news

News December 21, 2024

‘భరణం’ పేరిట భర్తను భార్య దోచుకోకూడదు: సుప్రీం

image

భరణమనేది స్త్రీ సంక్షేమాన్ని ఉద్దేశించి ఇప్పించేది మాత్రమే తప్ప తమ మాజీ భర్తను బెదిరించేందుకు దాన్ని భార్యలు ఉపయోగించుకోకూడదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. భర్త ఆస్తి, ఆదాయానికి తగిన మనోవర్తి కోరడం సరికాదంది. భర్తకు రూ.5 వేల కోట్ల ఆస్తి ఉందని, అందుకు తగినట్లుగా భరణం ఇప్పించాలని ఓ మహిళ వేసిన పిటిషన్‌ను సుప్రీం తోసిపుచ్చింది. వన్‌టైమ్ సెటిల్మెంట్‌గా రూ.12 కోట్లు భరణం ఇవ్వాలని భర్తను ఆదేశించింది.

News December 21, 2024

ఇంద్రకీలాద్రిలో నేటి నుంచి భవానీ దీక్షల విరమణ

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి 25వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణలు జరగనున్నాయి. భక్తులు ఏ క్యూలోనైనా ఫ్రీ దర్శనం చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అంతరాలయ ప్రవేశం ఉండదని, ఆర్జిత సేవలు రద్దు చేశామన్నారు. ఉచిత అన్న ప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ వివరాలను ప్లే స్టోర్‌లోని ‘భవానీ దీక్ష 2024’ యాప్‌లో చూసుకోవచ్చు. రోజుకు సుమారు లక్ష మంది చొప్పున భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా.

News December 21, 2024

విశాఖ జిల్లాలో ఇవాళ స్కూళ్లకు సెలవు

image

AP: అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తరాంధ్రను గత 2 రోజులుగా అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో విశాఖ జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు కలెక్టర్ ఇవాళ సెలవు ప్రకటించారు. అన్ని స్కూళ్లు సెలవు ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటు శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

News December 21, 2024

TGలో మరో అగ్రికల్చర్ కాలేజీ.. ఎక్కడంటే?

image

తెలంగాణలో మరో అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సూర్యాపేట (D) హుజూర్ నగర్ మఠంపల్లిలో దీనిని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం 100 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు సమాచారం. భూ సేకరణ పూర్తికాగానే ప్రభుత్వం కాలేజీని మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 8 వ్యవసాయ కళాశాలలున్నాయి.

News December 21, 2024

MCGలో ప్రాక్టీస్ ప్రారంభించిన టీమ్ ఇండియా

image

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య BGT నాలుగో టెస్ట్ ఈనెల 26 నుంచి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా ఇవాళ ఉదయం అక్కడ ప్రాక్టీస్ చేయడం మొదలెట్టింది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 3 టెస్టులు జరగ్గా ఇరు జట్లు చెరో విజయంతో సమంగా ఉన్నాయి. WTC ఫైనల్ చేరాలంటే భారత్ చివరి రెండు టెస్టులు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రోహిత్, కోహ్లీ ఫామ్ లేమి ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది.

News December 21, 2024

HIGH ALERT.. భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతోంది. విశాఖకు 450K.M దూరంలో కేంద్రీకృతమైన ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో అల్లూరి, కాకినాడ, అనకాపల్లి, VSP, మన్యం, VZM, SKLM జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమ, దక్షిణ, ఉత్తర కోస్తాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షాలు ఉత్తరాంధ్రను రెండ్రోజులుగా వణికిస్తున్నాయి.

News December 21, 2024

నేడు GST కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయాలు?

image

FM నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇవాళ GST కౌన్సిల్ భేటీ కానుంది. లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్‌లపై GST రేటు తగ్గించడంపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే ఛాన్సుంది. జొమాటో, స్విగ్గీపై GST రేటు 5% తగ్గించడంతో పాటు ఈవీలు, పెట్రోల్/డీజిల్‌తో నడిచే చిన్న స్థాయి వాహనాలపై GSTని 12% నుంచి 18%కి పెంచాలని సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 148 వస్తువులపై GSTని సవరించాలని ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం.

News December 21, 2024

ఇక నుంచి రోజుకు 8-10 సార్లు సైబర్ క్రైమ్ కాలర్ ట్యూన్స్

image

సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. వీటిపై ఫోన్ యూజర్లకు రోజుకు 8-10 సార్లు అవేర్‌నెస్ కాలర్ ట్యూన్‌లు ప్లే చేయాలని టెలికం ఆపరేటర్లను ఆదేశించింది. తాము అందించే వివిధ కాలర్ ట్యూన్స్‌ను 3 నెలల పాటు ప్లే చేయాలని సూచించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. దీంతో ఇకపై మీరు ఫోన్ కాల్స్ చేసినప్పుడల్లా సైబర్ క్రైమ్ కాలర్ ట్యూన్స్ వినపడనున్నాయి.

News December 21, 2024

ఈడీ కేసుపైనా హైకోర్టుకు కేటీఆర్?

image

ఫార్ములా ఈ-రేసు వ్యవహారంపై ఏసీబీ కేసు విషయంలో కేటీఆర్‌కు కొంత ఊరట దక్కిన సంగతి తెలిసిందే. ఆయనను ఈనెల 30 వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే గంటల వ్యవధిలోనే ఆయనపై <<14936688>>ఈడీ కేసు<<>> ఫైల్ చేసింది. దీనిని కూడా క్వాష్ చేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. క్వాష్ పిటిషన్ వేయాలా? పిటిషన్ వేయకుండా ఈడీ విచారణకు హాజరవ్వాలా అనే దానిపై ఆయన న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

News December 21, 2024

ఏపీ హైకోర్టులో ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయంటే?

image

ఏపీ హైకోర్టులో 2,47,097 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో వెల్లడించారు. జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 9,04,462 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. హైకోర్టులో మొత్తం 37 మంది జడ్జిలు ఉండాల్సి ఉండగా, 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. సుప్రీం కోర్టులో 82,640, అన్ని రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో కలిపి మొత్తం 61,80,878 పెండింగ్ కేసులు ఉన్నాయని చెప్పారు.