India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ జిల్లాలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారం, వేధింపుల కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. జిల్లాలో ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. మహిళలపై వేధింపులకు సంబంధించి ఈఏడాది ఇప్పటి వరకు 160 వరకు కేసులు నమోదయ్యాయి. గతేడాది 14 కేసుల్లో, ఈయేడు మూడు కేసులకు సంబంధించి నిందితులకు కోర్టు శిక్ష విధించింది.
నాన్ రెసిడెన్షియల్ ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను LG హోప్ టెక్నికల్ స్కిల్ అకాడమీ ద్వారా అభ్యర్థులకు హైదరాబాద్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ADB బీసీ సంక్షేమ అధికారి రాజలింగు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. 18నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్న వారు శిక్షణకు అర్హులన్నారు. ఈ నెల 24 వరకు tgbcstudycircle.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
జన్నారం మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన రాజమల్లు(35)బుధవారం ఇరాక్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. రాజమల్లు 7 సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం ఇరాక్ దేశం వెళ్లాడు. కాగా ప్రమాదవశాత్తు బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు వెల్లడించారు.
డెంగ్యూ కేసులను నియంత్రించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. పట్టణంలోని బాలాజీ నగర్లో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలకు పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై, సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమలు వృద్ధి కాకుండా చూడాలన్నారు. ఆయనతో పాటు డీఎంహెచ్ఓ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ ఖమర్, తదితరులున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టమాటా పంట సాగుతో పాటు కూరగాయల ఉత్పత్తి విపణి వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 48,560 ఎకరాల్లో కూరగాయలు సాగు చేయబడుతున్నాయి. ఈ విస్తరణలో, దాదాపు 15 ఎకరాల్లో టమాటా పంట సాగించబడుతుంది. జిల్లాలో మొత్తం 27.39 లక్షల జనాభా ఉన్న నేపథ్యంలో, కూరగాయల సాగు చేసే గ్రామాల సంఖ్య 212, ఏడాది మొత్తంలో 6.20 లక్షల టన్నులు కూరగాయలు ఉత్పత్తి అవుతున్నాయి.
ఆదిలాబాద్ టూ టౌన్ పీఎస్ వద్ద గురుకుల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. మావల గురుకుల ప్రిన్సిపల్ సంగీతను తొలగించాలని నిరసన వ్యక్తం చేశారు. నాసిరకం భోజనంపై ప్రశ్నిస్తే ప్రిన్సిపల్ బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపల్ను తొలగించేవరకు ఆందోళన చేస్తామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు.
LRS దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షిషా పంచాయతి, ఇరిగేషన్, రెవిన్యూ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. మొబైల్ యాప్ ద్వారా LRS దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ నిర్వహించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించాలన్నారు. అన్ని దరఖాస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
మంచిర్యాల పట్టణంలో ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో వ్యభిచారం నిర్వహిస్తున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వ్యభిచార ముఠాలోని ఆరుగురు విటులు, ఒక మహిళను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.15వేల నగదు, రెండు భైక్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఈనెల 24 ఉదయం 9 గంటలకు HCL టెక్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు DIEO జాదవ్ పరుశురాం తెలిపారు. 2024 సంవత్సరంలో 75% మార్కులతో ఉత్తీర్ణులైన HEC, CEC విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార గృహం పై పోలీసులు దాడి చేశారు. స్టేషన్ పరిధిలోని ద్వారకనగర్ కాలనీలో వ్యభిచారం జరుగుతుందన్న పక్క సమాచారంతో సీసీఎస్ పోలీసులు బుధవారం దాడిచేశారు. వ్యభిచార గృహంలో ఉన్న ఓ మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.