India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రోజుకు లక్ష మందికి పైగా భక్తులు కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే అవకాశం ఉండటంతో వారికి తాగునీరు, పాలు, అల్పాహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం రోజు అమ్మవారికి ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై సినీ నటి కరాటే కళ్యాణి మండిపడ్డారు. ‘జానీ మాస్టర్ది కచ్చితంగా లవ్ జిహాదీ కేసే. దీనికి వ్యతిరేకంగా అందరూ పోరాటం చేయాలి. నిందితుడిగా తేలితే అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మతం మారితే పెళ్లి చేసుకుంటాననడం ఏమిటి? బాధితురాలికి అందరూ అండగా నిలవాలి’ అని ఆమె పేర్కొన్నారు.
పలు పాశ్చాత్య దేశాల్లో ఒకప్పుడు టమాటాను విషంగా భావించి భయపడేవారు. అవి తినడం వల్ల చాలామంది కన్నుమూయడమే అందుక్కారణం. మరణ భయంతో దానికి పాయిజన్ యాపిల్ అని పేరు కూడా పెట్టారు. సుమారు 200 ఏళ్ల పాటు ఈ నమ్మకమే ఉండేది. అయితే, ప్రజలు వాడుతున్న ప్యూటర్(pewter) ప్లేట్లలో లెడ్ సారం ప్రమాదకర స్థాయుల్లో ఉంటోందని, టమాటాల్లోని ఆమ్లంతో కలిసి వారి మరణాలకు దారి తీస్తోందని తర్వాత గుర్తించారు.
వన్డే క్రికెట్లో అఫ్గానిస్థాన్ సంచలనం సృష్టించింది. దక్షిణాఫ్రికాపై తొలి సారి విజయం సాధించింది. యూఏఈలో సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలిచి అఫ్గాన్ రికార్డు సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్.. అఫ్గాన్ బౌలర్ల ధాటికి 106 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ఏడుగురు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. 107 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్ 26 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
తాను త్వరగా రిటైర్ అయిపోయానని తనకు తరచూ అనిపిస్తుంటుందని టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. టెన్నిస్ కోర్టుకు వచ్చినప్పుడల్లా తాను ఇంకా ఆడగలనని అనుకుంటానని పేర్కొన్నారు. ‘నాలో ఇంకా ఆట ఉంది. కానీ ఇంట్లో ఉండటం సౌకర్యంగా ఉంది. టూర్లు తిరగనవసరం లేదన్న విషయం గుర్తొచ్చినప్పుడు రిలీఫ్గా ఉంటుంది’ అని వెల్లడించారు. తన తోటి దిగ్గజం నాదల్ రిటైర్మెంట్పై అంచనా వేయలేనని స్పష్టం చేశారు.
AP: తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 8న నిర్వహించే గరుడ వాహన సేవ ఏర్పాట్లపై TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష జరిపారు. ఆ రోజున భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సమయం(OCT 4-12)లో ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. OCT 7న ఉ.6 గంటల నుంచి కొండపైకి బైకుల్ని నిలిపివేస్తామని, తిరిగి 9వ తేదీన ఉ.6 గం.కు అనుమతిస్తామన్నారు.
ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటాం. తక్కువసేపు నిద్రపోతే మానసిక, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. జ్ఞాపకశక్తి క్షీణించటం, ఏకాగ్రత కోల్పోవడం, బరువు పెరగడం, కోపం ముంచుకురావడం, నిరుత్సాహం ఆవరించడం, పనితీరు తగ్గడం, డ్రైవింగ్లో ప్రమాదాలకు గురికావడం, రోగనిరోధకశక్తి క్షీణించడం, ఒత్తిడి పెరగడం, గుండె సమస్యలు ఏర్పడతాయి. ప్రశాంతంగా ఎక్కువసేపు నిద్రపోతే వీటి నుంచి తప్పించుకోవచ్చు.
లెబనాన్లో <<14129580>>పేజర్లు<<>> పేలిన ఘటన మరువకముందే మళ్లీ అక్కడ వాకీ టాకీలు పేలాయి. ఈ ఘటనల్లో ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. కాగా లెబనాన్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఇప్పటివరకు 12 మంది మరణించారు. ఈ ఘటనపై హెజ్బొల్లా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించింది. ఇప్పటికే ఇజ్రాయెల్పై హమాస్, హౌతీ రెబల్స్ దాడులు చేస్తుండగా హెజ్బొల్లా కూడా రంగంలోకి దిగనుంది.
టెస్టుల్లో శ్రీలంక క్రికెటర్ కమిందు మెండిస్ అరుదైన ఘనత సాధించారు. టెస్టుల్లో 80.90 యావరేజ్ కలిగిన రెండో బ్యాటర్గా ఆయన రికార్డు సృష్టించారు. అగ్ర స్థానంలో బ్రాడ్మన్ (99.94) ఉన్నారు. మూడో స్థానంలో జైస్వాల్ (68.53) కొనసాగుతున్నారు. మెండిస్ తానాడిన తొలి 7 టెస్టుల్లోనే 4 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలతో 809 రన్స్ సాధించారు. కనీసం 10 ఇన్నింగ్స్లు ఆడిన వారిలో అత్యధిక పరుగులు చేసిన ఏడో ప్లేయర్గానూ నిలిచారు.
APలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అటు తెలంగాణలో ఈ నెల 21 నుంచి మళ్లీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.
Sorry, no posts matched your criteria.