India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై చర్చించేందుకు నేడు కీలక సమావేశం జరుగనుంది. బంజారాహిల్స్లోని ఓ హోటల్ ఈ సమావేశానికి వేదిక కానుంది. తెలంగాణ స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటైన తర్వాత ఇది మొదటి సమావేశం. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది. సంజీవ్ గోయంకా, కావ్య మారన్, ఉపాసన, పుల్లెల గోపీచంద్, కపిల్ దేవ్, శశిధర్ తదితరులు రానున్నట్లు సమాచారం.
భారీ వర్షాల నేపథ్యంలో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్నింటిని దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు గందరగోళంలో పడిపోయారు. వర్షాలు ఇంకా కురిసే అవకాశముండటంతో మరికొన్ని రైళ్లు రద్దుచేసి దారి మళ్లించే అవకాశముంది. అందుకే ప్రయాణికుల సహాయార్థం రైల్వే అధికారులు హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ 040-27786170, కాచిగూడ- 9063318082
భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ పరిధిలో వేలాది గణపతి మండపాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వాటి పక్కన కరెంట్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు ఉంటే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, అగ్నిమాపకశాఖ, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు అధికారులు వర్షం పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. పురాతన ఇళ్లల్లోఉన్న వారిని ఇతర ప్రాంతాలకు తరలించాలన్నారు.
హయత్నగర్లో బుధవారం ఓ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ఇద్దరు పిల్లలు గణపయ్యను ఇంటికి తీసుకెళ్తుండగా వర్షం మొదలైంది. వెనక కూర్చున్న బాలుడు గణపయ్య ప్రతిమ తడవకుండా తన చొక్కాను విప్పి కప్పాడు. తనకు లేకున్నా.. దేవుడు ప్రతిమ సురక్షితంగా ఉండాలని పసి ప్రాయంలో అతడు చూపిన భక్త, ప్రేమ అందరి హృదయాలను కదిలించింది. ‘వర్షంలో కరగకపోయినా నీ భక్తికి కురుగుతాడు’ ‘జాగ్రత్త బ్రో’ అంటూ SMలో పలువురు కామెంట్లు చేస్తున్నారు.
గణేశ్ నవరాత్రుల సందర్భంగా మండపాలు, నిమజ్జనవేడుకల్లో యువతులు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే పోకిరీల పని పట్టేందుకు SHE టీమ్స్ సిద్ధమైంది. మూడు కమిషనరేట్ల పరిధిలో అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా పోకిరీలపై నిఘా వేశారు. ఎవరూ చూడటం లేదని తోకజాడించాలని చూస్తే వారి కదలికలన్నీ పసిగడతాం అని స్పష్టం చేశారు. ఎక్కడైనా పోకిరీలు ఇబ్బంది పెడితే 94906 17444, 949061655, 8712662111 నెంబర్లకు కాల్ చేయాలన్నారు.
బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కామెంట్స్ ఆ పార్టీలోనే చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ నాయకులు తనతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారని.. అందుకే ఫుట్బాల్ను గిఫ్ట్గా పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శికి ఇవ్వడానికి తెచ్చానని మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో వ్యాఖ్యానించారు. అయితే బుధవారం దీనికి భిన్నంగా.. కాంగ్రెస్ పార్టీని ఎలా ఫుట్బాల్ ఆడుకోవాలో కార్యకర్తలకు చెప్పేందుకే ఇచ్చానని చెప్పడం ఆశ్చర్యకరం.
ఈ నెల 31న గచ్చిబౌలిలో సైక్లింగ్ ర్యాలీ జరుగనుంది. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఈ సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేసినట్లు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి తెలిపారు. ర్యాలీ ఆదివారం ఉ.7గం.కు గచ్చిబౌలి స్టేడియం మెయిన్ గేటు వద్ద ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పలువురు ప్రముఖులు వేడుకకు హాజరవుతారని వివరించారు.
సిటీ వెస్ట్ జోన్ పరధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 1,638 మండపాల్లో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించారు. బంజారాహిల్స్ PS పరిధిలో 274, బోరబండ పరిధిలో 268, మాసబ్ట్యాంక్ పరిధిలో 44, ఎస్ఆర్నగర్ లిమిట్స్లో 239, పంజగుట్ట పరిధిలో 185, ఫిలింనగర్లో 215, మధురానగర్లో 287, జూబ్లీహిల్స్ PS పరిధిలో 126 విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో 278 మంది పోలీసులను భద్రత కోసం కేటాయించారు.
స్థానిక సంస్థలు ఎన్నికలు, నగరంలో ఉపఎన్నిక, రానున్న GHMC ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్న ప్రధాన పార్టీలకు చెందిన లీడర్లు ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు గణపతి ఉత్సవాలు వేదికయ్యాయని గ్రామాల్లో, నగరంలో యువకుల మాట. వీరికి దగ్గరయ్యేందుకు యువజన సంఘాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎంత ఖర్చైనా చేసేందుకు నేతలు పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మీ కామెంట్.
HYDలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నట్లు వైద్యులు తెలిపారు. గ్రేటర్లో ఇప్పటికి 500కుపైగా ఈ కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, జాయింట్ పెయిన్స్, బీపీ తగ్గటం, కాళ్లు చేతులు చల్లబడటం, కాళ్ల వాపు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని OUMC ప్రిన్సిపల్ రాజారావు సూచించారు. శివారులో పారిశుద్ధ్యం లోపించడం, కొందరు ప్రైవేట్ స్థలాలను శుభ్రంగా ఉంచకపోవడంతో దోమలు వ్యాపిస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.