India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు, శిక్షలు విధించినా కొందరు మందు బాబులు మాత్రం మారడం లేదు. మద్యం తాగి పదేపదే దొరుకుతున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి జులై 31వ తేదీ వరకు 7 నెలల వ్యవధిలో వెస్ట్జోన్ ట్రాఫిక్ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్ఆర్నగర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 5,540 మంది పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు.
ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై కొరడా ఝళిపించేందుకు రవాణాశాఖ సిద్ధమవుతోంది. ప్రస్తుత చలాన్లపై 5,6 రెట్లు పెంచి పలు నిబంధనల్లో పలు మార్పులు చేసేందుకు యోచిస్తోంది. ఇష్టారీతిన వాహనాలు నడిపేవారికి ముక్కు తాడు వేసేందుకు ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతేడాది హెల్మెట్ లేకుండా పట్టుబడ్డ 18,33,761 మందికి జరిమానాలు విధించారు.
HYDలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తమ విద్యా సంస్థల నుంచి ఐదుగురు విద్యార్థులను ఇన్స్పైర్ అవార్డు మానక్ 2024-25 నామినేట్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని రోహిణి తెలిపారు. సెప్టెంబర్ 15 లోపు నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా HYDలో నేడు ఉ.4 నుంచి రా.11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. గన్ ఫౌండ్రీ ➥ తిలక్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలు నాంపల్లి స్టేషన్ వైపు వెళ్లకుండా GPO జంక్షన్ ➥ MJ మార్కెట్ వైపు మళ్లిస్తారు. MJ మార్కెట్ నుంచి GPO జంక్షన్ వెళ్లకుండా నాంపల్లి వైపు డైవర్ట్ చేస్తారు. నాంపల్లి నుంచి కోఠి➥ ట్రూప్ బజార్➥ బ్యాంక్ గల్లికి డైవర్ట్ చేస్తారు. BJP ఆఫీస్ ➥ MJ మార్కెట్ వైపు మళ్లిస్తారు.
జనహితం కోసం, భవిష్యత్ తరాల మేలు కోసం హైడ్రా ద్వారా చెరువుల పరిరక్షణను బృహత్తర బాధ్యతలా చేపట్టామని, ఇందులో రాజకీయ ఒత్తిళ్లకు తావు లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లేక్ సిటీగా వర్ధిల్లిన హైదరాబాద్ నగరానికి పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోకుంటే అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకం కావొద్దంటే వర్తమానంలో కఠిన చర్యలు తప్పవన్నారు.
రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 26న ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఇస్కాన్ టెంపుల్, అబిడ్స్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.
HYD నగరంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న దివ్యాంగులు, చిన్నారి బాధితులకు సంబంధించి జరిగిన స్టేట్ లెవెల్ సమావేశంలో CID డైరెక్టర్ షికాగోయల్ పాల్గొన్నారు. డైరెక్టర్ మాట్లాడుతూ..పోలీస్ స్టేషన్లలో భరోసా సెంటర్ల ఏర్పాటు ద్వారా చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడి, మంచి ప్రభావం చూపినట్లుగా పేర్కొన్నారు. భద్రత పై ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గే పరిస్థితి ఉండదన్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి శనివారం బంజారాహిల్స్ పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో మూడు కమిషనరేట్స్ పరిధిలోని ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు, గణేశ్ ఉత్సవ్ సమితి, ఖైరతాబాద్ ఉత్సవ్ సమితి, పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయకచవితి ఉత్సవాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని పలు సూచనలు చేశారు.
ఈయన పేరు శివన్కుట్టి.. రిటైర్డ్ ఆర్మీ అధికారి. వయస్సు 75 ఏళ్లు. ఈ వయస్సులోనూ సాహసోపేత బైక్ రైడ్ చేపట్టి ఈ తరం యువతకు తానేం తక్కువ కాదని నిరూపించారు. హైదరాబాద్ టూ లడఖ్.. లడఖ్ టూ కన్యాకుమారి, హైదరాబాద్ ఇలా సోలో బైక్ రైడ్తో దేశభక్తి చాటుతూ.. జాతీయ జెండాను రెపరెపలాడించారు. ఈ ఏడాది మే 26న నా యాత్ర ప్రారంభమై.. జూలై 20న ముగిసింది. 55 రోజుల్లో 8,826 కిలోమీటర్ల మేర యాత్ర చేశారు.
HYD, RR, MDCL,VKB జిల్లాలో ఉంటున్న ప్రజలకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ‘క్యూలైన్ తిప్పలు వద్దు.. UTS యాప్ ముద్దు’ అని తెలిపారు. ఇటీవల రైల్వే స్టేషన్లలో వందల సంఖ్యలో ప్రయాణికులు క్యూలైన్లో నిలబడి టికెట్లు తీసుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా UTS మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.