Y.S.R. Cuddapah

News July 7, 2024

BREAKING: చాపాడు: బైకును ఢీ కొట్టిన కారు.. వ్యక్తి మృతి

image

చాపాడు మండలం పల్లవోలు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. ప్రొద్దుటూరు నుంచి మైదుకూరు వీరయ్య(60) బైకుపై వెళ్తుండగా వెనుక వైపు నుంచి వేగంగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్నవారు మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు తెలిపారు. కాగా మృతుడు నాగులపల్లెకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

News July 7, 2024

అన్నమయ్య: పాలకోవ కోసం వెళ్లి.. ప్రాణాలు పోగొట్టుకున్నారు

image

చిత్తూరు – కర్నూల్ ఎన్‌హెచ్‌పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. కడపకు చెందిన ఐదుగురు రాత్రి కారులో గువ్వలచెరువులో పాలకోవ తినడానికి వెళ్లారు. తినేసి వస్తున్న సమయంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి మండిపల్లి సొంత నిధుల నుంచి రూ.లక్ష తక్షణ సాయం కింద అందించారు.

News July 7, 2024

రేపు ఇడుపులపాయకు వైఎస్ షర్మిల

image

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు కడప జిల్లాకు రానున్నారు. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు ఆమె జిల్లాకు రానున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. తన తండ్రికి నివాళులు అర్పించిన అనంతరం ఆమె విజయవాడకు వెళ్ళనున్నారు. సాయంత్రం వైఎస్ జయంతి సభకు తెలంగాణ సీఎం రానున్న విషయం తెలిసిందే.

News July 7, 2024

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై పుస్తకం

image

ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ రాష్ట్ర సభ్యుడు డా.తవ్వా వెంకటయ్య ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జీవితంపై పుస్తకం రచించారు. ‘ఓ ధీరుడి పయనం సమరం నుంచి సంక్షేమం వైపు’ అనే పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ పులివెందులలోని తమ స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటయ్య చేసిన కృషిని కొనియాడుతూ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

News July 7, 2024

రాయచోటి: ఆన్‌లైన్ మోసంపై కేసు నమోదు

image

పెట్టుబడులపై అధిక లాభాలు ఇస్తామని ఆన్‌లైన్ ద్వారా మోసానికి పాల్పడిన ఓ యాప్పై కేసు నమోదు చేసినట్లు బి. కొత్తకోట సీఐ సూర్యనారాయణ తెలిపారు. పట్టణానికి చెందిన మన్సూర్ అలీ ఆన్‌లైన్ ద్వారా ఓ యాప్‌కు ఇటీవల విడతల వారీగా రూ.3,14,300 డబ్బు పంపాడు. అయితే ఈ నగదును తిరిగి చెల్లించకుండా బాధితుడి ఖాతాను మూసివేశారు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించి ఫిర్యాదు ఇవ్వడంతో సీఐ కేసు నమోదు చేశారు.

News July 7, 2024

కడప: మరణంలోనూ వీడని స్నేహం

image

శనివారం రామాపురం మండలం కొండ్లవాండ్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా కడప వాసులేనని పోలీసులు గుర్తించారు. రాజారెడ్డి వీధికి చెందిన అలీఖాన్(35) ఇటీవల కారు కొన్నాడు. కారును టెస్ట్ డ్రైవ్ చేద్దామని తన స్నేహితులు జితేంద్ర (25), షేక్ అలీం (30), ఆంజనేయులు నాయక్ (28)‌తో కలిసి వెళ్లారు. కానీ.. మృత్యువు అనే రాకాసి వారిని తీసుకెళ్లింది.

News July 7, 2024

కమలాపురం: రెండు నెలల బాలుడు మృతి

image

మండలంలోని వసంతపురం గ్రామానికి చెందిన రెండు నెలల బాలుడు శనివారం మృతిచెందాడు. ఏఎన్ఎం వ్యాధులు రాకుండా చిన్నారులకు శనివారం వ్యాధి నిరోధక టీకా వేసింది. అందులో భాగంగా రెండు నెలల బాలుడికి టీకా వేయించిన తల్లి అనంతరం పడుకోబెట్టింది. ఎంతసేపటికీ బాలుడు నిద్ర లేవకపోవడంతో కుటుంబ సభ్యులు గమనించి వెంటనే పెద్దచెప్పలి పీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

News July 7, 2024

రాజంపేటలో ఎర్రచందనం దుంగలు స్వాధీనం

image

రాజంపేట మండలం తుమ్మలబైలు అటవీ ప్రాంతంలో 32 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు ఫారెస్ట్ రేంజర్ నారాయణ తెలిపారు. పట్టుబడ్డ దుంగల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.25 లక్షలుగా ఉంటుందని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా గమనించిన ఎర్రచందనం దొంగలు పరారైనట్లు తెలిపారు. దుంగలను అటవీ శాఖ కార్యాలయానికి తరలించినట్లు ఆయన తెలిపారు.

News July 6, 2024

వేముల: విద్యార్థులతో సెల్ఫీ దిగిన మాజీ సీఎం జగన్

image

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు వేముల
మండలంలోని దుగ్గినవారిపల్లి సమీపంలోని ఓ పాఠశాల విద్యార్థులతో  జగన్ రెడ్డి సెల్ఫీ దిగారు. అనంతరం
విద్యార్థులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం అక్కడి నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ పులివెందులకు వెళ్లారు.

News July 6, 2024

వాహనదారులు అతివేగంగా ప్రయాణించొద్దు: మండిపల్లి

image

వాహనదారులు అతివేగంగా ప్రయాణించి ప్రాణాలకు మీదకు తెచ్చుకోరాదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రామాపురం మండలం చిట్లూరు గ్రామ సమీపంలో కారు, ట్యాంకర్ ఢీకొని జరిగిన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కడప-చిత్తూరు జాతీయ రహదారిలో వాహనదారులు అతివేగంగా ప్రయాణించడంతో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయన్నారు.