India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు బ్యాటర్ జాకబ్ బెథెల్ గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యారని కెప్టెన్ బట్లర్ చెప్పారు. ఈ విషయం ఆయనను నిరుత్సాహానికి గురిచేసిందన్నారు. టీమ్ ఇండియాతో రెండో వన్డేలోనూ బెథెల్ ఆడలేదు.

APSRTCకి చెందిన బస్సులో ‘తండేల్’ పైరసీ వెర్షన్ ప్రదర్శన చేసినట్లుగా తమ దృష్టికి వచ్చినట్లు నిర్మాత బన్నీ వాసు ట్వీట్ చేశారు. WAY2NEWS కథనాన్ని ప్రస్తావిస్తూ ఇలా ప్రదర్శన చేయడం చట్టవిరుద్ధమని, సినిమాను తెరకెక్కించేందుకు కష్టపడిన వారికి అవమానమని పేర్కొన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావును కోరారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలన్నారు.

బ్రిటిష్ స్టార్ సింగర్ ఎడ్ షీరన్ ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ సాంగ్ పాడటంపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. ‘సంగీతానికి సరిహద్దులు లేవనే దానిని ఎడ్ మళ్లీ నిరూపించారు. మీరు తెలుగులో చుట్టమల్లే పాడటం నిజంగా విశేషం’ అని ఇన్స్టాలో పేర్కొంటూ సింగర్ శిల్పా రావును ట్యాగ్ చేశారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్-2’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనలకు నేడు బయల్దేరనున్నారు. గడిచిన 11 ఏళ్లలో ఆయన 86 విదేశీ పర్యటనలు చేసి దౌత్యపరమైన సమావేశాలు నిర్వహించారు. 2014లో తొలిసారి ప్రధాని కాగానే ఆయన భూటాన్ వెళ్లారు. ఆ తర్వాత బ్రెజిల్, నేపాల్, జపాన్.. ఇలా దశాబ్ద కాలంగా పర్యటనలు చేశారు. గతేడాది 11 విదేశీ పర్యటనలు చేసిన మోదీకి ఈ ఏడాది ఇదే తొలి పర్యటన.

TG: దుండగుల <<15408903>>దాడి ఘటనలో<<>> గాయపడిన చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకుడు రంగరాజన్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్ కాల్లో పరామర్శించారు. ఘటన వివరాలను ఆరా తీయడమే కాకుండా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. ఆయనకు అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు Xలో వెల్లడించారు.

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు ఎమర్జింగ్ మార్కెట్ల కరెన్సీలు కుదేలవుతున్నాయి. నేడు డాలర్తో పోలిస్తే రూపాయి 87.9563 వద్ద జీవితకాల కనిష్ఠాన్ని తాకింది. ఉదయం 87.9175 వద్ద ఓపెనైన రూపాయి ప్రస్తుతం 87.8240 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు డాలర్ ఇండెక్స్ 108.266 వద్ద జోరు ప్రదర్శిస్తోంది. తాము దిగుమతి చేసుకొనే స్టీల్, అల్యూమినియంపై 25% టారిఫ్స్ విధిస్తామని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

వివాహ శుభకార్యాల వేళ బంగారం ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.350 పెరిగి రూ.79,800లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.390 పెరగడంతో తొలిసారి రూ.87,060లకు చేరింది. అటు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,07,000గా ఉంది.

స్టార్ హీరో సినిమానా?.. అయితే అనిరుధ్ని దింపాల్సిందే అన్నట్లుగా మారిపోయింది. భారీ బడ్జెట్ సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ అందిస్తూ సక్సెస్కు కేరాఫ్ అడ్రెస్గా అనిరుధ్ మారిపోయారు. మన టాలీవుడ్లోనూ అదరగొట్టే మ్యూజిక్ డైరెక్టర్లున్నా ఈయనవైపే డైరెక్టర్లు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్- నెల్సన్, అల్లు అర్జున్- అట్లీ, ప్రభాస్ – లోకేశ్ కనగరాజ్ సినిమాలకు అనిరుధ్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం.

స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ నెల 11, 12 తేదీల్లో మరిన్ని దేశాలపై టారిఫ్స్ అమలు చేస్తానన్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో సూచీలు కుదేలయ్యాయి. నిఫ్టీ 23,452 (-107), సెన్సెక్స్ 77,514 (-341) వద్ద ట్రేడవుతున్నాయి. FMCG షేర్లకు డిమాండ్ ఉంది. మీడియా, మెటల్, ఫార్మా, హెల్త్కేర్, O&G షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. బ్రిటానియా, టాటా కన్జూమర్, HUL, నెస్లే ఇండియా, M&M టాప్ గెయినర్స్.

దివ్యాంగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే పాసులు పొందడానికి వెబ్ సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిలో కొత్త పాసులతో పాటు పాతవి రెన్యూవల్ చేసుకోవచ్చు. ఇందులోనే దివ్యాంగులకు యూనిక్ డిజేబిలిటీ ఐడీ కార్డు మంజూరు చేస్తారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
వెబ్సైట్: https://divyangjanid.indianrail.gov.in/
Sorry, no posts matched your criteria.