India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD నగర ప్రజలకు సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ అలర్ట్ జారీ చేశారు. ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ టోర్నమెంట్ కప్-2024 సెప్టెంబర్ 3, 6, 9వ తేదీలలో GMCB గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి, గచ్చిబౌలి నుంచి లింగంపల్లి, IIIT సర్కిల్ నుంచి విప్రో రూట్లో ఆయా రోజుల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్ రద్దీ ఉంటుందన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
తెలుగు రాష్ట్రాలలో కురిసిన వర్షంతో అనేక చోట్ల వరదలు ముంచెత్తాయి. దీంతో నేడు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు దాదాపు 18 రైళ్లను రద్దు చేస్తూ నోటీసు జారీ చేశారు. ఇందులో సికింద్రాబాద్ నుంచి సిర్పూర్, కాగజ్ నగర్, షాలిమార్, విశాఖపట్నం, హౌరా, గుంటూరు రైళ్లు ఉన్నాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని GM అరుణ్ కుమార్ జైన్ సూచించారు.
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టే ల్యాండ్ పూలింగ్ పథకంలో తాజాగా నిబంధనల్లో మార్పు చేయనున్నారు. రైతులకు ఇచ్చే వాటా మౌలిక వసతుల కల్పనకే పరిమితం కానుంది. గతంలో రైతులకు సంబంధించి ప్లాట్లను కూడా హెచ్ఎండీఏ విక్రయించేది. కాగా ఈ నిబంధనల్లో మార్పులు చేయాలని భావిస్తోంది. దీంతో హెచ్ఎండీఏ ధరకంటే రైతులు ఎక్కువకే విక్రయించుకునే అవకాశముంది.
3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు HYD చల్లబడింది. చిరుజల్లులు, పచ్చదనంతో నగరంలోని కృష్ణకాంత్, వనస్థలిపురం మహవీర్, కేబీఆర్ సహా పలు పార్కులు ఆహ్లాదకరంగా మారాయి. అటు వికారాబాద్ ప్రాంతం కొత్త అందాలతో కనువిందు చేస్తోంది. HYD, RR, MDCL, VKBకి వాతావరణ శాఖ ఆరెంజ్, రెడ్ అలర్ట్స్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు.
ట్రాఫిక్ జామ్ అయిందన్న వార్త తెలిస్తే ఈ వైపు వచ్చేవాళ్లం కాదుగా అని ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు సగటు వ్యక్తి అనుకునే ఉంటాడు. ఇక నుంచి ట్రాఫిక్ అలర్ట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు FM RADIO తరహాలో HYD పోలీసులు కమ్యూనిటీ రేడియోను ప్రారంభించనున్నారు. అంతేకాకుండా సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని సీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ, ఖమ్మం ప్రాంతాలకు వెళ్లాలనుకునే నగర ప్రజలు ప్రయాణం వాయిదా వేసుకోవాలని HYD ట్రాఫిక్ అదనపు కమిషనర్ పి.విశ్వప్రసాద్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో విజయవాడ వెళ్లాలనుకుంటే చౌటుప్పల్, చిట్యాల, నార్కెట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా వెళ్లాలన్నారు. అత్యవసర పరిస్థితిలో సహాయానికి హైదరాబాద్ ట్రాఫిక్ హెల్ప్లైన్ 9010203626 నంబర్ సంప్రదించాలన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు సహాయం కోసం కింది నంబర్లకు కాల్ చేయాలని అధికారులు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు.
◆హైదరాబాద్ కలెక్టరేట్ 040-23202813, 9063423979.
◆హైదరాబాద్ ఆర్డీవో : 7416818610
◆జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నంబర్ 040-21111111
◆హైడ్రో కంట్రోల్ రూమ్ నంబర్ 9000113667
◆సికింద్రాబాద్ ఆర్డీఓ 9985117660, 8019747481
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో గ్రేటర్ పరిధిలో చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి అంధకారం నెలకొంది. క్షేత్ర స్థాయిలో మరమ్మతులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో విద్యుత్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమీర్పేట, ఎర్రగడ్డ, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, సైబర్ సిటీ సర్కిల్, హబ్సిగూడ సరిళ్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ పునరుద్ధరించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ, ఖమ్మం ప్రాంతాలకు వెళ్లాలనుకునే నగర ప్రజలు ప్రయాణం వాయిదా వేసుకోవాలని HYD ట్రాఫిక్ అదనపు కమిషనర్ పి.విశ్వప్రసాద్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో విజయవాడ వెళ్లాలనుకుంటే చౌటుప్పల్, చిట్యాల, నార్కెట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా వెళ్లాలన్నారు. అత్యవసర పరిస్థితిలో సహాయానికి హైదరాబాద్ ట్రాఫిక్ హెల్ప్లైన్ 9010203626 నంబర్ సంప్రదించాలన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో ఇంటి పెద్దలు కుటుంబాలను చిదిమేస్తున్న ఘటనలు HYDలో పెరుగుతున్నాయి. జీడిమెట్ల పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి వెంకటేష్ భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి, ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్లో నష్టపోవడమే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పటాన్చెరులోని రుద్రారంలో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి అనంతరం తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలవరపెడుతోంది.
Sorry, no posts matched your criteria.