Y.S.R. Cuddapah

News September 22, 2025

కడపకు చేరుకున్న యూరియా

image

కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల యూరియా కోసం అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. ఈక్రమంలో రెండు జిల్లాలకు కలిపి 2,600 టన్నుల యూరియా కేటాయించారు. గూడ్స్ రైలులు సంబంధిత యూరియా కడపకు చేరుకుందని వ్యవసాయ శాఖ అధికారి చంద్రనాయక్ వెల్లడించారు. ఇందులో కడప జిల్లాకు 2,080 టన్నులు రాగా.. ప్రైవేట్ డీలర్లకు 780 టన్నులు, మార్క్‌ఫెడ్‌కు 1300 టన్నులు కేటాయించారు.

News September 22, 2025

వరల్డ్ టాప్-2 సైంటిస్టుల జాబితాలో YVU ప్రొఫెసర్లు

image

కడప జిల్లా యోగి వేమన యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లకు అరుదైన గుర్తింపు లభించింది. వరల్డ్ టాప్-2 సైంటిస్టుల జాబితాలో చోటు దక్కింది. మెటీరియల్ సైన్స్ అండ్ నానో టెక్నాలజీ విభాగ ప్రొఫెసర్ శంకర్, మైక్రోబయాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ వీరాంజనేయరెడ్డి 2025 ఎడిషన్‌లో స్థానాన్ని దక్కించుకున్నారు. వీరికి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు.

News September 22, 2025

ప్రొద్దుటూరులో వడ్డీ వ్యాపారిని వాళ్లే హత్య చేశారా?

image

పోరుమామిళ్ల(M) రెడ్డికోటకు చెందిన వేణుగోపాల్ రెడ్డి(54) వడ్డీ వ్యాపారం చేస్తూ ప్రొద్దుటూరులోని బొల్లవరంలో సెటిల్ అయ్యారు. ఈనెల 19న బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. ఇంటికి కాస్త దూరంలో ఆయన బైక్ పడిపోవడం, దాని చుట్టూ కారం చల్లి ఉండటాన్ని వాచ్‌మెన్ గుర్తించాడు. కుందూ నదిలో ఆదివారం ఆయన <<17784556>>డెడ్‌బాడీ <<>>దొరికింది. తన దగ్గర అప్పులు తీసుకున్న వారిపై ఆయన కోర్టుకు వెళ్లడంతో వాళ్లే హత్య చేసి ఉంటారని సమాచారం.

News September 21, 2025

కడప జిల్లాకే తలమానికం ప్రొద్దుటూరు అమ్మవారి శాల

image

ప్రొద్దుటూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక అలంకారంతో దర్శనమిస్తారు. చివరి రోజు అమ్మవారు ఊరేగింపు అంగరంగ వైభవంగా పురవీధులలో ఊరేగింపు చేయడం జిల్లాకే తలమానికంగా నిలుస్తుంది. పలు రకాల కళాకారులు నృత్య ప్రదర్శన, బాణాసంచ పేల్చడం ఒక ప్రత్యేకత సంచరించుకుంది. ఊరేగింపును తిలకించడానికి పక్క జిల్లా నుంచి కూడా భక్తులు పోటెత్తుతారు.

News September 21, 2025

ప్రొద్దుటూరు: కుందూనదిలో మృతదేహం.. వ్యాపారిదేనా?

image

చాపాడు సమీపంలోని కుందూ నదిలో ఆదివారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ మృతదేహం ఇటీవల ప్రొద్దుటూరులో కిడ్నాప్‌కు గురైన వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి మృతదేహమే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని పోలీసులు బయటికి వెలికి తీశారు. వేణుగోపాల్ రెడ్డిని కిడ్నాప్ చేసి, హత్య చేసిన తర్వాత నదిలో పడేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది.

News September 21, 2025

ప్రొద్దుటూరులో పొలిటికల్ వార్

image

ప్రొద్దుటూరులో టీడీపీ, వైసీపీ నాయకుల నడుమ పొలిటికల్ వార్ జరుగుతోంది. ప్రభుత్వంలో హోదాలేని MLA కుమారుడు కొండారెడ్డిని ప్రభుత్వ కార్యక్రమాల్లోకి ఆహ్వానిస్తున్న అధికారుల పేర్లను బ్యాడ్ మెమోరీస్ బుక్‌లో రాసుకుంటున్నానని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శనివారం హెచ్చరించారు. దీనిపై ఆదివారం కొండారెడ్డి స్పందిస్తూ CM రిలీఫ్ ఫండ్ పంపిణీ, మున్సిపాలిటీ సమీక్షలో పాల్గొంటున్నానని చేతనైతే అడ్డుకోండి అంటూ సవాల్ చేశారు.

News September 21, 2025

మైదుకూరు: రాయితీ నగదు కోసం ఎదురుచూపులు

image

ప్రభుత్వం వాణిజ్య పంటలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రైతులకు పలు రాయితీలు కల్పిస్తోంది. అరటి పంటను సాగు చేస్తే హెక్టారుకు రూ.70 వేలు రాయితీ కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు రాయితీ సొమ్ము జమ కాలేదని రైతులు వాపోతున్నారు. రాయితీ సొమ్ము కోసం ఏడాదికాలంగా ఎదురుచూడాల్సి వస్తోందన్నారు. మైదుకూరు మండలంలో 200 హెక్టార్లకు పైగా అరటిని సాగు చేశారు. మీకు డబ్బులు పడ్డాయా?

News September 21, 2025

మైదుకూరు: ఆర్టీసీ బస్ బోల్తా

image

మైదుకూరు (M) వరదాయపల్లె సమీపంలో ప్రమాదం జరిగింది. బద్వేల్ నుంచి మైదుకూరు మీదుగా కడపకు సూపర్ లగ్జరీ బస్ బయల్దేరింది. మార్గమధ్యంలో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉండగా.. కొందరికి స్వల్ప గాయాలయ్యాయని సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 21, 2025

సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు: కడప DEO

image

దసరా సెలవుల్లో ప్రైవేటు విద్యాసంస్థలు సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని కడప DEO శంషుద్దీన్ హెచ్చరించారు. ప్రైవేట్ యాజమాన్యాలు ప్రత్యేక తరగతులు, ట్యూషన్ల పేరుతో క్లాస్‌లు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందేనన్నారు.

News September 20, 2025

కడప: 18 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

image

తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం 18 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ SP శ్రీనివాస్ వివరాల మేరకు.. కడప(D) ప్రొద్దుటూరు-జమ్మలమడుగు దారిలో వాహనాల తనిఖీ చేపట్టగా పెద్దశెట్టిపల్లి వద్ద కార్లు వేగంగా వస్తూ కనిపించాయి. పోలీసులను చూసి వారు పారిపోయే ప్రయత్నం చేయగా సిబ్బంది చుట్టుముట్టి నిందితులు, 13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.