Hyderabad

News August 27, 2025

HYD: భారీ వర్షాలు.. పలు రైళ్లు రద్దు

image

భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే రద్దు చేసింది. కాచిగూడ- కరీంనగర్ రైలు బిక్నూరు- కరీంనగర్ మధ్య, నాందేడ్-మేడ్చల్ వెళ్లే రైలు కామారెడ్డి- మేడ్చల్ మధ్య, విశాఖ- నాందేడ్ రైలు ఆకంపేట- నాందేడ్ మధ్యలో క్యాన్సిల్ చేయగా, కాచిగూడ నుంచి మన్మాడ్ వెళ్లే రైళ్లు పలు ప్రాంతాలకు డైవర్షన్ చేసినట్లు <<17535440>>షెడ్యూల్<<>> విడుదల చేశారు. కాచిగూడ- మెదక్, నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రద్దు చేశారు.

News August 27, 2025

HYD: రైల్వే అభివృద్ధి పనుల్లో స్పీడ్ పెంచండి: DRM

image

సికింద్రాబాద్ రైల్వే అభివృద్ధి పనుల్లో స్పీడ్ పెంచాలని DRM గోపాలకృష్ణన్ అధికారులు, ఇంజినీర్లను ఆదేశించారు. స్టీల్ వర్క్ దాదాపుగా చివరి స్థాయికి వచ్చినట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఇప్పటికే వెయిటింగ్ అలా అందుబాటులోకి రాగా, త్వరలోనే ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు వివరించారు.

News August 27, 2025

HYD: ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో రూ.72.31కోట్లతో టెండర్లు

image

HYDలో 44 ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ, కొత్త వాటి ఏర్పాటుకు రూ.72.31 కోట్లతో టెండర్లు పిలవనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియజేసింది. నిర్ణయాలను ఒక్కొక్కటిగా అమలు చేయడం కోసం అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. పనులపై కసరత్తు చేయాలనే సూచించినట్లు జీహెచ్ఎంసీ వివరించింది.

News August 27, 2025

HYD: భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు రద్దు

image

భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నేడు పలు రైళ్లు రద్దు చేసింది. నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను రద్ద అయింది. మెదక్ – కాచిగూడ రైలు నేడు పాక్షికంగా రద్దు చేశారు. హైదరాబాద్ రైల్వే డివిజన్‌లోని భిక్నూర్ – తల్మడ్ల సెక్షన్, అకన్నపేట్ – మెదక్ సెక్షన్‌లో ట్రాక్‌లపై వరద నీరు పొంగిపొర్లుతుంది.

News August 27, 2025

ఐఐటీ HYDతో మిలిటరీ అధికారుల ఒప్పందం

image

ఐఐటీ హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని సిమ్యులేటర్ డెవలప్‌మెంట్ డివిజన్ మధ్య ఒప్పందం కుదిరింది. దీని ద్వారా సికింద్రాబాద్‌లో ఏఆర్‌/వీఆర్‌ టెక్నాలజీ నిపుణుల కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ భాగస్వామ్యం లక్ష్యం.. ఆధునిక పరిశోధనలను సైనిక అవసరాలకు అనుగుణంగా మార్చి, సైనికులకు అధునాతన శిక్షణను అందించే సాంకేతికతను అభివృద్ధి చేయడం. భవిష్యత్ మిలిటరీ సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు

News August 27, 2025

వర్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన

image

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలకు అలుగులు పొంగుతున్నాయి. ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. హైదరాబాద్‌లోని నీరు నిలిచే ప్రాంతాల వద్ద జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News August 27, 2025

శంకర్‌పల్లి మీదుగా తిరుపతి రైలు రద్దు

image

నిజామాబాద్ నుంచి శంకర్‌పల్లి మీదుగా తిరుపతికి వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం రద్దయింది. భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. వికారాబాద్, తాండూర్, మంత్రాలయం, గుంతకల్లు, కడపకు వెళ్లే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించగలరని రైల్వే అధికారులు కోరారు.

News August 27, 2025

కృష్ణాన‌గ‌ర్‌లో హైడ్రా నాలా ఆప‌రేష‌న్‌

image

నాలాలో ఒకటిరెండు అడుగుల పూడిక సహజమే. కానీ.. HYD కృష్ణానగర్‌లో 8 అడుగుల లోతైన నాలాలో 6 అడుగుల మేర సిల్ట్ పేరుకుపోవడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. 2 మీటర్ల పూడిక తీయగానే 7,8 ట్రాక్టర్లు నిండుతున్నాయి. 8 అడుగుల లోతు, ఆర‌డుగుల మేర పూడిక‌తీత పనులు నిర్వహిస్తున్నట్లు హైడ్రాధికారులు తెలిపారు. కమిషనర్ రంగనాథ్ సైతం పరిశీలించినట్లు వివరించారు.

News August 27, 2025

HYD: 20 నిమిసాల్లో భార్యను ముక్కలుగా చేశాడు!

image

మేడిపల్లి స్వాతి దారుణ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మహేందర్ రెడ్డి తన భార్య స్వాతి మృతదేహాన్ని 20 నిమిషాల్లోనే ముక్కలు చేసి మూసీ నదిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. గత 4 రోజులుగా DRF బృందాలు ఆమె శరీర భాగాల కోసం గాలిస్తున్నారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

News August 27, 2025

HYD: వర్షం పడిన ప్రతీసారి ఈ మార్గాల్లో ట్రాఫిక్

image

వర్షం పడితే HYDలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. గచ్చిబౌలి- మియాపూర్, లింగంపల్లి- హైటెక్ సిటీ, జేఎన్టీయూ- హఫీజ్‌పేట్- KPHB, బొటానికల్ గార్డెన్- కొత్తగూడ, టోలిచౌకి- రాయదుర్గం, షేక్‌పేట్ ఫ్లూఓవర్, కోఠి- ఎల్బీనగర్ వంటి ప్రధాన మార్గాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ సమస్యలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఐటీ కారిడార్‌ ప్రాంతంలో వాహనాల రద్దీ పెరగడం కారణంగా సమస్యలు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు.