India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఆటగాడు ముజీబ్ ఉర్ రెహ్మాన్ గాయం కారణంగా ఐపీఎల్కు దూరమయ్యారు. దీంతో అతడి స్థానాన్ని అఫ్గానిస్థాన్ యంగ్ స్పిన్నర్ అల్లాహ్ ఘజన్ఫర్తో KKR భర్తీ చేసింది. 16 ఏళ్ల ఘజన్ఫర్ను బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకే దక్కించుకుంది. మరోవైపు ప్రసిధ్ కృష్ణ స్థానంలో కేశవ మహరాజ్ను తీసుకున్నట్లు రాజస్థాన్ రాయల్స్ ప్రకటించింది. రూ.50 లక్షల బేస్ ప్రైజ్కు తీసుకుంది.

ఈరోజు జైపూర్లో రాజస్థాన్, ఢిల్లీకి మధ్య జరిగిన ఐపీఎల్ పోరులో రాజస్థాన్ గెలుపొందింది. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 173 పరుగులకే పరిమితమైంది. వార్నర్(49), స్టబ్స్(44) రాణించినా ఫలితం లేకపోయింది. RR బౌలర్లలో బర్గర్, చాహల్ చెరో రెండు వికెట్లతో రాణించారు.

ఉ.ప్రదేశ్కు చెందిన గ్యాంగ్స్టర్, పొలిటిషియన్ ముఖ్తర్ అన్సారీ(60) గుండెపోటుతో మృతి చెందారు. పొత్తి కడుపు నొప్పితో ఆయనను నిన్న బాండా మెడికల్ కాలేజీలో చేర్పించారు. ఆ తర్వాత డిశ్చార్జ్ అయినప్పటికీ మళ్లీ గుండెపోటు వచ్చింది. అయితే జైలులో ఉన్న అన్సారీకి విషం ఎక్కించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే అన్సారీ మృతి వార్త తెలియగానే ఘాజీపూర్లోని అతడి ఇంటి వద్దకు జనం తరలి వచ్చారు.

హెయిర్ స్ట్రయిటెనింగ్ కోసం రెగ్యులర్గా సెలూన్కి వెళుతున్న ఓ మహిళ(26) శరీరంలో కిడ్నీలు దెబ్బతిన్నాయి. అది కూడా రెండేళ్లలోనే మూడుసార్లు జరగడం గమనార్హం. హెయిర్కి వాడిన యాసిడ్స్ శరీరంలోకి ప్రవేశించి కిడ్నీలను దెబ్బతీసినట్లు వైద్యులు గుర్తించారు. ఆమెకు గతంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పారు. అయితే ఒకరోజు వాంతులు, విరోచనాలు, వెన్ను నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లగా ఈ సమస్య వెలుగు చూసింది.

TG: BRSలో భారీ కుదుపు. ఇన్నాళ్లూ ఆ పార్టీ టికెట్ కోసం పోటీ పడిన నేతలు ఇప్పుడు మాకొద్దు మొర్రో అంటున్నారు. తాజాగా వరంగల్ BRS ఎంపీ టికెట్ను కడియం శ్రీహరి కూతురు కావ్య వదులుకున్నారు. దీంతో శ్రీహరి, కావ్య కాంగ్రెస్లో చేరతారని ప్రచారం జరుగుతోంది. వరంగల్ కాంగ్రెస్ MP అభ్యర్థిగా కావ్య బరిలోకి దిగుతారని చర్చ జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా వరంగల్లో INC ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు.

ఆడవారికి ప్రతి నెలా వచ్చే పీరియడ్స్ నొప్పి వర్ణనాతీతం. తాజాగా ముంబైలోని మల్వానీ ప్రాంతానికి చెందిన 14ఏళ్ల బాలికకు తొలి రుతుక్రమం వచ్చింది. విపరీతమైన నొప్పిని భరించలేకపోయిన ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. అయితే పీరియడ్స్ గురించి అవగాహన లేకపోవడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని వైద్యులు తెలిపారు.

మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కొడుకు నకుల్ నాథ్ ఇటీవల ఛింద్వాడా నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అఫిడవిట్లో తన మొత్తం ఆస్తులను రూ.700 కోట్లుగా చూపించిన ఆయన.. సొంత కారు లేదని పేర్కొనడం గమనార్హం. గత ఐదేళ్లలో తన ఆస్తులు సుమారు రూ.40 కోట్లు పెరిగినట్లు వివరించారు. భార్య వద్ద కేవలం రూ.43వేల నగదు మాత్రమే ఉందని, తన తండ్రి కమల్నాథ్కు రూ.12లక్షల లోన్ ఇచ్చినట్లు వెల్లడించారు.

TG: రాష్ట్రంలో గూగుల్, యూట్యూబ్లలో రాజకీయ ప్రకటనలు ఇవ్వడంలో BJP టాప్లో ఉంది. FEB 1 నుంచి MAR 27 వరకు రూ.12కోట్లు ఖర్చు చేసిందని పొలిటికల్ అడ్వర్టయిజింగ్ ట్రాన్స్పరెన్సీ రిపోర్టులో గూగుల్ తెలిపింది. మొత్తంగా 11,613 యాడ్స్ ఇచ్చినట్లు పేర్కొంది. అన్ని పార్టీలు కలిపి రూ.30.2కోట్లు ఖర్చు చేశాయని వెల్లడించింది. వీడియోల రూపంలో రూ.24.4కోట్లు, ఫొటోల రూపంలో రూ.5.7కోట్లు వెచ్చించాయని తెలిపింది.

BRSకు మరో షాక్ తగిలింది. వరంగల్ ఎంపీగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు BRS అభ్యర్థి కడియం కావ్య ప్రకటించారు. ఈమేరకు ఆమె పార్టీ అధినేత కేసీఆర్కు లేఖ రాశారు. ‘కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కాం విషయాలు పార్టీ ప్రతిష్ఠను దిగజార్చాయి. నాయకుల మధ్య సమన్వయం లోపించింది. ఈ పరిస్థితుల్లో పోటీ చేయలేను’ అని లేఖలో పేర్కొన్నారు.

వినేందుకు వింతగా ఉన్న ఈ ఘోస్ట్ జాబ్స్ ఇటీవల ఎక్కువయ్యాయి. ఘోస్ట్ జాబ్స్ అంటే కంపెనీలు ఉద్యోగ ప్రకటనలు ఇచ్చినా నియమించుకునే ఉద్దేశం ఉండకపోవడం. కంపెనీ వెబ్సైట్లో ఖాళీలున్నట్లు చూపించినా బడ్జెట్, ఇతర కారణాలతో రిక్రూట్ చేసుకోదు. జాబ్ ప్రకటించిన డేట్ చెక్ చేయడం, కంపెనీ గురించి క్రాస్ చెక్, ఆ ఉద్యోగులను సోషల్ మీడియాలో కలవడం, నేరుగా కంపెనీకి వెళ్లడం వంటి స్టెప్స్ తీసుకుంటే వీటి నుంచి తప్పించుకోవచ్చు.
Sorry, no posts matched your criteria.