Adilabad

News September 22, 2025

ADB: సారీ.. 5 లక్షల మందికి నో శారీ

image

మహిళలు ఇష్టంగా జరుపుకొనే పండుగ బతుకమ్మ. వారి కోసం తెలంగాణ సర్కారు ఏటా పండుగకు చీరలు అందజేసేది. ప్రభుత్వం మారడంతో గతేడాది ఆడబిడ్డలకు చీరలు ఇవ్వలేదు. ఈసారి ఇద్దామనుకున్నా కేవలం స్వయం సహాయక సంఘాల సభ్యులకే ఇస్తామని స్పష్టం చేసింది. అయితే ఉమ్మడి ADBలో 9,50,000 వరకు మహిళా ఓటర్లున్నారు. కానీ 40వేల స్వయం సహాయక సంఘాల్లో ఉన్న 4,50,000 మందికే చీరలు ఇవ్వడం పట్ల విమర్శలు వస్తున్నాయి. దీనిపై మీ కామెంట్.

News September 21, 2025

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్

image

స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, సంబంధిత ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.

News September 21, 2025

ఆదిలాబాద్: భారీ కుంభకోణాన్ని బయటపెట్టిన పోలీసులు

image

భారీ కుంభ కోణాన్ని పోలీసులు బయటపెట్టారు. ప్లాటును తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న ముగ్గురిపై కేసు చేసి అరెస్టు చేసినట్లు మావల సీఐ స్వామి తెలిపారు. విజయ్ 2011లో ఎంప్లాయీస్ కాలనీలో ప్లాటును కోనుగోలు చేశారన్నారు. ఆ ప్లాటు పెంయిటర్ సంజీవ్ సహాకారంతో వెంకటరమణ గత ఏడాది అప్పటి సబ్ రిజిస్ట్రార్‌తో రఘుపతి పేరిట మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. బాధితుడు ఫిర్యాదుతో దర్యాప్తు చేశామన్నారు.

News September 21, 2025

ఆదిలాబాద్‌లో చికెన్ ధరల పెరుగుదల

image

ఆదిలాబాద్ జిల్లాలో చికెన్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆదివారం స్కిన్ చికెన్ కిలో రూ.199 నుంచి రూ.215 వరకు ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.226 నుంచి రూ.246 వరకు పలికింది. గత వారంతో పోలిస్తే రూ.20 నుంచి రూ.40 వరకు పెరిగింది. ఈ ఆకస్మిక పెరుగుదలతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

News September 21, 2025

జాతీయస్థాయి సదస్సులో ADB రిమ్స్ డైరెక్టర్

image

ఆసుపత్రుల్లో రోగుల భద్రతపై ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో శనివారం నిర్వహించిన జాతీయస్థాయి అవగాహన సదస్సులో ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ నోడల్ అధికారిగా పాల్గొన్నారు. తెలంగాణ నుంచి 30 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఆసుపత్రిలో చికిత్సలు అందించేటప్పుడు రోగులకు ఎలాంటి మందులు అందించాలి, నిర్వహణ తీరు, మందుల ప్రభావం తదితర అంశాల్లో అవగాహన కల్పించినట్లు ఆయన వెల్లడించారు.

News September 19, 2025

ఆదిలాబాద్: ఏఎస్పీ కాజల్ సింగ్‌కు పదోన్నతి

image

ఉట్నూర్ ఏఎస్పీగా ఉన్న కాజల్ సింగ్ ఎస్పీగా పదోన్నతి రాగా శుక్రవారం ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందనలు తెలిపారు. అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన కాజల్ సింగ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భుజస్కందాలపై సింహ తలాటం చిహ్నాన్ని అలంకరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, జీవన్ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్ పాల్గొన్నారు.

News September 19, 2025

గంజాయి రహిత జిల్లా నిర్మాణానికి కృషి చేయాలి: ADB ఎస్పీ

image

గంజాయి రహిత జిల్లా నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గురువారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. వీడీసీల ఆగడాలను పూర్తిస్థాయిలో అరికట్టాలన్నారు. రౌడీలు, కేడీలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా కఠినమైన పర్యవేక్షణ చేయాలని సూచించారు. దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు.

News September 19, 2025

అసాంఘిక కార్యకలాపాలను రూపమాపాలి: ADB ఎస్పీ

image

రానున్న నవరాత్రి ఉత్సవాలకు జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తి సంసిద్ధమై ఉందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదిలాబాద్‌లో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపడానికి ప్రత్యేక కార్యచరణను అవలంభించాలని సూచించారు. అందులో భాగంగానే కల్తీకల్లు, ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, గేమింగ్, మట్కా లాంటి వాటిని పూర్తిగా రూపమాపేలా కృషి చేయాలన్నారు.

News September 19, 2025

ADB: ఆరోగ్య పాఠశాల కార్యక్రమంపై సమీక్ష

image

విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమంపై కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా ఈ సమావేశంలో పాల్గొని, విద్యార్థులు వేసిన డ్రాయింగ్‌లు, ప్రదర్శనలను తిలకించారు. విద్యార్థులు ఈ కార్యక్రమం వల్ల తమలో వచ్చిన మార్పులను వివరించారు. ఛాంపియన్ విద్యార్థుల సందేశాలను కలెక్టర్ అభినందించారు. అనంతరం విద్యార్థులకు సూచనలు చేశారు.

News September 19, 2025

ADB: కలెక్టర్ సార్.. మీ కోసమే ఎదురుచూపులు

image

”స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లయినా మా గ్రామానికి రోడ్డు లేక నరకయతన పడుతున్నాం. విద్య, వైద్యం పొందలేక అవస్థలు పడుతున్నాం. వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడితే హాస్పిటల్ వెళ్లలేని పరిస్థితి. నిత్యవసరాలకీ నరకం అనుభవిస్తున్నాం. రోడ్డు సరిగ్గా లేక పిల్లలు చదువులకు దూరమయ్యారు” అంటూ గుబిడి గ్రామస్థులు కలెక్టర్‌కు రాసిన వినతిపత్రం చర్చనీయంగా మారింది. మండల పర్యటనకు రానున్న కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి.