Adilabad

News July 12, 2024

ADB: అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం

image

అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ ద్వార చేపడుతున్న నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాలకు రహదారులు కోతకు గురైన వాటి వివరాలు, నిర్మాణ పనుల తీరును ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

News July 12, 2024

ఆసిఫాబాద్: ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక టీమ్‌లు: ఎస్పీ

image

జిల్లాలో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ఆసిఫాబాద్, కాగజ్ నగర్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కొరకు జిల్లాలో 10మంది పోలీస్ సిబ్బంది చొప్పున 2టీంలను ఏర్పాటు చేసినట్లు జిల్లా SP,DV.శ్రీనివాస్ రావు తెలిపారు. SP మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ ప్రత్యేక టీంల ద్వారా ప్రతిరోజు వాహనాల తనిఖీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News July 12, 2024

తానూర్: రోడ్డు ప్రమాదంలో విలేకరి మృతి

image

రోడ్డు ప్రమాదంలో విలేకరి మృతి చెందిన ఘటనా శుక్రవారం తానూర్ మండలంలో చోటుచేసుకుంది. స్టానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని ఎల్వి గ్రామానికి చెందిన ఓ ప్రముఖ పత్రిక విలేకరి గంగ రెడ్డి తన బైక్‌పై హంగీర్గ గ్రామం నుంచి తన స్వగ్రామానికి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

News July 12, 2024

ఆదిలాబాద్: మహాలక్ష్మి ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన మహాలక్ష్మి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ రాజార్షి షా శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్ శాలువాతో సత్కరించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. సిజినల్ వ్యాధుల ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలను విద్యార్థులకు వివరించారు. ఆయన వెంట అధికారులు తదితరులు ఉన్నారు.

News July 12, 2024

ఆదిలాబాద్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్ మెంట్‌పై అవగాహన

image

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు అనిల్ గోస్వామి, జాట్ వీరి ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని కళాశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్ మెంట్ కొరకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఈ నెల 28 వరకు ఉందని తెలిపారు. ఆ తదుపరి అక్టోబర్ 18, 2024న రిటన్ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 12, 2024

ADB: వరుస హత్యలు.. రోడ్డున బాధిత కుటుంబాలు..!

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన హత్యలను పరిశీలిస్తే ఆస్తి తగదాలు, వివాహేతర సంబంధాలతో పాటు ప్రేమ వ్యవహారాలూ కారణమవుతున్నాయి. ఒకచోట వివాహేతర సంబంధం కారణంగా భార్యను భర్త అంతమొందించగా మరోచోట భర్తను భార్య హత్య చేయించింది. మరోచోట స్థిరాస్తి వివాదంలో రియల్ ఎస్టేట్ వ్యాపారికి నమ్మినబంటే నమ్మించి అతికిరాతంగా నరికి చంపేశాడు. దీంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది.

News July 12, 2024

అలర్ట్: ఆదిలాబాద్: మారిన PG పరీక్ష తేదీలు

image

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో PG వార్షిక పరీక్షల తేదీలు మారాయని ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు జరగాల్సిన PG రెండో సంవత్సర పరీక్షలు AUG 20 నుంచి 25 వరకు జరుగుతాయన్నారు. ఆగస్టు 9 నుంచి 13 వరకు జరగాల్సిన PG మొదటి సంవత్సరం పరీక్షలు SEP 20 నుంచి 25 వరకు జరుగుతాయని వెల్లడించారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయం గమనించాలని సూచించారు. SHARE IT

News July 12, 2024

మంచిర్యాల: జువెలర్స్ యజమానుల పరారీ..!

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ జువెలర్స్ షాప్ యజమానులు పట్టణ ప్రజలకు రూ.కోట్లలో టోకరా వేసి పరారయ్యారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలో సంచలనం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణంలోని జువెలర్స్ యజమాని, అతని కుమారుడు కొంతకాలంగా నమ్మకంగా ఉంటూ పలువురు నుంచి బంగారు ఆభరణాలతో పాటు నగదు రూపంలో పెద్ద ఎత్తున అప్పులు చేసి పరారయ్యారని తెలిపారు. గురువారం మొత్తం కుటుంబ సభ్యులు ఇంటిని వదిలి వెళ్ళిపోయారన్నారు.

News July 12, 2024

బడ్జెట్ సమావేశాలపై చర్చించిన బీజేపీ ఎమ్మెల్యేలు

image

రాబోయే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ ఎమ్మెల్యేలు హైదరాబాదులోని బీజేఎల్పీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ..ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఆదిలాబాద్ పాయల్ శంకర్, తదితర ఎమ్మెల్యేలు ఉన్నారు.

News July 12, 2024

ఆదిలాబాద్: ఆప్షన్ల ప్రక్రియకు నేడే ఆఖరు

image

ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంబంధించిన ఆప్షన్ల ప్రక్రియ గడువు నేటితో ముగియనుంది. జిల్లాస్థాయి అధికారి నుంచి అటెండర్ వరకు నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారి సీనియారిటీ జాబితాలను ఆయా శాఖల అధికారులు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు ప్రభుత్వం అందించిన జాబితాల ఆధారంగా సదరు అధికారులు, ఉద్యోగుల నుంచి ఆప్షన్లను స్వీకరించారు. ఇందుకోసం ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు గడువు ఇచ్చారు.