news

News February 15, 2025

భారత క్రికెటర్లను హగ్ చేసుకోవద్దు: పాక్ అభిమానులు

image

ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో పాకిస్థాన్ ప్లేయర్లకు ఆ దేశ అభిమానులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 23న భారత్, పాక్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీతో పాటు టీమ్ ఇండియా క్రికెటర్లను హగ్ చేసుకోవద్దని సందేశాలు పంపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. భారత్, పాక్ మ్యాచ్ అనగానే ఇరుదేశాల అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంటుందన్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ వార్నింగ్ నేపథ్యంలో ఆటగాళ్లు ఏవిధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

News February 15, 2025

కులగణన.. రేపటి నుంచి వారికి మరో ఛాన్స్

image

TG: కులగణనలో పాల్గొనని 3,56,323 కుటుంబాల వివరాల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. రేపటి నుంచి ఈ నెల 28 వరకు టోల్‌ఫ్రీ నంబర్ 040 21111111కు కాల్ చేస్తే ఎన్యుమరేటర్లు వారి ఇంటికెళ్లి వివరాలు సేకరిస్తారు. MPDO, వార్డు ఆఫీసులకు వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చు. https://seeepcsurvey.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో సర్వే ఫామ్ డౌన్‌లోడ్ చేసుకుని నింపి ప్రజాపాలన కేంద్రంలోనూ ఇవ్వొచ్చు.

News February 15, 2025

హీరోయిన్‌లా మోనాలిసా.. PHOTO

image

కుంభమేళాలో ఆకర్షించే కళ్లతో పూసలు అమ్ముతూ ఓవర్ నైట్ స్టార్‌గా మారిన మోనాలిసా కొత్త ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేరళలో ఓ జువెల్లరీ షాప్ ఓపెనింగ్‌కు వెళ్లినప్పుడు రెడ్ గాగ్రాలో ఉన్న ఆమెను కెమెరామెన్ క్లిక్ అనిపించాడు. ఆ ఫొటోను పోస్ట్ చేసిన మోనాలిసా లవ్ కేరళ అంటూ లవ్ సింబల్‌ను పంచుకున్నారు. దీంతో హీరోయిన్‌లా ఉన్నావంటూ, ఆల్ ది బెస్ట్ చెబుతూ నెటిజన్లు ఆ ఫొటోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

News February 15, 2025

జీబీఎస్ కేసులపై ఆందోళన అవసరం లేదు: మంత్రి సత్యకుమార్

image

AP: గిలియన్ బార్ సిండ్రోమ్(జీబీఎస్) కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్ చెప్పారు. కేసులు పెరగడానికి కారణాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. మరణాల నివారణ చర్యల కోసం ఇతర రాష్ట్రాలతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయన్నారు.

News February 15, 2025

BCలకు 48శాతం రిజర్వేషన్ ఇవ్వాలి: కవిత

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే తప్పులతడకగా ఉందని BRS MLC కవిత ఆరోపించారు. ఖమ్మంలో బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ‘బీసీలకు 42శాతం కాదు, విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో 48శాతం రిజర్వేషన్ ఇవ్వాలి. కులగణన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టాలి. మతాలు, కులాల మధ్య గొడవలు పెట్టడమే బీజేపీ నేతల పని. జై భీమ్, జై బీసీ నినాదం ఒకచోటే ఉండాలి’ అని డిమాండ్ చేశారు.

News February 15, 2025

మహిళా క్రికెటర్‌కు హీరో శివ కార్తికేయన్ సాయం!

image

తాము కష్టాల్లో ఉన్నప్పుడు సినీ నటుడు శివ కార్తికేయన్ చేసిన సాయాన్ని భారత మహిళా క్రికెటర్ ఎస్ సంజన గుర్తు చేసుకున్నారు. ‘2018 వయనాడ్ వరదల్లో ఇళ్లు కోల్పోయాం. నా ట్రోఫీలు, క్రికెట్ కిట్ కొట్టుకుపోయాయి. అప్పుడు శివ కార్తికేయన్ కాల్ చేసి హెల్ప్ కావాలా అని అడిగారు. కొత్త స్పైక్స్ కావాలని అడిగిన వారంలోనే అవి నా చెంతకు చేరాయి. అప్పుడు నా చుట్టూ ఎంత మంది మద్దతుదారులున్నారో తెలిసింది’ అని చెప్పుకొచ్చారు.

News February 15, 2025

కుంభమేళా సమయం పొడిగించండి: అఖిలేశ్

image

ప్రయాగ్‌రాజ్‌కు వస్తున్న భక్తుల రద్దీ దృష్ట్యా మహాకుంభమేళాను 75 రోజులకు పొడిగించాలని SP చీఫ్ అఖిలేశ్ యాదవ్ కోరారు. గతంలో ఒకసారి కుంభమేళా 75 రోజులపాటు జరిగిందని తెలిపారు. రద్దీ దృష్ట్యా 60 సంవత్సరాల పైబడిన వారు కుంభమేళాకు రాలేకపోతున్నారన్నారు. ఇప్పటివరకూ 60కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తే 50కోట్ల మంది వచ్చినట్లు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందని ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.

News February 15, 2025

రెండోసారి తల్లి కాబోతున్న హీరోయిన్ ఇలియానా

image

గోవా బ్యూటీ ఇలియానా తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు పరోక్షంగా చెప్పారు. తాజాగా విడుదల చేసిన ఇన్‌స్టా రీల్‌లో ప్రెగ్నెన్సీ కిట్‌ను చూపించడంతో పాటు మిడ్‌నైట్ స్నాక్స్ ఫొటోలను పంచుకుంది. ‘నువ్వు గర్భవతివని నాకు చెప్పకుండా గర్భవతివని చెప్పు’ అని రాసుకొచ్చింది. కాగా మైఖేల్ డోలన్‌ను పెళ్లాడిన ఇలియానాకు 2023 ఆగష్టులో కోవా ఫోనిక్స్ డోలన్ అనే బాబు పుట్టాడు.

News February 15, 2025

అప్పట్లో..! టీచర్ అంటే సర్ కాదు!!

image

స్కూల్ డేస్‌లో టీచర్, సర్ తేడాలు గుర్తున్నాయా. అప్పట్లో టీచర్ అంటే ఉపాధ్యాయురాలు. సర్ అంటే ఉపాధ్యాయుడు. పొరపాటున ఎవరైనా సర్‌ని టీచర్ అంటే ఆయన టీచర్ కాదు సర్ అని చెప్పి అంతా నవ్వడం, ఆ తర్వాత ఏడిపించడం సాధారణంగా జరిగేవి. ఇప్పుడు కొంచెం జెండర్ డిఫరెన్స్ క్లారిటీ వచ్చేలా మేడమ్, సర్ అంటున్నారు.
Ex: మీకు ఇంగ్లిష్ సబ్జెక్ట్ మేడమ్ చెబుతారా? సర్ చెబుతారా?
మీకూ ఈ టీచర్, సర్ అనుభవం ఉందా? కామెంట్ చేయండి.

News February 15, 2025

అమ్మడు లైనప్ అదిరిందిగా!

image

‘మిస్టర్ బచ్చన్’తో హీరోయిన్ భాగ్యశ్రీబోర్సే టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. సినిమా పెద్దగా ఆడకపోయినా ఈ బ్యూటీ నటనకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రేజ్‌తో వరుస సినిమాల్లో ఛాన్సులు కొట్టేశారు. రామ్ పోతినేని సరసన RAPO22, దుల్కర్ సల్మాన్ ‘కాంత’లో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’లో ఆమె కనిపిస్తారని సమాచారం. దీంతో ఈ అమ్మడి లైనప్ అదిరిపోయిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.