India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తోయిగూడకి చెందిన పవార్ గోపాల్కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా ఛైర్మన్ పురుషోత్తం రెడ్డి, వైస్ ఛైర్మన్ సందీప్, దేవిదాస్ జాయింట్ కలెక్టర్ శ్యామలా దేవిని కోరారు. తల్లిదండ్రులను కోల్పోయి కరీంనగర్లో ఉన్నత చదువులు చదువుకుంటున్న గోపాల్, GP సెక్రటరీ తప్పిదంతో ఇల్లు మంజూరు కాలేదని వివరించారు. దీనిపై స్పందించిన జేసీ, రెండో విడతలో ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, అదిలాబాద్ ఆధ్వర్యంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం ‘బేటీ బచావో – బేటీ పడావో’ కార్యక్రమంలో భాగంగా బేటీ బచావో బేటీ పడావో ప్రత్యేక రాఖీని తయారు చేశారు. ఈ రాఖీని అంగన్వాడీ కేంద్రం పిల్లలు కలెక్టర్ రాజర్షిషాకు కట్టి పండుగ శుభాకాంక్షలు అందజేశారు. ఆడపిల్లలందరినీ చదివించాలని కలెక్టర్ సూచించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ సలోని, డీడబ్ల్యూఓ మిల్కా ఉన్నారు.
యూరియా కొరత లేదని బోథ్ ఆత్మ ఛైర్మన్ గొర్ల రాజు యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గంగారెడ్డి అన్నారు. ఈరోజు మార్కెట్ ఆఫీసులో వారు మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు దొంగ నాటకాలు మానుకోవాలని సూచించారు. ఆదివారం సెలవు రోజున కార్యాలయం మూసి ఉన్న సమయంలో యూరియా కొరత ఉందంటూ ధర్నాలు చేయడం అవివేకమన్నారు. అనవసరంగా రైతులను తప్పుదోవ పట్టించవద్దని వారు సూచించారు.
తలమడుగు మండలంలో నలుగురి ఇంట్లో పెంచుతున్న పెంచుతున్న 4 కిలోల 460 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు ఇన్ఛార్జ్ ఎస్ఐ జీవన్రెడ్డి తెలిపారు. పెరట్లో గంజాయి మొక్కలు సాగు చేస్తున్న ఆత్రం సోనే రావ్, టేకం మల్కు, మడావి సోనీబాయి, ఆత్రం అయ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నలుగురు పరారీలో ఉన్నారని పట్టుకొని, చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
అంకితభావంతో పని చేయాలని ఆదిలాబాద్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పసుపుల దేవిదాస్ అన్నారు. ఆదివారం కైలాశ్నగర్లో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. సభ్యుల సంక్షేమం కోసం భవిష్యత్తులో నిర్వహించబోయే కార్యక్రమాలను దేవిదాస్ వివరించారు. కార్యక్రమంలో ఫిల్మ్ అసోసియేషన్ సభ్యులు ఆనంద్ కుమార్, నిహాల్ సింగ్, కమలాకర్రెడ్డి, కొత్తపల్లి కృష్ణ, స్వామి, హరికృష్ణ ఉన్నారు.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. అపరిచితులకు OTPలు చెప్పడం, ఫోన్కు వచ్చే లింక్లు ఓపెన్ చేయడం, APK అప్లికేషన్లు డౌన్లోడ్ చేయడం వంటివి చేయకూడదన్నారు. ఈ వారం జిల్లాలో మొత్తం 21 సైబర్ క్రైమ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ క్రైమ్కు గురైతే https://www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.
ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులైన లావూరి సతీష్, రమావత్ తరుణ్ జాతీయ స్థాయి జూడో ట్రయల్స్ పోటీల్లో సత్తా చాటారు. ఆసియా యూత్ జూడో ఛాంపియన్షిప్ కోసం భోపాల్లో ఈ నెల 8న జరిగిన అర్హత పోటీల్లో వీరు కాంస్య పతకాలను సాధించారని జూడో కోచ్ రాజు తెలిపారు. ఈ విజయం పట్ల క్రీడాకారులను జిల్లా యువజన, క్రీడల అధికారి జక్కుల శ్రీనివాస్, ఇతర అధికారులు అభినందించారు.
ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కొత్త పట్టా పాస్ బుక్లు కలిగిన రైతులు ఈనెల 13లోపు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలని DAO శ్రీధర్ ఈరోజు సూచించారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి జూన్ 5 వరకు కొత్తగా పాస్బుక్లు పొందిన రైతులు రైతుబీమా పథకం-2025 పాలసీలో చేరడానికి దరఖాస్తు అవసరమన్నారు. జిల్లాలోని 21 మండలాల్లో ఉన్న 101 రైతువేదికల్లో రైతుబీమా వివరాల నమోదు కార్యక్రమాన్ని ఏఈవోలు చేపడతారన్నారు.
ఉపాధ్యాయులపై నమోదవుతున్న పోక్సో కేసులపై పునః పరిశీలించాలని PRTU TS ఉపాధ్యాయ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కోరారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఏ తప్పు చేయని ఉపాధ్యాయులపై కేసులు నమోదు చేయడం ద్వారా మానసిక క్షోభకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీంతో సమాజంలో ఉపాధ్యాయులపై చులకన భావం కలుగుతుందని జిల్లా అధ్యక్షుడు కృష్ణకుమార్ పేర్కొన్నారు.
ఈనెల 11న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా వైద్య ఆరోగ్య, ఇతర శాఖల అధికారులతో ఈరోజు సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. నులిపురుగుల నిర్మూలన కోసం 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు తప్పకుండా వేయించాలని కలెక్టర్ సూచించారు. అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ మాత్రలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.