Hyderabad

News March 24, 2025

హైటెక్‌సిటీలో కేఫ్ నీలోఫర్ బ్రాంచ్ ప్రారంభం

image

టీ, స్నాక్స్‌కు ప్రసిద్ధి చెందిన కేఫ్ నీలోఫర్ హైటెక్‌సిటీలో నూతన బ్రాంచ్‌ను ఆదివారం మంత్రి శ్రీధర్‌బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. తమ 19వ అవుట్‌లెట్‌ను 40,000sft, 700 మంది కెపాసిటీ, ప్రత్యేకమైన పార్టీ జోన్స్‌తో ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉందని MD శశాంక్ తెలిపారు. సంప్రదాయాన్ని ఆధునిక రుచితో మిళితం చేస్తూ ఇక్కడ మరిన్ని ప్రత్యేకతలతో ప్రామాణికమైన హైదరాబాదీ రుచుల వారసత్వాన్ని కొనసాగిస్తామన్నారు.

News March 24, 2025

ఉప్పల్: పడితే ‘పంచ’ప్రాణాలకు ముప్పే!

image

ట్రిపుల్ రైడింగ్ ప్రాణాలు తీస్తుందని పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ, వాహనదారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనమే ఉప్పల్లో ఒకే బైకుపై ఐదుగురు ప్రయాణించడం. ఏకంగా బైక్ ట్యాంక్ మీద సైతం కూర్చోబెట్టి డ్రైవ్ చేశాడా డ్రైవర్. ఇలా డ్రైవ్ చేయడం అంటే మన ప్రాణాలు మనమే తీసుకోవడమని పోలీసులు చెబుతున్నారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

News March 24, 2025

GHMCలో 27 మంది ఇంజినీర్ల తొలగింపు

image

GHMC కమిషనర్ ఇలంబర్తి సంచలన నిర్ణయం తీసుకున్నారు. GHMC టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న న్యాక్ అవుట్ సోర్సింగ్ 27 మంది ఇంజినీర్లను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. క్రమశిక్షణ, అక్రమాలకు పాల్పడుతున్నవారితో చెడ్డపేరు వస్తుందని, వారిని విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. కొంతకాలంగా గ్రేటర్లో ఆక్రమణలపై ఇంజినీర్లు తనిఖీలు చేయకపోవడం, చేసినా చర్యలు తీసుకోకపోవడంతో తొలగించినట్లు తెలిపారు.

News March 24, 2025

HYD MMTSలో యువతిపై అత్యాచారయత్నం

image

సికింద్రాబాద్ TO మేడ్చల్ MMTS ట్రెయిన్‌లో ఓ యువతిపై దుండగుడు అత్యాచారానికి యత్నించాడు. ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారానికి యత్నించగా.. కదులుతున్న ట్రెయిన్‌లో నుంచి ఆ యువతి దూకేసింది. తీవ్రగాయాలైన ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 24, 2025

HYD: రూ.5లక్షలు కాజేసిన సుడో పోలీసులు

image

HYD: బోయినపల్లిలో సుడో పోలీసు డబ్బులు కాజేశాడు. రాత్రి సమయంలో వాహనం తనిఖీ చేయలంటూ ద్విచక్ర వాహనదారుడిని సూడో పోలీసులు ఆపారు. పోలీస్ డ్రెస్‌లో ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ తనిఖీ చేశారు. వాహణదారుడి దగ్గర రూ. 5లక్షల బ్యాగు ఉండటం చూసి వివరాలు అడిగారు. పోలీస్టేషన్‌కు వచ్చి వివరాలు చెప్పి డబ్బులు తీసుకవెళ్లలంటూ బ్యాగుతో పరారీ అయ్యారు. ఈమేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

News March 24, 2025

నగరంలో విద్యుత్ స్తంభాల లెక్క ఇక పక్కా

image

మహానగరంలో విద్యుత్ స్తంభాలు అసలు ఎన్ని ఉన్నాయో మనకే కాదు విద్యుత్ అధికారులకు కూడా అంతుపట్టదు. ఇక కరెంటు సమస్యలు వచ్చినప్పుడు ఏ పోల్‌లో సమస్య వచ్చిందో కనుగొనడం కష్టమవుతోంది. దీంతో స్తంభాల వివరాలను పక్కాగా లెక్కించనున్నారు. ప్రతి పోల్‌కు ఒక ఐడీ, క్యూఆర్ కోడ్ ఇవ్వనున్నారు. క్యూఆర్ కోడ్‌తో ఆ స్తంభం చరిత్ర మొత్తం తెలిసేలా సాఫ్ట్వేర్ రూపొందించనున్నారు.

News March 24, 2025

ఖైరతాబాద్‌: కారు కడిగితే రూ.10,000 కట్టాల్సిందేనా..?

image

అదేంటి మా కారు మేము కడిగితే రూ.10వేలు ఎందుకు కట్టాలి అని అనుకుంటారు. మీరు కాదులెండి. జలమండలి సరఫరా చేసే నీటితో విచ్చలవిడిగా కార్లు కడిగిన వారికి ఈ భారీ జరిమానా విధించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులకు సూచించారు. సరఫరా చేస్తున్న నీటిని విచ్చలవిడిగా వృథా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులు ఆలోచిస్తున్నారు. అయినా మంచినీటితో కారును ఎందుకు కడగాలి? అనేది మనం ఆలోచించాలి.

News March 24, 2025

HYD: ఏప్రిల్ 1 నుంచి స్కిల్ ఎడ్యుకేషన్ మేళా

image

కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గల సాఫ్ట్వేర్ స్కిల్ కోర్సుల్లో విద్యార్దులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 15 రోజుల పాటు స్కిల్ ఎడ్యుకేషన్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మణికొండలోని కార్యాలయంలో స్వయంగా గాని, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News March 24, 2025

చార్మినార్: పాతబస్తీలో పార్కింగ్‌కు నో పరేషాన్ !

image

రంజాన్ నేపథ్యంలో పాతబస్తీకి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు పార్కింగ్ స్థలాలను కేటాయించారు. సిటీ కాలేజీ, కులీ కుతుబ్ షా స్టేడియం, ఖిల్వంత్ గ్రౌండ్, మోతీగల్లీ ఓల్డ్ పెన్షన్ ఆఫీస్ ప్రాంతం, ముఫీద్ ఉల్ ఆనం గ్రౌండ్, చార్మినర్ బస్ టెర్మినల్, ఆయుర్వేదిక్ యునాని ఆస్పత్రి ప్రాంగణం ప్రాంతాల్లో ఉచితంగా పార్కింగ్ చేసుకోవచ్చు.

News March 24, 2025

సచివాలయానికి వెళ్లాలంటే ఫోన్లు డిపాజిట్ చేయాల్సిందే !

image

సచివాలయం ప్రజా ప్రభుత్వానికి చిహ్నమని, ఎవరైనా నిరభ్యంతరంగా రావచ్చని అప్పట్లో CM రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. కాగా ఇటీవల సచివాలయంలో ఏర్పడిన పరిమితులపై ప్రజల నుంచి ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ప్రజలు, ప్రతినిధులు, మీడియా స్వేచ్ఛగా సచివాలయంలోకి రావచ్చని చెప్పిన ప్రభుత్వ విధానం ఇప్పుడు విరుద్ధమైందని విమర్శలు వస్తున్నాయి. సచివాలయంలోకి వెళ్లే వారు తమ ఫోన్లను డిపాజిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.