India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYDలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒక్క అసెంబ్లీ సీటు కూడా రాలేదు. రాష్ట్రంలోని రూరల్ ప్రాంతాల్లో గెలుపుతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీకి గ్రేటర్లో గెలవలేదనే నిరాశ ఉండేది. కాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ 13,206 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రాజధానిలో ఆయన గెలవడం క్యాడర్లో సంతోషం నింపింది. ఖైరతాబాద్ BRS MLA దానం చేరికతో కాంగ్రెస్ బలం 2కి చేరింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస్సు వంచి స్వాగతిస్తున్నా అని బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత సాయన్న అన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు. ఎన్నికల ప్రచారంలో తనకు మద్దతుగా నిలిచిన నేతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయినా కంటోన్మెంట్ ప్రజలకు ఎల్లప్పుడూ తానూ అండగా నిలబడతానని హామీ ఇచ్చారు.
లోక్సభ ఎన్నికల్లో రాజధాని పరిధిలోని స్థానాల్లో నోటాకు వేలల్లో ఓట్లు పోలయ్యాయి. మల్కాజిగిరిలో అత్యధికంగా 13,206 ఓట్లు పోలవగా హైదరాబాద్లో అత్యల్పంగా 2,906 ఓట్లు పోలయ్యాయి. ఇక చేవెళ్లలో 6,308 ఓట్లు, సికింద్రాబాద్లో 5,166 ఓట్లు వచ్చాయి. ఆయా స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చక నోటాకు వేలల్లో ఓట్లు వేశారు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి నోటాకు ఓట్లు పెరిగాయి. దీనిపై మీ కామెంట్?
ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన HYD బాలాపూర్ సమీపంలోని మీర్పేట్ PS పరిధి వినాయక హిల్స్లో కాసేపటి క్రితం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉంటున్న జటావత్ ప్రభు(45) అనే మహిళను ఆమె కూతురి అత్త సుత్తితో తలపై కొట్టి చంపేసింది. పోలీసులు వచ్చి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం గమనార్హం.
కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీగణేశ్ బృందం CM రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి CM అభినందనలు తెలిపారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా శ్రీ గణేశ్కు సూచించారు. సీఎంను కలిసిన వారిలో జంపన ప్రతాప్, పల్లె లక్ష్మణ్ గౌడ్, ముప్పడి మధుకర్, సంకీ రవీందర్, ఇటుక రాజు, బద్రీనాథ్ ఉన్నారు
HYD ఎంపీ స్థానంలో కాంగ్రెస్, BRS డిపాజిట్లు కోల్పోయాయి.ఇక్కడ పోలైన మొత్తం ఓట్లలో MIM అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ 61.28% ఓట్లతో గెలుపొందారు. BJP అభ్యర్థి మాధవీలతకు 29.98% ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ సమీర్కు 5.83%, BRS అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్కు 1.73% ఓట్లు రాగా డిపాజిట్లు కోల్పోయారు. ఒవైసీకి 6,61,981, మాధవీలతకు 3,23,894, సమీర్కు 62,962, శ్రీనివాస్కు 18,641 ఓట్లు వచ్చాయి.
CM రేవంత్ రెడ్డికి గట్టి దెబ్బ తగిలింది. ఆయన సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరి MP స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డిపై BJP అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. మల్కాజిగిరి స్థానంలో గెలవాలని CM ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినా కలిసిరాలేదు. ఇక CM సొంత జిల్లా వికారాబాద్లోనూ BJP చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కొడంగల్లో BJP MBNR అభ్యర్థి DKఅరుణ సత్తా చాటి గెలుపొందారు.
కంటోన్మెంట్ ఉప ఎన్నికలో BRS పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. సిట్టింగ్ స్థానంలో సాయన్న కుమార్తె నివేదిత ఇక్కడ 3వ స్థానానికి పరిమితం కావడం శ్రేణులను మరింత నిరాశ పర్చింది. BJP అభ్యర్థి వంశ తిలక్పై శ్రీ గణేశ్(INC) 13,206 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్కు 53651 మంది ఓటేసి గెలిపించారు. వంశ తిలక్కు 40445, నివేదితకు 34462 మంది ఓటేశారు.
భారీ మెజార్టీతో గెలిపించిన మల్కాజిగిరి పార్లమెంటు ప్రజలందరికీ రుణపడి ఉంటానని ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండల పరిధి హోలీ మేరీ కళాశాలలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆయనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్నా నిత్యం అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. మూడోసారి మోదీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజల ఆశీర్వాదం భాజపాకు ఉంది.. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. అమ్మవారి ఆశీస్సులతో భాజపా భారీ విజయం సాధించబోతుందన్నారు. జూన్ రెండో వారంలో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.