Y.S.R. Cuddapah

News August 21, 2024

పోరుమామిళ్ల: కారు, స్కూటర్ ఢీ.. చికిత్స పొందుతూ యువకుడు మృతి

image

పోరుమామిళ్ల మల్ల కత్తువ సమీపంలో కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్ ద్వారా పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన యువకుల స్వగ్రామం కలసపాడు మండలం తంబళ్లపల్లె గ్రామంగా స్థానికులు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ వారిలో సాయికుమార్ రెడ్డి మృతి చెందాడు.

News August 21, 2024

ఉక్కు ప్రవీణ్‌కు కీలక పదవి?

image

ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ ఉక్కు ప్రవీణ్‌కు నామినేటెడ్ పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రవీణ్‌కు టికెట్ ఇవ్వకపోవడానికి కారణాన్ని వివరిస్తూ.. ప్రభుత్వం వచ్చిన అనంతరం తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్‌కు నెడ్ క్యాప్ ఛైర్మన్‌ పదవి వరించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై టీడీపీ అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది.

News August 21, 2024

కడప జడ్పీ ఛైర్మన్‌గా రామ గోవింద్ రెడ్డి

image

కడప జడ్పీ ఛైర్మన్‌గా ముత్యాల రామ గోవింద్ రెడ్డి పేరును మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. జడ్పీ ఛైర్మన్‌గా ఉన్న ఆకేపాటి అమర్నాథరెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు బ్రహ్మంగారిమఠం జడ్పీటీసీ రామ గోవింద్ రెడ్డి పేరును బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జడ్పీటీసీల సమావేశంలో వైఎస్ జగన్ ఖరారు చేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు.

News August 21, 2024

వివేకా హత్య కేసులో నిందితుడికి బెయిల్

image

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో A6గా ఉన్న ఉదయ్ కుమార్‌కి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్‌ను ఇస్తూ, ప్రతి ఆదివారం పులివెందుల పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. వివేకా హత్య కేసులో గత రెండున్నర సంవత్సరాల నుంచి ఉదయ్ కుమార్ రెడ్డి చంచల్ గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్నాడు.

News August 21, 2024

ప్రొద్దుటూరు: ఉద్యోగం ఇప్పిస్తానని మోసం

image

తన కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని ఓ వ్యక్తి మోసం చేశారంటూ ప్రొద్దుటూరు మండలం కొత్తపేటకు చెందిన మహబూబ్ బాషా మంగళవారం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మస్తాన్ వలికి ఏపీఎస్పీడీసీఎల్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని హైదరాబాద్‌కు చెందిన భానుప్రతాప్ రెడ్డి రెండేళ్ల క్రితం ఫోన్ పే ద్వారా పలుమార్లు రూ.2.47లక్షలు తీసుకుని మోసం చేశాడని, డబ్బులు వెనక్కి ఇవ్వాలన్నా ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

News August 21, 2024

కడప: నూతన ఓటు హక్కు చేర్చుకునే అవకాశం

image

కడప జిల్లాలోని 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు, కొత్తగా ఓటు హక్కును చేర్చుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి శివశంకర్ తెలిపారు. 1.1.25 నాటికి 18 ఏళ్లు నిండబోయే వారు ఓటర్ లిస్ట్ నందు తమ ఓటును నమోదు చేసుకోవచ్చని సూచించారు. అలానే ఓటు కార్డు నందు సవరణలు ఏవైనా ఉన్నయెడల సవరించుకోవచ్చని స్థానిక ఎమ్మార్వో, బూత్ లెవెల్ ఆఫీసర్ వద్ద నమోదు చేసుకోవాలన్నారు.

News August 21, 2024

రైల్వేకోడూరుకు పవన్ కళ్యాణ్.. షెడ్యూల్ ఇదే

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 23న రైల్వేకోడూరు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. గన్నవరం నుంచి ఆయన ఉదయం 9:05 గంటలకు రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 9:10 గంటలకు మైసూర్ వారి పల్లి చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు మైసూరు వారి పల్లె సభలో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా రాజంపేట మండలం పులపుత్తూరుకు మధ్యాహ్నం 12:45 గంటలకు చేరుకుని వరదల్లో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తారు.

News August 21, 2024

హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

image

వైఎస్ఆర్ జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండేళ్ల క్రితం హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించారు. 2022వ సంవత్సరంలో కొండపేట గ్రామంలో కసువ జ్యోతి అనే మహిళను వివాహేతర సంబంధంతో నాగరాజు అనే వ్యక్తి దిండుతో నులిమి హతమార్చాడు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన న్యాయస్థానం 6వ అదనపు జడ్జి నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించినట్లు సీఐ పురుషోత్తం రాజు తెలిపారు.

News August 21, 2024

కడప: ‘పరిశ్రమల స్థాపనకు రాయితీలు’

image

కడప జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపన కోసం ఔత్సాహికులకు మరింత ప్రోత్సాహాన్ని అందివ్వడంతో పాటు, ప్రభుత్వం అన్ని రకాల రాయితీలను అందిస్తుందని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి మంగళవారం పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) హాలులో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

News August 20, 2024

సుండుపల్లె: ఎర్రచందనం స్మగ్లర్లు పరార్

image

ఎర్రచందనం అక్రమంగా తరలించేందుకు డస్టర్ వాహనంలో స్మగ్లర్లు సుండుపల్లె మీదుగా అడవిలోకి చొరబడేందుకు, ప్రయత్నాలు జరుగుతున్నాయని ముందస్తుగా సమాచారం రావడంతో వారిని పట్టుకునే ప్రయత్నంలో పరార్ అయినట్లు సానిపాయి రేంజర్ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం తెలిపారు. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో పరారైన 6 మంది స్మగ్లర్ల వద్దనుంచి డస్టర్ వాహనం, 5 గొడ్డళ్లు, 1 రంపం, 8 చిన్న బియ్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.