Y.S.R. Cuddapah

News September 3, 2024

కడప: ‘సమస్యలుంటే సంప్రదించండి’

image

కడప జిల్లాలో ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే 8561293086 నంబరుకు ఫోన్ చేసి సమస్య పరిష్కరించుకోవాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గృహ నిర్మాణాలకు సంబంధించిన ఫిర్యాదులపై ఏర్పాటు చేసిన ఫోన్ నంబరును ఆయన ప్రారంభించారు. ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించాలన్నదే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమన్నారు.

News September 3, 2024

మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

image

జిల్లా ఉపాధి కల్పనాధికారి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 గంటలకు మైదుకూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పలు కంపెనీల ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేశ్ కుమార్ తెలిపారు. 5, 10, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చదివిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలని తెలిపారు.

News September 3, 2024

గండిలో అవి విక్రయిస్తే కఠిన చర్యలు

image

గండి ఆలయ ప్రాంగణంలో బీడీలు, సిగరెట్లు, గుట్కాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య హెచ్చరించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి బీడీలు, సిగరెట్లు గుట్కాలు విక్రయించడాన్ని నిషేధిస్తూ ఇప్పటికే దుకాణదారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా బీడీలు, సిగరెట్లు, గుట్కాలు విక్రయిస్తున్న దుకాణాలపై కాగా సోమవారం దాడులు నిర్వహించారు.

News September 3, 2024

లక్కిరెడ్డిపల్లె పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

లక్కిరెడ్డిపల్లి విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపులపై విచారించేందుకు<<14005463>> కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆకస్మిక తనిఖీ చేశారు.<<>> ప్రిన్సిపాల్ వారి భర్త ద్వారా తమకు సమస్యలు ఎదురవుతున్నట్లు కలెక్టర్‌కు విద్యార్థినులు వివరించారు. ప్రిన్సిపాల్ భర్తపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు. విద్యార్థులకు ఎటువంటి సమస్యలు ఉన్నా తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.

News September 2, 2024

కడప: తిరుమల ఎక్స్ ప్రెస్ రద్దు

image

కడప నుంచి విశాఖపట్నం వెళ్ళే తిరుమల ఎక్స్ ప్రెస్ రైలు రద్దయింది. రైలు నంబర్ (17487) విజయవాడ ప్రాంతంలో రైల్వే ట్రాక్ మీద నీరు నిలిచి, రాకపోకలకు అంతరాయం ఏర్పడటం వలన రైలును నేడు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ ప్రకటనలో తెలిపారు. కావున ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News September 2, 2024

YCPకి ద్రోహం చేసేదివారే: రాచమల్లు

image

పదవులు అనుభవించినవారే YCPకి ద్రోహం చేస్తున్నారని మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధికారం కోల్పోయిన మరుక్షణం అధికారాన్ని అనుభవించిన కొందరు MLAలు, MPలు, MLCలు, నాయకులు పార్టీ గుండెల్లో పొడిచి పోతున్నారన్నారు. 2029లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామన్నారు.

News September 2, 2024

డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి విశేష స్పందన

image

డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. సోమవారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి నిర్వహించిన ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమంలో మొత్తం 08 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలను విన్నవించారు. ఫిర్యాదులకు సంబందించిన శాఖల అధికారులతో వెంటనే మాట్లాడి.. తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం.

News September 2, 2024

‘మాదకద్రవ్యాల నిర్మూలనను విజయవంతం చేయాలి’

image

సెప్టెంబర్ 9 నుంచి 23 వరకు నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల నిర్మూలన పక్షోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో NGOలు ప్రచురించిన మాదకద్రవ్యాల నిర్మూలన పక్షోత్సవాల కరపత్రాలను ఎస్పీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటరాముడు, జూటురు విజయ్ కుమార్, సూలం లక్ష్మీదేవి, తదితరులు పాల్గొన్నారు.

News September 2, 2024

నిర్ణీత సమయంలోగా సమస్యలు పరిష్కరించాలి: కడప SP

image

ప్రజా సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించిన వెంటనే పరిష్కరించాలని కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేశారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం చేసేలా సమస్యలు పరిష్కరించాలని ఎస్పీ సూచించారు.

News September 2, 2024

అర్జీదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

image

కడప జిల్లాలో ప్రజలు అందించే సమస్యల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆదేశించారు. కడప కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాల ద్వారా ఫిర్యాదులను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు రెఫర్ చేస్తూ.. సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు.