Adilabad

News August 18, 2024

ఆసిఫాబాద్: పిడుగుపాటుతో రైతుమృతి

image

పిడుగుపడి ఒకరు మృతిచెందిన ఘటన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం ఎల్లూరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సీడం శ్రీను (45) అనే రైతు పొలంలో పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా వర్షం కురిసి అతనిపై పిడుగు పడింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందినట్లు వారు తెలిపారు.

News August 18, 2024

బెల్లంపల్లి: రూ.28 లక్షల నగదును దొంగిలించింది ఈ కారు నుంచే

image

పార్కింగ్ చేసిన కారు నుంచి రూ. 28 లక్షలు స్వాహా చేసిన ఘటన బెల్లంపల్లి పట్టణంలో సంచలనం రేపింది. తనిష్క్ ప్లైవుడ్ కంపెనీకి చెందిన సేల్స్ బాయ్స్ పలు దుకాణాల నుంచి వసూలు చేసిన నగదును తమ కారు టీఎస్ 13 ఈజీ 8100 సీటు కింద పెట్టి టిఫిన్ చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలో పల్సర్ బైక్ పై హెల్మెట్, కర్చీపు ధరించిన ఇద్దరు వ్యక్తులు వచ్చి దొంగతనానికి పాల్పడ్డారు.

News August 18, 2024

రేపు మంచిర్యాల జిల్లాకు కేంద్రమంత్రి బండి సంజయ్

image

రేపు మంచిర్యాల జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటించనున్నారు. హాజీపూర్ మండలం పడ్తనపల్లి పంచాయతీ పరిధిలోని రాంపూర్ చొక్కారాంనగర్ శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నట్లు పాఠశాల ప్రబంధకారిణి అధ్యక్షుడు మాధవరపు వినయ్ ప్రకాశ్ రావు వెల్లడించారు.

News August 18, 2024

కోటపల్లి: ‘మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా బాధ్యత తీసుకోవాలి’

image

గంజాయి, మత్తు పదార్థాల చెడు వ్యసనాలపై వ్యతిరేకంగా అందరు బాధ్యత తీసుకోవాలని మంచిర్యాల DCP భాస్కర్ అన్నారు. చెన్నూర్ రూరల్ కొటపల్లి పోలీస్ స్టేషన్ కోటపల్లి మండలం మోడల్ స్కూలులో గంజాయి, మాదకద్రవ్యాలపై అవగాహన సూచనలు చేశారు. DCP మాట్లాడుతూ.. యువత, విద్యార్థులు కొంత మంది వ్యక్తుల స్వార్థం కారణంగా యువతకు మత్తు పదార్థాలు బానిసలు మారుతున్నారని అన్నారు.

News August 17, 2024

తీర్యాణి: మంగి అటవీ ప్రాంతంలో పులి అడుగులు

image

తీర్యాణి మండలం గిన్నెదరి రేంజ్ వద్ద మంగి అటవీ ప్రాంతంలో పులి అడుగులను గుర్తించినట్లు అటవీశాఖా అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మంగి అటవీ ప్రాంతంలో ముల్కల మంద బీట్ పరిధిలో పులి అడుగులను గుర్తించినట్లు పేర్కొన్నారు. అది పెద్దపులా.. చిరుత పులా అనే సమాచారం తెలియాల్సి ఉందన్నారు. సమీప గ్రామ ప్రజలు అటవీ ప్రాంతంలోకి వెళ్లొదని, పశువుల కాపర్లు, వంట చేను కొరకు వెళ్లేవారు జాగ్రత్త వహించాలన్నారు.

News August 17, 2024

భైంసా: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

image

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం భైంసా మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. మహాగాం గ్రామానికి చెందిన కదం బాలాజీ 48 గత కొన్నాళ్లుగా మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది మద్యం మత్తులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుని కుమారుడు కదం అర్జున్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News August 17, 2024

కడెం: ఎడ్ల బండిపై నుంచి వెళ్లి చిన్నారి మృతి

image

కడెం మండలంలోని సింగపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రణయ్ అనే చిన్నారిపై నుండి ఎడ్ల బండి చక్రాలు వెళ్లడంతో మృతి మృతి చెందాడు. ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి వివరాలు.. తల్లి పద్మతో కలిసి ప్రణయ్ చేనుకు ఎడ్ల బండిపై యూరియా బస్తాలు తీసుకెళ్తుండగ ఎడ్ల బండిపై నుండి పడిపోయాడు. ప్రణయ్‌ పై నుండి ఎడ్ల బండి రెండు చక్రాలు వెళ్లడంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు. బాలుని తండ్రి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 17, 2024

ఖానాపూర్: ‘టైగర్ జోన్ పరిధిలో భారీ వాహనాలకు అనుమతి ఇవ్వాలి’

image

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో భారీ వాహనాలకు అనుమతి ఇవ్వాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం మధ్యాహ్నం రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖతో నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో పాల్గొని వారిని కోరారు. అలాగే గిరిజన వికాస్ పథకం కింద నిర్మించిన బావులకు త్రీఫేస్ విద్యుత్ లైన్ ఇవ్వాలన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని వారిని కోరారు.

News August 17, 2024

మంచిర్యాల: ఆగి ఉన్న కారులోంచి రూ.18లక్షలు చోరీ

image

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో టిఫిన్ చేద్దామని ఆపిన కారులో నుంచి రూ.18 లక్షల నగదును అపహరించిన ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం.. వ్యాపారం పనులపై హైదరాబాద్ నుంచి వచ్చిన వాసవి ట్రేడర్స్ ప్రతినిధులు ఖాతాదారుల నుంచి డబ్బు వసూలు చేసి కారులో ఉంచారు. అయితే కారు డోర్ లాక్ వేయక పోవడంతో నగదు తీసుకొని దుండగులు పరారైనట్లు తెలిపారు.

News August 17, 2024

ADB: స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్‌లో సత్తా చాటిన చరణ్

image

తెలంగాణా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణా షార్ట్ కోర్స్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్‌లో ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారుడు సత్తా చాటారు. జిల్లా కేంద్రానికి చెందిన కొమ్ము చరణ్ తేజ్ 1500 మీటర్స్ ఫ్రీ స్టైల్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించాడు. అదేవిధంగా 400 మీటర్స్ ఫ్రీ స్టైల్ విభాగంలోనూ రెండవ స్థానంలో నిలిచి ప్రతిభ చాటాడు.