India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశం మందిరం సోమవారం నిర్వహించిన ప్రజాఫిర్యాదుల భాగంగా మండలాల నుండి వచ్చిన దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులను జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్వీకరించారు. ఈ సందర్భంగా 35 మంది వద్ద అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. వారి సమస్యను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్, అధికారులు ఉన్నారు.
ఆసిఫాబాద్ మండలంలోని తుంపల్లి వాగును సోమవారం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సందర్శించారు. అధికారులను పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ..వరద ప్రభావిత, లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలకు ఎవరు వెళ్లవద్దన్నారు. సమస్యలు ఉంటే కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నంబర్లో సంప్రదించాలని సూచించారు.
డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ, పీజీలో ప్రవేశాలకై గడువు పొడగించినట్లు సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ సంగీత తెలిపారు. డిగ్రీ, పీజీ, తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులో చేరవచ్చని, AUG 31 వరకు గడువు పూర్తవగా దాన్ని SEP 30 వరకు పొడిగించినట్లు ఆమె వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా SRSP (శ్రీరాంసాగర్)జలాశయం పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. జలాశయం పరివాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తున్న సందర్భంగా దిగువకు నీటిని వదలనున్నట్లు తెలిపారు. గోదావరి పరివాహక గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు వాగులో చేపల వేటకు వెళ్ళవద్దని కోరారు.
HYD జీడిమెట్ల పీఎస్ పరిధి గాజుల రామారంలో దారుణం జరిగింది. ఓ అపార్ట్మెంట్లో ఇద్దరు పిల్లలను చంపి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు మంచిర్యాలకు చెందిన దంపతులు వెంకటేశ్(40), వర్షిణి(33), వారి పిల్లలు రిషికాంత్(11), విహంత్ (3)గా గుర్తించారు. ఘటనా స్థలానికి జీడిమెట్ల పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
SHARE IT
WGL-హసన్పర్తి-కాజీపేట ‘F’ క్యాబిన్ మధ్యలో ప్రస్తుతం ఉన్న 2 లైన్ల మార్గాన్ని, 4 లైన్లుగా అందుబాటులోకి తీసుకువచ్చే పనుల నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. సికింద్రాబాద్-సిర్పుర్కాగజ్నగర్ SEP 23 నుంచి OCT 7, కాజీపేట-సిర్పుర్టౌన్ SEP 26 నుంచి OCT 7 వరకు రద్దయ్యాయి. సిక్రింద్రాబాద్- సిర్పూర్ కాగజ్ నగర్, సిర్పూర్ – సికింద్రాబాద్ SEP 23 నుంచి అక్టోబర్ 7 వరకు రద్దు చేశారు.
ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో ఎఫ్ఎం స్టేషన్లను ప్రవేశ పెట్టేందుక కేంద్రమంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయంతో ఉభయ జిల్లాలో ఎఫ్ఎం రేడియో సదుపాయం రానుండటంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఒక్కో స్టేషన్ కు 20 నుంచి 30 మందికి ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార సముదాయాలు, సంఘాలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రజలకు చేరవేయడానికి ఎఫ్ఎం రేడియో ఉపయోగించుకోవచ్చు.
ఆదిలాబాద్ పట్టణం శాంతినగర్ లో ఉన్న ఎస్బీఐ వారి ఏటీఎంలో చోరీకి గురువారం రాత్రి యత్నం జరిగింది. వన్ టౌన్ సీఐ సునిల్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. గుర్తుతెలియని వ్యక్తి స్ధానిక శాంతినగర్లోని ఏటీఎం అద్దాలు పగులగొట్టి చోరీ చేయటానికి ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవటంతో వెనుదిరిగాడు. ఈ విషయమై ఎస్బీఐ రీజినల్ బ్యాంక్ ఆఫీసర్ సత్యనారాయణ శుక్రవారం పీఎస్ లో ఫిర్యాదు చేశారని దర్యాప్తు చేపడుతున్నామన్నారు.
కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విఠల్ తెలిపారు. జలాశయం పరివాహక ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశముందని శుక్రవారం రాత్రి వరద గేట్ల నుంచి దిగువకు నీటిని వదిలే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ క్రమంలో
నది పరివాహక గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని కోరారు.
Sorry, no posts matched your criteria.