Adilabad

News August 27, 2024

ఆదిలాబాద్‌లో నేడు ఏజెన్సీ బంద్‌కు పిలుపు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ బంద్‌ను మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఆదివాసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏజెన్సీలోని గిరిజనుల సమస్యల పరిష్కరణ, ఐటీడీఎలోని బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీపై బంద్ నిర్వహిస్తున్నామన్నారు. దీంతో అన్ని సంఘాల నాయకులు, వ్యాపారస్తులు సహకరించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి, ఆదివాసీ విద్యార్థి సంఘం, తుడుందెబ్బ నాయకులు పేర్కొన్నారు.

News August 27, 2024

MNCL: ప్రజలకు నమ్మకం కలిగేలా పోలీసులు విధులు నిర్వర్తించాలి: డీసీపీ

image

పోలీసులు పై ప్రజలకు నమ్మకం, భరోసా కల్పించేలా ప్రతిఒక్కరూ విధులు నిర్వర్తించాలని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ అన్నారు. సోమవారం ఆయన జైపూర్ సబ్ డివిజన్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. విచారణలోని కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సమగ్ర విచారణతో ప్రతి నిందితుడికి శిక్షపడేలా పోలీసు అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు.

News August 26, 2024

ఆదిలాబాద్: పంజా విసురుతున్న డెంగీ

image

ఉమ్మడి జిల్లాలో దగ్గు, జలుబు, ఫ్లూ, విష జ్వరాలకు తోడు డెంగీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇటీవల విస్తారంగా వర్షాలు కురవడంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షపు నీరు నిల్వ ఉండి దోమలకు ఆవాసంగా మారింది. నీటి నిల్వలు ఉండకుండా చూసుకుంటూ పరిసరాల పారిశుద్ధ్యం పాటించాలని వైద్య శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ఉమ్మడి జిల్లాలో 204 డెంగీ కేసులు నమోదయ్యాయి.

News August 26, 2024

MNCL: సర్పంచ్ ఎన్నికలు.. వారొస్తున్నారు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యువత ధోరణిలో ప్రస్తుతం మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాజకీయాల్లోకి రావడానికి మక్కువ చూపుతున్నారు. అందుకు పంచాయతీ ఎన్నికలను అవకాశంగా మలుచుకోవాలని ఎంతో మంది యువకులు భావిస్తున్నారు. అటు రాజకీయ హోదాను అనుభవించేందుకు, అదే సమయంలో ఇటు ప్రజా సేవ చేయొచ్చన్న ఆలోచనతో చాలా మంది యువ నేతలు పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.

News August 26, 2024

ADB: ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య

image

ADB జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. చాలా ప్రాథమిక పాఠశాలల్లో 10 నుంచి 25 లోపు విద్యార్థులు మాత్రమే ఉంటున్నారు. జిల్లాలో ఒక్క టీచర్ కూడా లేని పాఠశాలలు 18 ఉండగా, 85 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఇక విద్యార్థులు లేక మూతపడిన స్కూళ్లు 10 ఉన్నట్లు సమాచారం. జిల్లాలోని పలు పాఠశాలల్లో పలువురు టీచర్ల నిర్లక్ష్య వైఖరే విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది.

News August 26, 2024

ADB: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ముంబాయి-బల్లార్ష మధ్య నడిచే నందిగ్రాం ఎక్స్‌ప్రెస్ 28, 29 తేదీల్లో ఆదిలాబాద్ వరకే పరిమితం కానుందని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నాగపూర్ డివిజన్లో మరమ్మతుల నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది. 28న సీఎస్ ముంబయి నుంచి బయలుదేరే రైలు(నెంబరు 11401) ఆదిలాబాద్లో నిలిపివేయునున్నట్లు పేర్కొంది. 29న నందిగ్రామ్ రైలు(నెంబరు 11402) ఆదిలాబాద్ నుంచి బయలుదేరి ముంబయికి బయలుదేరనుంది.

News August 26, 2024

ఆదిలాబాద్: ‘రిమ్స్‌లో నాణ్యమైన చికిత్సను అందించాలి’

image

అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్సను అందించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్ ప్రభుత్వాసుపత్రిలో ఉన్న రోగులతో వారు మాట్లాడారు. రోగులకు చికిత్సతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌ను కోరారు.

News August 25, 2024

నిర్మల్: తండ్రి మరణం తట్టుకోలేక కొడుకు మృతి

image

తండ్రి మరణం తట్టుకోలేక కొడుకు మృతి చెందిన ఘటన నిర్మల్‌లో చోటుచేసుకుంది. ఆస్రా కాలనీకి చెందిన జుహార్ అలీ ఖాన్(74) ఆదివారం ఉదయం అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. తండ్రి మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆవీద్ అలీఖాన్ (52) ఏడుస్తూ గుండెపోటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గంటల వ్యవధిలోనే తండ్రీకొడుకులిద్దరూ మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

News August 25, 2024

ఆదిలాబాద్: మేనల్లుడని చేరదీస్తే ఇంట్లోంచి వెల్లగొట్టాడు

image

మేనల్లుడని చేరదీస్తే తమను సొంత ఇంటి నుంచి బయటకు గెంటేశాడని ఆదిలాబాద్‌‌లోని శాంతినగర్‌కు చెందిన దేవన్న, దేవమ్మ దంపతులు వాపోయారు. తాను గతంలో మేస్త్రీ పని చేసే వాడినని, ఓ ప్రమాదంలో కాలుకోల్పోయి ఇంటికే పరిమితమయ్యానని దేవన్న పేర్కొన్నారు. దీంతో చేరదీసిన మేనల్లుడు తమను ఇంట్లోంచి వెల్లగొట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై RDOను కలిసేందుకు కలెక్టరేట్‌కు వెళ్లగా ఆయన రాకపోవడంతో వెనుదిరిగామన్నారు.

News August 25, 2024

ADB: ఆర్టీసి ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి చక్రం పురస్కారాలు అందజేత

image

ఆదిలాబాద్ ఆర్టీసీ కార్గో విభాగంలో విధులు నిర్వహిస్తున్న షేక్ అబ్దుల్ ఆన్సర్ ఉత్తమ ఉద్యోగిగా ఎంపికయ్యారు. అదేవిధంగా ఉత్తమ డ్రైవర్‌గా అదిలాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన మహమ్మద్ ఎంపికయ్యారు. ఇందులో భాగంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వీరికి ప్రగతి చక్రం పురస్కారాలను అందజేసి ఘనంగా సత్కరించారు.