India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంటర్ పరీక్ష రాసే విద్యార్థులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. చింతల్ బస్టాండ్ నుంచి రిడ్జ్ టవర్స్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సైతం ఈ ట్రాఫిక్లో చిక్కుకోవడం గమనార్హం. సంబంధిత అధికారులు ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు క్లియర్ చేసేలా చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. ఎగ్జామ్ సమయంలో ప్రధాన సర్కిళ్ల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య కేంద్రమైన ప్రొఫెసర్ జి.రామ్రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అందించే వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంబీఏ రెగ్యులర్ పరీక్ష ఫలితాలతో పాటు డిగ్రీ కోర్సుల సప్లమెంటరీ రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంబీఏ (ఈవినింగ్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్ – ఈవినింగ్) కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు.
ఆదిలాబాద్లోని సీసీఐ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధంకావడం దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సీసీఐని పునఃప్రారంభిస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి ఓట్లు దండుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలంటే బీజేపీకి పట్టింపు లేదని, ఆ సంస్థను స్క్రాప్ కింద అమ్మాలని చూస్తుండటం ప్రజలను వంచించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
HYDకు చెందిన జెమిని ఎడిబుల్స్& ఫ్యాట్స్, కోయంబత్తూరుకు చెందిన మసాలా బ్రాండ్ శ్రీ అన్నపూర్ణ ఫుడ్స్ జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేశాయి. ఈ మేరకు మంగళవారం ప్రెస్మీట్లో సంస్థల ప్రతినిధులు ప్రకటించారు. బ్రాండింగ్& పంపిణీకి రూ.70 కోట్లు, రాబోయే రెండేళ్లలో మరో రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో చంద్రశేఖర రెడ్డి, విజయ్ ప్రసాద్, అక్షయ్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.
బడ్జెట్ సమావేశాలు దగ్గర పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అందుకోసం ఈనెల 6న కేబినెట్ మీటింగ్ నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం ఈ సమావేశం జరగనుంది. కాగా ఈ సమావేశంలో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలను చర్చించనున్నారు.
మహిళలను గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచకొండ కమిషనరేట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నాగోల్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనరేట్ విభాగాల పోలీసు మహిళా అధికారులు పాల్గొన్నారు.
రాయదుర్గంలో విషాద ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాలు.. వికారాబాద్ జిల్లాకు చెందిన దేవిక(25), సతీశ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. రాయదుర్గంలో కాపురం పెట్టారు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆదివారం మరోసారి వాగ్వాదం పెట్టుకున్నారు. ఈ మనస్తాపంతో దేవిక ఉరివేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
మలక్పేట జమున టవర్స్లో శిరీష మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెది సహజ మరణం కాదని పోస్టుమార్టం నివేదికలో తేలింది. పోలీసుల వివరాలు.. 2016లో వినయ్ను శిరీష ప్రేమ వివాహం చేసుకుంది. మలక్పేటలో దంపతులు కాపురం పెట్టారు. ఆమెపై అనుమానంతో వినయ్ వేధించేవాడు. ఈ క్రమంలోనే భార్యను చంపి, గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించాడు. చివరకు హత్య విషయం బయటపడడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో ఇంటర్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. హైదరాబాద్లో 244, రంగారెడ్డిలో 185, మేడ్చల్ మల్కాజిగిరిలో 150 కలిపి మొత్తం 579 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. మూడు జిల్లాల్లో 4,64,445 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. నగరంలోని అన్ని సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 040-29700934కు కాల్ చేయండి.
SHARE IT
Sorry, no posts matched your criteria.