India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బండి బయటకు తీస్తే చాలు.. గంటల తరబడి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నరకాన్ని చూసున్న ఐటీ కారిడార్ వాసులకు ఇక ఆ ఇబ్బందులు తీరినట్లే! హైటెక్ సిటీ, మాదాపూర్, గొల్కొండ నుంచి ORR వరకు రోడ్ల రూపురేఖలను మార్చేందుకు HMDA సరికొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. కేవలం రోడ్లే కాదు, పాదాచారుల కోసం ఆకాశ మార్గాలు (Sky walks), వాహనాల కోసం భారీ ఫ్లైఓవర్లతో 2050 నాటి అవసరాలకు తగ్గట్టుగా నగరాన్ని తీర్చిదిద్దబోతున్నారు.

RTC X రోడ్స్, చిక్కడపల్లి గల్లీల్లో భోగి మంటలు హోరెత్తుతున్నాయి. కానీ, హైటెక్ సిటీ వైపు వెళ్తే సీన్ రివర్స్ కనిపిస్తోంది. కాలుష్యం పేరిట అక్కడ మంటల బదులు ఎల్ఈడీ వెలుగులు, ఇండోర్ పూజలు కనిపిస్తున్నాయి. ఒకవైపు తెల్లవారుజామున రోడ్లపై పెద్ద ఎత్తున వేసే మంటలు, మరోవైపు వాట్సాప్ గ్రూపుల్లో ‘గ్రీన్ గిల్ట్’ రాజకీయాలు పండగ జోష్ కంటే కూడా క్లాస్, ఎడ్యుకేషన్ ఇక్కడ మంటల సైజును డిసైడ్ చేస్తున్నాయి.

HYD ఖాళీ అయ్యిందని కొందరి SM పోస్టులు వైరల్ అయ్యాయి. సంక్రాంతి కోసం జనాలు సొంతూళ్లకు వెళ్లారని దీని అర్థం. ఈ పరిస్థితి సిటీలో ఓ వైపు మాత్రమే కనిపిస్తోందని మరికొందరి వాదన. పండుగలకు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ సాధారణమని, సిటీలో ఏ మూలకు వెళ్లిన ట్రాఫిక్ ఉందని చెబుతున్నారు. పల్లెబాట పట్టిన వీడియోలు, సిటీ రష్ వీడియోలు SMలో పోటీ పడుతున్నాయి. మరి మీ ఏరియాలో పరిస్థితి ఏంటి? కామెంట్ చేయండి.

స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ ద్రష్ట మర్రి చెన్నారెడ్డి 1919 JAN 13న వికారాబాద్ (D) మార్పల్లి (M) సిరిపురంలో జన్మించారు. MBBS పూర్తి చేసి వైద్యవృత్తిని ప్రజాసేవగా మలిచారు. 1969 TG ఉద్యమంలో కీలక భూమిక పోషిస్తూ తెలంగాణ ప్రజా సమితికి నాయకత్వం వహించారు. ఉద్యమ ఉత్థాన, పతనాల మధ్య పార్టీని రాజకీయ శక్తిగా నిలిపారు. 1978లో మేడ్చల్ నుంచి MLAగా గెలిచి ఉమ్మడి AP CMగా బాధ్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించారు.

HYDలో పెళ్లళ్లకు బ్యూటీషియన్ల డిమాండ్ పెరిగింది. మగువ మొహాన్ని మెరుపుటద్దంలా మార్చే మేకప్, మరింత అందాన్ని తెచ్చే లేటెస్ట్ మెహంది డిజైన్ల కోసం ఖర్చుకు వెనకాడటం లేదు. నెయిల్ పాలిష్ తర్వాత ఒకే వేలుకు మాత్రమే పెట్టే ఒక్క మెరుపు చుక్కకే రూ.2,500 వరకు ఖరీదు చేస్తున్నారు. మల్టీ వ్యూ డిమాండ్ అని పిలిచే ఈ మెరుపు చుక్కలో నిలబడి చూస్తే ‘వధూవరులు’ మెరుస్తూ కనిపిస్తారు.

నేడు HYD దద్దరిల్లనుంది. ఆకాశంలో రోజంతా అద్భుతాలు చూడొచ్చు.
☛ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 3 డేస్ కైట్& స్వీట్ ఫెస్టివల్
☛ 3డేస్ పరేడ్ గ్రౌండ్లో సా.5 నుంచి రాత్రి వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్
☛ గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్
వీటికోసం రాష్ట్ర పర్యాటకశాఖ సర్వం సిద్ధం చేసినట్లుగా వెల్లడించింది.

MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో బ్రెస్ట్, సర్విక్స్ క్యాన్సర్ తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఒకప్పుడు స్మోకింగ్ చేసేవారికే వచ్చే ఈ క్యాన్సర్ ఇప్పుడు తాగనివారి జీవితాలనూ కబళిస్తోంది. HYDలో మహిళల్లో, ముఖ్యంగా స్మోకింగ్ అలవాటులేనివారిలోనూ కేసులు పెరుగుతున్నాయి. గాలి కాలుష్యం, ఇరుకు కిచెన్లో వంట చేసేటప్పుడు వచ్చే పొగ, చెత్త దహనం, ధూళి ప్రధాన కారణాలుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.

నివాసాల జోలికి హైడ్రా వెళ్లదని మరోసారి స్పష్టం చేసింది. 2024 జులైలో హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, హైడ్రా ఏర్పాటుకు ముందు నిర్మించిన ఇళ్లను తొలగించకూడదని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఈ నిబంధన అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందని పేర్కొంది. చట్టం ప్రకారం హైడ్రా తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని పేర్కొంది. నిన్న హైడ్రా ప్రజావాణికి 76 ఫిర్యాదులు అందాయి.

తెలంగాణ జైళ్ల యాన్యువల్ రిపోర్టు చూస్తే మతిపోతోంది. సైబర్ క్రైమ్ కేసులు బాంబులా పేలగా, తాగి నడిపి 2,833 మంది లోపలికి వెళ్లారు. మొత్తంగా ఖైదీల సంఖ్య 42 వేలు దాటింది. అందులో Gen Z మెజారిటీ ఉండటం కలవర పెట్టే అంశం. 2025 రిపోర్టు ప్రకారం.. 18,737 మంది యువకులు, 654 మంది యువతులు, 22 ఇతరులు కలిపి 19,413 మంది ఖైదీ అయ్యారు. 2024తో పోలిస్తే నేరలు చేసిన వారి సంఖ్య 13.31% శాతం పెరగడం గమనార్హం.

తెలంగాణ జైళ్ల యాన్యువల్ రిపోర్టు చూస్తే మతిపోతోంది. సైబర్ క్రైమ్ కేసులు బాంబులా పేలగా, తాగి నడిపి 2,833 మంది లోపలికి వెళ్లారు. మొత్తంగా ఖైదీల సంఖ్య 42 వేలు దాటింది. అందులో Gen Z మెజారిటీ ఉండటం కలవర పెట్టే అంశం. 2025 రిపోర్టు ప్రకారం.. 18,737 మంది యువకులు, 654 మంది యువతులు, 22 ఇతరులు కలిపి 19,413 మంది ఖైదీ అయ్యారు. 2024తో పోలిస్తే నేరలు చేసిన వారి సంఖ్య 13.31% శాతం పెరగడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.