India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గణేశ్ నవరాత్రుల నేపథ్యంలో మహిళల భద్రత కోసం షీ టీమ్స్ రంగంలోకి దిగాయి. అన్ని ప్రధాన గణేశ్ మండపాల వద్ద షీ టీమ్స్ నిఘా పెట్టాయి. మహిళా భక్తులు, యువతుల పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్స్ DCPలు హెచ్చరించారు. ఈ మేరకు మహిళలు, యువతులు వేధింపులకు గురైతే సమాచారం ఇవ్వాలంటే HYD 9490616555, రాచకొండ 8712662111, సైబరాబాద్ 9490617444,100/112 నం.లకు కాల్ చేయాలని తెలిపాయి.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. నేడు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి అత్యధికంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 14.8 మిల్లీమీటర్లు, కూకట్నల్లి 10, కుత్బుల్లాపూర్ 8, అల్వాల్ 7.8, షేక్పేట 6, మారేడుపల్లిలో 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. గణపతి పండుగ వేళ వర్షం కురుస్తుండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇకపై కరెంట్ కనెక్షన్ తీసుకోవడం భారంగా మారేలా కనిపిస్తోంది. నగరంలో అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తులు ఉండటం సహజం. అయితే.. కనీసం లోడ్ 1BHK ఫ్లాట్కు 2 కిలోవాట్లు, 2BHKకు 5 కిలోవాట్లు, 3BHKకు 10 కిలోవాట్లు, 4BHK అంతకంటే ఎక్కువ ఉన్న వాటికి 15 కిలోవాట్ల లోడ్ తీసుకోవాలని TGSPDCL జారీ చేసిన ఆదేశాలు కీలకంగా మారనున్నాయి. గతం కంటే ఇవి అధికమని వినియోగదారులంటున్నారు. దీనిపై మీకామెంట్.
1954లో ఒక్క అడుగుతో సింగరి శంకరయ్య కృషితో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేశ్ చరిత్ర నేటికీ పదిలంగా కొనసాగుతోంది. 2014లో 60 ఏళ్లు పూర్తైనందున 60 ఫీట్లు, 2024లో 70 ఏళ్లు పూర్తైనందున 70 ఫీట్ల గణపతిని ప్రతిష్ఠించారు. ఈఏడాది ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో యుద్ధాలు ముగిసి శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తూ.. 69 ఫీట్ల విశ్వశాంతి మహాశక్తి గణపతిని ప్రతిష్ఠించారు.
HYDలో ఓ దిక్కు భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు యువకులను వినాయక చవితి ఉత్సాహం అలరిస్తోంది. ఈ వర్షాన్ని లెక్కచేయకుండా గణపయ్యలను తమ ఇళ్లకు తీసుకెళ్తున్నారు. వార్షానికి తడవొద్దని వెంకటాద్రి టౌన్షిప్లో ఓ బాలుడు తన బైక్పై విగ్రహాన్ని మోసుకెళ్తూ, పూజ దుకాణం వద్ద ఆగి గొడుగు పట్టిన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. భక్తి, ఆరాధన, కర్తవ్య సమ్మేళనంగా మారిన ఈ క్షణాన్ని Way2News కెమెరాలో బంధించింది.
నగర వ్యాప్తంగా అనేక చోట్ల ఇప్పటికే వర్షం కురుస్తోంది. దాదాపు ఒంటిగంట వరకు వర్షం కొనసాగే అవకాశం ఉన్నట్లు బేగంపేట్ వాతావరణశాఖ తెలిపింది. హైటెక్సిటీ, గచ్చిబౌలి, కూకట్పల్లితో సహా రంగారెడ్డిలోని రాజేంద్రనగర్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, షాద్నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మిగతా ప్రాంతాలకూ ఆరెంజ్ అలెర్ట్ ఉందని, అవసరమైతే కానీ బయటకు వెళ్లొద్దని సూచించారు.
ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనం కోసం వెళ్లిన మహిళ ఉ.6 గంటలకు క్యూ లైన్లోనే ప్రసవించింది. ఆమె రాజస్థాన్కు చెందిన రేష్మగా గుర్తించారు. ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
HYDలో నిన్న సాయంత్ర కురుస్తున్న వర్షానికి భారీగా వర్షపాతం నమోదైంది. శేరిలింగంపల్లిలో ఏరియాలో 4 CM, రామచంద్రపురం 3.5, కుత్బుల్లాపూర్లో 2.9, పటాన్చెరు 2.9, కూకట్పల్లిలో 2.7, షేక్పేట్లో 2.4, ముషీరాబాద్ 2.3, కాప్రాలో 2.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ సాయంత్రం వరకు వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
HYD బిగ్గెస్ట్ పండుగ గణేశ్ ఉత్సవాలు షురూ అయ్యాయి. RR, మేడ్చల్, HYD జిల్లావ్యాప్తంగా పూలు, పండ్లు, ఇతర పూజ సామగ్రి ధరలు అమాంతం పెరిగిపోయాయి. చామంతి పూలు కేజీ ₹600-800 మధ్య తూగుతోంది. బంతిపూలు కిలో రూ.150 నుంచి రూ.200 వరకు, అరటి డజన్ రూ.40- 60కి పెంచారు. బత్తాయి, యాపిల్, దానిమ్మ, జామ వంటి పూజలో ఉపయోగించే పండ్ల ధరలు రెట్టింపు చేశారు. దీంతో పండుగ వేళ కొనక తప్పదని కొనుగోలు చేస్తున్నారు.
క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పే మాస్టారు మారథాన్లో పరుగులు తీస్తున్నారు. మారేడ్పల్లి శ్రీ రాఘవ లక్ష్మిదేవి జూ.కాలేజీలో హిస్టరీ లెక్చరర్ సమ్మయ్య HYD రన్నర్స్ సొసైటీ(NMDC-2025) ఆధ్వర్యంలో నిర్వహించిన మారథాన్ను కంప్లీట్ చేశారు. 42 ఏళ్ల వయసులో 42KM పరిగెత్తడం విశేషం. యువత ఫిట్నెస్పై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. సమ్మయ్య ప్రతిభను ప్రిన్సిపల్ A.భాగ్యలక్ష్మి, లెక్చరర్లు, విద్యార్థులు అభినందించారు.
Sorry, no posts matched your criteria.