India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసింది. దీంతో జూన్ నుంచి గృహజ్యోతి పథకాన్ని HYD, ఉమ్మడి RR జిల్లా పరిధిలోని వినియోగదారులకు వర్తింపజేయనున్నారు. సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఈ పథకం ఇప్పటి వరకు అమలు కాలేదు. సరూర్నగర్, రాజేంద్రనగర్, సైబర్ సిటీ, వికారాబాద్ సెక్షన్ల పరిధిలో నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారు 11.50 లక్షల మంది వరకు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. SHARE IT
ఓయూలోని ఇంజినీరింగ్ కళాశాలలోని సెల్ట్ (సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్)లో నిర్వహించనున్న ‘ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తులను ఈనెల 11 వరకు స్వీకరిస్తున్నట్లు సెల్ట్ డైరెక్టర్ సవీన్ సౌడ తెలిపారు. 12 నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు సెల్ట్ కార్యాలయంలో పేరును నమోదు చేసుకోవాలన్నారు.
కొందరు పబ్ ఓనర్లు, యువతులు కలిసి HYDలో కొత్త రకం మోసానికి తెర లేపారు. వ్యాపార వేత్తలు, శ్రీమంత యువకులను డేటింగ్ యాప్లలో పరిచయం చేసుకుని డబ్బులు కొట్టేస్తున్నారు. తాజాగా రితికా అనే యువతి తనకు పరిచయమై ఇలాగే మోసం చేసిందని ఓ బాధితుడు వాపోయాడు. హైటెక్ సిటీ మెట్రోస్టేషన్ దగ్గర కలిసి పబ్కు వెళదామని ఫోన్ చేసి చెప్పిందన్నాడు. ఆమె ఏం తాగకపోయినా కాసేపటికి రూ.40,505 బిల్లు చేతిలో పెట్టి వెళ్లిపోయిందన్నాడు.
లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో MLAల ఫిరాయింపుల పర్వం మొదలుకానుందని తెలుస్తోంది. BRS MLAలు కాంగ్రెస్లోకి వెళ్లేందుకు మంతనాలు చేస్తున్నారని, ఇందులో HYD వారు ఉన్నారని సమాచారం. వచ్చే నాలుగున్నరేళ్లు సౌకర్యంగా ఉండడం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కొందరు పార్టీ మారనున్నారనే చర్చ నడుస్తోంది. కాగా ఇటీవల 10మంది MLAలు కాంగ్రెస్లోకి వస్తారని మైనంపల్లి పేర్కొనగా ఆయన మాటలు నిజం అవుతాయో లేదో చూడాలి.
HYD నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని డా.నందమూరి తారక రామారావు కళామందిరంలో సంస్థ అధ్యక్షురాలు డా.దేవసేన నిర్వహణలో సాంస్కృతిక సంస్థ సిద్ధేంద్ర ఆర్ట్స్ అకాడమీ 42వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అతిథులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. డా.దేవసేన 42 ఏళ్లుగా సాంస్కృతిక రంగానికి నిర్విరామ సేవలను చేస్తున్నారని కొనియాడారు. ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
HYD తార్నాకలోని లాలాగూడ PS పరిధిలో విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాలు.. లాలాపేట్లో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా ఆడుతున్న పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. దీంతో పోలీసులను చూసిన వినయ్ అనే వ్యక్తి పారిపోతూ మూడంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకి మృతిచెందాడు. అయితే టాస్క్ఫోర్స్ పోలీసులు కొట్టడంతో తట్టుకోలేక బిల్డింగ్ పై నుంచి దూకాడని ఆరోపిస్తూ అతడి స్నేహితులు ఆందోళనకు దిగారు.
HYDలోని రాష్ట్ర పోలీస్ అకాడమీలో జులై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త క్రిమినల్ చట్టాలపై పోలీస్ ఉన్నతాధికారులకు గురువారం వర్క్షాప్ నిర్వహించారు. డీజీపీ రవిగుప్తా ముఖ్యఅతిథిగా హాజరై కొత్త చట్టాలపై రూపొందించిన ‘న్యూ క్రిమినల్ లా బుక్స్’ ‘రెడీ రికనర్ ఆఫ్ న్యూ లాస్’ ‘న్యూ క్రిమినల్ లాస్’ అనే యాప్లను ఆవిష్కరించారు. కొత్త చట్టాలపై క్రిమినల్ లాయర్ ఏపీ సురేశ్ అవగాహన కల్పించారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏడాది పాటు మన్నికగా ఉండేలా.. మీ పిల్లలకు దుస్తులు కడుతున్నాం అనుకుని కుట్టాలని HYD కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఈ మేరకు ముషీరాబాద్ రాంనగర్ మేడిబాయి బస్తీలోని మహ్మదీయ, శ్రీలక్ష్మి, శ్రీవినాయక, మల్లికార్జున సహాయక బృందాల బట్టలు కుట్టే కేంద్రాలను సందర్శించి యూనిఫామ్ కుట్టే ప్రక్రియను పరిశీలించారు. యూనిఫాం కుడుతున్న మహిళలతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు.
గ్రేటర్ HYDలో వరద నీటి నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. గురువారం శేరిలింగంపల్లి జోన్ మాదాపూర్ సర్కిల్లో జోనల్ కమిషనర్ స్నేహ శబరీష్తో కలిసి కమిషనర్ మాదాపూర్ బాటా షోరూం, యశోద దవాఖాన, శిల్పారామం తదితర ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన తెలుగుదేశం పార్టీకి తెలంగాణలోనూ పూర్వ వైభవం వస్తుందని, ఇక్కడ కూడా భవిష్యత్తులో గెలుస్తుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, షాద్నగర్ మాజీ MLA బక్కని నర్సింహులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో షాద్నగర్లో గురువారం టీడీపీ నాయకులు బక్కని నర్సింహులును సన్మానించి, అభినందనలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.