India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: అసెంబ్లీలో సీఎం చంద్రబాబుకు ఇచ్చే సమయమే తనకూ ఇవ్వాలని జగన్ కోరడం సరికాదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పారు. ఆయనకు ప్రతిపక్ష నేత హోదా లేదని, అసెంబ్లీ నియమాలు, నిబంధనలను తెలుసుకోవాలని సూచించారు. అనుమతి తీసుకోకుండా 60 రోజులు శాసనసభకు రాకపోతే వారి సభ్యత్వం రద్దు చేయొచ్చని పునరుద్ఘాటించారు. ఈ మేరకు రాజ్యాంగంలో రూల్స్ ఉన్నాయని తెలిపారు.

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ అడుగులు వేస్తున్నారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్తో ఆయన ఇవాళ చెన్నైలో భేటీ అయ్యారు. పార్టీ నిర్మాణం, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఐప్యాక్ నుంచి బయటికి వచ్చిన పీకే బిహార్లో రాజకీయ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే.

మైసూర్లోని <<15388532>>ఇన్ఫోసిస్<<>> క్యాంపస్లో వేటుపడ్డ 400 ట్రైనీలతో మేనేజ్మెంట్ మానవత్వం మరిచి కర్కశంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. FEB 7న 6PMలోపు వెళ్లిపోవాలని ఆదేశించడంతో యువతులు ఇబ్బంది పడ్డారు. ‘ఈ ఒక్క రాత్రికి ఉండనివ్వండి. రేపు వెళ్లిపోతాను. ఈ రాత్రి ఎక్కడికని వెళ్లగలను’ అంటూ MP అమ్మాయి ఏడుస్తూ అడిగితే ‘అదంతా మాకు తెలియదు. మీరిప్పుడు ఉద్యోగి కాదు. వెళ్లిపోవాల్సిందే’ అని చెప్పినట్టు తెలిసింది.

అక్రమ వలసదారులపై యునైటెడ్ కింగ్డమ్ ఉక్కుపాదం మోపబోతుంది. తమ దేశంలోకి చాలామంది విదేశీయులు అక్రమంగా చొరబడి వివిధ పనులు చేస్తున్నారని, త్వరలోనే వారిపై కఠిన చర్యలుంటాయని ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ ట్వీట్ చేశారు. ఇప్పటికే అక్రమ వలసదారులను అమెరికా తిరిగి వారికి దేశాలకు పంపిస్తుండగా, ప్రస్తుతం యూకే సైతం అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు సన్నద్ధమవుతుండడం చర్చనీయాంశంగా మారింది.

దేశీయ స్టాక్మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 77,311 (-548), నిఫ్టీ 23,381 (-178) వద్ద ముగిశాయి. కొన్ని దేశాలపై డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ ప్రకటనే ఇందుకు కారణం. ఆటో, మీడియా, మెటల్, ఫార్మా, రియాల్టి, PSU బ్యాంకు, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లు విలవిల్లాడాయి. ఇండియా విక్స్ 5.55% పెరిగి 14.45కు చేరుకుంది. కొటక్ బ్యాంక్, ఎయిర్టెల్, బ్రిటానియా, టాటా కన్జూమర్, HCL టెక్ టాప్ గెయినర్స్.

క్రికెట్ ప్రయాణంలో IND తొలి విజయాన్ని నమోదు చేసి నేటికి 73 ఏళ్లు పూర్తయ్యింది. 1952, FEB 10న చెన్నై వేదికగా జరిగిన టెస్టులో ENGపై ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో ఇండియా గెలిచింది. ENG 266&183 స్కోర్లు చేయగా, భారత్ 459/9D చేసింది. పంకజ్ రాయ్(111), పాలీ ఉమ్రిగర్(130) సెంచరీలతో అదరగొట్టారు. మేనేజ్మెంట్ అప్పట్లో ఒక్కో ప్లేయర్కు రూ.250 బహుమతిగా ఇచ్చింది. 1932లో ENGపైనే ఇండియా తొలి టెస్టు ఆడటం విశేషం.

AP: చిత్ర వేడుకల్లో హుందాతనంగా ప్రవర్తించాలని, రాజకీయ విమర్శలు చేయడం మంచిది కాదని YCP MLA తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ‘ఇప్పుడున్న 11 గొర్రెలే రేపు గర్జించే సింహాలు అవుతాయి. శత్రువులను చీల్చి చెండాడుతాయి. వ్యక్తిగత కక్షలతో ఇండస్ట్రీని బలి చేయడమేంటి? రోజులెప్పుడూ ఒకేలా ఉండవు’ అని ఆయన హెచ్చరించారు. కాగా ‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీరాజ్ 150 మేకలు, 11 గొర్రెలంటూ వ్యాఖ్యలు చేశారు.

సల్మాన్ ఖాన్ రోజుకు కేవలం 2-3 గంటలే నిద్రపోతానని చెప్పడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మనిషికి 7-8 గంటల నిద్ర ముఖ్యమని డాక్టర్లు చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ‘నిద్ర సరిగా లేకపోతే మెదడు తనకు తానే డ్యామేజ్ చేసుకుంటుంది. ఇది స్వల్పకాలంలో ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ, ఇది దీర్ఘకాలికంగా హానికరం. మెదడులోని ఆస్ట్రోసైట్లు & మైక్రోగ్లియల్ కణాలు విచ్ఛిన్నం అవుతాయి’ అని వైద్యులు తెలిపారు.

క్రిమినల్ కేసులుంటే ఉద్యోగులుగా చేరేందుకు అనర్హులని, అలాంటప్పుడు ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులవుతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో ఈసీ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. క్రిమినల్ కేసుల్లో దోషులు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం విచారణ జరిపింది.

భారత్ బయోటెక్కు చెందిన బయోవెట్ కంపెనీ పాడి రైతులకు గుడ్న్యూస్ చెప్పింది. తమ BIOLUMPIVAXIN®కు CDSCO లైసెన్స్ వచ్చినట్టు ప్రకటించింది. భారత్ సహా ప్రపంచంలోనే ఇదే తొలి DIVA మార్కర్, LSD టీకా అని కంపెనీ తెలిపింది. వ్యాధి సోకిన, టీకా వేసిన జీవాలను వేర్వేరుగా గుర్తించగలగడమే DIVA ప్రత్యేకత. మేకలు, బర్రెలు, ఆవులను వేధించే ముద్దచర్మం వ్యాధికి (Lumpy Skin Disease) ఇది ఉపయోగపడుతుంది.
Sorry, no posts matched your criteria.