news

News December 20, 2024

సంగారెడ్డి జైలు నుంచి లగచర్ల రైతుల విడుదల

image

TG: లగచర్లలో అధికారులపై దాడి కేసులో అరెస్టైన రైతులు సంగారెడ్డి జైలు నుంచి విడుదల అయ్యారు. వీరికి గిరిజన సంఘాలు స్వాగతం పలికాయి. రైతులకు 2 రోజుల క్రితం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయగా గురువారమే రిలీజ్ కావాల్సింది. సాయంత్రం 6 గంటలలోగా బెయిల్‌కు సంబంధించిన పత్రాలు సిద్ధం కాకపోవడంతో ఈ ఉదయం విడుదల చేశారు.

News December 20, 2024

6 గంటల్లోనే ఖాతాల్లోకి డబ్బులు!

image

AP: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతులకు డబ్బులు జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే కొంత మంది రైతులకు 6, 7 గంటల్లోనే నగదును జమ చేస్తున్నట్లు తెలుస్తోంది. ధాన్యం మిల్లుల్లో దిగుమతి చేయగానే అక్కడికక్కడే చెల్లింపులు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మీకు ధాన్యం అమ్మిన ఎన్ని గంటలకు డబ్బులు జమ అవుతున్నాయో కామెంట్ చేయండి.

News December 20, 2024

మహిళలపై ‘మంత్రగత్తె’ ముద్ర రాజ్యాంగానికే మచ్చ: సుప్రీం కోర్టు

image

మంత్రగత్తెల పేరిట మహిళలపై దాడులు జరగడం రాజ్యాంగ స్ఫూర్తికి మచ్చ అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. మంత్రగత్తెల నెపంతో ఇద్దరు మహిళలపై ఓ వ్యక్తి దాడి చేసిన కేసులో బిహార్ హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టేను అత్యున్నత ధర్మాసనం కొట్టివేసింది. మహిళల ప్రాథమిక హక్కులు, గౌరవానికి దాడులతో భంగం వాటిల్లుతోందని, వృద్ధ, వితంతు మహిళలపై దాడులు చేసేందుకు నెపాన్ని వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

News December 20, 2024

శ్రీవారి దర్శనం కోసం 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ రెండ్రోజులుగా పెరుగుతూనే ఉంది. నిన్నటి మాదిరే ఇవాళ కూడా టోకెన్లు లేని వారికి శ్రీవారి దర్శనం కోసం 15 గంటల సమయం పడుతోంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారిని నిన్న 58,165 మంది దర్శించుకోగా, 20,377 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.60కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

News December 20, 2024

BITCOIN క్రాష్: 3 రోజుల్లో ₹9 లక్షల నష్టం

image

క్రిప్టో మార్కెట్లు గత 24 గంటల్లో భారీగా పతనమయ్యాయి. మార్కెట్ విలువ 4.23% తగ్గి $3.33Tకు చేరుకుంది. బిట్‌కాయిన్ డామినెన్స్ స్వల్పంగా పెరిగినా రేటు $2742 తగ్గింది. చివరి 3 సెషన్లలోనే BTC $10500 (₹9L) మేర పతనమైంది. ప్రస్తుతం $96037 వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ ఏకంగా 6.50% తగ్గి $3380 వద్ద ట్రేడవుతోంది. BNP 2.97, SOL 4.72, DOGE 11.42, ADA 6.52, AVAX 6.37, LINK 5.92, SHIB 8.18% మేర నష్టపోయాయి.

News December 20, 2024

ఇవాళ స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్

image

AP: అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, మన్యం, అనకాపల్లి, అన్నమయ్య జిల్లాలు సహా పలుచోట్ల రాత్రి నుంచి వర్షం పడుతోంది. దీంతో ఇవాళ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. వర్షంలో స్కూలు, కాలేజీలకు వెళ్లేందుకు ఇబ్బంది అవుతుందని, ముందే సెలవు ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

News December 20, 2024

అశ్విన్‌లో ఆవేదన, బాధ కనిపించాయి: కపిల్ దేవ్

image

భారత స్టార్ ఆటగాడు అశ్విన్‌ ఇలా ఆటను వదిలేయడం తనను షాక్‌కు గురిచేసిందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. కొన్ని రోజులు ఆగి సొంత గడ్డపై రిటైర్మెంట్ ప్రకటించాల్సిందన్నారు. అతనిలో ఆవేదన, బాధ కనిపించాయని.. తన వైపు కథేంటో వినాలని ఉందని చెప్పారు. బ్యాటర్లకు ఎక్కువగా ప్రశంసలు దక్కే ఆటలో అశ్విన్ సత్తా చాటి 100కు పైగా టెస్టులు ఆడారన్నారు. BCCI అతనికి ఘనమైన వీడ్కోలు పలకాలని కపిల్ దేవ్ అన్నారు.

News December 20, 2024

STOCK MARKETS: ఇవాళా నష్టాలేనా!

image

స్టాక్‌మార్కెట్లు నేడూ లాభపడే సూచనలు కనిపించడం లేదు. నిన్న US, EU సూచీలన్నీ భారీ నష్టాల్లో ముగిశాయి. మరోవైపు రూపాయి ఆల్‌టైమ్ కనిష్ఠమైన 85.08కు చేరుకుంది. FIIల అమ్మకాలు కొనసాగుతున్నాయి. నేడు ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందుతున్నాయి. నిక్కీ పెరిగినా గిఫ్ట్ నిఫ్టీ 67 పాయింట్లు తగ్గిపోవడం అశుభసూచకం. ఓవర్ సోల్డ్ పరిస్థితుల్లో సూచీల్లో స్వల్ప పుల్‌బ్యాక్‌కు ఆస్కారం ఉందంటున్నారు నిపుణులు.

News December 20, 2024

అమెరికా వీసా కష్టాలకు చెక్!

image

అమెరికా వీసా కోసం ఇకపై నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. నిబంధనల్లో మార్పులు చేయడంతో కొత్త సంవత్సరం నుంచి దరఖాస్తుదారులు వారి అపాయింట్‌మెంట్‌ను ఎలాంటి అదనపు రుసుము లేకుండా మరో వీసా కేంద్రానికి మార్చుకోవడంతో పాటు ఒకసారి రీ షెడ్యూల్ చేసుకోవచ్చు. రెండోసారి రీ షెడ్యూల్ చేసుకోవాలని భావిస్తే కొత్త అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు భారత్‌లోని యూఎస్ ఎంబసీ ప్రకటన విడుదల చేసింది.

News December 20, 2024

మతపరమైన పాలనపై సిరియాలో నిరసనలు

image

మతపరమైన పాలన తమకొద్దంటూ వందలాదిమంది సిరియా ప్రజలు నిరసనల బాట పట్టారు. రాజధాని డమాస్కస్‌లోని ఉమయ్యద్ చౌరస్తా వద్ద గుమిగూడి తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. మహిళలకు హక్కుల్ని కల్పించే ప్రజాస్వామ్య వ్యవస్థ రావాలంటూ డిమాండ్ చేశారు. ‘50 ఏళ్లకు పైగా నియంతృత్వ పాలనలో నలిగిపోయాం. ఇప్పుడైనా మాకు లౌకిక, ప్రజాస్వామ్య పాలనను ఏర్పాటు చేయాలి’ అంటూ నినాదాలు చేశారు.