India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది అబ్దుల్ రహీం జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదేవిధంగా మరో న్యాయవాది ప్రవీణ్ కుమార్ పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. వీరిద్దరి పదవీకాలం మూడేళ్లపాటు ఉంటుంది. ఈ సందర్భంగా వీరికి పలువురు న్యాయవాదులు అభినందనలు తెలియజేశారు.
ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం కింద జిల్లాలోని నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెప్మా డీఎంసీ శ్రీనివాస్ తెలిపారు. ఇంటర్మీడియెట్, పాలిటెక్నిక్/ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి 21 నుంచి 24 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారు అర్హులన్నారు. జిల్లాలోని ఆసక్తి గల యువత https://pminternship.mca.gov.in/login/ వెబ్ సైట్లో ఈ నెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ పేర్కొన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో భాగంగా ప్రత్యేక తనిఖీ బృందం ADBలోని రెండు స్కానింగ్ సెంటర్లను శుక్రవారం తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించి సూచనలు, సలహాలు ఇచ్చారు. తనిఖీ బృందం సభ్యులు డిప్యూటీ డీఎంహెచ్ఓ సాధన, డాక్టర్ క్రాంతి, యశోద, వైష్ణవి ఉన్నారు.
ఐటీఐలో ఏదైన ట్రేడ్కు సంబంధించి మూడేళ్ల అనుభవం కలిగిన అభ్యర్థులు సర్టిఫికెట్ పొందేందుకు ఈనెల 12లోపు వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో ఐటీఐ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు అర్హులని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ADBలోని ఠాకూర్ హోటల్ సమీపంలో మిర్జానసీర్ బైగ్కు చెందిన లారీలో నుంచి ఆదివారం రాత్రి బ్యాటరీలు చోరీ చేసిన మరో దొంగను అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. ఈ కేసులో మంగళవారం వడ్డెర కాలనీకి చెందిన సంతోశ్ను రిమాండ్కు తరలించామన్నారు. తాజాగా మరో దొంగ కార్తిక్ అలియాస్ గణేశ్ను గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. మరో దొంగ మైనర్ అని.. అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
ADBలోని ఠాకూర్ హోటల్ సమీపంలో మిర్జానసీర్ బైగ్ చెందిన లారీలో నుంచి ఆదివారం రాత్రి బ్యాటరీలు చోరీ చేసిన మరో దొంగను అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. ఈ కేసులో మంగళవారం వడ్డెర కాలనీకి చెందిన సంతోశ్ను రిమాండ్కు తరలించామన్నారు. తాజాగా మరో దొంగ కార్తిక్ అలియాస్ గణేశ్ను గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. మరో దొంగ మైనర్ అని.. అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
ఆదిలాబాద్ ఖుర్షిద్ నగర్ లో మట్కా స్థావరం నిర్వహిస్తున్న వారిపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ కరుణాకర్ రావు వివరాల ప్రకారం.. షేక్ నజ్జు అనే మహిళ కాలనీలో మట్కా నిర్వహిస్తుండగా.. హుస్సేన్, సాహిల్లు మట్కా ఆడటానికి రాగా వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మట్కా డబ్బులను షేక్ నజ్జు మరో నిర్వాహకుడు నజీమ్ ఉద్దీన్ అలియాస్ బబ్లుకు జమ చేస్తుందన్నారు. దీంతో బబ్లుపై సైతం కేసు చేశారు.
బోథ్ మండలంలోని కౌట(B), ధన్నూర్(B) గ్రామాల్లో దాడులు నిర్వహించగా అక్రమ మద్యం పట్టుబడిందని ఎస్ఐ ప్రవీణ్ తెలిపారు. కౌట గ్రామంలోని బెల్ట్ షాపులో రూ.90,000 వేల విలువైన 690 మద్యం బాటిళ్లు, ధన్నూర్లో రూ.1,34,000 విలువైన 587మద్యం బాటిల్లు దొరికాయన్నారు. బెల్ట్ షాపు నిర్వాహకులు శ్రీనివాస్ గౌడ్, రత్నపురం సాయన్న, VDCకి చెందిన వ్యక్తులు శ్రీకాంత్, రాజేశ్వర్ రెడ్డి, భూమారెడ్డిలపై కేసులు నమోదు చేశామన్నారు.
పరస్పరంగా దాడులు చేసుకున్న 8 మందిపై కేసు నమోదు చేసినట్లు మావల ఎస్సై గౌతమ్ తెలిపారు. KRK కాలనీకి చెందిన సాజిద్ మరో మహిళ వద్ద ఉంటున్నాడన్న కోపంతో భార్య సల్మా అక్కడకు వెళ్లి గొడవ చేసింది. దీంతో సాజిద్ తన భార్యను నచ్చజెప్పి ఇంటికి తీసుకురాగా సల్మా బంధువులు సాజిద్పై దాడి చేశారు. దీంతో సాజిద్ రెండో భార్యగా అనుమానిస్తున్న ఆఫ్రిన్ బంధువులు వారిపై దాడి చేశారు. దీంతో ఇరువర్గాలకు చెందిన వారిపై కేసు చేశారు.
ట్రాఫిక్ సిబ్బందితో ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సమీక్ష నిర్వహించారు. పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలతో ఎత్తకుండా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. విధులు నిర్వర్తించే క్రమంలో బాడీ ఆన్ కెమెరాలను ధరించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని సూచించారు. ప్రస్తుత ఎండాకాలం దృష్ట్యా ట్రాఫిక్ సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.