India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నగరంలో వర్షం వస్తే బయటకు వెళ్లాలంటేనే భయం. కారణం వాటర్ లాగింగ్ పాయింట్లు HYDలో పెరగడం గతంలో వాటర్ లాగింగ్ పాయింట్లు 144 ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 436కు పెరిగినట్లు తేలింది. దీంతో అధికారుల్లో ఒక రకమైన ఆందోళన, అన్ని చోట్లా నీరు నిలిచిపోతే నగరం ఏమైపోతుందన్న భయం.. ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారుల సర్వేలో ఈ వివరాలు తెలిశాయని సమాచారం.
మహిళా న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు దేశంలోనే టాప్ ప్లేస్లో నిలిచింది. 33.3% మహిళా జడ్జీలు ఇక్కడ సేవలందిస్తున్నారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో మొత్తం 30 మంది జడ్జీలు ఉండగా 10 మంది అంటే 33.3% మంది మహిళా జడ్జిలు ఉన్నారు. అదే ఏపీలో 30 మందికి గానూ 16.67 % అంటే ఐదుగురే ఉండటంతో జాబితాలో 9వ స్థానంలో నిలిచింది. సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసర్చ్ నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది.
తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి త్వరలో భేటీ కానున్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు సంబంధించి ఇద్దరు మాట్లాడనున్నట్లు సమాచారం. రోడ్ అలైన్మెంట్, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల విషయాలు చర్చించనున్నారు. వీరి చర్చలు ఓకే అయితే.. ఆ నివేదికను కేంద్రానికి పంపి అనుమతి కోరనున్నట్లు తెలిసింది.
మహానగరం హత్యలతో ఉలిక్కిపడుతోంది. రక్తపు చారలతో మైల పడుతోంది. వారం రోజుల్లోనే 2 దారుణ హత్యలు జరిగాయి. 18వ తేదీన కూకట్పల్లిలో సహస్ర (12)ను 10వ తరగతి విద్యార్థి దారుణంగా కత్తితో పొడిచి హత్య చేయగా.. 23న బోడుప్పల్లో మహేందర్రెడ్డి తన భార్య స్వాతి(21)ని అత్యంత దారుణంగా చంపి శరీరాన్ని ముక్కలు చేసి మూసీలో పడేశాడు. అత్యంత పాశవికంగా జరిగిన ఈ హత్యలతో మానవత్వం ఏమైపోతోందంటూ పలువురు మండిపడుతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నిర్బంధాల నడుమ ఉస్మానియా యూనివర్సిటీని సందర్శిస్తున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ మండిపడ్డారు. సీఎం పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులలో భాగంగా ఆయనను అంబర్పేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధికారం కోసం హామీలు ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసి, ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు.
మహానగరంలో పోకిరీల బెడద నుంచి కాపాడాలని సైబరాబాద్ షీ టీమ్స్కు పలువురు ఫోన్ చేసే సహాయం అర్థిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు షీటీమ్స్ సిబ్బంది 143 డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించారు. అసభ్యకరంగా వేధిస్తున్న 70 మందిని పట్టుకున్నట్లు డీసీపీ సృజన కరణం తెలిపారు. అంతేకాక 34 మంది భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు వివరించారు. బాధితులు 181, 1098కు ఫోన్ చేసి చెప్పాలని ఈ సందర్భంగా సూచించారు.
శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆత్మీయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సమావేశమయ్యారు. తమ అభిమాన నాయకుడిని చూసిన కార్యకర్తలు సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో కేటీఆర్ స్వయంగా వారితో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. దీంతో కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పార్టీలో కొందరు ప్రధాన నేతలు మోసం చేసినా.. కార్యకర్తలు పార్టీని గుండెల్లో పెట్టుకుని చేసుకుంటున్నారని వారిని కీర్తించారు.
గణేశ్ మండప నిర్వాహకులకు విద్యుత్ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. నిర్వాహకులు కనెక్షన్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గ్రేటర్లో గతంలో కమర్షియల్ కేటగిరి కింద తాత్కాలిక కనెక్షన్లు జారీ చేసి రూ.1,500 వరకు వసూలు చేసేవారు. ప్రభుత్వం ఈ నెల 27 నుంచి వచ్చేనెల 6 వరకు మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనుంది.
షిర్డీ యాత్రలో 1973లో కొన్న చిన్న వినాయకుడి విగ్రహంతో ప్రారంభమైన సికింద్రాబాద్ వాసి శేఖర్ భక్తి నేడు ప్రపంచ రికార్డు స్థాయికి చేరింది. సాధారణంగా అందరూ స్టాంపులు, నాణేలు సేకరిస్తే, ఆయన మాత్రం 21,708 గణేశుడి విగ్రహాలు, గణపయ్యకు సంబంధించిన 19,558 పోస్ట్కార్డులు, ఫొటోలు 14,950, పోస్టర్లు 11,005, కీ చైన్లు 250, ఆడియో, వీడియోలు 250తో కలిపి మొత్తం 58,748 సేకరించారు. ఇది హాబీ కాదు జీవిత మిషన్ అన్నారు.
అది 25 AUG 2007 సాయంత్రం.. లుంబినీ పార్కులో ఫ్యామిలీస్, గోఖుల్ ఛాట్ వద్ద ఫుడీస్ ఛాట్ ఎంజాయ్ చేస్తున్నారు. సందడిగా ఉన్న ఆ ప్రదేశాల్లో క్షణకాలంలో ఆర్తనాదాలు, రక్తపు మడుగులో శరీరాలు పడి ఉండటంతో దేశమే ఉలిక్కిపడింది. 18ఏళ్ల క్రితం ఉగ్రవాదుల ఇనుప ముక్కల బాంబులు కుటుంబాలను చీల్చేశాయి. ఆ పరిస్థితులను గుర్తుచేసుకుంటే ఇప్పటికీ నగరవాసులకు చెమటలు పడతాయి. ఈ ఘటనల్లో 42 మంది మృతిచెందగా.. వందల మంది మంచానపడ్డారు.
Sorry, no posts matched your criteria.