India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 2న రక్సల్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైలులో అత్యాచారానికి గురైన బాలికకు(12) గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, ట్రీట్మెంట్ను అందించారు. కుటుంబ సభ్యులతో HYD వస్తున్న బాలిక.. అర్ధరాత్రి వారంతా నిద్రలో ఉండగా రైల్లో వాష్ రూమ్కి వెళ్లింది. ఆ సమయంలో లోపలికి వెళ్లిన బీహార్కు చెందిన వ్యక్తి అత్యాచారం చేసి వీడియోలు తీశాడు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
HYD ట్రాఫిక్ పోలీసులు నేటి నుంచి మైనర్ డ్రైవింగ్పై ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించనున్నారు. ‘మోటారు వెహికిల్ యాక్ట్ ప్రకారం మైనర్ డ్రైవింగ్ నేరం. వాహన రిజిస్ట్రేషన్ను 12 నెలల పాటు రద్దు చేస్తారు. మైనర్కి 25 ఏళ్లు వచ్చే వరకు లైసెన్స్ అర్హత ఉండదు. తల్లిదండ్రులు, వాహన యజమానులు దీనికి బాధ్యులు అవుతారు’ అని హెచ్చరించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ విజ్ఞప్తి చేశారు.
HYDలో అనేక ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ బస్సుల కంటే ఎలక్ట్రిక్ బస్సులు లగ్జరీగా ఉండడంతో కొందరు ప్రయాణికులు వాటిలో మహిళలకు ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం వర్తించదనే అపోహ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ఎలక్ట్రిక్ బస్సులపై మహాలక్ష్మి FREE పథకం వర్తిస్తుందని స్టిక్కర్లు అంటించారు.
లక్ష్మీ భాయి షిండేకు షిర్డీ సాయిబాబా స్వయంగా అందించిన దైవికమైన 9 సాయి నాణేలు చాదర్ఘాట్ సాయిబాబా భక్తులు దర్శించుకోవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఏప్రిల్ 6న ఉ.11 నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఈ నాణేలు ప్రదర్శించనున్నట్లు సాయిబాబా ఆలయ అధికారులు తెలిపారు. ఈ అరుదైన పుణ్యదర్శనాన్ని భక్తులు తప్పక వినియోగించుకోవలసిందిగా వారు కోరారు.
శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 6, 2025న ఉ.10:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు వైన్స్లు బంద్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వుల జారీ చేసింది. దీని పరిధిలోని కల్లు, వైన్ షాపులు, రెస్టారెంట్ల అనుబంధ బార్లు, మిలిటరీ కాంటీన్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్ దీని పరిధిలోకి వస్తాయి. ఈ విషయాన్ని అందరూ గమనించాలని రాచకొండ పోలీసులు కోరారు.
హైదరాబాద్ ప్రెస్క్లబ్ 2025 డైరీని తన క్యాంప్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శుక్రవారం ఆవిష్కరించారు. ప్రెస్క్లబ్కు స్థలం కేటాయించాలని ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రిని ప్రెస్క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వేణుగోపాల్ నాయుడు, రవికాంత్ రెడ్డి కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించినట్టు పేర్కొన్నారు. అనంతరం ప్రెస్క్లబ్ పాలకమండలి సభ్యులు బట్టిని శాలువాతో సత్కరించారు.
ములుగు జిల్లాలో నకిలీ మొక్కజొన్న విత్తనాలతో గిరిజన రైతులకు జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, రైతు హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే చట్ట సవరణలు చేయాలని రైతు కమిషన్.. CS శాంతి కుమారికి నివేదిక అందించింది. వ్యవసాయ మార్కెట్, విత్తన చట్టాల్లో మార్పులు, నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ శాఖ పేరులోనూ మార్పులు కోరింది.
ప్రముఖ విద్యాసంస్థ ఐఐటీ హైదరాబాద్కు విరాళమిచ్చే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ విద్యా సంస్థకు విరాళం ఇస్తే ఆ మొత్తానికి సంబంధించి టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలో 50% పన్ను చెల్లించాల్సి ఉండేది. అయితే ఇపుడు ఐటీ యాక్ట్ సెక్షన్ 80జీ ప్రకారం విరాళాలు టాక్స్ ఫ్రీ అని ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొ.బీఎస్ మూర్తి తెలిపారు.
చారిత్రాత్మక కట్టడాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అధికారుల అలసత్వం, క్రమశిక్షణ లేని జనం మూలంగా మురికి కూపంలా మారుతున్నాయి. అందుకు నిదర్శనం పాతబస్తీలోని గుల్జార్ హౌజ్ వద్ద ఉన్న వాటర్ ఫౌంటెన్. సందర్శకులను ఎంతగానో అలరించిన నిజాంకాలం నాటి ఫౌంటెన్ వద్ద నేడు శుభ్రత కరవైంది. మంచినీటికి బదులు మురికి నీరు దాని నిండా ఖాళీ వాటర్ బాటిల్స్, చెత్త చెదారంతో స్వాగతం పలుకుతున్నాయి.
ప్రముఖ విద్యాసంస్థ ఐఐటీ హైదరాబాద్కు విరాళమిచ్చే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ విద్యా సంస్థకు విరాళం ఇస్తే ఆ మొత్తానికి సంబంధించి టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలో 50% పన్ను చెల్లించాల్సి ఉండేది. అయితే ఇపుడు ఐటీ యాక్ట్ సెక్షన్ 80జీ ప్రకారం విరాళాలు టాక్స్ ఫ్రీ అని ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొ.బీఎస్ మూర్తి తెలిపారు.
Sorry, no posts matched your criteria.