India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంగళవారం రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి, ఎల్బీనగర్ జోన్ పరిధిలో మద్యం దుకాణాలు మూసివేస్తారని సీపీ తరుణ్ జోషి తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
HYD, ఉమ్మడి RRలో అర్హులైన విద్యుత్ వినియోగదారులకు ఈనెల 6 నుంచి గృహజ్యోతి పథకం అమల్లోకి రానుంది. సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగియగానే బిల్లులు జారీ చేయాలని డిస్కం నిర్ణయించింది. 200 యూనిట్లలోపు వినియోగదారులకు సున్నా బిల్లు జారీ చేయనున్నారు. మిగతా వారికి ఈనెల 1 నుంచే బిల్లింగ్ ప్రక్రియ మొదలుకాగా, పథకానికి దరఖాస్తు చేసుకున్నవారికి కోడ్ ముగియగానే సున్నా బిల్లు జారీ చేస్తామని అధికారులు తెలిపారు.
లోక్సభ ఎన్నికలు ఫలితాలు రేపే వెలువడనుండడంతో మల్కాజిగిరి ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్రెడ్డి, BJP నుంచి ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు. కాగా BRS, BJP మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా BRS, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు కావడంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
వారంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఉప్పల్లోని మినీ శిల్పారామంలో పేరణి ఆంధ్ర నాట్యం, కూచిపూడి కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. వాగ్దేవి ఆర్ట్స్ అకాడమీ గురువు పవన్, సంధ్య ఆధ్వర్యంలో పేరణి, ఆంధ్ర నాట్య అంశాలను కళాకారులు ప్రదర్శించారు. వినాయక కౌతం, మెలప్రాప్తి, శబ్దపల్లవి, శృంగనర్తనం, కుంభ హారతి, జయజయోస్తు తెలంగాణ, తిల్లాన, మామవతు, శ్రీ సరస్వతి, హారతి అంశాలను కళాకారులు ప్రదర్శించారు.
లోక్సభ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలు మోహరించి చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ కౌంటింగ్ సెంటర్లను 24/7 నిఘా నేత్రాలతో పర్యవేక్షణ చేస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం మాదాపూర్ శిల్పారామంలో ఏర్పాటు చేసిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ ప్రదర్శనలు కళా ప్రియులను అలరించాయి. నాట్య గురువుల విద్యారావు, స్మితా మాధవ్, అర్చన మిశ్రా, సౌందర్యకౌశిక్ శిష్య బృందాలు చక్కటి హావ భావాలతో లయాత్మకంగా నృత్యం చేసిన తీరు నయనానందకరంగా సాగింది.
చేవెళ్ల లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వీటి పరిధిలో మొత్తం 29,38,370 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా చేవెళ్లలో 71.83% పోలింగ్ నమోదు కాగా… అతి తక్కువ శేరిలింగంపల్లిలో 43.91 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 23 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు ఉంటుందని కలెక్టర్ శశాంక తెలిపారు.
మండీ బిర్యానీ తిని 10 మంది అస్వస్థతకు గురయ్యారు. ఘట్కేసర్ ఎస్ఐ రాము తెలిపిన వివరాలు.. భూపాలపల్లికి చెందిన ఉషారాణి(22), మహేశ్(25), అశోక్, చందు, మౌనిక, రేణుకతో పాటు నలుగురు చిన్నారులు ఇటీవల HYDకు కారులో వచ్చి ఘట్కేసర్లోని స్థానిక అరేబియా మండీలో బిర్యానీ తిన్నారు. అనంతరం వారంతా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉషారాణి తండ్రి నరసింహచారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి మనవడితో గవర్నర్ రాధాకృష్ణన్ కొద్దిసేపు సరదాగా గడిపారు. HYD ట్యాంక్ బండ్ వద్ద రాత్రి జరిగిన తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో స్టేజీపై తన మనవడిని సీఎం గవర్నర్కు పరిచయం చేశారు. ఈ సమయంలో గవర్నర్ ఆ చిన్నారికి రెండు నోట్లను ఇచ్చారు. దీంతో ఆ బాలుడు వద్దన్నట్లుగా ఆ డబ్బుల్ని తిరిగి ఇచ్చాడు. అయినా గవర్నర్ మరోసారి ఆ నోట్లను చిన్నారికి ఇస్తూ జేబులో పెట్టడంతో సీఎం నవ్వుతూ చూశారు.
HYD, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు పాడై ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. ప్రధాన మార్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. అధికారులకు చెప్పినా తాత్కాలిక మరమ్మతులతో సరి పెడుతున్నారని, దీంతో అవస్థలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ ప్రాంతంలో రోడ్లు బాగున్నాయా కామెంట్ చేయండి.
SHARE IT
Sorry, no posts matched your criteria.