news

News February 5, 2025

జగన్ 2.O చూడబోతున్నారు: YS జగన్

image

AP: ఈసారి జగన్ 2.Oని చూడబోతున్నారని YS జగన్ అన్నారు. ‘2.0 వేరేగా ఉంటుంది. కార్యకర్తల కోసం జగన్ ఎలా పని చేస్తాడో చూపిస్తా. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయ పడ్డా. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయా. ఇప్పుడు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టను. ఎక్కడున్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతా’ అని జగన్ హెచ్చరించారు.

News February 5, 2025

రిజర్వేషన్ల కోసమే కులగణన: టీపీసీసీ చీఫ్

image

TG: రిజర్వేషన్ల కోసమే రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టినట్లు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. పీసీసీలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. ‘రాష్ట్రంలో 3.6 శాతం మందే సర్వేలో పాల్గొనలేదు. వీరిలో ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉన్నారు. అలాగే పార్టీలో ఎంతటివారైనా నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. రూల్స్ పాటించని వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయి’ అని ఆయన హెచ్చరించారు.

News February 5, 2025

పేరు మార్పు: ఫోర్ట్ విలియమ్ ఇకపై ‘విజయ్ దుర్గ్’

image

కోల్‌కతాలోని ఇండియన్ ఆర్మీ ఈస్ట్రన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ పేరును మార్చినట్టు తెలిసింది. ఫోర్ట్ విలియమ్ బదులు ‘విజయ్ దుర్గ్’గా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. 2023, DECలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని డిఫెన్స్ మినిస్ట్రీ PR, వింగ్ కమాండర్ హిమాన్షు తివారీ చెప్పారని TOI తెలిపింది. అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇంటర్నల్ కమ్యూనికేషన్లో విజయ్‌దుర్గ్‌నే వాడుతున్నట్టు చెప్పారని వెల్లడించింది.

News February 5, 2025

23న శ్రీశైలానికి సీఎం చంద్రబాబు

image

AP: శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ఈ నెల 19- మార్చి 1 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా CM చంద్రబాబు 23న స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు దేవస్థాన యంత్రాంగం కృషి చేస్తోంది. పాతాళగంగ వద్ద రక్షణ కంచెలు, మహిళలు బట్టలు మార్చుకునే గదులకు మరమ్మతులు చేస్తున్నారు. అటు శివ దీక్ష భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు.

News February 5, 2025

Stock Markets: మీడియా, మెటల్, PSU బ్యాంకు షేర్లు అదుర్స్

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు మోస్తరు నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో లాభపడినప్పటికీ గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలు రావడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. నిఫ్టీ 23,696 (-42), సెన్సెక్స్ 78,271 (-312) వద్ద క్లోజయ్యాయి. FMCG, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లు ఎరుపెక్కాయి. మీడియా, మెటల్, PSU బ్యాంకు, O&G షేర్లు ఎగిశాయి. హిందాల్కో, ITC హోటల్స్, ONGC, అపోలో హాస్పిటల్స్, BPCL టాప్ గెయినర్స్.

News February 5, 2025

ఇలా చేస్తే ₹14లక్షల వరకు Zero Income Tax

image

కొత్త పన్ను విధానంలో ఉన్న ఏకైక మినహాయింపు NPS. సెక్షన్ 80CCD ప్రకారం బేసిక్ శాలరీలో 14% వరకు లబ్ధి పొందొచ్చు. దీనికి ₹75K స్టాండర్డ్ డిడక్షన్ తోడైతే దాదాపుగా ₹14L వరకు పన్ను కట్టాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. Ex. CTC ₹13.75L, బేసిక్ ₹7.16L (CTCలో 50%) అనుకుందాం. అందులో NPS ₹1.1L (బేసిక్‌లో 14%), SD ₹75K తీసేస్తే మిగిలేది ₹11.9L. ఇది Taxable Income ₹12.1L కన్నా తక్కువే.

News February 5, 2025

ChatGPT, డీప్‌సీక్‌పై నిషేధం

image

రహస్య సమాచారం, పత్రాలు లీకయ్యే ప్రమాదం ఉండటంతో ఛాట్‌జీపీటీ, డీప్‌సీక్ వంటి అన్ని రకాల AI టూల్స్ వాడకాన్ని ఫైనాన్స్ మినిస్ట్రీ నిషేధించింది. సంబంధిత ఆదేశాలను ఆ శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఆమోదించారు. ఆర్థిక వ్యవహారాలు, ఎక్స్‌పెండీచర్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, దీపమ్, ఆర్థిక సేవల శాఖలకు లేఖలు పంపించారు. జనవరి 29న, కేంద్ర బడ్జెట్‌కు ముందు ఆదేశాలు ఇవ్వగా ఇప్పటికీ అమలు కొనసాగుతోంది.

News February 5, 2025

TTDలో అన్యమత ఉద్యోగులు బదిలీ

image

AP: టీటీడీలో అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభమయ్యాయి. హిందూ మతేతర కార్యక్రమాల్లో పాల్గొంటూనే టీటీడీ ఉత్సవాల్లోనూ పాల్గొంటున్న 18 మంది ఉద్యోగులపై టీటీడీ క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది. ఇకపై వీరిని టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపుల్లో విధులకు నియమించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 18 మందిని వెంటనే బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

News February 5, 2025

ఏపీ అసెంబ్లీకి లోక్‌సభ స్పీకర్

image

AP: అసెంబ్లీలో ఈ నెల 22 నుంచి రెండు రోజుల పాటు MLA, MLCలకు ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ఓరియంటేషన్ క్లాసులను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించనుండగా, ఒక సెషన్‌లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడనున్నారు. ఈ క్లాసుల తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

News February 5, 2025

మహిళలూ.. ఇది మీకోసమే!

image

చాలా మంది మహిళలు మేకప్ వేసుకున్న తర్వాత బ్రష్‌ను అలానే వదిలేసి, కొద్ది రోజుల తర్వాత దాన్నే వాడుతుంటారు. అయితే, ఇది ఎంతో ప్రమాదకరమని, టాయిలెట్ సీటు కంటే శుభ్రపరచని మేకప్ బ్రష్‌లపై ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ బ్రష్‌ను వాడటం వల్ల మొటిమలు, చికాకు వంటి సమస్యలొస్తాయని తేలింది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మేకప్ బ్రష్‌లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.