Adilabad

News July 9, 2024

నేరడిగొండ: ప్రమాదవశాత్తు లారీ డ్రైవర్ మృతి

image

లారీకి మరమ్మతులు చేస్తుండగా ఓ డ్రైవర్ ప్రమాదవశాత్తు మరణించిన ఘటన నేరేడిగొండ మండలం ఆరేపల్లిలో చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి రబ్బర్ లోడుతో తమిళనాడు-ఢిల్లీకి వెళ్తుండగా అకస్మాత్తుగా లారీ నిలిచిపోయింది. డ్రైవర్ లారీని నిలిపి హ్యాండ్ బ్రేక్ వేయకుండా టైర్ల వద్ద మరమ్మతులు చేస్తుండడంతో లారీ వెనక్కి వచ్చి డ్రైవర్‌పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడని పేర్కొన్నారు.

News July 9, 2024

వాంకిడి: గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

image

వాంకిడి మండల కేంద్రానికి చెందిన గిరిజన సంక్షేమశాఖ ఉపాధ్యాయుడు మడావి రాజేశ్వర్(58) గుండెపోటుతో మృతి చెందారు. తెల్లవారు జామున అస్వస్థతకు గురికావడంతో మహారాష్ట్రలోని చంద్రపూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజేశ్వర్ తిర్యాణి మండలం గుండాల గిరిజన పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

News July 9, 2024

ఆదిలాబాద్: ముగిసిన EAPCET కౌన్సెలింగ్.. 715 మంది హాజరు

image

ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశించేందుకు ఎప్‌సెట్‌ తొలివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో 3 రోజులపాటు జరుగగా సోమవారంతో ముగిసింది. నేడు 201 మంది హాజరు కాగా మొత్తం 715 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ వెరీఫికేషన్ పూర్తయినట్లు కోఆర్డినేటర్ వీరస్వామి తెలిపారు. జులై 15 వరకు వెబ్ అప్షన్లు పెట్టుకోవాలని, 19న సీట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు.

News July 8, 2024

ఆసిఫాబాద్: అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన దంపతులు

image

ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన దంపతులు ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2024లో సత్తా చాటారు. జూన్ 5 నుంచి 7 వరకు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగిన 5KM వాకింగ్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో శకుంతల(48) రెండో స్థానం, ఆమె భర్త ఆనంద్ రావు(56) ఐదో స్థానం సాధించారు. దీంతో వారిని జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ అడ్మిన్ ప్రభాకర్ రావు సన్మానించి అభినందించారు.

News July 8, 2024

తలమడుగు: సెల్‌ఫోన్ కొనివ్వలేదని యువకుడి సూసైడ్

image

సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఓ యువకుడు (18) ఆత్మహత్య చేసుకున్న ఘటన తలమడుగులో చోటుచేసుకుంది. ఉమ్రి గ్రామానికి చెందిన మేస్రం కృష్ణ తల్లిదండ్రులను ఇటీవల సెల్ ఫోన్ కొనివ్వమని అడిగాడు. ఆర్థిక పరిస్థితి కారణంగా కొనివ్వలేమని చెప్పడంతో ఈనెల 3న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సోమవారం గ్రామ శివారులోని గుట్టపైన చెట్టుకు ఉరేసుకొని కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

News July 8, 2024

దండేపల్లి: చికిత్స పొందుతూ యువకుడు మృతి

image

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన బోడకుంట హరికృష్ణ(24) శనివారం రోజున లక్షట్టిపేట గ్రామ శివారులో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News July 8, 2024

ఇచ్చోడ: పాము కాటుతో వ్యక్తి మృతి

image

ఒక రైతు తన పంట పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా పాము కాటుతో మృతి చెందాడు. ఈ సంఘటన ఇచ్చోడ మండలం దాబా (కే) గ్రామంలో చోటు చేసుకుంది. దాబా (కే) గ్రామానికి చెందిన జాదవ్ లక్ష్మణ్ (28) అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం తన పొలంలో పని చేస్తుండగా పాము కాటు వేయడంతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

News July 8, 2024

మందమర్రి: బావిలో మృతదేహం కలకలం

image

మందమర్రి పట్టణంలోని దీపక్ నగర్ రైల్వే ట్రాక్ సమీపంలోని కోల్ యార్డు వద్ద బావిలో ఆదివారం యువకుని మృతదేహం గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజశేఖర్ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించారు. ఎస్సై మాట్లాడుతూ.. మృతుడు దీపక్ నగర్‌కు చెందిన సూరమల్ల ప్రణయ్(30)గా గుర్తించామని తెలిపారు. కొంత కాలంగా తాగుడుకు బానిసైన అతను బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.

News July 8, 2024

ADB: ఆదివాసీ గ్రామాల్లో సంబురాలు

image

ఆదివాసీలు ప్రతి ఏటా ఆషాఢమాసంలో నిర్వహించే అకాడి వేడుకలను నిన్న భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్, తిర్యాణి పలు మండలాల్లోని ఆదివాసీలు అడవీకి వెళ్లి వన దైవానికి మహాపూజ చేశారు. మక్క ఘట్కతో తయారు చేసిన లడ్డూలను నైవేద్యంగా సమర్పించారు. ఊర్లోని ఆవులన్నింటినీ అడవీలో ఊరేగించారు. గ్రామస్థులంతా ఒకచోట చేరి సామూహిక వనభోజనాలు చేశారు. ఈ వేడుకలు నేటితో ముగియనున్నాయి.

News July 8, 2024

ADB ఉపాధ్యాయుడిని అభినందించిన మాజీ ఉపరాష్ట్రపతి 

image

గోండి భాషలో మహాభారత కథ రాసిన ADB జిల్లా వాఘాపూర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తొడసం కైలాస్‌ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు. కైలాస్ చేసిన ప్రయత్నం గురించి తెలిసి ఆనందించాను. మహాభారతాన్ని గోండి భాషలోకి అనువదించి ‘పండోక్న మహాభారత కథ’ పేరిట పుస్తకంగా తీసుకొచ్చిన ప్రయత్నం అభినందనీయమైనది. ఇంతటితో ఆగిపోకుండా భవిష్యత్ తరాలు, పెద్దల స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని X వేదికగా రాసుకొచ్చారు.