India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తన కళ్లతో కుంభమేళాలో అందరినీ ఆకర్షించి రాత్రికి రాత్రే స్టార్గా మారిపోయింది మోనాలిసా. ఇటీవల తొలిసారి ఫ్లైట్ ఎక్కిన ఆమె, తాజాగా ఫస్ట్ టైం 5 స్టార్ హోటల్కు వెళ్లింది. తన కుటుంబ సభ్యులతో కలిసి అందులో భోజనం చేసింది. ఆమె నటిస్తున్న మూవీ డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాను ఇక్కడకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కుటుంబంతో కలిసి 5 నక్షత్రాల హోటల్లో మోనాలిసా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద టెక్స్టైల్ ఎగుమతిదారుగా భారత్ ఉందని PM మోదీ చెప్పారు. ప్రస్తుతం ₹3L Cr కోట్లుగా ఉన్న వార్షిక ఎగుమతులను 2030కి ₹9L Crకు పెంచడమే తమ లక్ష్యమన్నారు. వస్త్ర రంగానికి బ్యాంకులు సహకరించాలని కోరారు. ఢిల్లీలో జరుగుతున్న ‘భారత్ టెక్స్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హైగ్రేడ్ కార్బన్ ఫైబర్ తయారీలోనూ ఇండియా దూసుకెళ్తోందన్నారు. కాగా ఈ సదస్సులో 120కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి.

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్పై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే ఈ విషయంపై ఉత్తర్వులు జారీ చేయగా ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో రేపు ఆయా సంఘాల నేతలతో మంత్రి డోలా వీరాంజనేయస్వామి భేటీ కానున్నారు. <<15268707>>క్రమబద్ధీకరణ<<>> తర్వాత మిగిలిపోయే 40వేల మందిని ఏ శాఖల్లోకి కేటాయించాలి? అనే అంశంపై వారి సూచనలు తీసుకోనున్నారు.

ప్రముఖ సౌత్ కొరియన్ నటి కిమ్ సె రాన్(24) ఇవాళ కన్నుమూశారు. సియోల్లోని తన ఇంట్లో ఆమె శవమై కనిపించారు. పోస్టుమార్టం తర్వాత నటి మరణానికి గల కారణాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు. ఆమె 2009లో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ది బ్రాండ్ న్యూ లైఫ్, ది నైబర్స్, సీక్రెట్ హీలర్, ది విలేజర్స్, బ్లడ్ హౌండ్స్ తదితర చిత్రాలు, టీవీ షోలు, వెబ్సిరీస్లలో కీలక పాత్రలు పోషించారు.

మనీ లాండరింగ్ కేసులో మారిషస్ మాజీ PM ప్రవింద్ జగన్నాథ్(63)ను ఆ దేశ ఆర్థిక నేరాల కమిషన్ అరెస్ట్ చేసింది. ఆయన నివాసంలో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లు, లగ్జరీ వాచ్లు, నగదును స్వాధీనం చేసుకుంది. ప్రవింద్ 2017-24 మధ్య PMగా పనిచేశారు. ఆయన చేసుకున్న కొన్ని ఒప్పందాల్లో స్కామ్స్ జరిగాయని, వాటిపై ఆడిట్ నిర్వహిస్తామని కొత్త ప్రధాని నవీన్ రామ్ అప్పట్లో ప్రకటించారు. అన్నట్లుగానే చర్యలు తీసుకున్నారు.

లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ల తర్వాత కొత్త మూవీపై డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఫోకస్ చేశారు. ఇటీవలే హీరో గోపీచంద్కు ఓ కథ వినిపించినట్లు సమాచారం. త్వరలోనే సినిమాపై అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో 2010లో వచ్చిన ‘గోలీమార్’ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాగా గోపీచంద్ చివరి 3 చిత్రాలు(రామబాణం, భీమా, విశ్వం) బాక్సాఫీస్ను మెప్పించలేకపోయాయి.

IPL-2025లో కీలక మ్యాచ్లకు HYD, కోల్కతా వేదికలు కానున్నాయి. క్వాలిఫయర్-1 మే 20న, ఎలిమినేటర్ మే 21న HYDలో జరగనున్నాయి. క్వాలిఫయర్-2 మే 23న, ఫైనల్ మే 25న కోల్కతాలో నిర్వహించనున్నారు. క్వాలిఫయర్-1లో గెలిచిన టీం నేరుగా ఫైనల్ చేరనుండగా, ఓడిన టీంకు మరో అవకాశం ఉంటుంది. ఆ జట్టు ఎలిమినేటర్లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-2లో తలపడాలి. మే 25న టైటిల్ విన్నర్ ఎవరో డిసైడ్ అవుతుంది.

ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ‘నిన్న ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రావడంలో కొంత ఆలస్యమైంది. 14వ ప్లాట్ఫామ్పై ప్రయాణికులు వేచి ఉన్నారు. ఇంతలో 12వ ప్లాట్ఫామ్పై ప్రత్యేక రైలును ప్రకటించారు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా అక్కడికి కదలడంతో మెట్లపై తొక్కిసలాట జరిగి 18 మంది చనిపోయారు. ఈ ఘటన దురదృష్టకరం. దర్యాప్తు కొనసాగుతోంది’ అని పేర్కొంది.

TG: ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఎంత తిరిగితే అంత మంచిదని CM రేవంత్ అన్నారు. అయితే కొందరు AC గదులను వదిలేందుకు ఇష్టపడట్లేదని వ్యాఖ్యానించారు. HYDలో జరిగిన ‘లైఫ్ ఆఫ్ ఏ కర్మ యోగి- మెమోయిర్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్’ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. పాలకులు ఎన్ని పాలసీలు చేసినా వాటిని సమర్థంగా అమలు చేసేది అధికారులేనని తెలిపారు. వాళ్లు చూపే నిబద్ధతను బట్టి పథకాలు విజయవంతమవుతాయని పేర్కొన్నారు.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రధాని మోదీ రాష్ట్రపతి భవన్లో కలిశారు. ఇటీవల తాను చేపట్టిన ఫ్రాన్స్, అమెరికా పర్యటనల వివరాలు, అక్కడ చేసుకున్న ఒప్పందాలు, ద్వైపాక్షిక సంబంధాలను ముర్ముకు మోదీ వివరించారు. భారత్-అమెరికా, భారత్-ఫ్రాన్స్ వాణిజ్య సంబంధాల సారాంశాలను ఆమెతో మోదీ పంచుకున్నారు.
Sorry, no posts matched your criteria.