Adilabad

News April 6, 2025

టాప్‌ 10లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే

image

తెలంగాణ రాష్ట్రంలో పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వేలో టాప్ టెన్ ఎమ్మెల్యేల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చోటు సంపాదించుకున్నారు. పీపుల్స్ పల్స్ సంస్థ సౌత్ ఫస్ట్ వెబ్ ద్వారా 2024 మార్చి 28 నుంచి ఏప్రిల్ 3 వరకు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేశారు. ఇందులో ఆదిలాబాద్ ఎమ్మెల్యే 8వ స్థానంలో నిలిచారు. నియోజకవర్గంలో 450 నుంచి 500 శాంపిల్స్ సేకరించినట్టు సంస్థ తెలిపింది.

News April 6, 2025

ADB: పాలిటెక్నిక్‌లో ప్రవేశాలకు POLYCET

image

పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు పాలిసెట్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆదిలాబాద్ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ బండి రాంబాబు తెలిపారు. ఏప్రిల్ 20లోగా దరఖాస్తు చేసుకోవాలని, మే 13న పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పదోతరగతి పూర్తయిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News April 6, 2025

శిక్షలు పడేవిధంగా ప్రతి ఒక్కరు పని చేయాలి: ADB ఎస్పీ

image

కోర్టులలో నేరస్తులకు సరైన సమయంలో సరైన శిక్ష పడేవిధంగా ప్రతి ఒక్క కోర్టు డ్యూటీ అధికారి పని చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. శనివారం ఆదిలాబాద్ పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో కోర్టు డ్యూటీ అధికారులు, లైసెన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎఫ్ఐఆర్ నమోదైన సందర్భం నుంచి కేసు పూర్తి అయ్యేవరకు ప్రతి ఒక్క అంశాన్ని కోర్టు డ్యూటీ అధికారులు పరిశీలించాలన్నారు.

News April 6, 2025

ADB: పాలిటెక్నిక్‌లో ప్రవేశాలకు POLYCET

image

పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు పాలిసెట్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆదిలాబాద్ సంజయ్ గాంధి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ బండి రాంబాబు తెలిపారు. ఏప్రిల్ 20లోగా దరఖాస్తు చేసుకోవాలని, మే 13న పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పదోతరగతి పూర్తయిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News April 5, 2025

తాంసి: విద్యుదాఘాతంతో రైతు మృతి

image

తాంసి మండలం పొన్నారికి చెందిన అశిలీ పోచన్న అనే రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోచన్న ఆదిలాబాద్ రైతు బజారులో కూరగాయాలు విక్రయిస్తుంటాడు. శుక్రవారం బల్బు వెలుగకపోవడంతో దాన్ని సరిచేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. దీంతో కౌలు రైతు కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

News April 5, 2025

గంజాయిని, మాదకద్రవ్యాలను రూపుమాపాలి: ADB SP

image

జిల్లా వ్యాప్తంగా గంజాయిని, మాదకద్రవ్యాలను రూపుమాపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. దాబాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించరాదన్నారు. శుక్రవారం ADBలోని AR హెడ్ క్వార్టర్స్‌లో ఉట్నూర్ సబ్ డివిజనల్ పోలీసు సిబ్బందితో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీటు దాఖలు చేయాలన్నారు. ఏఎస్పీ కాజల్ సింగ్ తదితరులున్నారు.

News April 5, 2025

గంజాయిని, మాదకద్రవ్యాలను రూపమాపాలి: ADB SP

image

జిల్లా వ్యాప్తంగా గంజాయిని, మాదకద్రవ్యాలను రూపుమాపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. దాబాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించరాదన్నారు. శుక్రవారం ADBలోని AR హెడ్ క్వార్టర్స్‌లో ఉట్నూర్ సబ్ డివిజనల్ పోలీసు సిబ్బందితో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీటు దాఖలు చేయాలన్నారు. ఏఎస్పీ కాజల్ సింగ్ తదితరులున్నారు.

News April 5, 2025

ADB: సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం: DSP

image

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని డీఎస్పీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మివాడలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొత్త పంథాలో సైబర్ నేరగాళ్ల మోసాలు చేస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే సమాచారం అందించాలని సూచించారు. టూ టౌన్ సీఐ కరుణాకర్ రావు, సిబ్బంది, కాలనీవాసులు ఉన్నారు.

News April 5, 2025

ఇన్‌కం సర్టిఫికెట్ అవసరం లేదు: ADB కలెక్టర్

image

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని నూతనంగా ప్రారంభించినట్లు కలెక్టర్ రాజర్షిషా ఆన్నారు. ADB కలెక్టరేట్‌లో PO ఖుష్బూ గుప్తాతో కలిసి పథకంపై సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ద దరఖాస్తు చేసేందుకు రేషన్‌ కార్డు ఉంటే సరిపోతుందని, ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

News April 4, 2025

విద్యార్థులకు మెరుగైన విద్య అందించండి: ITDA PO

image

ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఐటీడీఏ పీఓ కుష్బూగుప్తా ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం ఇంద్రవెల్లి బాలికల ఏకలవ్య మోడల్ రెసిడెన్సీ పాఠశాలను పీఓ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలని సూచించారు.

error: Content is protected !!