India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TGలో మున్సిపల్ పోరుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. అయితే, దీనికి ముందే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కలియతిరగనున్నారు. ఉత్తర, దక్షిణ, మధ్య ప్రాంతాల్లో 3 భారీ సభలు నిర్వహించనుంది. ప్రజల్లోకి వెళ్లిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ భావిస్తోంది. ఈ సభలు ముగిసిన వెంటనే SEC ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేస్తుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. సీఎం టూర్ ఖరారైన తర్వాతే క్లారిటీ రానుంది. STAY TUNED..

మన పిల్లలకు ఇక ఫిన్లాండ్ రేంజ్ చదువులు HYDలోనే దొరికేస్తాయోచ్! కొల్లూరులో సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి ఫిన్లాండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్కూల్ను ‘హారిజన్ ఎక్స్పీరియెన్షియల్ వరల్డ్ స్కూల్’ (HEWS) ప్రారంభించింది. ప్రపంచంలోనే నం.1 విద్యా విధానాన్ని మన దగ్గరకు తెస్తూ టీసీసీ క్లబ్లో వేడుక నిర్వహించారు. బట్టీ పద్ధతులకు స్వస్తి చెప్పి, పిల్లల్లో సృజనాత్మకత పెంచడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

సంక్రాంతి వేడుకల వేళ తిండిపై నియంత్రణ లేకపోతే తిప్పలు తప్పవంటున్నారు నిపుణులు. విందులు, చిరుతిళ్లు, నిద్రలేమితో గుండె, కాలేయంపై ఒత్తిడి పెరుగుతోందని HYDలోని డా.సయ్యద్ ముస్తఫా అష్రఫ్ హెచ్చరించారు. మితిమీరిన మద్యం, మసాలా ఆహారంతో ఫ్యాటీ లివర్ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డా.కార్తికేయ రామన్రెడ్డి పేర్కొన్నారు. నీళ్లు బాగా తాగుతూ, నడుస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

దివంగత మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ భార్య, ప్రముఖ కవయిత్రి, చిత్రకారిణి రాజకుమారి ఇందిరాదేవి ధన్రాజ్ గిర్ (96) HYDలోని గోషామహల్లో ఉన్న జ్ఞాన్ బాగ్ ప్యాలెస్లో తుదిశ్వాస విడిచారు. బహుముఖ ప్రజ్ఞతో సాహిత్య, కళా రంగాల్లో ఆమె తనదైన ముద్ర వేశారు. అల్లా ఇక్బాల్, గాలీబ్, అరబిందో రచనల నుంచి ఇన్స్పైర్ అయిన ఇందిరా దేవి చిన్నప్పటి నుంచే రచనలపై ప్రేరణ పొందారు.

డాబాల మీద డీజే గోల, పతంగుల కోసం కొట్లాటలకు ఈ తరం కుర్రాళ్లు గుడ్ బై చెప్పేస్తున్నారు. నెక్లెస్ రోడ్, గండిపేట లాంటి చెరువు గట్లనే తమ పతంగ్ అడ్డాగా మార్చుకుంటున్నారు. తెల్లవారుజామునే చాయ్ థర్మోస్, ఫోల్డబుల్ కైట్స్, మ్యూజిక్ కోసం చిన్న బ్లూటూత్ స్పీకర్తో అక్కడ వాలిపోతున్నారు. రొటీన్ రచ్చకు దూరంగా, ప్రశాంతమైన గాలిలో గాలిపటాలు ఎగరేస్తూ సరికొత్త ‘యాంటీ నాయిస్’ కల్చర్కు తెరలేపుతున్నారు. మీకూ నచ్చిందా?

భారీ వర్షాలు కురిసినా బల్దియాలోని భూగర్భజలాలు పడిపోతున్నాయి. నిరుడితో పోలిస్తే నీటిమట్టం 2-3 అడుగుల దిగువకు జారిందని అధికార గణాంకాలు చెబుతున్నాయి. GHMC పరిధిలోని 46 మండలాల్లో 13 మండలాలు రెడ్జోన్లోకి వెళ్లాయి. కాంక్రీటీకరణతో వర్షపు నీరు భూమిలోకి ఇంకకపోవడం ప్రధాన కారణం. బోర్లు అడుగంటడంతో వేసవిలో నగర, శివారువాసులకు నీటి ఎద్దడి తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంకుడు గుంతల ఆవశ్యకత గుర్తుచేస్తున్నాయి.

మెట్రో రైలును పట్టాలెక్కించినట్టే చిత్రకారుల ప్రతిభను ప్రపంచానికి చాటాలంటున్నారు NVS రెడ్డి. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘పరిచయ్ ఆర్ట్ ఫౌండేషన్’ నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్, క్యాంప్ కళాభిమానులను ఫిదా చేస్తోంది. ఒకేచోట ప్రదర్శన, ప్రత్యక్ష చిత్రలేఖనం చూడటం అరుదైన అవకాశమని చెప్పుకొచ్చారు. జయవంత్ నాయుడు ఆధ్వర్యంలో 12 మంది దిగ్గజ చిత్రకారుల కుంచె నుంచి జాలువారిన అద్భుతాలు ఇక్కడ కొలువుదీరాయి.

పతంగ్.. పండుగ 3 రోజులే కానీ, 365 రోజులు ధూల్పేటలో గాలిపటాల తయారీ ఉంటుందని మీకు తెలుసా?. అవును.. స్టేట్ వైడ్ వ్యాపారులు, నగరవాసులు అధికంగా ఇక్కడికే వస్తుంటారు. దీంతో లక్షల్లో పతంగులు సిద్ధం చేయాలి. హ్యాండ్మేడ్ కదా.. 5 రోజులకు ఒక్కరు 100 పేపర్ పతంగుల వరకు తయారీ చేయగలరు. అందుకే ఏడాది మొత్తం శ్రమించి 500 రకాల విభిన్న రూపాల్లో లక్షల్లో పతంగులు రెడీ చేస్తారు. పైఫొటోలో ఉన్న పతంగ్ Made In Dhoolpet.

పతంగ్.. పండుగ 3 రోజులే కానీ, 365 రోజులు ధూల్పేటలో గాలిపటాల తయారీ ఉంటుందని మీకు తెలుసా?. అవును.. స్టేట్ వైడ్ వ్యాపారులు, నగరవాసులు అధికంగా ఇక్కడికే వస్తుంటారు. దీంతో లక్షల్లో పతంగులు సిద్ధం చేయాలి. హ్యాండ్మేడ్ కదా.. 5 రోజులకు ఒక్కరు 100 పేపర్ పతంగుల వరకు తయారీ చేయగలరు. అందుకే ఏడాది మొత్తం శ్రమించి 500 రకాల విభిన్న రూపాల్లో లక్షల్లో పతంగులు రెడీ చేస్తారు. పైఫొటోలో ఉన్న పతంగ్ Made In Dhoolpet.

పతంగ్.. పండుగ 3 రోజులే కానీ, 365 రోజులు ధూల్పేటలో గాలిపటాల తయారీ ఉంటుందని మీకు తెలుసా?. అవును.. స్టేట్ వైడ్ వ్యాపారులు, నగరవాసులు అధికంగా ఇక్కడికే వస్తుంటారు. దీంతో లక్షల్లో పతంగులు సిద్ధం చేయాలి. హ్యాండ్మేడ్ కదా.. 5 రోజులకు ఒక్కరు 100 పేపర్ పతంగుల వరకు తయారీ చేయగలరు. అందుకే ఏడాది మొత్తం శ్రమించి 500 రకాల విభిన్న రూపాల్లో లక్షల్లో పతంగులు రెడీ చేస్తారు. పైఫొటోలో ఉన్న పతంగ్ Made In Dhoolpet.
Sorry, no posts matched your criteria.