Adilabad

News August 12, 2025

బజార్హత్నూర్: సంప్రదాయబద్ధంగా నోవోంగ్ పూజలు

image

ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని నాయకులు పేర్కొన్నారు. బజార్‌హత్నూర్‌ మండలం అనంతపూర్ (పంగిడి) గ్రామంలోని సిడాం వంశస్థులు మంగళవారం నోవోంగ్ పూజలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా చేతికొచ్చిన పంటలకు ప్రత్యేక పూజలు చేసి, తమ మొక్కులను తీర్చుకున్నారు.

News August 12, 2025

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: ADB DSP

image

విద్యాసంస్థల్లో ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ జీవన్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని వ్యవసాయ కళాశాలలో విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. ర్యాగింగ్‌కు పాల్పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ర్యాగింగ్ వంటి అంశాలకు దూరంగా ఉండి, తమ కెరీర్‌పై దృష్టి పెట్టాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేయాలని ఆయన తెలిపారు.

News August 12, 2025

అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు: ADB కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అక్రమాలకు పాల్పడిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు, సంబంధిత సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజర్షిషా హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్లు, వనమహోత్సవం, గృహజ్యోతి, మహాలక్ష్మి, సౌర విద్యుత్ ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. భూభారతి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని, దరఖాస్తుల పరిశీలనను రోజువారీగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.

News August 12, 2025

ADB: అధిక ప్రవేశాలు.. ప్రిన్సిపల్‌కు సన్మానం

image

2025-26 విద్యాసంవత్సరంలో కళాశాలలో అధిక ప్రవేశాలు సాధించినందుకు ADB ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్ ప్రిన్సిపల్ సంగీతను అధ్యాపకులు సత్కరించారు. ఆమె చొరవతో మొత్తం 600 సీట్లకు 472 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని తెలిపారు. ఫిజికల్ సైన్స్‌లో 180కి 162, లైఫ్ సైన్సెస్‌లో 420కి 310 సీట్లు భర్తీ అయ్యాయని పేర్కొన్నారు. ఈ విజయం సాధించినందుకు ప్రిన్సిపల్‌తోపాటు దోస్త్ బృందాన్ని అధ్యాపకులు అభినందించారు.

News August 12, 2025

ఉట్నూర్: ‘ఓటు చోరీ ప్రజాస్వామ్య హత్య’

image

ప్రజల ఓటు చోరీ చేసి ఎన్నికల పోటీల్లో గెలవడం ప్రజాస్వామ్య హత్య అని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. సోమవారం ఉట్నూర్‌లో పార్టీ శ్రేణులతో కలిసి మాట్లాడారు. రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కాంగ్రెస్ ముందడుగు వేస్తుందని పేర్కొన్నారు.

News August 12, 2025

ADB: ‘స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలి’

image

స్వాతంత్య్ర దినోత్సవాలను ఆదిలాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్నామని, అందుకనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులకు సూచించారు. వేడుకలకు వచ్చే అతిథికి పోలిసు గౌరవ వందనంతో పాటు పోలీసు బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. వేడుకల సందర్భంగా విద్యుత్ అంతరాయం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలన్నారు.

News August 11, 2025

ADB: సనాతన హిందూ ఉత్సవ సమితి సమావేశం

image

ఆదిలాబాద్‌లోని గోపాలకృష్ణ మఠంలో సోమవారం సనాతన హిందూ ఉత్సవ సమితి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. సమితి అధ్యక్షుడిగా ప్రమోద్ కుమార్ ఖాత్రి, ప్రధాన కార్యదర్శులుగా గేడం మాధవ్, పడకంటి సూర్యకాంత్, కోశాధికారిగా రేణుకుంట రవీందర్, కార్యనిర్వాహక కార్యదర్శిగా కందుల రవీందర్ ఎన్నికైనట్లు తెలిపారు. మిగిలిన పదవులు యథావిధిగా కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.

News August 11, 2025

ADB: ‘ఆల్బెండజోల్ మాత్రలను వేయాలి’

image

19 ఏళ్లలోపు ప్రతి ఒక్కరికీ నులిపురుగుల నిర్మూలనకు ఆల్బెండజోల్ మాత్రలను వేయాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. సోమవారం ఆదిలాబాద్ కేజీబీవీలో ఏర్పాటుచేసిన నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు మాత్రలు వేశారు. పిల్లలలో నులిపురుగులు ఉండటం వలన వారిలో పోషకాహార లోపం, రక్తహీనత, ఆకలి మందగించడం తదితర ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయన్నారు. డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ ఉన్నారు.

News August 11, 2025

ADB: పోలీస్ గ్రీవెన్స్‌కు 43 ఫిర్యాదులు

image

ఆదిలాబాద్ పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చి నేరుగా ఎస్పీకి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఎస్పీ సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చి ప్రజాసమస్యలను సిబ్బందిని కేటాయించి, త్వరితగతిన సమస్యల పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు. 43 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు.

News August 11, 2025

ఇచ్చోడ: ‘వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి’

image

వేధింపులకు గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని షీటీం ASI వాణిశ్రీ విద్యార్థినులకు సూచించారు. సోమవారం ఇచ్చోడ ప్రభుత్వ Jr కళాశాల, ఉన్నత పాఠశాలల్లో షీటీం సేవలపై అవగాహన కల్పించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, హెల్ప్‌లైన్ నంబర్ల గురించి వివరించారు. మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం షీటీం పనిచేస్తుందన్నారు. సమస్య ఉంటే 8712659953కి కాల్ చేయాలని సూచించారు. షీటీం సిబ్బంది మహేశ్, మోహన్, రోహిణి పాల్గొన్నారు.