news

News November 15, 2024

రణ్‌వీర్‌ను నేను వెయిట్ చేయించలేదు: ముకేశ్ ఖన్నా

image

తన ఆఫీస్‌కి వచ్చిన రణ్‌వీర్ సింగ్‌ను 3 గంటలపాటు వెయిట్ చేయించారన్న వార్తల్ని ‘శక్తిమాన్’ ముకేశ్ ఖన్నా ఖండించారు. ‘ఆయన ఉండాలనుకున్నారు కాబట్టి ఉన్నారు. తనో అద్భుతమైన నటుడు. కానీ శక్తిమాన్ పాత్రలో ఎవరు నటించాలో డిసైడ్ చేయాల్సింది నేను. నిర్మాతలు నటుల్ని ఎంపిక చేయాలి గానీ నటులు నిర్మాతల్ని ఎంపిక చేయరాదు. నా ఆఫీస్‌కి వచ్చి శక్తిమాన్ పాత్ర చేస్తానంటే..? ఒప్పేసుకోవాలా? కుదరదు’ అని తేల్చిచెప్పారు.

News November 15, 2024

AP NEWS రౌండప్

image

✒ విశాఖ జిల్లాలో ప్రేమించలేదనే కారణంతో యువతిపై నీరజ్ శర్మ అనే యువకుడు దాడి చేశాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. తలకు 31 కుట్లు పడ్డాయి. ఘటన జరిగి 24 గంటలైనా నిందితుడు ఆచూకీ దొరకలేదు.
✒ తిరుపతి జిల్లా సత్యవేడు గురుకుల పాఠశాలలో ఒకేసారి 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నవారికి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఓ స్టూడెంట్ పరిస్థితి విషమంగా ఉంది.

News November 15, 2024

కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం

image

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆత్మాహుతి డ్రోన్లను భారీ సంఖ్యలో తయారు చేయాలని ఆయన ఆదేశించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఉత్తర కొరియా ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి ఆత్మాహుతి డ్రోన్లను పరీక్షించింది. ఇవి భూమితో పాటు సముద్ర జలాల్లో వివిధ రేంజ్‌లలో ఉన్న శత్రువులను సైతం ఛేదించగలవు. వీటిని ఇప్పటికే ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ యుద్ధాల్లో ఉపయోగించారు.

News November 15, 2024

GREAT: చనిపోతూ నలుగురికి ప్రాణం పోశాడు

image

AP: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన కొడుకు అవయవాలు దానం చేసి పేరెంట్స్ నలుగురి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన విజయనగరంలో జరిగింది. మన్యం(D) కొత్తవలసకు చెందిన సాయికుమార్(22) బైక్‌పై ఇంటికొస్తూ కింద పడ్డారు. తీవ్ర గాయాలపాలైన అతడిని VZM ఆస్పత్రికి తీసుకెళ్లగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. తల్లిదండ్రుల సమ్మతితో కాలేయం, కిడ్నీలు, ఊపిరితిత్తులను విశాఖకు తరలించి నలుగురికి అమర్చారు.

News November 15, 2024

లగచర్ల కేసు నిందితులతో కేటీఆర్ ములాఖత్

image

TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి కేసులో అరెస్టయి సంగారెడ్డి జైలులో ఉన్న వారితో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిన్న 16 మంది నిందితులను పోలీసులు కంది సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు, 500 మీటర్ల పరిధి వరకూ ఎవరినీ అనుమతించడం లేదని సమాచారం.

News November 15, 2024

సూపర్-6 హామీలపై చేతులెత్తేయడం తగదు: ముద్రగడ

image

AP: సీఎం చంద్రబాబుకు YCP నేత ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖ రాశారు. సూపర్-6 హామీలు ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేయడం తగదన్నారు. వీటిని అమలు చేయాలంటే రూ.కోట్లు కావాలనే సంగతి అప్పుడు మీకు తెలియదా? అని నిలదీశారు. ప్రజల దృష్టి మరల్చడానికి తిరుపతి ప్రసాదం, రెడ్‌బుక్, SM పోస్టింగులపై చర్యలంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోకపోవడం అన్యాయని పేర్కొన్నారు.

News November 15, 2024

గుండెపోటు మరణాలు.. యువతలో ఆందోళన!

image

వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తుండటం కలకలం రేపుతోంది. వయసు పైబడిన వారే కాకుండా పిల్లలు, యువత హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా తెలంగాణలోని జగిత్యాల(D) మోత్కూరావుపేటలో సంజీవ్ అనే యువకుడు పెళ్లి వేడుకలో డాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందాడు.

News November 15, 2024

దేవతలు భూమ్మీదికి దిగొచ్చే ‘దేవ్ దీపావళి’ తెలుసా?

image

భక్తిశ్రద్ధలతో జరుపుకొనే కార్తీక పౌర్ణమినే ఉత్తరాదిలో దేవ్ దీపావళి అంటారు. వర గర్వంతో చావే రాదని విర్రవీగుతూ సజ్జనులను బాధిస్తున్న త్రిపురాసురులను ఆ పరమశివుడు సంహరించింది ఈరోజే. అందుకే ఆ విశ్వేశ్వరుడి దేహంలో ఒక భాగంగా భావించే కాశీ నగరంలో ఈ పండుగను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈసారి గంగాతీరంలో 17లక్షల దీపాలను వెలిగిస్తున్నారు. ఈ వేడుకను వీక్షించేందుకు దేవతలు భూమికి దిగొస్తారని భక్తుల నమ్మిక.

News November 15, 2024

పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. పలువురి మృతి

image

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో నిన్న సాయంత్రం బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు, ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులు మృతిచెందారని, 14మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. రసూల్ జాన్ అనే తాలిబాన్ ఉగ్రవాది తన ఇంటి వద్ద కారులో బాంబును బిగిస్తుండగా అది పేలిందని పేర్కొన్నారు. తాలిబాన్లు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాల్ని తరలించారని వెల్లడించారు.

News November 15, 2024

రోహిత్ పారిపోయే కెప్టెన్ కాదు: కైఫ్

image

టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ సవాళ్ల నుంచి పారిపోయే కెప్టెన్ కాదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ వ్యాఖ్యానించారు. వీలుంటే వెంటనే టెస్టు జట్టుతో చేరేవారని పేర్కొన్నారు. ‘రోహిత్ ఓ నాయకుడు. ఆయనలో పారిపోయే నైజం లేదు. తొలి టెస్టు నుంచే ఆడాలని ఆయన కచ్చితంగా అనుకుంటూ ఉంటారు. అందుకే గైర్హాజరీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇంట్లో పరిస్థితి ఓకే అనుకుంటే వెంటనే పెర్త్‌కు వచ్చేస్తారు’ అని తెలిపారు.