Adilabad

News April 4, 2026

హెల్ప్ డెస్క్ ఏర్పాటు: ఆదిలాబాద్ కలెక్టర్

image

వినియోగదారులు తమకు కావలసిన ఇసుకను tgmiv.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా లేదా ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ‘MIV Mobile App’ ద్వారా సులభంగా బుక్ చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మాన్యువల్ కూపన్లు చెల్లవని, కేవలం ఆన్‌లైన్ రశీదులు ఉన్న వాహనాలకు ఇసుక తరలింపునకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. హెల్ప్ డెస్క్ నంబర్ 7569538588ను సంప్రదించాలన్నారు. ఈ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 4, 2026

ఆదిలాబాద్: హత్యకు దారి తీసిన ఇద్దరి మధ్య కొట్లాట

image

ఆదిలాబాద్‌లో ఇద్దరి మధ్య జరిగిన కొట్లాట హత్యకు దారితీసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారు గూడలో శుక్రవారం రాత్రి రాజేశ్, జబ్బార్ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో జబ్బార్, రాజేశ్‌పై దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ఇద్దరు కూలీలుగా పని చేస్తున్నట్లు సమాచారం.

News April 4, 2026

ఆదిలాబాద్: హత్యకు దారి తీసిన ఇద్దరి మధ్య కొట్లాట

image

ఆదిలాబాద్‌లో ఇద్దరి మధ్య జరిగిన కొట్లాట హత్యకు దారితీసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారు గూడలో శుక్రవారం రాత్రి రాజేశ్, జబ్బార్ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో జబ్బార్, రాజేశ్‌పై దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ఇద్దరు కూలీలుగా పని చేస్తున్నట్లు సమాచారం.

News April 4, 2026

ఆదిలాబాద్: హత్యకు దారి తీసిన ఇద్దరి మధ్య కొట్లాట

image

ఆదిలాబాద్‌లో ఇద్దరి మధ్య జరిగిన కొట్లాట హత్యకు దారితీసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారు గూడలో శుక్రవారం రాత్రి రాజేశ్, జబ్బార్ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో జబ్బార్, రాజేశ్‌పై దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ఇద్దరు కూలీలుగా పని చేస్తున్నట్లు సమాచారం.

News April 4, 2026

ఆదిలాబాద్: హత్యకు దారి తీసిన ఇద్దరి మధ్య కొట్లాట

image

ఆదిలాబాద్‌లో ఇద్దరి మధ్య జరిగిన కొట్లాట హత్యకు దారితీసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారు గూడలో శుక్రవారం రాత్రి రాజేశ్, జబ్బార్ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో జబ్బార్, రాజేశ్‌పై దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ఇద్దరు కూలీలుగా పని చేస్తున్నట్లు సమాచారం.

News April 3, 2026

ఇంద్రవెల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం

image

ఇంద్రవెల్లి మండలం దన్నోర(బి) శివారులోని పిప్రి క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని మ్యాక్స్ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆత్రం లోకేశ్(17) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనతో పాటు బైక్‌పై ఉన్న కినక ప్రమిత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని అంబులెన్స్‌లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు.

News April 3, 2026

ఆదిలాబాద్: సుభద్ర ఇంటిని సందర్శించిన కలెక్టర్

image

బజారహత్నూర్ మండలం జాతర్ల రామ్ నగర్ హాబిటేషన్‌లో కలెక్టర్ రాజర్షిషా ప్రత్యేక చొరవతో మంజూరు చేసిన ఊయీకె సుభద్ర నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును ఆయన సందర్శించారు. కలెక్టర్ ఆమెను శాలువాతో సన్మానించి బహుమతిని అందజేశారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఎంపీడీఓ శ్రీనివాస్, తహశీల్దార్ శ్యామ్ సుందర్, హోసింగ్ ఏఈ జలబ, ఇతర అధికారులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

News April 3, 2026

‘ఉమ్మడి ఆదిలాబాద్ అభివృద్ధిపై సీఎం దృష్టి’

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. సాగునీటి, విద్యా రంగాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ సుమారు రూ.600 కోట్ల పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. పిప్రి బహిరంగ సభలో కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

News April 3, 2026

రేపు ఆదిలాబాద్‌లో జాబ్ మేళా

image

ఆదిలాబాద్‌లోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో ఈనెల 4న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.శివకృష్ణ తెలిపారు. పలు ప్రైవేటు కంపెనీలు పాల్గొని టెక్నికల్ ఉద్యోగాలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, టెలికాలర్‌తో పాటు పలు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు. ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులన్నారు.

News April 3, 2026

ఆదిలాబాద్: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

image

జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషాను శుక్రవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ నాయకులు కలిసి వినతపత్రాన్ని అందజేశారు. అర్హులైన జర్నలిస్టుల అందరికీ అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయడంతో పాటు హెల్త్ కార్డులు అన్ని ప్రైవేటు ఆసుపత్రులలో చెల్లుబాటు అయ్యేవిధంగా చూడాలన్నారు. అర్హులైన జర్నలిస్టుల అందరికీ ఇల్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరారు.