India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజీవ్ యువ వికాస్ స్వయం ఉపాధి పథకాలకు ప్రభుత్వ ఏప్రిల్ 5 వరకు అవకాశం కేంద్రం కాగా యువత కొరిక మేరకు దరఖాస్తు గడువును ఏప్రిల్ 14 వరకు పొడిగించినట్లు ADB కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. దరఖాస్తులను ప్రజాపాలన సేవా కేంద్రం, మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో అందచేయాలన్నారు. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకునేవారు అదనపు చార్జీలు చెల్లించనవసరం లేదని కోరారు చేశారు.
ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్ష 13వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు పలు యువజన నాయకులు, వివిధ సంఘాల నేతలు మద్దతు తెలిపారు. సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి సీసీఐ పునరుద్ధరణకు కృషి చేయాలని కోరారు.
గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా వాసి ప్రతిభ కనబరిచారు. స్థానిక దోబీ కాలనీకి చెందిన బండి అశోక్- లక్ష్మి దంపతుల కుమారుడు బండి అమరేందర్ 478.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 149 ర్యాంకు సాధించారు. మల్టీ జోన్- 1లో 76వ ర్యాంకు సాధించారు. గ్రూప్-1లో ఉత్తమ ర్యాంకు సాధించడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్ను తేల్చనుంది. ఆదిలాబాద్ జిల్లాలో త్వరలో సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నూతన సంవత్సరంలో జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘కీ రోల్’ కాబోతోంది.
నార్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన పవార్ సంగీత-ఉత్తమ్ దంపతుల కుమారుడు పవార్ శంకర్(22) ఆదివారం కెరమెరిలోని శంకర్ లొద్ది పుణ్య క్షేత్రానికి వెళ్లి వాగులో <<15940359>>ఈతకు వెళ్లి<<>> మృతిచెందాడు. శంకర్ ఉగాది రోజే మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కాగా ఏప్రిల్లో అతడికి పెళ్లి నిర్ణయించినట్లు స్థానికులు తెలిపారు.
స్వయం ఉపాధి పథకాల ద్వారా యువత లబ్ధి పొందాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన రాజీవ్ యువ వికాస్ పథకానికి అన్ని వర్గాల ప్రజలు, యువత దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆధార్, కుల, ఆధాయ, పాన్ కార్డ్, తదితర వివరాలను ఉపయోగించి https://tgobmmsnew.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ప్రైవేట్ వ్యక్తులకు వాహనాలు ఆపే అధికారం లేదు అని డిఎస్పీ జీవన్ రెడ్డి అన్నారు. బోరజ్ చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేస్తున్న ఒక ఎంవీఐ అధికారి, ప్రైవేట్ డ్రైవర్ యుగంధర్చ ప్రైవేట్ వ్యక్తి వాహనాలు ఆపి ధ్రువపత్రాల అడగ్గా హైవే పెట్రోల్ గమనించి జైనథ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అతనిపై కేసు నమోదు చేశారు. చట్ట వ్యతిరేకంగా ప్రైవేట్ వ్యక్తులు వాహనాలు ఆపిన, డబ్బులు వసూలు వారిపై చర్యలు తప్పవన్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఆదివారం WWE సూపర్ స్టార్ ది గ్రేట్ ఖలీ రానున్నట్లు ఆదిత్య ఖండేష్కర్ సొసైటీ అధ్యక్షుడు ఆదిత్య తెలిపారు. దక్షిణ భారతదేశ ప్రయాణం ముగించుకొని ఆయన సొంత ఊరికి వెళ్తున్న ఖలీ మార్గమధ్యలో ఆదిలాబాద్లోని తన ఇంటికి రానున్నట్లు ఆదిత్య వెల్లడించారు. ఆదివారం ఇక్కడే ఉండి మరుసటి రోజు తిరుగి ప్రయాణం కానున్నట్లు పేర్కొన్నారు.
ఆధునిక సమాజంలో అమాయక ప్రజలను ఎలాగైనా మోసం చేసి డబ్బులు దోచేయాలనే దురుద్దేశంతో వివిధ రకాలైన సైబర్ క్రైమ్ జరుగుతుందని జిల్లా SP అఖిల్ మహాజన్ అన్నారు. సైబర్ నేరాలను అప్రమత్తత, అవగాహన ద్వారా అడ్డుకోవడం సాధ్యమవుతుందని, ఎవరైనా సైబర్ నేరానికి గురైన వెంటనే 1930 నంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎలాంటి నష్టాన్ని అయినా సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు.
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన SC విద్యార్థులకు 2025 విద్యా సంవత్సరానికి గాను విదేశాల్లో ఉన్నత విద్యనూ అభ్యసించేందుకు ‘అంబేడ్కర్ ఓవర్సీస్ విద్య నిధి” పథకం ద్వారా స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని SC సంక్షేమ శాఖ అధికారి సునీత పేర్కొన్నారు. ఈనెల 20 నుంచి మే 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 88869 76630 నంబర్ను సంప్రదించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.