India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పిడుగుపాటుకు కొమురం భీం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. కెరమెరి మండలానికి చెందిన చౌదరి రమేశ్ (30) చింతకర్ర వెళ్లే మార్గంలో పత్తి పంటకు యూరియ వేస్తుండగా పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆసిఫాబాద్ మండలం చోర్ పల్లి పంచాయతీ పరిధి నందూపకు అంజన్న (20) సంకెపల్లి శివారులోని తన పొలం నుంచి వస్తున్న క్రమంలో పిడుగు పడటంతో కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
భైంసా పట్టణంలో మారణాయుధాలతో పట్టుబడిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన ఘటనపై శుక్రవారం ఏఎస్పీ అవినాష్ కుమార్ విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అయితే సమావేశం ముగిసిన గంటకే నిందితుడు పరారవడంతో సంచలనం రేపుతోంది. నీరు తాగుతానని అనడంతో సిబ్బంది నీరు తీసుక వచ్చేలోపే నిందితుడు పరారీ అయ్యారని స్థానిక పోలీసులు వాపోతున్నారు. వెంటనే విషయం తెలుసుకున్న సీఐ, ఏఎస్పీ విస్తృతంగా గాలిస్తున్నారు.
ఉమ్మడి జిల్లా ప్రజల ఆరోగ్య వర ప్రదాయిని అయిన జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో సరిగ్గా వైద్యం అందడం లేదు. ఇటీవల బదిలీల్లో భాగంగా 148 పోస్టులలో 89 మంది వైద్య సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా 11 మంది వైద్యులను బదిలీ చేయడంతో అత్యాధునిక వైద్యం అందని ద్రాక్షగా మారింది. 70 మంది నర్సులను సైతం బదిలీ చేయడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీకి చెందిన బాలిక (14) ను బావ వరుస అయ్యే వ్యక్తి లైంగికంగా వేధింపులకు గురి చేసిన ఘటన వెలుగు చూసింది. ఈనెల 13న కిరాణా దుకాణానికి వెళ్ళిన బాలికను బావ వరుస అయ్యే అదే కాలనీకి చెందిన యువకుడు చెయ్యి పట్టి లాగి వేధించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడిపై లైంగిక వేధింపులు, పోక్సో కేసు నమోదు చేసి శుక్రవారం రిమాండ్కు తరలించినట్లు SI విష్ణువర్ధన్ తెలిపారు.
ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం పెరగడంతో కడెం ప్రాజెక్టులోని రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 700 అడుగులు కాగా, రాత్రి 10 గంటలకు ప్రాజెక్టులో 698.52అడుగుల నీటిమట్టం ఉంది. వరద నీటి ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టులోని రెండు గేట్లను ఎత్తి 8786 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఆయకట్టుకు సాగునీటి విడుదల కొనసాగుతోందని వారన్నారు.
పిడుగుపాటుకు యువరైతు మృతి చెందిన ఘటన కెరమెరి మండలంలో చోటుచేసుకుంది. చౌదరి రమేశ్ అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తున్న క్రమంలో ఉరుములు, మెరుపులతో కూడి భారీ వర్షం కురిసింది. దీంతో అతను ఓ చెట్టు కింద తలదాచుకున్నాడు. అదే సమయంలో పిడుగు పడటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
అదిలాబాద్ జిల్లా కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయురాలు మృతి చెందిన విషాద ఘటన గురువారం చోటు చేసుకుంది. జిల్లాలోని బేలా మండలం కేంద్రంలోని కేజీబీవీ ఆశ్రమ పాఠశాలలో వృక్షశాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయురాలు మల్లేశ్వరి బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందింది. ఉపాధ్యాయురాలు మృతి పట్ల పాఠశాల తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలోని దత్తాత్రేయ మందిరంలో ఉన్న హుండీని బుధవారం అర్ధరాత్రి ఓ దొంగ కొల్లగొట్టాడని స్థానికులు తెలిపారు. రా.10గంటలకు ప్రవేశించిన దుండగుడు ముందుగా అంతరాలయంలోని దత్తాత్రేయ టెంపుల్ హుండీలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యిందన్నారు. ప్రధాన హుండీని తెరవడానికి యత్నించి విఫలమయ్యాడని, గురువారం ఆలయానికి వచ్చిన సిబ్బంది హుండీలను చూసి పోలీసులకు చెప్పారన్నారు.
చింతలమనేపల్లి మండలంలోని ఖర్జెల్లీ గ్రామంలో గురువారం కురిసిన గాలివానకు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ చేసుకుంటున్న నాయిని తులసి ఇల్లు కూలిపోయింది. భారీగా గాలి రావడంతో ఇంటి పైకప్పుతో సహా కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు, నాయకులు స్పందించి తమను ఆదుకోవాలని ఆమె వేడుకుంది.
కెరమెరి మండలంలోని లక్మాపూర్, కరంజివాడ శివారుల్లో చిరుత పులి సంచారం కలకలం రేపింది. గురువారం లక్మాపూర్కి చెందిన రాజు చేనులో మంచెకింద ఓ జంతువు కూర్చున్నట్లు, అక్కడ ఉన్న వివిధ వస్తువులను చిందర వందరగా చేసిన ఆనవాళ్లతో పాటు పాదముద్రలు కనిపించాయి. ఆటవీ అధికారులు పాదముద్రలు పరిశీలించారు. అవి దాదాపు చిరుతవి అయి ఉండవచ్చని భావిస్తున్నారు. చిరుతతో పాటు ఓ చిన్న పిల్ల కూడా ఉంటుందని ఎఫ్ఆర్వో తెలిపారు.
Sorry, no posts matched your criteria.