Hyderabad

News June 15, 2024

HYD: నేడు డ్రైవర్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు 

image

ఈఎంఆర్ఐ సంస్థలో పైలెట్ (డ్రైవర్) ఉద్యోగాల కోసం ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రొగ్రామ్ మేనేజర్ షేక్ జనాహీద్ తెలిపారు. ఈనెల 15వ తేదీన HYD కోఠి రీజినల్ కార్యాలయంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 10 నుంచి మ.3 గంటల వరకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. 10వ తరగతి అర్హతతో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక జిరాక్స్ సెట్ వెంట తీసుకొని రావాలన్నారు. SHARE IT

News June 14, 2024

HYD: యూసుఫ్‌గూడ యాక్సిడెంట్‌లో చనిపోయింది ఈమెనే..!

image

HYD మధురానగర్ PS పరిధి యూసుఫ్‌గూడలో ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి ఇంటర్ <<13439494>>విద్యార్థిని మెహరీన్‌<<>> చనిపోయిన విషయం తెలిసిందే. అప్పటి వరకు తమతో ఉన్న ఫ్రెండ్ చనిపోయిన విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు. విగత జీవిగా ఉన్న మెహరీన్‌ను చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది. ప్రయాణికులూ.. బస్సు దిగేటప్పుడు జర జాగ్రత్త!

News June 14, 2024

HYD: నీట్ ఫలితాల అవకతవకాలపై విచారణ జరిపించాలి: SFI

image

నీట్ ఫలితాల అవకతవకాలపై విచారణ జరిపించాలని కోరుతూ SFI రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సుందరయ్య పార్కు నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా SFI రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మూర్తి, నాగరాజు మాట్లడుతూ.. నీట్ ఫలితాల అవకతవకాలపై కేంద్రం స్పందించకుండా, గ్రేస్ మార్కులు పొందిన వారి స్కోర్ కార్డులు రద్దు చేసి, వారికి మళ్లీ ఎగ్జామ్ నిర్వహించడం అంటే నీట్ అవకతవకలు పక్కదారి పట్టించడమే అని అన్నారు.

News June 14, 2024

HYD: ట్రైనీ ఐఏఎస్‌లకు సజ్జనార్ అవగాహన

image

తెలంగాణ కేడర్‌కి చెందిన 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్‌లు శుక్రవారం HYDలోని బస్‌భవన్‌ను సందర్శించారు. టీజీఎస్‌ఆర్టీసీ అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను వారు అధ్యయనం చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి సజ్జనార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఆర్టీసీ పనితీరు, ఉద్యోగుల సంక్షేమం, మహాలక్ష్మీ పథకం అమలుపై వివరాలు తెలిపారు.

News June 14, 2024

HYD: సీఐకి 14 రోజుల రిమాండ్..!

image

HYD CCSలో పని చేస్తున్న ఇన్‌స్పెక్టర్ <<13435343>>సీహెచ్.సుధాకర్‌<<>> గురువారం రూ.3లక్షలు లంచం తీసుకుంటుండగా ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. రూ.15 లక్షలకు డీల్ కుదుర్చుకుని అందులో మొదట విడతగా రూ.5 లక్షలు తీసుకున్నాడు. మరో రూ.3లక్షలు తీసుకుని పారిపోతుండగా ఛేజ్ చేసి అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం సుధాకర్‌ని విచారణ చేసి, నాంపల్లి ACB కోర్టులో హాజరుపర్చగా 14రోజుల రిమాండ్‌ విధించింది.

News June 14, 2024

BREAKING: HYD: అదృశ్యమైన బాలిక.. శవమై..!

image

అదృశ్యమైన ఓ బాలిక ఘటన విషాదాంతంగా ముగిసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD మియాపూర్ నడిగడ్డ తండాలో గత శుక్రవారం బానోతు వసంత(12) అనే బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా అదృశ్యమైన ప్రాంతానికి 100 మీటర్ల దూరంలో ఈరోజు బాలిక మృతదేహం లభ్యమైంది. హత్య చేశారా? లేదా వేరే కారణం ఉందా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

News June 14, 2024

HYD: లెటర్స్ ఇచ్చిన సీఎం.. పోస్టింగ్ ఇవ్వలేదు: అభ్యర్థులు 

image

HYD ప్రజాభవన్ ఇన్‌ఛార్జ్ సంగీతతో పాటు చిన్నారెడ్డికి ఈరోజు గురుకుల అపాయింట్‌మెంట్ లెటర్స్ పొందిన అభ్యర్థులు వినతి పత్రాన్ని అందించారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తాము అపాయింట్‌మెంట్ లెటర్స్ తీసుకున్నామని, ఇప్పటివరకు తమకు పోస్టింగ్ ఇవ్వలేదని వాపోయారు.అనంతరం నాంపల్లిలోని ట్రెబ్ ఛైర్మన్‌‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. న్యాయం చేయాలని కోరారు. 

News June 14, 2024

జీహెచ్ఎంసీ పరిధిని పెంచితే రంగారెడ్డి జిల్లా ఉనికికి ప్రమాదం: BJP

image

జీహెచ్ఎంసీ పరిధిని పెంచితే రంగారెడ్డి జిల్లా ఉనికి దెబ్బతినే ప్రమాదం ఉందని BJP రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం HYD హైదర్‌గూడలోని NSSలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 7 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని అన్నారు.

News June 14, 2024

GHMC పరిధి విస్తరణకు అధికారుల కసరత్తు..!

image

HYD శివారులోని 7కార్పొరేషన్లు, 21మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేసి రాజధాని పరిధిని పెంచేందుకు MDCL, RRఅధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా CMరేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. జవహర్‌నగర్, ఘట్‌కేసర్, కొంపల్లి, మేడ్చల్, దుండిగల్, బడంగ్‌పేట్, శంషాబాద్, ఆదిభట్ల, పెద్దఅంబర్‌పేట్, బోడుప్పల్, నాగారం, దమ్మాయిగూడ, ఇబ్రహీంపట్నం, తుర్కయాంజల్ తదితర ప్రాంతాలు విలీనం కానున్నాయి.

News June 14, 2024

HYD: గ్రూప్-1 మెయిన్స్‌లో 1:100కి అవకాశం ఇవ్వాలని మంత్రికి వినతి

image

త్వరలో జరగబోయే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులను 1:50 గా కాకుండా 1:100గా ఎంపిక చేయాలని పలువురు నిరుద్యోగులు ఈరోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి హైదరాబాద్‌లో వినతిపత్రం అందజేశారు. 1:100కి అవకాశం ఇవ్వడం ద్వారా తెలంగాణ నిరుద్యోగ యువతకు ఎక్కువ అవకాశం కల్పించినట్లు అవుతందన్నారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందిస్తూ CM దృష్టి తీసుకెళుతానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.