India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ. ఎంపీ ఎన్నికల్లో మేం 13 నుంచి 14 స్థానాల్లో గెలుస్తాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదు. ప్రస్తుతం బీఆర్ఎస్ పని అయిపోయింది ఎన్నికల తర్వాత ఆ పార్టీ మనుగడ కష్టమే’ అని ఆయన పేర్కొన్నారు.

గతేడాది అక్టోబర్లో హమాస్ ఉగ్రవాదులు ఓ జర్మనీ అమ్మాయిని నగ్నంగా కారులో ఊరేగించిన ఫొటో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఆ ఫొటోను ‘పిక్చర్ ఆఫ్ ది ఇయర్ ఇంటర్నేషనల్ అవార్డు’కు ఎంపిక చేయడం వివాదాస్పదమైంది. దీంతో అవార్డు ప్రకటించిన ‘డొనాల్డ్ W రేనాల్డ్స్ జర్నలిజం ఇన్స్టిట్యూట్’పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మానవత్వం మరిచి, అలాంటి ఫొటోను అవార్డుకు ఎంపిక చేస్తారా? అని మండిపడుతున్నారు.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే RCBvsKKR మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే రెండు మ్యాచ్లు ఆడిన RCB ఒకటి ఓడిపోయి మరొకటి గెలిచింది. KKRకి ఇది రెండో మ్యాచ్ కాగా మొదటిది గెలుపొందింది. అయితే, ఈ మ్యాచ్లో KKR ప్లేయర్ రస్సెల్ మరోసారి విధ్వంసం సృష్టిస్తారా? అనేదానిపై నెట్టింట చర్చ జరుగుతోంది. 2019లో ఇదే స్టేడియంలో RCB గెలిచే మ్యాచ్లో రస్సెల్ 13 బంతుల్లో 48 రన్స్ చేసి KKRను గెలిపించారు.

మరికొన్ని రోజుల్లో జరిగే లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. ఛత్తీస్గఢ్లోని వార్తాపత్రికల్లో దీనిపై కథనాలు రావడంతో ఓటర్లలో గందరగోళం ఏర్పడింది. ఈక్రమంలో దీనిపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ వార్తలు ఫేక్ అని, ఇలాంటి నిరాధారమైన వాటిని నమ్మొద్దని పేర్కొంది. అలాంటి ఆదేశాలివ్వలేదని ఈసీ వెల్లడించింది.

IPL చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ సరికొత్త రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఈ ఘనతపై SRH ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. అభిషేక్ శర్మ, క్లాసెన్, హెడ్, మార్క్రమ్ ఫొటోలతో 277 అని ఉన్న పోస్టర్ను SRH షేర్ చేసింది. ‘పర్వతం ఎక్కేశారు. రికార్డు బద్దలు కొట్టారు. చరిత్ర సృష్టించారు’ అని ట్వీట్ చేసింది. ఇదివరకు ఈ రికార్డు RCB పేరుపై ఉండేది.

లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓ మెసేజ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ‘లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోని ఓటర్లకు ఎన్నికల సంఘం ఫైన్ వేస్తుంది. వారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.350లను డెబిట్ చేస్తుంది’ అని మెసేజ్ సారాంశం. దీనిపై కేంద్రానికి సంబంధించిన PIB FACTCHECK స్పందించింది. ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇలాంటి ఫేక్ మెసేజ్లను నమ్మొద్దని పేర్కొంది.

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన కూతురు రాహాపై ఉన్న ప్రేమను తెలిపేందుకు తాను ముంబైలో నిర్మిస్తోన్న కొత్త బంగ్లాను ఆమె పేరు మీద రిజిస్టర్ చేయనున్నారట. రణబీర్, అలియా ఇద్దరూ కష్టపడి సంపాదించిన డబ్బును ఈ ఇంటిపై సమానంగా పెట్టుబడి పెడుతున్నారు. ఇంటికి రూ.250 కోట్లకు పైగా ఖర్చవుతుండగా.. ఆమె పేరిట రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక రిచెస్ట్ స్టార్ కిడ్గా మారనుంది.

AP: తనది విజన్ అని.. సీఎం జగన్ది పాయిజన్ అని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ‘ఇప్పటివరకు జగన్ పరదాల చాటున తిరిగారు. ఇప్పుడు ప్రజల్లోకి వస్తుంటే వారు పారిపోతున్నారు. ఎవరో కట్టిన దానికి జగన్ రిబ్బన్ కటింగ్ చేస్తారు. వైసీపీ పాలనలో అన్నివర్గాలూ నష్టపోయాయి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటైనర్లలో డబ్బులు తరలిస్తున్నారు. ఆ డబ్బుతో ఓట్లు కొనాలని అధికార పార్టీ భావిస్తోంది’ అని ఆయన మండిపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ బ్రాంచ్లలో ఆఫీస్ స్పేస్ను కుదించడం ద్వారా రూ.10,000 కోట్లు ఆదా చేయడానికి అమెజాన్ కసరత్తు చేస్తోంది. అవసరం లేని చోట ఆఫీసు లీజులను క్లోజ్ చేయడం, కొన్ని అంతస్తుల వినియోగాన్ని నిలిపివేయడంపై దృష్టిసారించింది. కార్యాలయాలను ఉద్యోగులు ఎలా వినియోగిస్తున్నారనే దానిపై విశ్లేషించి దశలవారీగా కుదింపు చేయనుంది. కాగా ఇప్పటికే కొన్ని వేల మంది ఉద్యోగులను సంస్థ తొలగించిన విషయం తెలిసిందే.

తమిళ స్టార్ హీరో విజయ్, వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(THE GOAT)’. ఈ సినిమా విషయంలో క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో భారత జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ధోనీ నటించనున్నట్లు సమాచారం. క్రికెట్కు సంబంధించిన సన్నివేశాల్లో ధోనీ గెస్ట్ రోల్లో కనిపిస్తారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.