India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప జిల్లాలో CIలను బదిలీ చేస్తూ కర్నూల్ DIG కోయ ప్రవీణ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొద్దుటూరు ట్రాఫిక్కు రాజగోపాల్, కడప VRకు సుబ్బారావు, కృష్ణయ్యలను బదిలీ చేశారు. జమ్మలమడుగు అర్బన్కు నరేష్ బాబు, రూరల్కు భాస్కరరెడ్డి, బద్వేల్కు లింగప్ప, ఎర్రగుంట్లకు విశ్వనాథరెడ్డి, కొండాపురానికి రాజు, కడప సైబర్ సెల్కు సురేష్ రెడ్డిలను బదిలీ చేశారు. తక్షణమే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
కడప జిల్లాలో ఈ నెల 12న పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంపై ఎస్పీ అశోక్ కుమార్ అత్యాధునిక డ్రోన్ కెమెరా ద్వారా నిఘా పెంచారు. పులివెందుల మండలంలోని ఆర్.తుమ్మలపల్లి, నల్లపురెడ్డి పల్లి, రాగిమాని పల్లి, రాయలాపురం ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంపై డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షించారు. అభ్యర్థులు చేస్తున్న ప్రచారం ప్రశాంత వాతావరణంలో జరగాలన్నారు.
కానిస్టేబుల్ ఉద్యోగాల ఫలితాల్లో కడప పరిధిలోని అరుందతి నగర్కు చెందిన అన్నాచెల్లెళ్లు మధుమోహన్, లలితాదేవిలు సత్తా చాటారు. వారధి ఓబులేసు, రామలక్షుమ్మల ఇద్దరు సంతానం కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఒకే కుటుంబంలోని అన్నాచెల్లెళ్లకు పోలీస్ జాబ్స్ రావడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కాగా కడప ఆకాశవాణిలో మధు మోహన్ క్యాజువల్ అనౌన్సర్గా, లలితాదేవి యువవాణి కాంపియర్గా పనిచేస్తూ ప్రిపేర్ అయ్యారు.
మైదుకూరు ప్రాంతంలో పండించే కృష్ణాపురం ఉల్లికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉంది. KP ఉల్లిలో ఔషధ గుణాలు ఉండడంతో వాటి తయారీ కంపెనీలు మాత్రమే వీటిని కొనుగోలు చేస్తున్నాయి. అయితే కొనుగోళ్లు లేనప్పుడు, ధరలు తగ్గినప్పుడు KPఉల్లిని నిల్వ ఉంచే NAFED గోడౌన్లు ఇక్కడ లేవు. దీంతో రైతులు నష్టపోతున్నారు. ఇక్కడ గోడౌన్ల నిర్మాణానికి NAFED ముందుకు రావడంతో KPఉల్లి రైతులకు మేలు కలుగుతుందని ఆశిస్తున్నారు.
కడప డా.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విభాగానికి సంబంధించిన 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలను వర్సిటీ ఉపకులపతి ఆచార్య జి. విశ్వనాథ కుమార్ సోమవారం విడుదల చేశారు. వర్సిటీ అదనపు పరీక్షల నియంత్రనాధికారి డా. జి. ఫణీంద్ర రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమార్థం త్వరితగతిన పరీక్షా ఫలితాలను విడుదల చేయడం జరిగిందన్నారు.
రామేశ్వరం బ్రిడ్జి నిర్మాణానికి అటవీశాఖ నుంచి బ్రేక్ పడింది. అప్రోచ్ రోడ్లు RFలోకి వస్తున్నాయంటూ అభ్యంతరం తెలిపింది. స్థానిక రామేశ్వరం పెన్నా నదిపై రూ.53కోట్లతో హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. MDR గ్రాంట్ స్కీమ్ నిధులతో ప్రొద్దుటూరు- RTPP మార్గంలో R&B బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే సుమారు 65% పనులు పూర్తయ్యాయి. ఇంకా అప్రోచ్ రోడ్లు నిర్మించాల్సి ఉంది. కాగా ప్రస్తుతం పనికి బ్రేక్ పడింది.
కడప జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించాలని ఎస్పీ అశోక్ కుమార్ సిబ్బందికి సూచించారు. ఆధ్యాధునిక సాంకేతికతతో రూపొందించిన బైకులను ఎస్పీ శుక్రవారం ప్రారంభించారు. సైరన్, బ్లింకర్స్, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టం, క్రౌడ్ కంట్రోల్ చేసే సదుపాయాలు ఈ వాహనాల్లో ఉన్నాయి. కడపకు 7, ప్రొద్దుటూరుకు 4, పులివెందులకు 2, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలుకు ఒకొక్కటి చొప్పున నూతన వాహనాలు కేటాయించారు.
ప్రొద్దుటూరులోని రామేశ్వరం పురపాలక ప్రాథమిక ఆదర్శ పాఠశాలలో 159 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు ఉన్నారు. ఇక్కడ ఐదు తరగతులు ఉన్నాయి. నెల కిందట ఇక్కడ HM, ఆరుగురు టీచర్లు ఉండేవారు. బదిలీల తర్వాత ఇక్కడ ఇప్పుడు HM ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నారు. టీచర్ల కొరతపై MEO దృష్టికి తీసుకెళ్లామని HM వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. టీచర్ల సర్దుబాటు తన పరిధిలో లేదని MEO సావిత్రమ్మ తెలిపారు.
కడప జిల్లాలో గురువారం భారీగా పోలీసులు బదిలీ అయ్యారు. 169 పోలీస్ సిబ్బందిని ఒకేసారి బదిలీ చేస్తూ SP అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 24 మంది ASIలు, 32 మంది HCలు, 113 మంది PCలు ఉన్నారు. దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న, ఆరోపణలున్న వారిని బదిలీ చేసిన్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ ఉత్తర్వులను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపారు.
మొహర్రం సందర్భంగా నాదర్ షావలీ దర్గా ఉరుసు నిర్వహించారు. ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా ప్రతినిధులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం కేసీ కెనాల్లో రొట్టెలు వదిలారు. ఆ సమయంలో ఎమ్మెల్యే చెప్పులు వేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఎంతో పవిత్రంగా రొట్టెలు వదిలే కార్యక్రమంలో ఎమ్మెల్యే చెప్పులు ధరించడంతో భక్తుల మనోభావాలు దెబ్బతీశారని పలువురు అంటున్నారు.
Sorry, no posts matched your criteria.