Adilabad

News March 18, 2025

ఆదిలాబాద్: యువకుడికి ST కేటగిరిలో 1st ర్యాంకు

image

ఆదిలాబాద్ రూరల్ లోహర గ్రామానికి చెందిన మర్సకోల జ్యోతిరాం నిన్న విడుదలైన HWO ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటారు. పట్టుదలతో కష్టపడి చదివి రాష్ట్రస్థాయిలో 34వ ర్యాంకు, బాసర జోన్ ST కేటగిరిలో మొదటి ర్యాంక్ సాధించి, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌కి ఎంపికయ్యారు. ఉద్యోగం సాధించడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

News March 18, 2025

ఆదిలాబాద్: ఆరుగురు అరెస్ట్

image

మట్కా నిర్వహిస్తున్న మహిళా గ్యాంగ్‌ను అరెస్ట్ చేసినట్లు ADB టూ టౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. మట్కా నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీలో దాడులు నిర్వహించగా మట్కా నిర్వహిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. కాగా, ఇందులో నలుగురు ఆడవాళ్లు, ఇద్దరు మగవారు ఉన్నారు. మట్కా చిట్టీలతో పాటు 2 సెల్ ఫోన్లు, రూ.2,260 నగదు స్వాధీనం చేసుకొని.. వారిపై కేసు నమోదు చేశారు.

News March 18, 2025

12 నుంచి 4 వరకు బయటకు రావొద్దు : ADB కలెక్టర్

image

ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని రోజురోజుకి భానుడి ప్రతాపం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దన్నారు. అత్యవసరమైతే తప్పా బయటకు రావాలని సూచించారు. బయటకు వెళితే వెళ్లినప్పుడు తలపై టోపీ పెట్టుకోవాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ 4 నెలలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

News March 18, 2025

ADB: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త

image

ఈనెల 18 నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్‌కు ప్రతిరోజు ఆదిలాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి రెండు సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ కల్పన తెలిపారు. ఈ బస్సులు ప్రతిరోజు మధ్యాహ్నం 3, రాత్రి 9:30 గంటలకు బయలుదేరుతాయన్నారు. తిరుగుప్రయాణంలో ఎయిర్ పోర్ట్ నుంచి ఉదయం 5 గంటలకు, 11:30 గంటలకు బస్ ఉంటుందన్నారు. ఈ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 18, 2025

ADB: పోలీసులను బెదిరించిన మహిళపై కేసు: CI

image

మట్కా జూదం నిర్వహిస్తున్న మహిళాగ్యాంగ్‌ను ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు స్థానిక ఇంద్రానగర్‌లో అరెస్టు చేశారు. అరెస్టు చేసే క్రమంలో ఫర్జానా సుల్తానా అనే మహిళ పోలీస్ స్టేషన్‌కు రానని.. తనను స్టేషన్కు తీసుకెళ్తే గొంతు కోసుకుంటానంటూ పోలీసులను బెదిరించింది. బ్లేడుతో గొంతు కోసుకోవడానికి ప్రయత్నించి భయపెట్టించింది. దీంతో ఆమెపై మట్కా కేస్‌తోపాటు బెదిరించినందుకు మరో కేసును నమోదు చేసినట్లు CI కరుణాకర్ తెలిపారు.

News March 18, 2025

ఆదిలాబాద్ బిడ్డకు స్టేట్ 5th ర్యాంక్

image

బజార్హత్నూర్ మండలం కొల్హారి గ్రామానికి చెందిన సిరాజ్ ఖాన్ సోమవారం విడుదలైన హెచ్ డబ్ల్యూ ఓ(HWO) ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటారు. తెలంగాణ రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు సాధించారు. దీంతో కష్టపడి ఉద్యోగం సాధించడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సిరాజ్ ఖాన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు.

News March 18, 2025

ADB: పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం

image

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో ఓ వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. సీతాగొంది గ్రామానికి చెందిన శ్రీనివాస్ (35) అనే వ్యక్తి సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. సమాచారం అందుకున్న 108 వాహన ఈఎంటి విశాల్, పైలెట్ ముజాఫర్ బాధితున్ని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

News March 18, 2025

ADB: ఆరుగురు మహిళలు అరెస్ట్: CI

image

మట్కా జూదం నిర్వహిస్తున్న మహిళా గ్యాంగ్‌ను అరెస్టు చేసినట్లు ADB టూ టౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. మట్కా నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీలో దాడులు నిర్వహించగా మట్కా నిర్వహిస్తున్న ఆరుగురిని అరెస్టు చేశారు. కాగా ఇందులో నలుగురు ఆడవాళ్లు, ఇద్దరు మగవారు ఉన్నారు. మట్కా చిట్టీలతోపాటు 2 సెల్ ఫోన్లు, రూ.2,260 నగదు స్వాధీనం చేసుకొని.. వారిపై కేసు నమోదు చేశారు.

News March 18, 2025

ADB: సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై కలెక్టర్ సమీక్ష

image

సమ్మర్ యాక్షన్ ప్లాన్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయుటకు సంబంధిత ఆయా శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ రాజర్షిషా ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. వేసవి వడగాల్పులు నష్టాల నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవి కాలంలో వడగాల్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

News March 17, 2025

ADB: ఆ రైతు గ్రేట్.. తొలికాత విద్యార్థులకే

image

సహజంగా ఏ రైతైనా పంట కాతను దేవుడికి సమర్పిస్తుంటారు.. కానీ ఆ రైతు మాత్రం తాను పండించిన పంటను ముందుగా విద్యార్థులకే అందిస్తుంటారు. బాలల్లోనే తాను దైవాన్ని చూస్తానని చెబుతున్నారు. తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన రైతు అండే ఆనంద్ తాను సాగుచేస్తున్న పుచ్చకాయ(వాటర్‌మిలన్) తొలి కాతను ఏటా విద్యార్థులకు పంచి పెడుతున్నారు. రైతును పలువురు అభినందిస్తున్నారు. మీ ప్రాంతంలోనూ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి.