Adilabad

News March 26, 2025

ఆదిలాబాద్: కాంగ్రెస్ ప్రక్షాళన..?

image

కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి పార్టీ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టారు. రేపు ఢిల్లీలో DCC అధ్యక్షులతో భేటీ కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెబెల్స్ పోటీచేయడంతో మాజీ DCC అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, సుజాత, సంజీవరెడ్డిలను సస్పెండ్ చేశారు. తర్వాత కొత్త అధ్యక్షుడిని నియమించలేదు. రేసులో ADB అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది, TPCC ప్రధానకార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ZPTC గణేశ్‌రెడ్డి తదితరులున్నట్లు సమాచారం.

News March 26, 2025

ADB: BC విద్యార్థులకు GOOD NEWS

image

BC విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తమ వాటాను డైరెక్ట్‌గా కళాశాలల ఖాతాలకు జమచేయనున్నట్లు బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు తెలిపారు. అన్ని కళాశాలల యాజమాన్యాలు వారి బ్యాంకు అకౌంట్ డిటైల్స్, పాస్ బుక్ కాపీని బీసీ శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఈ నెల 27లోపు ONLINEలో పొందుపరుచాలని, లెటర్ హెడ్ పైన అకౌంట్ డిటేల్స్‌తో పాటు స్టేట్ మెంట్ కాపీ జత చేయాలని సూచించారు.

News March 26, 2025

ADB: తల్వార్‌తో INSTAలో పోస్ట్.. వ్యక్తిపై కేసు

image

తల్వార్‌తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వ్యక్తిపై సుమోటో కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ 1 టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. బంగారిగూడకు చెందకన సలీం ఖాన్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో తల్వార్లతో ఒక పోస్టును పెట్టడం వైరలైందన్నారు. ఇదివరకే సలీం ఖాన్ పలు ముఖ్యమైన కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు సీఐ వెల్లడించారు.

News March 26, 2025

ADB: KU సెమిస్టర్స్ ఫీజు గడువు పొడిగింపు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నేటితో ఈ గడువు ముగియగా ఏప్రిల్ 2 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. 

News March 26, 2025

ఆదిలాబాద్: CCI సాధన కమిటీ కార్యాచరణ ఇదే.!

image

ఆదిలాబాద్ సీసీఐ సాధన కమిటీ సమావేశాన్ని మంగళవారం సుందరయ్య భవనంలో నిర్వహించారు. మాజీ మంత్రి జోగురామన్న, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మార్చి 28న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ వస్తున్నారని తెలిపారు. ఏప్రిల్ 1న ఛలో ఢిల్లీ, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టనున్నామని, ఉద్యమ ఫొటో, ఫ్లెక్సీలు పెట్టాలని సూచించారు. రోజూ సాయంత్రం 4 గంటలకు సీసీఐ సాధన పోరాట కమిటీ సమావేశం నిర్వహించాలని తీర్మానించామన్నారు.

News March 25, 2025

ఆదిలాబాద్: బాధిత కుటుంబానికి రూ.8 లక్షల చెక్కు

image

గత సంవత్సరం తాంసి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తూ గుండెపోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ గంగన్న కుటుంబానికి ప్రభుత్వపరంగా వచ్చే అన్ని సహాయ సహకారాలు సకాలంలో అందజేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిబ్బందిని ఆదేశించారు. హెడ్ కానిస్టేబుల్ గంగన్న భార్య ప్రమీలకు మంగళవారం ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.8 లక్షల చెక్కును ఎస్పీ అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు.

News March 25, 2025

ఆదిలాబాద్‌కు వచ్చిన కేంద్ర బృందం సభ్యులు

image

జిల్లాలోని నార్నూర్ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్ర బృందం సభ్యులు ఆదిలాబాద్‌కువచ్చారు. డైరెక్టర్ మృత్యుంజయ ఝా, శుభోద్ కుమార్ డిప్యూటీ సెక్రటరీలను స్థానిక పెన్‌గంగా గెస్ట్ హౌస్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా మర్యాద పూర్వకంగా కలసి పూలమొక్కను, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా వారితో పలు అంశాలపై చర్చించారు.

News March 25, 2025

ADB: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

News March 25, 2025

గాదిగూడ: తల్లిదండ్రులు మృతి.. అనాథగా పిల్లలు

image

అభం శుభం తెలియని పసిపిల్లల జీవితాలతో విధి ఆడుకుంది. తల్లిదండ్రులను దూరం చేసి వారిని అనాథలుగా మార్చింది. గాదిగూడలోని దాబా(కే) గ్రామానికి చెందిన సోయం కిషన్(37) అనారోగ్యంతో శనివారం మృతిచెందగా ఆయన భార్య తూర్పబాయి 2021లో మృతిచెందింది. దీంతో వారి పిల్లలు దేవరావు, రాజేశ్వరి అనాథలుగా మారారు. తల్లిదండ్రులను కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వారిని దాతలు ఆదుకొని భవిష్యత్తుకు దారి చూపాలని వేడుకున్నారు.

News March 25, 2025

ADB: జిల్లాకు 2 మంత్రి పదవులు..!

image

రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు నిర్ణయం తీసుకుంది. ఉమ్మడిజిల్లాకు మంత్రి పదవి లేకపోవడంతో సమస్యలపై MLAలు ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క, ఇతరులను కలవాల్సి వచ్చేది. దీంతో ప్రజల సమస్యలు తీరలేదనే ఆరోపణలున్నాయి. అయితే ఇద్దరికి మంత్రి పదవులు వస్తాయనే ప్రచారం ఊపందుకుంది. ఈ విడతలో చెన్నూర్ MLA వివేక్, తర్వాత MNCL MLA ప్రేమ్‌సాగర్‌రావుకు దక్కనున్నట్లు సమాచారం.

error: Content is protected !!