Adilabad

News August 24, 2024

కవ్వాల్ ప్రాంతంలో పెద్దపులి సంచారం 

image

కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం పరిధిలోని గోండు గూడ బీట్ జువ్విగూడా ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది. శుక్రవారం ఆ ప్రాంతంలో పులి అడుగులను అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో అటవీ సమీప ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరికైనా పులి కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు.

News August 24, 2024

కడెం ప్రాజెక్టును సందర్శించిన అధికారులు

image

కడెం ప్రాజెక్టును మెకానికల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విద్యానంద్, డీఈ కరుణాకర్ శుక్రవారం సందర్శించారు. ప్రాజెక్టు వరద గేట్ల స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పలు గేట్లను ఎత్తి చూసి ప్రాజెక్ట్ అధికారులకు గేట్లు ఎత్తే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. అనంతరం మెకానికల్ విభాగంలో ఉన్న పలు పరికరాలను పరిశీలించారు.

News August 23, 2024

నిర్మల్: పుట్టినరోజు వేడుకలకు వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి

image

నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం లోలం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. నిర్మల్ నుంచి లోలంకి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు ప్రశాంత్ (20), సంజయ్ (20), నితిన్ వెళ్తుండగా వారి బైకు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రశాంత్, సంజయ్ అక్కడికక్కడే మృతి చెందారు. నితిన్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

News August 23, 2024

ADB: బాత్రూంకు వెళ్లొచ్చేలోపే బైక్, ఫోన్ మాయం

image

బాత్రూంకు వెళ్లొచ్చేలోపే బైక్, ఫోన్ మాయమైన ఘటన ఆదిలాబాద్‌లో చోటుచేసుకుంది. టూ టౌన్ ఎస్ఐ విష్ణు ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం.. దుర్వ రామ్ అనే వ్యక్తి శుక్రవారం బైక్ పై భీంసారి నుంచి గాంధీనగర్ వెళ్తుండగా మార్గ మధ్యలో బైకును పక్కన పెట్టి బాత్రూంకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ద్విచక్రవాహనం దొంగతనానికి గురైంది. వెంటనే బాధితుడు స్టేషన్ వెళ్లి వాహనంతో పాటు ఫోన్ పోయిందని ఫిర్యాదు చేశారు.

News August 23, 2024

మంచిర్యాల: అమాత్య యోగం ఎవరికో..?

image

MNCL: రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లాకు చోటు దక్కనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 4 సీట్లు కైవసం చేసుకుంది. దీంతో నలుగురు ఎమ్మెల్యేలు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అందులో ఎమ్మెల్యేలు, వారి అనుచరగణం మంత్రి పదవి తమకే వస్తుందనే ధీమాతో ఉన్నారు. కష్టపడి పని చేసే వారికి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ క్యాడర్ నుంచి అభిప్రాయాలు వినిపిస్తుంది.

News August 23, 2024

ADB: ఈనెల 24న ఉమ్మడి జిల్లా టేబుల్ టెన్నిస్ పోటీలు

image

పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 24న అండర్-19 విభాగంలో బాలబాలికలకు ఉమ్మడి జిల్లా టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి బాబురావు తెలిపారు. జైపూర్ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఉదయం 10 గంటలకు పోటీలు ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు పోటీలకు హాజరు కావాలని, 1-1-2006 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు.

News August 23, 2024

నిర్మల్: ఉపాధి కోసం వెళ్తే.. ఉసురు పోతోంది

image

నిర్మల్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు ఎక్కువగా వలస పోతుంటారు. అయితే నిరుద్యోగులుగా వెళ్తున్న కొందరు నిర్జీవంగా తిరిగివస్తున్నారు. జిల్లాలోని 19 మండలాల పరిధిలో సుమారుగా 40 వేల మంది ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టారు. కాగా ఈ ఏడాదిలోనే 20 మంది వివిధ కారణాలతో గల్ఫ్‌లో మరణించడంతో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇటీవల భైంసా మండలానికి చెందిన ఇద్దరు మరణించడం ఆందోళన కలిగిస్తోంది.

News August 23, 2024

మంచిర్యాల: కొడుకును చూడటానికి వెళ్తూ తండ్రి మృతి

image

RTC బస్సు ఢీకొని పెద్దపల్లి జిల్లా ఓదెలలో సింగరేణి ఉద్యోగి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన రంజిత్‌కుమార్(39)కు 14 ఏళ్ల క్రితం ఓదెలకు చెందిన రజితతో పెళ్లయింది. వారికి నెల క్రితమే ఓ బాబు పుట్టాడు. అయితే సుల్తానాబాద్‌లో ఓ శుభకార్యానికి హాజరై.. అత్తగారింటి వద్ద ఉన్న భార్య, కొడుకును చూడటానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొని మృతి చెందాడు.

News August 23, 2024

ఆదిలాబాద్ జిల్లాలో మహిళలపై పెరుగుతున్న దాడులు

image

ఆదిలాబాద్ జిల్లాలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారం, వేధింపుల కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. జిల్లాలో ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. మహిళలపై వేధింపులకు సంబంధించి ఈఏడాది ఇప్పటి వరకు 160 వరకు కేసులు నమోదయ్యాయి. గతేడాది 14 కేసుల్లో, ఈయేడు మూడు కేసులకు సంబంధించి నిందితులకు కోర్టు శిక్ష విధించింది.

News August 22, 2024

ADB: స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

నాన్ రెసిడెన్షియల్ ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను LG హోప్ టెక్నికల్ స్కిల్ అకాడమీ ద్వారా అభ్యర్థులకు హైదరాబాద్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు ADB బీసీ సంక్షేమ అధికారి రాజలింగు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. 18నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్న వారు శిక్షణకు అర్హులన్నారు. ఈ నెల 24 వరకు tgbcstudycircle.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.