India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈనెల 15,16వ తేదీల్లో మిగిలిపోయిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అతిక్ బేగం పేర్కొన్నారు. బీఏ ఇంగ్లిష్ మీడియం, తెలుగు/ఉర్దూ మీడియంలో సీట్లు కాళీగా ఉన్నాయన్నారు. అలాగే బీకాం తెలుగు/ఇంగ్లిష్ మీడియంలో సీట్లు ఉన్నట్లు తెలియజేశారు. ప్రవేశం పొందగల విద్యార్థులు ఒక సెట్ జిరాక్స్ ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.

లోక్ అదాలత్ ప్రాముఖ్యతను వివరిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర్ రావు, రాజీమార్గమే రాజమార్గం అని తెలిపారు. బోథ్ జూనియర్ కోర్టులో జరిగిన ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి కె.సందీప్, రాజీ ద్వారా 34 క్రిమినల్ కేసులు, ఒక సివిల్ వివాదం, నేరం ఒప్పుకోవడం ద్వారా 22 ఎక్సైజ్ కేసులు, 429 ఎస్టీసి కేసులను పరిష్కరించారు.

ఆదిలాబాద్ జిల్లాలో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలు శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు కాస్త ఎడతెరిపినిచ్చాయి. ఆదిలాబాద్ రూరల్ మండలంలో 22.8 మి.మీ వర్షపాతం నమోదు కాగా, మిగతా మండలాల్లో జల్లులు మాత్రమే కురిశాయి. ఈనెల 15వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అధికారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

ప్రభుత్వం డిగ్రీ అడ్మిషన్లకు చివరి అవకాశం కల్పించినట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్ ప్రిన్సిపల్ డాక్టర్ జె.సంగీత పేర్కొన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో కళాశాలలో మిగిలిపోయిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్ ఉర్దూ మీడియంలో 17, ఇంగ్లీష్ మీడియంలో 49, తెలుగు మీడియంలో 56, ఫిజికల్ సైన్సెస్లో 20 సీట్లు ఉన్నట్లు తెలిపారు.

మధ్యాహ్న భోజన పథకం బిల్లుల నిర్వహణను యుకుబేర్ నుంచి మినహాయించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల చిన్నన్న అన్నారు. శుక్రవారం ఆయన ఆదిలాబాద్ సీఐటీయూ ఆఫీస్లో మాట్లాడారు. కార్మికుల పెండింగ్ బిల్లులతోపాటు వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం కార్మికులకు పదివేల వేతనం అమలు చేయాలని పేర్కొన్నారు.

ఆదిలాబాద్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ రాజర్షి షా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా సమీక్ష చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాల ప్రాముఖ్యతపై చర్చించారు. అంగన్వాడీ భవనాల్లో మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి అవసరమైన సౌకర్యాలు తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

దివ్యాంగులకు విద్య, ఉపాధి, సంక్షేమం, సాధికారత అంశాలపై ఎన్పీఆర్డీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర కమిటీ సమావేశాల సందర్భంగా 2025 అక్టోబర్ 25, 26 తేదీల్లో హైదరాబాద్ జాతీయ సదస్సు ఉంటుందని జిల్లా అధ్యక్షుడు నగేష్ తెలిపారు. ఈసమావేశాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశానికి సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు.

ఐటీఐ, ఏటీసీలో చేరేందుకు మరొక అవకాశం కల్పించినట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆగస్టు 30 వరకు అడ్మిషన్ గడువు ఉండగా సెప్టెంబర్ 30వరకు పొడిగించినట్లు తెలిపారు. ఇప్పటికే 1వ, 2వ, 3వ దశలలో దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఈ వాక్-ఇన్ అడ్మిషన్లలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SHARE IT.

బాల్య వివాహాలను అంతం చేయడానికి పూర్తి ఒకరూ కృషి చేయాలని మౌలానా అబ్దుల్ అజీమ్ అసది, సీడబ్ల్యూసీ కమిటీ సభ్యుడు సమీరుల్లా అన్నారు. ఆదిలాబాద్లోని మహమ్మదీయ మస్జిద్ శుక్రవారం నమాజ్ అనంతరం ష్యూర్ ఎన్జీవో ఆధ్వర్యంలో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ వరల్డ్ ప్రచారం కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. బాల్యవివాహాల వల్ల జరిగే అనర్ధాలను వివరించారు. బాల్య వివాహాలు చేయడం నేరమన్నారు. జిల్లా కోఆర్డినేటర్ వినోద్ ఉన్నారు.

అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా నాలుగో మహాసభలు ఈనెల 13న నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్, జిల్లా కార్యదర్శి దేవేందర్ తెలిపారు. మహాసభలకు అంగన్వాడీ ఉద్యోగులకు అనుమతి ఇవ్వాలని శుక్రవారం ఆదిలాబాద్ సీడీపీఓ మిల్కాకు వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీ ఉద్యోగులు మహాసభలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Sorry, no posts matched your criteria.