Hyderabad

News August 23, 2024

HYD: ఐఐటీహెచ్‌లో బాహుబలి డ్రోన్ తయారీ!

image

విపత్తుల సమయంలో బాధితులకు సాయం అందించడం సవాళ్లతో కూడుకున్న పని, చాలాసార్లు హెలికాప్టర్ వెళ్లలేని ప్రాంతాలు సైతం ఉంటాయి. ఇలాంటి పరిస్థితులను ధీటుగా ఎదుర్కొనేందుకు ఐఐటీ హైదరాబాద్ చేపట్టిన డ్రోన్ల తయారీ ప్రాజెక్టు తుది దశకు చేరింది. ఇప్పటికే 60 కిలోల బరువు తీసుకువెళ్లే డ్రోన్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారు. తాజాగా 100 కిలోల బరువును అవలీలగా తరలించే ప్రాజెక్టు ప్రయోగ దశలో ఉంది.

News August 23, 2024

HYD: ఎంపాక్స్ ఎఫెక్ట్.. గాంధీలో ప్రత్యేక వార్డులు

image

ప్రపంచవ్యాప్తంగా ఎంపాక్స్ (మంకీపాక్స్) అలజడి రేకెత్తిస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రులను సిద్ధం చేసింది. అక్కడ ప్రత్యేక వార్డులు నెలకొల్పింది. గాంధీలో 20 పడకలు కేటాయించారు. ఇందులో పురుషులకు, మహిళలకు పదేసి పడకలు కేటాయించినట్లు గాంధీ వైద్యులు పేర్కొన్నారు. ఫీవర్ ఆసుపత్రిలో ఆరు పడకలు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు.

News August 23, 2024

HYD: ధరణి సమస్య.. తలకిందులుగా నిరసన చేసిన బాధితుడు

image

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహశీల్దార్ కార్యాలయంలో ఓ వ్యక్తి తన భూమికి సంబంధించి ధరణి సమస్య పరిష్కారం కాకపోవడంతో తలకిందులుగా నిరసన చేశాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాధితుడు చేసిన పనికి తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు, కార్యాలయ అధికారులు అవాక్కయ్యారు.

News August 23, 2024

HYD: వినికిడి సమస్య ఉందా..? ENT వెళ్లండి!

image

కోఠి ENT ఆసుప‌త్రిలో వినికిడి సమస్య సంబంధించిన స‌ర్జ‌రీలు ఇటీవ‌ల పెద్ద సంఖ్య‌లో జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఖ‌రీదైన వినికిడి యంత్రాలు, స‌ర్జ‌రీలు చేయించుకున్న‌ వారికి LOC, CMRF ద్వారా ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తోంది. చికిత్స‌ల అనంత‌రం ఉచితంగా వినికిడి యంత్రాల‌తో పాటు, ఏడాది పాటు AVT( Auditions Verbal Therapy) అందిస్తారు.

News August 22, 2024

BREAKING: HYD: బాలాపూర్‌లో మరో హత్య..! 

image

HYD బాలాపూర్ PS పరిధిలో మరో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రౌడీషీటర్ రియాజ్ హత్య మరువక ముందే మరో యువకుడిని గుర్తు తెలియని దుండగులు వెంటపడి మరీ కత్తులతో పొడిచి హత్య చేశారు. బాలాపూర్ గణేశ్ చౌక్ వద్ద ఉన్న ఓ హోటల్ ఎదుట జనం చూస్తుండగానే హత్య జరిగింది. మృతుడి ఎంవీఎస్ఆర్ మాజీ స్టూడెంట్ ప్రశాంత్‌గా గుర్తించారు. ఘటనా స్థలానికి DCP సునీతారెడ్డి చేరుకుని, కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

News August 22, 2024

HYDలో పీల్చే గాలి చంపేస్తోంది!

image

HYDలో కాలుష్యం పెరుగుతోంది. క్రమక్రమంగా విషవాయువులు పీలుస్తున్న జనాలు అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. ‘స్టేటస్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్’ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2000 నుంచి 2019 వరకు నగరంలో పీఎం 2.5 వంటి సూక్ష్మదూళి కణాల ఉద్గారాలతో అనేక మంది శ్వాసకోశ సంబంధ సమస్యల బారిన పడి మరణించినట్లు వెల్లడించింది. 2000 నాటికి కాలుష్యం బారిన పడి 2,810 మంది, 2019 నాటికి 6,460 మంది మరణించారు.

News August 22, 2024

HYD: రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక కోర్సు..!

image

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే హైదరాబాద్‌లో మాత్రమే ప్రింటింగ్ టెక్నాలజీ కోర్సు ఉంది. దీనిలో చేరడానికి పదో తరగతి పాసై తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించే పాలిసెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే చాలు. HYDలో జూ పార్క్ సమీపంలోని కులీ కుతుబ్షా (QQ) గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో మాత్రమే ఈ కోర్సు బోధిస్తున్నారని, విద్యార్థులు మెరుగైన ఉపాధి పొందుతున్నట్లు లెక్చరర్లు తెలిపారు.

News August 22, 2024

హైటెన్షన్: హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి ధర్నా

image

HYDలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గురువారం ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నేతల ధర్నా కార్యక్రమం జరగనుంది. మరికాసేపట్లో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఆందోళన చేపట్టనున్నారు. మరోవైపు రైతు రుణమాఫీ‌పై కేటీఆర్‌ పిలుపు మేరకు బీఆర్ఎస్‌ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఒకేరోజు అధికార, ప్రతిపక్ష నేతల ధర్నాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

News August 22, 2024

హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన చికెన్ ధరలు

image

నగరంలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత రెండు వారాల క్రితం కేజీ చికెన్ రూ. 160(స్కిన్‌లెస్) చొప్పున విక్రయించారు. ఇక నిన్నటి నుంచి మాంసం ధరలు‌ మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. గురువారం డ్రెస్డ్ కేజీ ధర రూ. 187, స్కిన్‌లెస్ ధర రూ. 213, ఫాంరేటు రూ. 107, రిటైల్ రూ. 129గా ఉంది. శ్రావణ మాసం తొలివారానికి, ఈ రోజు పోల్చితే కేజీకి ఏకంగా రూ. 40 పెరగడం గమనార్హం.
SHARE IT

News August 21, 2024

HYD: గణేశ్ ఉత్సవాలకు భారీ బందోబస్తు: సీపీ

image

గణేశ్ ఉత్సవాలు సజావుగా సాగేలా భారీ బందోబస్తు, నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. బుధవారం గణేశ్ ఉత్సవాల బందోబస్తుపై అధికారులతో రాచకొండ సీపీ సమన్వయ సమావేశం నిర్వహించారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు మండపాల నిర్వాహకులు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలన్నారు. మండపాల్లో డీజేలకు అనుమతి లేదని సీపీ స్పష్టం చేశారు.
SHARE IT