Adilabad

News September 23, 2025

ADB: చేప.. చేప నువ్వేక్కడా?

image

తెలంగాణ మత్స్యకారులకు చేయూతనిచ్చేందుకు ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో ఆ పథకం అమలుకాక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 283 చెరువులు ఉండగా.. 107 మత్స్యకార సంఘాలు పని చేస్తున్నాయి. వీటితో పాటు సాత్నాల, మత్తడివాగు, దహెగాం ప్రాజెక్టులు ఉన్నాయి. జలవనరుల్లో కోటి వరకు చేప పిల్లలు వదలాలి. సెప్టెంబర్ నెల గడిచిపోతున్నా చేప పిల్లు ఇంకా వదలలేదు.

News September 22, 2025

ADB: అగ్రి కళాశాల అసోసియేట్ డీన్‌గా డా.వై.ప్రవీణ్ కుమార్

image

వ్యవసాయ కళాశాల నూతన అసోసియేట్ డీన్‌గా డాక్టర్ ప్రవీణ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు డీన్‌గా ఉన్న డాక్టర్ శ్రీధర్ చౌహాన్ వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా బదిలీపై వెళ్లారు. గతంలో ప్రవీణ్ కుమార్ కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్‌లో కోఆర్డినేటర్‌గా విధులు నిర్వహించారు. నూతనంగా విధులు స్వీకరించడం పట్ల కళాశాల సిబ్బంది అభినందనలు తెలిపారు.

News September 22, 2025

ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చేయాలి: ADB SP

image

ఆదిలాబాద్ పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు ఎస్పీ అఖిల్ మహాజన్ ను నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. సమస్యలను విన్న ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చి బాధితుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రతి ఒక్క సమస్యను పరిశీలించి శాశ్వతంగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. మొత్తం 43 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు.

News September 22, 2025

ప్రత్యేక నిపుణుల వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి: ADB కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం SNSPA కార్యక్రమంలో భాగంగా ప్రజల కోసం ప్రత్యేక నిపుణుల వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఆయా మండలాల్లో నిర్వహిస్తున్న శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్త్రీ, చిన్న పిల్లల కంటి, చర్మ, పళ్ల సమస్యలు, చెవి-ముక్కు-గొంతు వ్యాధులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 22, 2025

ఆదిలాబాద్: SC శాఖలో బతుకమ్మ సంబరాలు

image

జిల్లాలో ఆయా సంబంధిత శాఖల్లో బతుకమ్మ సంబరాలు మంగళవారం నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ముందుగా SC, BC, ST, మైనార్టీ సంక్షేమ శాఖలకు సంబంధించి SC డెవలప్‌మెంట్ కార్పొరేషన్ శాఖలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. బతుకమ్మ సంబరాలకు కమిటిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదనపు కలెక్టర్, ఛైర్మెన్, DWO, SC డెవలప్మెంట్, ప్రజా సంబంధాల శాఖ సభ్యులు ఉన్నారు.

News September 22, 2025

ADB: CM వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

image

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుతో కలిసి సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాజర్షి షా, జిల్లా అటవీ శాఖ అధికారితో కలిసి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి పాల్గొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం, సీఎస్ సూచించారు.

News September 22, 2025

యువత అనవసరంగా తిరగడం మానేయాలి: ADB SP

image

నవరాత్రి ఉత్సవాల్లో మహిళలు ఎలాంటి అత్యవసర సమయంలోనైనా డయల్ 100 ద్వారా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించి సహాయాన్ని పొందవచ్చని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. రాత్రి సమయాల్లో యువత అనవసరంగా తిరగడం మానేయాలని సూచించారు. మహిళలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో యువత, తెలియని వారు వారిని వీడియోలు తీయడం, వికృత చేష్టలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

News September 22, 2025

బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి: ఆదిలాబాద్ కలెక్టర్

image

జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ పండుగ చేయాలన్నారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో బతుకమ్మ ఆడే ప్రాంతాలు, నిమజ్జనం చేసే చెరువుల వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు.

News September 22, 2025

డీజేలకు అనుమతులు లేవు: ఆదిలాబాద్ ఎస్పీ

image

దుర్గా నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనంలో డీజేలకు అనుమతులు లేవని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
సుప్రీంకోర్టు నియమ నిబంధనలను లోబడి సౌండ్ బాక్స్‌లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాత్రి సమయాల్లో మహిళలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో శారదా దేవి మండప కమిటీల వద్ద మహిళా సిబ్బంది, షీ టీం బృందాలతో నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పోలీసు యంత్రాంగం నిరంతరం పెట్రోలింగ్ ఉంటుందన్నారు.

News September 22, 2025

ఉట్నూర్: ఐఏటీలో గిరిజన విద్యార్థిని ప్రతిభ

image

ఉట్నూర్ మండలంలోని గంగాన్నపేట్‌కు చెందిన కీర్తి జాతీయ స్థాయిలో నిర్వహించిన ఐఏటీ పరీక్షలో ప్రతిభ కనబరిచి 729వ ర్యాంక్ సాధించింది. ఒడిశాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్‌లో ఐదేళ్ల బీఎస్ఎంఎస్ కోర్సులో సీటు సంపాదించింది. ప్రతిభ కనబరిచిన కీర్తిని పలువురు అభినందించారు.