వరి (జీడీసీ, కడప)
వీరు అక్టోబర్లో గుజరాత్లో జరిగే శిబిరానికి హాజరవుతారు. వీరిని కో ఆర్డినేటర్ ఎన్.వెంకటరామిరెడ్డి, VC శ్రీనివాసరావు, రిజిస్ట్రారు పద్మ, ప్రొ. శ్రీనివాస్ అభినందించారు.

మహిళల రక్షణకు పోలీసు శాఖ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎస్పీ విశ్వనాథ్ అన్నారు. శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జిల్లా పోలీసులు శాఖ, మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక బృందాల సభ్యులకు మహిళల భద్రత, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. మహిళలకు పోలీసు శాఖ అండగా ఉంటుందన్నారు.

కడప జిల్లా అంటేనే పర్యాటక ప్రాంతాలకు నిలయం. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను నెమరువేసుకుందాం. గండికోట సోయగాలు జిల్లా వాసులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అంతేకాక సిద్ధవటంకోట, ప్రఖ్యాత అమీన్పీర్ పెద్దదర్గా, ఒంటిమిట్ట కోదండ రామునిదేవాలయం, ఇడుపులపాయ నెమళ్ళ పార్క్, దేవుని గడప వేంకటేశ్వరస్వామి, బ్రహ్మంగారిమఠం ఇలా ఎన్నో ఉన్నాయి. మరి ఈ దసరాకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు.
Sorry, no posts matched your criteria.