India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
> జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో నవ వధువు ఆత్మహత్య
> అదనపు, జోనల్ కమిషనర్లతో GHMC కమీషనర్ ఆమ్రపాలి టెలీ కాన్ఫరెన్స్
> రామంతపూర్లో భవనంపై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య
> బోయిన్పల్లిలి వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ అనుదీప్
> కేటీఆర్కు రాఖీలు కట్టిన మహిళా కమిషన్ సభ్యులు
> ఆర్టీసీ కళా భవన్లో ప్రగతి చక్ర అవార్డుల ప్రదానోత్సవం
> PIB ఏడీజీ శ్రుతి పాటిల్తో గవర్నర్ సమావేశం
HYD నగరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిపై రైల్వే సహాయక మంత్రి రవ్నీత్సింగ్ బిట్టు మీడియాతో మాట్లాడారు. పునరాభివృద్ధి అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే, 40 ఏళ్ల వరకు ఎలాంటి డోకా ఉండదన్నారు. రాబోయే 40 ఏళ్ల ప్రయాణికుల సామర్థ్యాన్ని అంచనా వేసి, డిజైన్ చేసి పనులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాంలో GM అరుణ్ కుమార్ జైన్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
HYD నగరంలోని ఉస్మానియా, గాంధీ, NIMS ఆస్పత్రుల్లో కాలేయ మార్పిడి కోసం రోగులు ఏళ్లుగా వేచి చూస్తున్నారు. లాస్ట్ స్టేజ్ సిరోసిస్ లాంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి కాలేయ మార్పిడే చివరి ఆశ. ఉస్మానియాలో కాలేయ మార్పిడి కోసం వందల మంది వేచి చూస్తున్నారు. కాలేయ మార్పిడి జరిగితే తప్ప బతకడం కష్టమని రోగుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగులకు ఆర్టీసీ సంస్థ అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరెంట్షాక్తో మరణించిన వరంగల్-2 డిపోకు చెందిన డ్రైవర్ మెరుగు సంపత్ కుటుంబసభ్యులకు రూ.1.15 కోట్ల విలువగల ప్రమాద బీమా చెక్ను మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం బాగ్ లింగంపల్లిలో అందజేశారు. కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ.సజ్జనర్, యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జోనల్ హెడ్ అరుణ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.
జగద్గిరిగుట్ట PSపరిధి రిక్షా పుల్లర్ కాలనీలో విషాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. యువతి మనీషాను ప్రేమించి, పెద్దల అనుమతితో జులై 10న ఆర్య సమాజ్లో యువకుడు శేఖర్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందే మరో యువతితో శేఖర్కు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. వరకట్న వేధింపులతో ఈనెల 11న మనీషా యాసిడ్ తాగింది. చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందింది. శేఖర్ అల్వాల్ PSలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు.
HYDలో సెల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ డ్రైవింగ్, నో పార్కింగ్, అర్హత లేకుండా డ్రైవింగ్ లాంటివి చేసిన వారిపై గత సంవత్సరం 14.2 లక్షల మంది పై మాత్రమే కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది మే వరకు 18.15 లక్షల మంది పై కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే దాదాపుగా 28% జరిమానాలు పెరిగినట్లు పేర్కొన్నారు. రోడ్లపై డ్రైవింగ్ చేసేవారు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.
HYD, RR, MDCL, VKB జిల్లాల్లోని ప్రజలు tspolice.gov.in వెబ్సైట్ ద్వారా పోలీసులకు ఫిర్యాదులు, సూచనలను ఇప్పుడు ఆన్లైన్ ద్వారా చేయొచ్చని HYD, CYB పోలీస్ అధికారులు తెలిపారు. FIR సైతం డైరెక్ట్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. ప్రజా భద్రత విషయంలో పారదర్శకతను పాటిస్తున్నట్లుగా పోలీసు యంత్రాంగం తెలిపింది.
HYD ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి ప్రైవేట్ ఆసుపత్రులతో పోలిస్తే అంతంత మాత్రమే జరుగుతుంది. 2013నుంచి ఇప్పటివరకు సుమారు నిమ్స్ ఆసుపత్రిలో 32, గాంధీలో ఒకటి, ఉస్మానియాలో 9 అవయవ మార్పిడి పరీక్షలు జరిగాయి. అదే.. యశోదలో 486, కిమ్స్లో 275 అవయవ మార్పిడిలు జరగడం గమనార్హం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిపుణులు ఉన్నప్పటికీ, అత్యాధునిక థియేటర్లు, పూర్తి వసతులు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
HYD సోమాజిగూడ వద్ద ఉన్న రాజ్ భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ADG శృతి పాటిల్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏడీజీ, మీడియా యూనిట్స్ పరిస్థితి, మినిస్ట్రీ ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ సంబంధించిన సమాచారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువచ్చినట్లుగా పేర్కొన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వ్యక్తులు 2 రోజుల పాటు ట్రాఫిక్ డ్యూటీ చేయాలని మెజిస్ట్రేట్ ఆదేశించింది. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఉప్పల్ ట్రాఫిక్ పీఎస్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు కోర్టు ఆర్డర్లను అమలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వారు ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ‘మద్యం తాగి వాహనం నడపొద్దని’ ప్లకార్డులను ప్రదర్శించారు.
Sorry, no posts matched your criteria.