India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: గల్ఫ్ ఆఫ్ మన్నార్, పరిసర ప్రాంతాలపై తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతూ వచ్చే 12 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. రేపు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది.
AP: ఈనెల 17న విజయవాడలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ సదస్సులో నూతన పర్యాటక పాలసీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో ఎలా ముందుకెళ్లాలనే అంశాలను కూలంకషంగా చర్చిస్తామని కలెక్టర్ల సమావేశంలో తెలిపారు. అడిగిన వెంటనే పర్యాటక రంగానికి సీఎం చంద్రబాబు పరిశ్రమ హోదా కల్పించారని పేర్కొన్నారు.
‘పుష్ప-2’ సినిమాలో ‘తగ్గేదేలే’ అని చెప్పే ప్రతి సీన్ తన ఫేవరెటేనని హీరో అల్లు అర్జున్ చెప్పారు. ఈ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన భారతీయులకు ఐకాన్ స్టార్ ధన్యవాదాలు తెలిపారు. పుష్ప అంటే ఫైర్ కాదని, వెల్డ్ ఫైర్ అని హిందీలో డైలాగ్ చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన ‘థాంక్యూ ఇండియా’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా దర్శకుడు సుకుమార్దేనని పేర్కొన్నారు.
దేశంలో 1952లో తొలి సాధారణ(జమిలి) ఎన్నికలు జరగగా 1967 వరకు కొనసాగాయి. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలడం, ముందుగానే అసెంబ్లీలు రద్దు చేసి ఎన్నికలు నిర్వహించడంతో గడువులు మారాయి. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, ఆంధ్రప్రదేశ్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తాజాగా కోవింద్ కమిటీ సిఫార్సుల మేరకు జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
స్వర్ణాంధ్ర-2047 విజన్తో రాష్ట్రాన్ని నం.1గా నిలబెడతామని CM చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయిన సందర్భంగా ట్వీట్ చేశారు. మెగా DSC, కానిస్టేబుల్ తదితర ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నామని, పలు కంపెనీల నుంచి భారీ పెట్టుబడులు రాబట్టినట్లు చెప్పారు. దీపం-2 పథకం, పెన్షన్ల పెంపు వంటి హామీలను నెరవేర్చామన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై మీ కామెంట్?
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా నుంచి ఈనెల 14న మొదటి పాట విడుదల కానుంది. రేపు ఉ.10.08 గంటలకు ప్రోమోను రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు. 2025 జనవరి 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
‘షేర్లు పడ్డప్పుడు కొని పెరిగినప్పుడు అమ్మేయాలి’.. ఈ నానుడి నిజమే అయినా అవగాహన లేకుండా కొంటే తిప్పలు తప్పవు. మార్కెట్లు పడ్డాయి కదాని అప్పుచేసి పెట్టుబడి పెడితే ఆ ఊబిలోంచి బయటపడలేరు. TG, తాండూరులో ఓ ల్యాబులో పనిచేసే శివప్రసాద్ ఇదే తప్పు చేశారు. అప్పుచేసి పెట్టుబడి పెడితే రాబడి రాలేదు. దాంతో అప్పుల బాధ తాళలేక కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది. షేర్లు కొనేముందు రకరకాల అంశాలు ఇమిడి ఉంటాయి. అవేంటంటే..
షేర్లలో అప్పుచేసి ఎప్పుడూ పెట్టుబడి పెట్టొద్దు. డబ్బు లేకుంటే నెలకు కొంత పక్కన పెట్టుకొని కార్పస్ ఏర్పాటు చేసుకోవచ్చు. ముందు నిపుణుల వద్ద ఇన్వెస్టింగ్, ట్రేడింగ్ నేర్చుకోవాలి. లాభనష్టాలు, నష్టభయంపై అవగాహన తెచ్చుకోవాలి. ఫండమెంటల్స్, టెక్నికల్స్, సపోర్టు, రెసిస్టెన్సీ, కన్సాలిడేషన్, కరెక్షన్, అక్యూములేషన్, మార్కెట్ కండీషన్స్ తెలుసుకొని చిన్నగా ఆరంభించాలి. అనుభవం వచ్చాక పొజిషన్ సైజ్ పెంచుకోవచ్చు.
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్వదేశంలో హీరో, విదేశాల్లో జీరో అని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కల్లినన్ ఎద్దేవా చేశారు. ఫ్లాట్ ట్రాక్లపై మాత్రమే ఆయన ఆడతారన్నారు. ‘రోహిత్ ఫిట్గా కనిపించడం లేదు. కోహ్లీ ఫిట్నెస్తో పోలిస్తే హిట్మ్యాన్ చాలా వెనుకబడ్డారు. ఆయన అధిక బరువుతో సతమతమవుతున్నారు. 5 రోజుల పాటు సాగే టెస్టుల్లో ఆడేందుకు రోహిత్ పనికిరాడు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకుల వాదన. పార్లమెంటు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికతో జాతీయ పార్టీలకు ప్రాధాన్యం ఏర్పడి స్థానిక పార్టీలు పత్తా లేకుండా పోతాయని చెబుతున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీనే రాష్ట్రాల్లోనూ విజయం సాధించే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. మరోవైపు ఈ ఎన్నికలతో స్థానిక అంశాలు, సమస్యలు మరుగునపడుతాయని చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.