India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి తనకు అవకాశం కల్పించాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. అలాగే మద్యం కేసులో రెగ్యులర్ బెయిల్ కావాలని కోరారు. ఈ రెండు పిటిషన్లపై విచారణను సెప్టెంబర్ 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. సెప్టెంబర్ 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. మరి మిథున్ రెడ్డికి బెయిల్ వస్తుందో? లేదో? చూడాలి మరి.

ప్రొద్దుటూరులోని రామేశ్వరానికి చెందిన తల్లీకుమారుడి అదృశ్యంపై 1వ టౌన్ PS లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. తన భార్య సుమిత్ర (24), కుమారుడు తేజేంద్ర(3) ఈ నెల 25 కనిపించడం లేదని చండ్రాయుడు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. అత్తాకోడళ్లు గొడవపడి కుమారుడిని తీసుకొని వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు బ్యాంకర్లు మంజూరు చేయాలని కలెక్టర్ డా.శ్రీధర్ పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాలులో డీసీసీ/డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సకాలంలో క్రాప్లోన్లు మంజూరు చేయాలన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రాధాన్యతా రంగానికి సంబంధించి కోట్లు ఋణాలు మంజూరు లక్ష్యం అన్నారు.

కడప జిల్లాలో వినాయక నిమజ్జన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. బాణాసంచా పేలి నలువురికి గాయాలయ్యాయి. బ్రహ్మంగారిమఠం మండలం రేకలగుంట పంచాయతీ బాగాది పల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాణసంచా పేలి గ్రామానికి చెందిన పాల కొండయ్య, జగదీశ్, లోకేశ్, దుక్కేశ్ గాయపడ్డారు. గాయపడిన వారిని 108లో బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

దివంగత మాజీ ఎమ్మెల్యే నందమూరి హరికృష్ణ మన మధ్య లేకపోయినా కడప వాసులు మరిచిపోలేరు. దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు 1982 ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండాపురం మండలం తాళ్ల ప్రొద్దుటూరు, చౌటపల్లి వచ్చిన సమయంలో చైతన్య రథాన్ని హరికృష్ణ నడిపారు. మళ్లీ 1992లో రెండోసారి కొండాపురం, పులివెందుల, కడప తదితర ప్రాంతాలలో రోడ్ షోలో పాల్గొన్నారు. నేడు ఆయన వర్థంతి సందర్భంగా ఆనాటి రోజులు నెమరివేసుకుంటున్నారు.

కడప స్టీల్ ప్లాంట్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రూ.25 కోట్లు విడుదల చేసింది. గతంలో YSR స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపులకు రూ.25 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ GO.Rt.No.138 విడుదల చేశారు. YSR స్టీల్ కార్పొరేషన్ భూములను, మౌళిక సదుపాయాలను ఇటీవల జిందాల్ స్టీల్ ప్లాంటుకు ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ పనులకు ఇప్పుడు రూ.25 కోట్లు ఇచ్చారు.

కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఈనెల 30నుంచి వైద్య పరీక్షలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో హాజరు కావాలని ఎస్పీ అశోక్ కుమార్ గురువారం తెలిపారు. ఈనెల 30న రిజిస్టర్ నంబర్ 4001160 నుంచి 4155879 వరకు, సెప్టెంబర్ 1న నంబర్ 4156636 నుంచి 4299199 వరకు, సెప్టెంబర్ 2న నం: 4299250 నుంచి 4504602 వరకు సివిల్, అదేరోజు నం: 4002777 నుంచి 4468576 అభ్యర్థులు హాజరవ్వాలని సూచించారు.

జిల్లాలో శుక్రవారం నిర్వహించనున్న గణేశ్ నిమజ్జనానికి గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కడప ఎస్పీ అశోక్ కుమార్ గురువారం రాత్రి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు రూపొందించిన యాప్ ద్వారా నిర్వాహకులు 4,500 విగ్రహాలకు అనుమతులు తీసుకున్నారన్నారు. ఈనెల 29న 1600 గణేశ్ విగ్రహాలు నిమజ్జనం చేయనున్నారన్నారు. అన్ని శాఖల అధికారులతో కలిసికట్టుగా నిమజ్జన ఏర్పాట్లు చేశామని, నిర్వాహకులు తమకు సహకరించాలని కోరారు.

మాదకద్రవ్యాలతో విద్యార్థుల భవిష్యత్తు సర్వనాశనమవుతుందని పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ డా. శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. గురువారం గోపవరం వద్ద ఉన్న పశువైద్య కళాశాలలో నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు జరిగింది. మత్తుపదార్థాల వినియోగంతో ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. మాదకద్రవ్యాలు వాడమని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి.. జిల్లా ప్రజలు కూడా మాదకద్రవ్యాలను దూరం పెట్టాలన్నారు.

డీఎస్సీ 2025కు ఎంపికైన అభ్యర్థులకు గురువారం ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం జరగనుందని డీవో ఓ. శంషద్దీన్ బుధవారం తెలిపారు. కడప నగరంలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.17 బృందాలు పరిశీలన చేస్తాయని, నాలుగు బృందాలకు ఒక డిప్యూటీ ఉంటారన్నారు. పరిశీలనకు హాజరు కాకుంటే అభ్యర్థిత్వం రద్దవుతుందన్నారు.
Sorry, no posts matched your criteria.