India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని విద్యాసంస్థలకు కలెక్టర్లు ఇవాళ సెలవు ప్రకటించారు. ఈ ఆదేశాలను యాజమాన్యాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు.
వరల్డ్ చెస్ ఛాంపియన్గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్ ట్రోఫీతో పాటు 1.35మిలియన్ డాలర్లు( దాదాపు రూ.11.45కోట్లు) ప్రైజ్ మనీ గెలిచారు. అలాగే, రన్నరప్ డింగ్ లిరెన్ 1.15 మిలియన్ డాలర్లు (రూ.9.75కోట్లు) సొంతం చేసుకున్నారు. మొత్తం ఛాంపియన్షిప్ ప్రైజ్ మనీ రూ.21.75 కోట్లు కాగా, ఒక గేమ్ గెలిచిన ఆటగాడికి రూ.1.69 కోట్లు వస్తాయి. గుకేశ్ 3 గేమ్లు, లిరెన్ 2 నెగ్గగా.. మిగిలిన దాన్ని సమానంగా పంచారు.
TG: ఈ-ఫార్ములా రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. KTRపై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. రేసుకు ముందే నిర్వహణ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ ఇవ్వడంపై ప్రభుత్వం <<14595374>>విచారణ<<>> చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ప్రజాప్రతినిధి అయిన KTRపై చట్టపరమైన చర్యల కోసం గవర్నర్ అనుమతి కోరింది. ఈ అంశంపై న్యాయసలహా తీసుకున్న గవర్నర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
TG: హైదరాబాద్లో న్యూఇయర్ వేళ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అర్ధరాత్రి 1గంట వరకే ఈవెంట్స్ నిర్వహించాలని, సీసీ కెమెరాలు తప్పనిసరి అని నిర్వహకులకు సూచించారు. 15 రోజుల ముందే కచ్చితంగా అనుమతి తీసుకోవాలన్నారు. వేడుకల్లో అశ్లీల నృత్యాలపై నిషేధం విధించారు. తాగి వాహనం నడిపితే రూ.10వేల ఫైన్, 6 నెలలు జైలుశిక్ష విధిస్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు.
వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో చైనా ప్లేయర్ డింగ్ లిరెన్ ఉద్దేశపూర్వకంగా ఓడినట్లు రష్యా చెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఆండ్రీ ఫిలాటోవ్ ఆరోపించారు. దీనిపై అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్(FIDE) విచారణ జరపాలన్నారు. కీలక సెగ్మెంట్లో లిరెన్ పావుల కదిపిన తీరు అనుమానాస్పదంగా ఉందని చెప్పారు. ఫస్ట్ క్లాస్ ప్లేయర్తో ఓడిపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. 18ఏళ్ల గుకేశ్ వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే.
AP: మద్దతు ధర లేక అల్లాడుతున్న అన్నదాతలకు అండగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాటకు సిద్ధమైనట్లు YCP ప్రకటించింది. రైతులతో కలిసి తమ నాయకులు కలెక్టరేట్లకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రాలు అందజేస్తారని తెలిపింది. రైతుల గోడు ప్రభుత్వానికి తెలిసేలా నిరసన చేపట్టనున్నట్లు వివరించింది. ధాన్యం కొనుగోలు, రూ.20వేలు పెట్టుబడి సాయం తదితర సమస్యలపై YCP పోరాడుతుందని మాజీ CM జగన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
TG: రాష్ట్రంలోని పలు జిల్లాలను చలి వణికిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం కనిష్ఠ ఉష్ణోగ్రత 7°C నమోదైంది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 9 వరకు చలి ప్రభావం ఉంటుండగా వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికి తోడు పొగమంచు కారణంగా వాహనదారులు లైట్లు వేసుకొని నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు చెబుతున్నారు.
చలికాలంలో ప్రతి ఒక్కరినీ వేధించే సమస్య పెదవుల పగుళ్లు. రాత్రి పడుకునే ముందు పాలతో పెదవులను మర్దన చేసుకొని మార్నింగ్ లేవగానే కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే కొబ్బరి నూనె, ఆ నూనెతో తయారు చేసిన లిప్ బామ్స్ కూడా పగుళ్లను నివారిస్తాయి. తేనె కూడా పెదవుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రాత్రి పూట రాసి ఉదయాన్నే కడిగితే పెదవులు మృదువుగా మారిపోతాయి. వీటితో పాటు తగినంత నీటిని తాగడం ముఖ్యం.
పాక్ క్రికెట్ టెస్ట్ జట్టు కోచ్ గిలెస్పీ రాజీనామా చేశారని క్రిక్బజ్ తెలిపింది. కొద్దిగంటల్లో పాక్ జట్టు సౌతాఫ్రికాకు టెస్ట్ సిరీస్ కోసం వెళ్లాల్సి ఉండగా ఆయన పాక్ క్రికెట్ బోర్డ్(PCB)కి ఈ విషయం తెలియజేసినట్లు పేర్కొంది. ‘గిలెస్పీ రాజీనామా చేశారు’ అని PCB అధికార ప్రతినిధి ఒకరు చెప్పారని వివరించింది. దీంతో వన్డే జట్టు తాత్కాలిక కోచ్ ఆకిబ్ జావెద్నే టెస్టు జట్టుకూ తాత్కాలికంగా PCB నియమించింది.
ఇటీవల పలు ఈవెంట్లలో చేసిన వ్యాఖ్యలతో అల్లు అర్జున్ వ్యవహారంపై కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. మొన్న ఈవెంట్లో <<14819498>>తెలంగాణ CM పేరును<<>> ఆయన మరిచిపోయారని చర్చ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీ ఈవెంట్లోనూ సుకుమార్ పేరును <<14859353>>సుకుమార్ రెడ్డి<<>> అని సంబోధించారు. అయితే మరోసారి ఐకాన్ స్టార్ పొరబడ్డారని పలువురు పోస్టులు పెడుతున్నారు. దీంతో అల్లు అర్జున్కు ఏమైందని కామెంట్లు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.