India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసి రిమాండ్కి తరలించినట్లు ADB వన్ టౌన్ CI సునిల్ కుమార్ తెలిపారు. ఖానాపూర్ చెరువు కట్ట వద్ద షేక్ కలీం గంజాయి విక్రయించగా అతని వద్ద కొనుగోలు చేసి తాగుతున్న అనంద్, అజహర్, ఫారూఖ్, రోషన్లను SI అశోక్ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 300 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రేత కలీంను రిమాండ్ తరలించి మిగిలిన నలుగురికి నోటీసులు ఇచ్చారు.
ఆదిలాబాద్ శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న భారీ శోభాయాత్రలో శాంతిభద్రతలను ఎస్పీ అఖిల్ మహాజన్ స్వయంగా పరిశీలించారు. శోభాయాత్ర ముందర మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎస్పీ సీసీ కెమెరాల ద్వారా నిఘాను పర్యవేక్షించారు. శాంతి భద్రతలపై ఎప్పటికప్పుడు పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వేలో టాప్ టెన్ ఎమ్మెల్యేల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చోటు సంపాదించుకున్నారు. పీపుల్స్ పల్స్ సంస్థ సౌత్ ఫస్ట్ వెబ్ ద్వారా 2024 మార్చి 28 నుంచి ఏప్రిల్ 3 వరకు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేశారు. ఇందులో ఆదిలాబాద్ ఎమ్మెల్యే 8వ స్థానంలో నిలిచారు. నియోజకవర్గంలో 450 నుంచి 500 శాంపిల్స్ సేకరించినట్టు సంస్థ తెలిపింది.
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు పాలిసెట్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆదిలాబాద్ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ బండి రాంబాబు తెలిపారు. ఏప్రిల్ 20లోగా దరఖాస్తు చేసుకోవాలని, మే 13న పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పదోతరగతి పూర్తయిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కోర్టులలో నేరస్తులకు సరైన సమయంలో సరైన శిక్ష పడేవిధంగా ప్రతి ఒక్క కోర్టు డ్యూటీ అధికారి పని చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. శనివారం ఆదిలాబాద్ పోలీసు హెడ్ క్వార్టర్స్లో కోర్టు డ్యూటీ అధికారులు, లైసెన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎఫ్ఐఆర్ నమోదైన సందర్భం నుంచి కేసు పూర్తి అయ్యేవరకు ప్రతి ఒక్క అంశాన్ని కోర్టు డ్యూటీ అధికారులు పరిశీలించాలన్నారు.
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు పాలిసెట్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆదిలాబాద్ సంజయ్ గాంధి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ బండి రాంబాబు తెలిపారు. ఏప్రిల్ 20లోగా దరఖాస్తు చేసుకోవాలని, మే 13న పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పదోతరగతి పూర్తయిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తాంసి మండలం పొన్నారికి చెందిన అశిలీ పోచన్న అనే రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోచన్న ఆదిలాబాద్ రైతు బజారులో కూరగాయాలు విక్రయిస్తుంటాడు. శుక్రవారం బల్బు వెలుగకపోవడంతో దాన్ని సరిచేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. దీంతో కౌలు రైతు కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా గంజాయిని, మాదకద్రవ్యాలను రూపుమాపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. దాబాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించరాదన్నారు. శుక్రవారం ADBలోని AR హెడ్ క్వార్టర్స్లో ఉట్నూర్ సబ్ డివిజనల్ పోలీసు సిబ్బందితో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీటు దాఖలు చేయాలన్నారు. ఏఎస్పీ కాజల్ సింగ్ తదితరులున్నారు.
జిల్లా వ్యాప్తంగా గంజాయిని, మాదకద్రవ్యాలను రూపుమాపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. దాబాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించరాదన్నారు. శుక్రవారం ADBలోని AR హెడ్ క్వార్టర్స్లో ఉట్నూర్ సబ్ డివిజనల్ పోలీసు సిబ్బందితో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీటు దాఖలు చేయాలన్నారు. ఏఎస్పీ కాజల్ సింగ్ తదితరులున్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని డీఎస్పీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మివాడలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొత్త పంథాలో సైబర్ నేరగాళ్ల మోసాలు చేస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే సమాచారం అందించాలని సూచించారు. టూ టౌన్ సీఐ కరుణాకర్ రావు, సిబ్బంది, కాలనీవాసులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.