Hyderabad

News August 21, 2024

HYD: ప్రతి ఏటా కొత్తగా 15,000 క్యాన్సర్ కేసులు!

image

HYD నగరంలోని MNJ క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రతి ఏటా కొత్తగా సుమారు 15,000 క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రతి సంవత్సరం మేజర్ సర్జరీలు 4500, మైనర్ సర్జరీలు 6000, రేడియేషన్ థెరపీలు దాదాపు 300 మందికి జరుగుతున్నాయి. కీమోథెరపీ చికిత్సలు సైతం 300 మందికి జరుగుతున్నట్లు తెలిపారు. దాదాపుగా 1.5 లక్షల మందికి వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

News August 21, 2024

HYD: 2 వేల మందితో భారీ ర్యాలీ

image

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం ఘటనను నిరసిస్తూ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అన్ని ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు (దాదాపు 2 వేల మంది) ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు. శంషాబాద్ RBనగర్ నుంచి మధురానగర్, HYD- బెంగళూరు రహదారి మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది.

News August 21, 2024

HYDను వణికిస్తున్న డెంగ్యూ.. జాగ్రత్త!

image

HYD, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ ఏడాది హైదరాబాద్ జిల్లాలో ఏకంగా 1,751, మేడ్చల్-399, రంగారెడ్డి-310 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గాంధీ, ఉస్మానియా, ఏరియా ఆసుపత్రుల్లో జ్వర లక్షణాలతో వస్తున్న పేషెంట్లు కిక్కిరిసిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దోమల నివారణకు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోని, దోమతెరలు వాడాలన్నారు.

News August 21, 2024

ఈనెల 23న హరేకృష్ణ హెరిటేజ్ టవర్ ‘అనంతశేష స్థాపన’

image

నగరం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. నార్సింగిలో హరే కృష్ణ మూమెంట్ సంస్థ ‘హరే కృష్ణ హెరిటేజ్ టవర్ పేరుతో భారీ ఆలయాన్ని నిర్మిస్తోంది. ఈ నెల 23న అనంతశేష స్థాపన ద్వారా ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. హరేకృష్ణ మూమెంట్ ఛైర్మన్, అక్షయపాత్ర ఫౌండేషన్ ఛైర్మన్ మధు పండిట్ దాస్ ప్రభూజీ తదితరులు హాజరుకానున్నారు.

News August 21, 2024

HYD: రేపటి నుంచి దోస్త్ ఇంట్రా కాలేజ్ రెండో విడత

image

దోస్త్ ద్వారా ఆయా డిగ్రీ కళాశాలల్లో చేరిన విద్యార్థులు అదే కళాశాలలో గ్రూపు మారేందుకు ఇంట్రా కాలేజ్ రెండో విడతను చేపడుతున్నామని, ఈనెల 22, 23 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని కన్వీనర్ ఆచార్య ఆర్.లింబాద్రి తెలిపారు. గ్రూపు మారేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 24న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు.

News August 21, 2024

HYD: ఇక BRS ఎప్పటికీ గెలవదు: జగ్గారెడ్డి

image

KTR రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, పొలిటికల్ కోచింగ్ సెంటర్‌లో ట్రైనింగ్ తీసుకుంటే మంచిదని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. ‘రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు పెడితే తీసేస్తాం అంటారా? మీరు తీసేస్తే మేం చూస్తూ ఊరుకుంటామా? తెలంగాణ తల్లి మన గుండెల్లో ఉండాలని లోపల ప్రతిష్ఠిస్తున్నాం. BRS ఎప్పటికీ గెలవదు. మళ్లీ గెలిచేది కాంగ్రెస్సే’ అని అన్నారు.

News August 21, 2024

HYD: ‘ప్రైవేటు టీచర్స్, ఉద్యోగుల రక్షణకు చట్టం కావాలి’

image

ప్రైవేటు ఉపాధ్యాయులు, ఉద్యోగుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం రావాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. అప్పుడే కోర్టుల్లో తమ హక్కుల కోసం పోరాడవచ్చని చెప్పారు. తెలంగాణ ప్రైవేట్‌ టీచర్స్‌ ఫోరం అధ్యక్షుడు షేక్‌ షబ్బీర్‌ అలీ అధ్యక్షతన ‘విద్యాభివృద్ధి-ప్రైవేట్‌ ఉపాధ్యాయుల పాత్ర’ అన్న అంశంపై మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

News August 21, 2024

HYD: రియల్ ఎస్టేట్‌లో మరో భూమ్: మంత్రులు

image

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో భూమ్ రాబోతుందని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. HYD ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ సదస్సు 2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు హాజరై మాట్లాడారు. స్థిరాస్తి వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందన్నారు.

News August 21, 2024

ఈనెల 23న కోకాపేటకు సీఎం

image

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 23న కోకాపేటకు వస్తున్నారని హరేరామ హరేకృష్ణ సంస్థ నిర్వాహకులు తెలిపారు. కోకాపేట హరేరామ హరేకృష్ణ స్థలం ప్రాంగణంలో 430 అడుగుల ఎత్తుతో శ్రీకృష్ణ ఆలయం(హరేకృష్ణ హెరిటేజ్‌ టవర్‌) నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆలయ నిర్మాణంలో భాగంగా అనంతశేషస్థాపన పూజా కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా పాల్గొంటారని వారు తెలిపారు.

News August 21, 2024

HYD: పాఠశాలలకు 5రోజులు సెలవులు?

image

రానున్న 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం భారీ వర్షాల ప్రభావంపై రెవెన్యూ, విద్య, వైద్య, అగ్ని, పోలీసు శాఖ అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. పరిస్థితులను బట్టి ఆయా ప్రాంతాల అధికారులు పాఠశాలలకు ముందస్తు సెలవులు ప్రకటించాలని ఆదేశించారు.