Hyderabad

News August 23, 2024

HYD: ‘బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి’

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో బీసీ కుల గణన చేసి రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని, బీసీ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకగ్రీవంగా ఈరోజు తీర్మానం చేశారు. బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని ప్రధాన డిమాండ్‌తో, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలు, బీసీ కుల సంఘాల, సంయుక్త సమావేశం నిర్వహించారు.

News August 23, 2024

HYD: ఆయన జీవితం స్ఫూర్తిదాయకం: మాజీ ఉప రాష్ట్రపతి

image

స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి సందర్భంగా HYDలోని శాసనసభ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుష్పాంజలి ఘటించారు. సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో ఆంగ్లేయ సాయుధ బలగాలకు గుండెలు చూపిస్తూ ధైర్యం ఉంటే కాల్చుకోండి అని సింహంలా గర్జించి ఆంధ్ర కేసరిగా సుప్రసిద్ధులైన శ్రీ ప్రకాశం పంతులు జీవితం స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.

News August 23, 2024

BREAKING: HYD: ఏసీబీ వలకు చిక్కిన మరో అధికారిణి..!

image

HYDలో ACB ఆకస్మిక దాడులు కొనసాగిస్తోంది. నేడు నారాయణగూడ సర్కిల్ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారిణి బి.వసంత ఇందిరా రూ.35,000 లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కారు. ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు, నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. అకౌంట్లకు సంబంధించిన ఓ విషయమై ఆమె లంచం తీసుకున్నట్లుగా ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

News August 23, 2024

HYD: రూ.1,450తో మెట్రో డీలక్స్ నెలవారి బస్ పాస్

image

ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు మరోసారి మెట్రో డీలక్స్ నెలవారి బస్సు పాసు ప్రవేశపెట్టినట్లు గ్రేటర్ RTC ఈడీ వెంకటేశ్వర్లు ఈరోజు తెలిపారు. రూ.1450 చెల్లించి మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ మెట్రో ఎక్స్‌ప్రెస్(నాన్ఏసీ), ఆర్డినరీ బస్సుల్లో ప్రయాణించవచ్చన్నారు. రూ.5000తో పుష్పక్ ఏసీ,రూ.1900తో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ,రూ.1300తో మెట్రో ఎక్స్‌ప్రెస్, రూ.1150తో సిటీ ఆర్డినరీ బస్ పాసులు ఉంటాయన్నారు.

News August 23, 2024

HYD: మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై స్పందించిన మహిళా కమిషన్

image

సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో రుణమాఫీపై వాస్తవ పరిస్థితి ఏంటనే విషయమై తెలుసుకునేందుకు ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఆవుల సరిత, విజయరెడ్డి వెళ్లగా వారిపై కొందరు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వీలైనంత త్వరగా దర్యాప్తు చేసి ఛార్జ్ తీసుకోవాలని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ శారద ఈరోజు HYD నుంచి నాగర్‌కర్నూల్ ఎస్పీకి లేఖ రాశారు. జరిగిన విషయాన్ని తనకు తెలియజేయాలని లేఖ ద్వారా కోరారు.

News August 23, 2024

HYD: డీజీపీని కలిసిన మహిళా జర్నలిస్టులు 

image

HYDలోని తెలంగాణ డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ జితేందర్‌ను ఈరోజు మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి కలిశారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ అయ్యిందా లేదా అని రైతులను అడిగేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై వారు ఈ ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు.

News August 23, 2024

HYD: మంత్రి కోమటిరెడ్డిని కలిసిన మందకృష్ణ మాదిగ

image

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని HYD బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో కలిశారు. ఈ రోజు ఉదయం రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు మంత్రిని కలిసిన మందకృష్ణ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మోత్కుపల్లి, MLAలు అడ్లూరి లక్ష్మణ్, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య ఉన్నారు.

News August 23, 2024

HYD: వరద నీటికి అడ్డుకట్ట.. ఈ ప్రాంతాల్లో సంపులు!

image

HYD నగరంలో వరద నీటికి అడ్డుకట్ట వేసేందుకు GHMC రోడ్ల పరిసరాల్లో సంపుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. PVNR పిల్లర్ నంబర్-264, నేతాజీ నగర్, రంగ మహల్ జంక్షన్, సోమాజిగూడ ఇమేజ్ ఆసుపత్రి, సోమాజిగూడ జోయ్ ఆలుకాస్, రాజీవ్ గాంధీ విగ్రహం, లక్డీకపూల్ ద్వారక హోటల్, ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్, అయ్యప్ప సోసైటీ చెక్ పోస్ట్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, ఓల్డ్ కేసీపీ ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు.

News August 23, 2024

HYD: గాంధీ, ఈఎస్ఐసీని ప్రశంసించిన ఐసీఎంఆర్

image

కరోనా కష్టకాలంలో రోగులకు సేవలందించిన గాంధీ మెడికల్ కాలేజీ, సనత్ నగర్ ఈఎస్ఐసీ ఆస్పత్రులను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రశంసలతో ముంచెత్తింది. గురువారం ఢిల్లీ క్లినికల్ రిజిస్ట్రీ ఫర్ కొవిడ్-19 రిపోర్టు రిలీజ్ అండ్ డిస్సెమినేషన్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో గాంధీ ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు, ప్రొఫెసర్ త్రిలోక్ చందర్‌ను సన్మానించి, ప్రశంసాపత్రాలను అందజేశారు.

News August 23, 2024

బాలాపూర్‌: బీటెక్ స్టూడెంట్ ప్రశాంత్ హత్య కేసులో పురోగతి

image

బాలాపూర్‌లో బీటెక్ స్టూడెంట్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో పక్కా ప్లాన్ చేసి మరీ ప్రశాంత్‌ని హత్య చేసినట్లు గుర్తించారు. హంతకులు అంతా ఒకే బస్తీకి చెందిన వారు అని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో దొరికిన సీసీ ఫుటేజ్ ద్వారా మూడు గంటల్లో నిందితులకు చెక్ పెట్టినట్లు పోలీసులు తెలిపారు.