India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహిళలు, విద్యార్థినులకు ఉద్యోగస్థలాల్లో, కళాశాలల్లో ఎలాంటి సమస్యలున్నా, వేధింపులకు గురైనా జిల్లా షీ టీం బృందాలను సంప్రదించాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. షీ టీం బృందాలను సంప్రదించడానికి 24 గంటలు పని చేసేలా ఒక మొబైల్ నెంబర్ 8712659953ను ఏర్పాటుచేశామన్నారు. జిల్లాలో గత నెలల్లో 34 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఫిర్యాదులు అందిన వాటిలో 3 కేసులు, మావల పీఎస్లో ఒక FIR నమోదు చేసినట్లు చెప్పారు.
అస్వస్థతకు గురై ఉపాధి కూలీ మృతిచెందాడు. గ్రామస్థుల వివరాలు.. ఉట్నూర్ (M) అందోలికి చెందిన పారేకర్(34) 3 వారాలుగా ఉపాధి పనులకు వెళ్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం వరకు పని చేసి ఇంటికి చేరుకుని పడుకున్నాడు. కొద్దిసేపటికి అతడికి వాంతులు, విరోచనాలు, ఛాతిలో నొప్పి రావడంతో ఇంద్రవెల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ADBకి తరలించే క్రమంలో మృతిచెందాడు. ఎండ తీవ్రతతో మరణించినట్లు అనుమానిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ రాజర్షిషా వైవిధ్య ఆలోచన రూపమైన ఆరోగ్య పాఠశాల ప్రత్యేక కార్యక్రమానికి ప్రతిష్ఠాత్మకమైన జాతీయ స్థాయి స్కోచ్ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఆరోగ్య పాఠశాల కార్యక్రమానికి అవార్డు వచ్చేలా పనిచేసిన బృందాన్ని కలెక్టర్ మంగళవారం సన్మానించారు. ఇదే ఉత్సాహంతో కార్యక్రమాన్ని వచ్చే విద్యా సంవత్సరంలోనూ పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ వారిని కోరారు.
డయల్ 100 సిబ్బంది వీలైనంత త్వరగా ఘటన స్థలాలకు చేరుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ అన్నారు. తమ పరిధిలో పెట్రోలింగ్, గస్తీ నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలన్నారు. బ్లూ కోర్ట్&డయల్ 100 సిబ్బంది, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. అదేవిధంగా పాత నేరస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు. డయల్ 100కి ఫోన్ చేసే వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచాలన్నారు.
గుడిహత్నూర్ మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సీతాగొంది జాతీయ రహదారిపై వాటర్ ట్యాంక్తో డివైడర్ల మధ్యలోని మొక్కలకు NHAI సిబ్బంది నీరు పడుతున్నారు. గుడిహత్నూర్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ ట్యాంకర్ను ఢీకొంది. లారీ డ్రైవర్ మహమ్మద్ జలీంకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని రిమ్స్కు తరలించారు.
పండగల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో చికెన్ విక్రయాలు భారీగా పెరిగాయి. దీంతోపాటు చికెన్ ధరలు సైతం పెరిగాయి. ఆదిలాబాద్ పట్టణంలో కిలో రూ:200, స్కిన్ లెస్ రూ:220 ధర పలుకుతుంది. కొన్నిచోట్ల డిమాండ్ ను బట్టి అమ్ముతున్నారు. గత నెలలో కిలో రూ.160 నుంచి 180 వరకు విక్రయాలు జరిపారు. గత రెండు నెలలుగా గిరాకి లేక ఇబ్బందులు పడ్డ వ్యాపారులకు.. తిరిగి చికెన్ విక్రయాలు ఊపందుకోవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్ కేంద్రీయ విద్యాలయ ఖాళీ సీట్లలో ప్రవేశాలకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆఫ్లైన్లో ఆహ్వానిస్తున్నట్లు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అశోక్ తెలిపారు. రెండో తరగతి నుంచి 8వ తరగతుల్లో ఖాళీ సీట్లు ఉన్నాయన్నారు. తాత్కాలిక ఖాళీల జాబితా, అర్హత ప్రమాణాలు, రిజిస్ట్రేషన్ షెడ్యూల్ మొదలైన వాటికోసం వెబ్ సైట్ https://adilabad.kvs.ac.in/ను సందర్శించాలని లేదా విద్యాలయాన్ని సందర్శించాలని కోరారు.
ఆదిలాబాద్ కేంద్రీయ విద్యాలయ ఖాళీ సీట్లలో ప్రవేశానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆఫ్లైన్లో ఆహ్వానిస్తున్నట్లు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అశోక్ తెలిపారు. రెండో తరగతి నుంచి 8వ తరగతుల్లో ఖాళీ సీట్లు ఉన్నాయన్నారు. తాత్కాలిక ఖాళీల జాబితా, అర్హత ప్రమాణాలు, రిజిస్ట్రేషన్ షెడ్యూల్ మొదలైన వాటికోసం వెబ్ సైట్ https://adilabad.kvs.ac.in/ సందర్శించాలని లేదా విద్యాలయాన్ని సందర్శించాలని కోరారు.
రాజీవ్ యువ వికాస్ స్వయం ఉపాధి పథకాలకు ప్రభుత్వ ఏప్రిల్ 5 వరకు అవకాశం కేంద్రం కాగా యువత కొరిక మేరకు దరఖాస్తు గడువును ఏప్రిల్ 14 వరకు పొడిగించినట్లు ADB కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. దరఖాస్తులను ప్రజాపాలన సేవా కేంద్రం, మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో అందచేయాలన్నారు. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకునేవారు అదనపు చార్జీలు చెల్లించనవసరం లేదని కోరారు చేశారు.
ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్ష 13వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు పలు యువజన నాయకులు, వివిధ సంఘాల నేతలు మద్దతు తెలిపారు. సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి సీసీఐ పునరుద్ధరణకు కృషి చేయాలని కోరారు.
Sorry, no posts matched your criteria.