Hyderabad

News August 31, 2025

HYD: GREAT: పర్యావరణం కోసం ముసలవ్వ పిలుపు.!

image

కాప్రా చెరువు వద్ద పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న గుల్షాన్ బంబాత్ చిన్న గణపతి విగ్రహాల ద్వారానే ఎక్కువ విశ్వాసం, స్వచ్ఛమైన భక్తి ఉంటాయని అభిప్రాయపడ్డారు. చెరువులను కలుషితం చేయకుండా పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆమె రాత్రిపూట కూడా చెరువు దగ్గరే ఉన్నారు. కాలుష్యరహిత సమాజం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. “చెరువులు కలుషితం కావొద్దంటే, మనందరం మారుదాం” అని ఆమె పేర్కొన్నారు

News August 31, 2025

HYD: సండే ఆన్ సైక్లింగ్ ప్రారంభించిన గవర్నర్

image

HYDలో నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ 2025లో ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా ఆదివారం సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. సైక్లింగ్ శారీరక, మానసిక బలాన్ని పెంచుతుందని గవర్నర్ అన్నారు. ప్రోగ్రాంలో స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేన రెడ్డి పాల్గొన్నారు.

News August 31, 2025

HYD: కృష్ణానగర్ నివాసితులతో త్వరలో సమావేశం: కమిషనర్

image

HYDలో వరదలకు గల కారణాలను అన్వేషిస్తూ, సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ తెలియజేశారు. త్వరలో కృష్ణానగర్ నివాసితులతో సమావేశం నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు. అమీర్పేట, కృష్ణానగర్ ప్రాంతంలో నాలా డీసిల్టింగ్ పక్రియ వేగంగా జరుగుతుండగా, ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు.

News August 31, 2025

HYD: నేడు, రేపు వర్షాలు అలర్ట్!

image

HYD, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుపుతూ సైబరాబాద్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదివారం సూచించారు. వర్షం ఒక్కసారిగా ప్రారంభమై కురిసే అవకాశాలు అధికంగా ఉన్నట్లుగా అధికారులు వివరించారు.

News August 31, 2025

వచ్చే నెల 6న ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం

image

ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయితే సెప్టెంబర్ 7న చంద్ర గ్రహణం ఉండటంతో వినాయక నిమజ్జనాలపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 6న ఖైరతాబాద్ విశ్వశాంతి మహా గణపతిని నిమజ్జనం చేయనున్నట్లు ఉత్సవ సమితి ప్రకటించింది.

News August 31, 2025

HYD: ఈ జిల్లాల్లో క్యాన్సర్ కేర్ యూనిట్లు..!

image

క్యాన్సర్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. HYD, RR, MDCL, VKB జిల్లాల్లో క్యాన్సర్ కేర్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. HYD పరిధి MNJ క్యాన్సర్ ఆస్పత్రి, NIMS ఆసుపత్రులలో ప్రస్తుతం వైద్యం అందుబాటులో ఉండగా, వైద్య చికిత్స విస్తరణపై ఫోకస్ చేసిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

News August 31, 2025

HYD: పిల్లలకు మొబైల్ ఇస్తున్నారా? జాగ్రత్త

image

మీ పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? జాగ్రత్త! HYDలో నమోదైన పలు కేసుల్లో పిల్లల ప్రవర్తన వెనుక అనేక విషయాలు బయటపడ్డాయి. ఇటీవల కూకట్‌పల్లి బాలుడు OTTచూసి ప్రభావితం అయిన తీరు ఓ ఉదాహరణ. మీ పిల్లలు యూట్యూబ్ షాట్స్, ఇన్‌స్టా, షేర్‌చాట్, ఫేస్‌బుక్ లాంటివి చూస్తుండగా నేరాలు, పోర్న్, డ్రగ్స్, ఇతరత్రా అనవసరపు వీడియోలు రావడంతో వాటికి ఆకర్షితులై వారు చెడుదారి వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

News August 31, 2025

HYD: లడ్డూ దొంగలొస్తున్నారు.. జాగ్రత్త!

image

వినాయకచవితి నవరాత్రుల వేళ లడ్డూ దొంగల బెడద పెరిగింది. మీర్‌పేట PS పరిధి హస్తినాపురంలోని విశ్వేశ్వరయ్య ఇంజినీర్స్‌ కాలనీలో ఏకంగా 4 మండపాల్లో గణపతి లడ్డూలను ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి స్కూటీపై వచ్చిన యువకులు అదును చూసి చోరీ చేశారు. దీనిపై స్థానికులు PSలో ఫిర్యాదు చేశారు. మండపంలో నిద్రించే వాలంటీర్లు అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.
SHARE IT

News August 30, 2025

HYDలో ఫంక్షన్ కోసం పేదోడి టెన్షన్!

image

ఇంట్లో ఫంక్షన్‌ ఉంటే HYDలో పేదోడు ఓ ఫంక్షన్ చేయాలంటే కొండంత భారంగా మారింది. ఇందుకోసం అప్పు మీద అప్పు చేయాల్సిన పరిస్థితి. HYDలో ఒక ఫంక్షన్ కోసం రూ.లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. వివిధ ప్రాంతాల నుంచి బతుకుదెరువుకు వలస వచ్చిన ఎంతో మంది ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. HYDలో ప్రభుత్వం ప్రతి డివిజన్‌లో కనీసం 2 ఫంక్షన్ హాల్స్ నిర్మించి, తక్కువ ధరకు ఉంచేలా చూడాలని కోరుతున్నారు.

News August 30, 2025

మహానగరంలో శోభాయాత్రకు భారీగా ఏర్పాట్లు

image

వచ్చే నెల 6న జరిగే గణపతి శోభాయాత్రకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. స్టాటిక్ క్రేన్లు: 134, మొబైల్ క్రేన్లు: 269, హుస్సేన్‌సాగర్ వద్ద పడవలు 9, డీఆర్ఎఫ్ 16 టీములు, గజ ఈతగాళ్లు: 200, గణేశ్ యాక్షన్ టీమ్స్: 160, పారిశుద్ధ్య కార్మికులు 14,486 మంది, మినీ టిప్పర్లు: 102, జేసీబీలు 125, స్వీపింగ్ యంత్రాలు 30, మొబైల్ టాయిలెట్స్ 309, లైటింగ్ పాయింట్లు 56,187, వైద్య శిబిరాలు 7 ఏర్పాటు చేశారు.