Adilabad

News August 8, 2025

ADB: ‘PRTUTSతోనే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం’

image

PRTU TS ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణ కుమార్ పేర్కొన్నారు. గోండి భాష అభివృద్ధికి కృషి చేసిన ఉపాధ్యాయుడు తొడసం కైలాష్ ఈరోజు PRTU TS ఉపాధ్యాయ సంఘంలో చేరగా సాదరంగా ఆహ్వానించారు. ఆయన్ను శాలువాతో ఘనంగా సత్కరించి, సభ్యత్వ రసీదును అందజేశారు. ప్రధాన కార్యదర్శి నరసింహ స్వామి, గౌరవ అధ్యక్షుడు గోవర్ధన్, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

News August 8, 2025

అడ్మిషన్లలో రికార్డు కొట్టిన ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల

image

DOST ద్వారా అడ్మిషన్ ప్రక్రియలో ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రికార్డు స్థాయిలో అడ్మిషన్స్ అయినట్లు కళాశాల ప్రిన్సిపల్ టి.ప్రతాప్ సింగ్ తెలిపారు. 2007లో కాలేజ్ స్థాపించినప్పటి నుంచి 2024 వరకు కానీ అడ్మిషన్లు.. ఈసారి అయ్యాయని తెలిపారు. 900 సీట్లకు 844 అడ్మిషన్లు అయ్యాయని కేవలం B.COM, BFSI సీట్లు మిగిలాయన్నారు. గ్రామ గ్రామన విస్తృతంగా ప్రచారం చేసిన కళాశాల సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

News August 7, 2025

బోథ్: CM రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు

image

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ ఛార్జ్ ఆడే గజేందర్ ఢిల్లీలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్యకు పదవి ఇప్పించినందుకు గాను సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం నియోజకవర్గంలో ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలు, తాజా రాజకీయాలను సీఎంతో చర్చించినట్లు గజేందర్ పేర్కొన్నారు.

News August 7, 2025

తలమడుగు: ఇంటి నుంచి వెళ్లి శవమై తేలాడు

image

తలమడుగు మండలంలో ఓ వ్యక్తి ఇంటి నుంచి వెళ్లి శవమై కనిపించాడు. SI రాధిక వివరాల ప్రకారం.. మండలం సుంకిడి కి చెందిన దాసరి ప్రశాంత్ ఇంట వారసత్వ భూమి విషయంలో ప్రతిరోజు మద్యం మత్తులో తండ్రి ఎర్రన్నతో గోడవపడేవాడు. ఈ నెల 6న మద్యం మత్తులో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. గురువారం సుంకిడి వాగులో శవమై కనిపించగా తండ్రి ఎర్రన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News August 6, 2025

ఆదిలాబాద్: కృష్ణ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు సూచన

image

విజయవాడ డివిజన్లో లైబీ బ్లాక్ కారణంగా ADB నుంచి తిరుపతి వరకు నడిచే కృష్ణ ఎక్స్ ప్రెస్‌ను కొద్దీ రోజులు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నంబర్ 17406 ADB నుంచి తిరుపతి నడిచే రైలు ఈనెల 8,10,12 తేదీలలో రెండు గంటలు ఆలస్యంగా ఉంటుందన్నారు. రైలు నంబర్ 17405 తిరుపతి నుంచి ADB నడిచే రైలు ఈనెల 13 నుంచి 19 వరకు రద్దు, 17406 ADB నుంచి తిరుపతి ఈనెల 14 నుంచి 20 వరకు రద్దు చేస్తున్నామన్నారు.

News August 6, 2025

ఆదిలాబాద్: ‘ఆకతాయిల వేధిస్తే షీ టీంను సంప్రదించండి’

image

ఆకతాయిల వేధింపులకు గురైతే వెంటనే షీ టీం నంబర్ 8712659953కు సంప్రదించాలని షీ టీం ఇన్‌ఛార్జ్ ఏఎస్ఐ సుశీల సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. బుధవారం ఆదిలాబాద్‌లోని సరస్వతి శిశు మందిర్‌లో విద్యార్థులకు షీ టీం సేవలపై ఆమె అవగాహన కల్పించారు. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్, హెల్ప్‌లైన్ నంబర్ల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో షీ టీం సిబ్బంది వాణిశ్రీ, మహేష్, మోహన్ పాల్గొన్నారు.

News August 6, 2025

తాంసి: ఒకరికి షోకాజ్ నోటీసులు

image

తాంసి PHCని జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి ఒకరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రిజిష్టర్ పరిశీలించి గైర్హాజరైన వారి వివరాలు డాక్టర్‌ను ఫోన్‌లో ద్వారా తెలుసుకున్నారు. తను అర్బన్ హెల్త్ సెంటర్ హమాలివాడలో ఆరోగ్య మహిళా కార్యక్రమంలో పాల్గొన్నట్లు వైద్యులు శ్రావ్య వాణీ తెలిపారు. తాంసీ పీహెచ్‌సీలో విధులకు గైర్హాజరైన జూనియర్ అసిస్టెంట్ తేజకు షోకాస్ నోటీస్ జారీ చేశారు.

News August 5, 2025

ఆదిలాబాద్: మెగా జాబ్ మేళా.. 296 మందికి నియామకం

image

ఆదిలాబాద్ ఎస్‌టీయూ భవన్‌లో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతంగా ముగిసిందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ జాబ్ మేళాకు మొత్తం 3,580 మంది అభ్యర్థులు హాజరుకాగా 396 మంది షార్ట్‌లిస్టు అయ్యారన్నారు. వీరిలో 296 మందికి నియామక ఉత్తర్వులు అందజేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కంపెనీలు అభ్యర్థుల వెరిఫికేషన్ అనంతరం అర్హులను ఎంపిక చేశాయని ఆయన వివరించారు.

News August 5, 2025

ఆదిలాబాద్: ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

image

ఆదిలాబాద్‌లో మౌనిక అనే యువతి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఉట్నూర్‌కు చెందిన ఆమె ఆదిలాబాద్‌లోని ఫుట్‌వేర్ దుకాణంలో ఉద్యోగం చేస్తూ భుక్తాపూర్‌లో అద్దె గదిలో నివాసం ఉంటోంది. కాగా మంగళవారం విధులు నిర్వహించిన అనంతరం గదికి వచ్చి ఉరేసుకుంది. ఇరుగుపొరుగు వారు గమనించడంతో విషయం బయటకు తెలిసింది. మృతదేహాన్ని రిమ్స్ తరలించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది

News August 5, 2025

ఆదిలాబాద్: ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

image

తాంసిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఎస్సై వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న కీర్తిరాజా గీతేష్ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి ఉపాధ్యాయుడిని రిమాండ్‌కు తరలించారు.