Adilabad

News August 16, 2025

NRG: ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

image

నేరడిగొండ మండలంలోని మథుర(కైతి లంబాడ) కులస్థులు శ్రీ కృష్ణాష్టమి శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలంతా కలిసి సంప్రదాయ పద్ధతిలో మట్టిని తెచ్చి దానితో శ్రీకృష్ణుని ప్రతిమను తయారు చేసి ఆ ప్రతిమను తమ ఇంట్లో ప్రతిష్టిస్తామని తెలిపారు. అర్ధరాత్రి శ్రీకృష్ణుడు జన్మించిన సమయం అనంతరం ఆ ప్రతిమకు ఓమా, బంక, బెల్లం, గోధుమ పిండితో తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తామని మహిళలు పేర్కొన్నారు.

News August 16, 2025

తాంసి మండలంలో అత్యధిక వర్షపాతం

image

జిల్లావ్యాప్తంగా కురిసిన వర్ష పాతం నమోదు వివరాలను అధికారులు వెల్లడించారు. శనివారం ఉదయం 8 నుంచి 11 గంటలకు వరకు తాంసి మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. తాంసిలో 142.0 మి.మీ, తలమడుగు 140.3, సిరికొండ 135.0, గుడిహత్నూర్ 133.3, రాంనగర్ 129.0, సాత్నాల 125.5, హీరాపూర్ 122.2, ఇచ్చోడ 114.3 మి.మీ వర్షపాతం రికార్డయింది.

News August 16, 2025

లారీ డ్రైవర్‌ను కాపాడిన తర్నం వాసులు

image

తర్నం వాగులో వరద ఉద్ధృతి కొంత మేర తగ్గింది. దీంతో వాగులో చిక్కుకున్న లారీ డ్రైవర్‌ను తాడు సహాయంతో కాపాడారు. డ్రైవర్ సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ఇదే వాగులో జైనథ్ మండలానికి చెందిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. వరద సమయంలో వాహనదారులు వాగు వైపు వెళ్లకుండా అధికారులు రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

News August 16, 2025

తాంసి: రామాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి

image

శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని తాంసి మండలం కప్పర్ల రామాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విశాల్ శ్రీ రాముడిని కృష్ణుడి రూపంలో అలంకరించారు. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న రాముడి రూపాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

News August 15, 2025

రాష్ట్రపతి విందులో పాల్గొన్న ADB ఉపాధ్యాయుడు

image

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లోని at home కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విందులో ఆదిలాబాద్ ఉపాధ్యాయుడు తొడసం కైలాస్ పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలు, దేశ విదేశాల నుంచి వచ్చిన అతిథుతులతో కలిసి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ విందులో పాల్గొన్నారు. కైలాస్ రాష్ట్రపతి, ప్రధానీకి గోండి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్పించాలని విన్నవించారు.

News August 15, 2025

ADB: రాగి తీగలు చోరీ.. ముగ్గురి అరెస్ట్

image

రాగి తీగలు చోరీ చేసిన కేసులో ముగ్గురు నిందితులను శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఎస్ఐ రమ్య సీసీఐ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంగా అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన మహారాష్ట్రకు చెందిన దేవీదాస్, లాండసాంగికి చెందిన రాజేశ్వర్, శివాజీలను అదుపులోకి తీసుకున్నారన్నారు. వారి వద్ద ఉన్న సంచిలో 30 కిలోల రాగి తీగలు గుర్తించి, స్వాధీనం చేసుకున్నామన్నారు.

News August 15, 2025

ADB: ‘పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి’

image

CPSను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని PRTU TS జిల్లాధ్యక్షుడు కొమ్ము కృష్ణ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1న నిర్వహించనున్న పెన్షన్ విద్రోహ దినం గోడప్రతులను జిల్లా ఉపాధ్యాయ సంఘం నాయకులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News August 15, 2025

ADB: పోలీసు అధికారులకు రాఖీ కట్టిన విద్యార్థులు

image

మిషన్ శక్తి, DHEW బృందం, శిశు గృహ పిల్లలతో కలిసి హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా పిల్లలు రాఖీలు కట్టారు. విద్యార్థులే స్వయంగా ఇండియన్ ఫ్లాగ్‌తో రాఖీలు తయారు చేసి శుక్రవారం పోలీస్ అధికారులకు రాఖీలు కట్టారు. కార్యక్రమంలో జిల్లా మిషన్ కోఆర్డినేటర్ యశోద, కృష్ణవేణి, కోటేశ్వర రావు, నిఖలేశ్వర్, వెంకటేశ్, శిశు గృహ సిబ్బంది, పోలీసులు విద్యార్థులు పాల్గొన్నారు.

News August 15, 2025

‘ADBలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి’

image

ఆదిలాబాద్‌లో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి యూనివర్సిటీ సాధన సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా స్థానిక నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. ఈ విషయం స్పందించిన షబ్బీర్ అలీ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బొజ్జు పటేల్, కలెక్టర్ రాజర్షి షాతో చర్చించారు.

News August 14, 2025

ఆదిలాబాద్‌కు చేరుకున్న ప్రభుత్వ సలహాదారుడు

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహదారుడు మమ్మద్ షబ్బీర్ అలీ ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. ఆగస్ట్ 15 వేడుకల్లో భాగంగా నిర్వహించే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొననున్న షబ్బీర్ అలీ గురువారం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఆయనకు పుష్పగుచ్ఛాన్ని అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.