India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిర్మల్ జిల్లా కలెక్టర్ పేరుతో ఉన్న నకిలీ ఫేస్బుక్ ఖాతాలను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేరుతో కొందరు నకిలీ ఫేస్బుక్ ఖాతాలను సృష్టించారని ఆమె పేర్కొన్నారు. ఆయా ఫేస్బుక్ ఖాతాలకు ఎట్టి పరిస్థితుల్లో స్పందించవద్దన్నారు. జిల్లా కలెక్టర్ పేరుతో, ఫొటోలతో ఉన్న ఫేస్ బుక్ ఖాతాలు నకిలీవని, ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించామన్నారు.
బాబా మాటలు నమ్మి ఒక వ్యక్తి మోసపోయిన ఘటన ADBలో జరిగింది. CI కరుణాకర్ కథనం ప్రకారం.. ఖుర్షీద్ నగర్కు చెందిన అజహర్ ఉద్దీన్కు మహారాష్ట్రకు చెందిన యాసీన్(జనబ్ డోంగీబాబా) పరిచయమయ్యాడు. ఆయన అజహర్కు మాయమాటలు చెప్పి తన వద్ద తాయత్తు తీసుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మించాడు. అయితే తాయత్తు తీసుకున్న అనంతరం ఇంట్లో గొడవలు ప్రారంభం కావడంతో తనను బాబా మోసం చేశాడంటూ టూటౌన్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
ఈనెల 27న నిర్వహించే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది వారికి కేటాయించిన పోలీంగ్ స్టేషన్ లను పరిశీలించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 220 మంది, జోనల్ ఆఫీసర్లు 9 మందిని కేటాయించడం జరిగిందని తెలిపారు. పోలింగ్ విధులు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఉదయం 8 నుంచి 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు.
ఇటీవలే ఓమన్ దేశంలో గుండెపోటుతో మృతి చెందిన జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన దుర్గం మల్లేశ్ మృతదేహం శనివారం సాయంత్రం స్వగ్రామానికి చేరుకుంది. దీంతో కవ్వాల్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతని మృతదేహంపై పడి భార్య రోదిస్తుంటే గ్రామంలోని వారందరూ కన్నీరు పెట్టుకున్నారు. ఆ గల్ఫ్ కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అసోసియేషన్ సభ్యులు కోరారు.
HYD పోచారం IT కారిడార్ PS పరిధిలో నిర్మల్ జిల్లాకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బామ్ని గ్రామానికి చెందిన అంకిత(21) ఎస్సీ కార్పొరేషన్లో ఉచిత కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటోంది. శుక్రవారం హాస్టల్లోని గదిలో ఉరేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా MLC హీట్ ఎక్కింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, BJP అభ్యర్థులు నరేందర్ రెడ్డి, అంజిరెడ్డిలతో పాటు మాజీ ప్రొఫెసర్, BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, AIFB అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్, శేఖర్ రావు, ముస్తక్ అలీ, తదితరనేతల మధ్యపోటీ నెలకొందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా సోనాల మండల కేంద్ర శివారు ప్రాంతంలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర శనివారం ఉదయం విష్ణు అనే యువకుడి పై అడవి పంది దాడి చేసి గాయపరిచింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పెట్రోల్ బంక్ నుంచి సొనాల వైపు వెళుతుండగా బ్రిడ్జి దగ్గర ఉన్న అడవి పంది ఒక్కసారి పైకి వచ్చి దాడి చేసింది. దానిని ప్రతిఘటిస్తూ కేకలు వేయడంతో పారిపోయిందన్నారు. తృటిలో ప్రాణాపాయం తప్పిందన్నారు.
అడవిలో లేదా రోడ్డు పక్కన, రెవెన్యూ, పట్టా, గైరాన్ భూముల్లో ఎవరైనా చెట్లను నరికివేస్తే, ఆ సమాచారం ఇచ్చిన వారికి తగిన పురస్కారాలు అందజేస్తామని డీఎఫ్ఓ ప్రశాంత్ పాటిల్ ప్రకటించారు. మానవ జీవనానికి ఎంతగానో ప్రయోజనకరంగా ఉండే చెట్లను కొందరు ఆర్థిక లబ్ది కోసం నరికేయడం విచారకరమన్నారు. చెట్ల నరికివేత, అడవుల్లో అగ్నిప్రమాదాలు, క్వారీల తవ్వకం లాంటి సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
ఈనెల 11న ఆదిలాబాద్లోని నటరాజ్ థియేటర్ వద్ద పాన్ షాప్లో చోరీ కేసులో ఇద్దరు నిందితులను వన్ టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. CI సునీల్ తెలిపిన వివరాలు.. SI పద్మ NTR చౌక్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న మహాలక్ష్మీవాడకు చెందిన రతన్, వడ్డెర కాలనీకి చెందిన మల్లన్నను అదుపులోకి తీసుకుని విచారించారు. పాన్ షాప్లో చోరీ చేసినట్లు అంగీకరించడంతో అరెస్ట్ చేశారు.
ADB జిల్లా గుడిహత్నూర్ మండలం ఘర్కంపేట్ గ్రామానికి చెందిన మాధవ్ (53) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ తట్టుకోలేక బుధవారం మధ్యాహ్నం పురుగుమందు తాగి ఇంటికి వచ్చాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్లో రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.