India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్లో ఇటీవల GHMC అధికారులు లోతైన మ్యాన్హోళ్లపై ఎరుపు రంగు పూశారు. భారీ వర్షం, వరదలు వచ్చినప్పుడు మ్యాన్హోళ్లను తెరవద్దని హెచ్చరించారు. గతంలో నాలాలో పడి పలువురు మృతి చెందారు. ఇటువంటి ప్రమాదాల నివారణ కోసం అధికారులు ఈ చర్యలు చేపట్టారు. అక్రమంగా మ్యాన్హోల్స్ తెరిస్తే క్రిమినల్ కేసులు పెట్టే అధికారం జలమండలికి ఉంది. వరదల్లో వీటిని తెరవకండి. ఇతరులకు హాని కలిగించకండి.
SHARE IT
పదేళ్లు KCR గడీల పాలన సాగిందని, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాతే గడీల పాలనకు స్వస్తి పలికామని MLC బల్మూరి వెంకట్ అన్నారు. ఈరోజు HYDలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజా పాలన వచ్చిందన్నారు. పింక్ మీడియా అసత్యపు ప్రచారం చేస్తోందని, కొత్త యూట్యూబ్ ఛానల్స్ పెట్టి నెలకు రూ.3 లక్షలు ఇస్తున్నారన్నారు. TSకు బదులు TGగా మార్చినందుకు రూ.4 వేల కోట్లు ఖర్చు అవుతాయనేది అబద్ధమన్నారు.
HYD నానక్రామ్గూడలో ఉన్న అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంలో ఉద్యోగ భర్తీలకు నోటిఫికేషన్ విడుదలైంది. భర్తీలో భాగంగా స్ట్రాటజిక్ కంటెంట్ కోఆర్డినేషన్ అసిస్టెంట్- కమ్యూనిటీ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం కమ్యూనికేషన్స్, బిజినెస్ మార్కెటింగ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. SHARE IT
HYD ఖైరతాబాద్లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు నుంచి కొత్త రూల్స్ అమలు కానున్నాయి. గేట్ నంబర్-4 నార్త్ ఈస్ట్ గేటు ద్వారా లోపలికి సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ రానుంది. మంత్రులు, సీఎస్, డీజీపీతో సహా ఇదే గేటు నుంచి లోపలికి రానున్నారు. ఇక ఐఏఎస్, ఐపీఎస్, ఇతర వీఐపీలకు సౌత్ ఈస్ట్ గేట్-2 ద్వారా ఎంట్రీ ఉండనుంది. ఇంకా మరమ్మతులు పూర్తి కాని వెస్ట్ గేట్-3 అలాగా ఉండనుండగా ఈస్ట్ గేట్-2ను మూసివేయనున్నారు.
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను ఫోన్ కాల్స్ ద్వారా బెదిరిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. మహమ్మద్ వసీం అనే వ్యక్తి 10 సంవత్సరాలుగా దుబాయ్లో ఉండి రాజాసింగ్కు కాల్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. ఈరోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ అతడిని పట్టుకున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్న 9 విశ్వవిద్యాలయాలకు శాశ్వత ఉపకులపతుల నియామకం మరికొంత ఆలస్యం కానుంది. గత నెల 21వ తేదీతో 10 వర్సిటీల వీసీల పదవీకాలం ముగిసింది. దీంతో ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జ్ వీసీలుగా ప్రభుత్వం నియమించింది. 15వ తేదీలోపు కొత్త వీసీలను నియమించకుంటే ఇన్ఛార్జుల పదవీకాలం పొడిగిస్తూ మరోసారి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది.
HYD తార్నాకలోని ICMRకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) కింద ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసై పని అనుభవం ఉండాలి. పోస్టును అనుసరించి రూ.18,000 నుంచి రూ.1,12,400 జీతం ఉంటుంది. జూన్ 16లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు https://www.nin.res.in/employement.html వెబ్సైట్ చూడండి. SHARE IT
రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల విషయమై PRTU తెలంగాణ హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిషనర్ శ్రీదేవసేనని పలువురు కలిశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులకు నిలిచిపోయిన పదోన్నతులు, బదిలీలు జరిపి న్యాయం చేయాలని కోరారు. దేవసేన స్పందిస్తూ రేపు స్వయంగా తానే అడక్వేట్ జనరల్ని కలిసి సాధ్యాసాధ్యాలపై చర్చించి వారికి సాధ్యమైనంత మేరకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
HYD, రాచకొండ, సైబరాబద్ కమిషనరేట్ల పరిధిలో షీ టీమ్స్ నిఘా పెంచాయి. బస్టాప్లు, పార్కులు, కాలేజీలు, స్కూళ్లు ఇతర ప్రాంతాల్లో యువతుల వెంట పడుతూ వారిని వేధిస్తున్న పోకిరీలను పోలీసులు మఫ్టీలో ఉంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. ముందుగా వారు చేస్తున్న ఆకతాయి చేష్టలను పోలీసులు వీడియో తీసి ఆ తర్వాత పట్టుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. యువతులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు.
బక్రీద్ పర్వదినాన వెలువడే వ్యర్థాలను రోడ్లపై వేయకూడదని GHMC అధికారులు సూచించారు. ఈ మేరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మెయింటైనింగ్ కన్వీనర్ మహమ్మద్ అలీ పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛ నగరంగా మారుస్తూనే , పండగలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించుకోవాలని కోరారు. ఉప్పల్, నాంపల్లి, మలక్పేట్, నాచారం ప్రాంతాల్లో ప్రత్యేక NGOS స్వచ్ఛతకు కృషి చేస్తున్నాయన్నారు.
Sorry, no posts matched your criteria.