India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలంగాణ సీఐడీ నుంచి రెండు పోలీస్ కేనైన్లు సైబరాబాద్ కమిషనరేట్కు బదిలీ అయ్యాయి. దీంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న జాగిలాల సంఖ్య18కు చేరింది. పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాల గుర్తింపు, ట్రాకింగ్ వంటి కీలక విధుల్లో ఇవి సేవలందించనున్నాయి. సీఐడీ నుంచి వచ్చిన ‘రానా’ (బెల్జియన్ మాలినోయిస్), ‘రాడో’ (లాబ్రడార్) నేరాల ఛేదనలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు.

నిర్మాణ వ్యర్థాల పారబోతపై GHMC పకడ్బందీగా వ్యవహరించనుంది. నాలాలు, చెరువుల్లో వ్యర్థాలు పారబోస్తే రూ.2 లక్షల ఫైన్ విధించే అవకాశం ఉంది. ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు డంప్ చేసినా ఫైన్ విధిస్తామని అధికారులు హెచ్చరించారు. బస్భవన్, VST పాత ఆఫీసు ఎదురు గల్లీలో నిర్మాణ వ్యర్థాలతో రోడ్డు మూసుకుపోవడం గమనార్హం. ఇలాంటివి రిపీట్ కావొద్దంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందే.

పరీక్షలు ముగిసిన తర్వాత పుస్తకాలను చింపి రోడ్లపై వేయకుండా, విద్యార్థులు క్రమశిక్షణతో వ్యవహరించాలని HYDలోని విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. పుస్తకాలు జ్ఞానానికి ప్రతీకలని, సరస్వతి దేవతతో సమామానంగా కొలిచే వాటిని అగౌరపరచొద్దని, అవసరమైనవారికి అందించాలని గుర్తు చేస్తున్నారు. రోడ్లపై పేపర్లు వేస్తే పారిశుద్ధ్య కార్మికులపై భారం పడుతుందని, నగరాన్ని నీట్గా ఉంచడంలో అందరూ సహకరించాలన్నారు.

HYDలో ఒక్కసారిగా వాతావారణం మారిపోయింది. ఉప్పల్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాలను నల్లని మబ్బులు కమ్మేయగా, చల్లని గాలులు వీస్తున్నాయి. అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. వర్ష ప్రభావ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. కొన్ని చోట్ల ఎండగా ఉన్నప్పటికీ ప్రయాణాలను పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని చెబుతున్నారు. మీ ఏరియాలో వర్షం పడుతుందా?

విధులకు హాజరుకాక, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వైద్యులను తొలగిస్తూ DME నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో నగరంలోని గాంధీ, పేట్లబుర్జూ, కోఠి ప్రసూతి ఆస్పత్రి వైద్యులతో సహా 21 మంది ఉన్నారు. ప్రభుత్వ దవాఖానాలకు ఎంపికైనా జాయిన్ అవ్వని, లాంగ్ లీవ్లో ఉన్న వారిని రాష్ట్ర వ్యాప్తంగా 94 మందిని తొలగించారు. వీరంతా అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి ఉద్యోగులే కావడం గమనార్హం.

నాంపల్లి ఎగ్జిబిషన్లో షీ టీమ్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేసి 264 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 242 మంది మేజర్లు, 22 మంది మైనర్లు ఉన్నట్లు గుర్తించారు. 56 మందిపై పెట్టీ కేసులు నమోదు చేయగా, 52 మందికి కోర్టు రూ.1,050 జరిమానా విధించింది. మరో నలుగురికి 2 రోజుల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించింది. 188 మందికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.

మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. కరోనా టీకా తరహాలో ఫ్రీ వ్యాక్సిన్ను నిర్ణయించింది. త్వరలోనే కార్యరూపం దాల్చనుందని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్లో దాదాపు 56 లక్షల మంది మహిళలు ఉండగా.. ఇందులో 14- 26 ఏళ్ల వయసు వారు 12 లక్షల మంది ఉంటారని తెలంగాణ వైద్యారోగ్యశాఖ అంచనా. సమీప PHCల్లో 6 నెలల వ్యవధిలో 3 టీకాలు ఉచితంగా అందించనున్నారు.

‘ఏడిస్తే గుండెలకు హత్తుకుంటావని, ఆకలైతే పాలు తాగిస్తావని అనుకున్నానమ్మా. చిట్టిచేతులు కట్టేసి, గంతలు కడితే దాగుడు మూతలు ఆడుతున్నావ్ అనుకున్నానమ్మా! పొయ్యిలో నన్ను కాలుస్తుంటే ఇలా నిన్ను అమ్మా అని పిలుస్తాననుకోలేదు. నోట్లో గుడ్డలు కుక్కింది నువ్వని తెలిసి విలవిలలాడానమ్మా. ఏంనేరం చేశా నాకెందుకీ శిక్ష’ భౌరంపేట్లో <<19230114>>పసిబిడ్డ<<>> ఇలా అనుకుని ఉంటుందేమో. 9నెలలు మోసిన తల్లే చంపడం నగరాన్ని కలవరపెడుతోంది.

మనిషిని కుంగదీస్తున్న మానసిక రోదన వెనక అనేక కారణాలు ఉన్నాయని మేడిపల్లి డా.సుప్రజ తెలిపారు. మనసు విశ్రాంతిని, మార్పును కోరుకుంటోందని చెప్పే సంకేతం. నీరసం, చిన్నదానికే కోపం, కన్నీళ్లు, నలుగురిలోకి వెళ్లలేకపోవడం లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త. ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, ఒంటరితనం, SM వంటివి తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వివరించారు. ఫోన్లు దూరంపెట్టి నచ్చిన పనిచేస్తే ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయన్నారు.

ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 1,75,271 మంది విద్యార్థులు 217 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాస్తారు. 1st ఇయర్లో 81,898 మంది, 2nd ఇయర్లో 93,373 మంది ఉన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా అలర్ట్ ఇచ్చే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు CC రూమ్కు అనుసంధానించారు. కేంద్రాల వద్ద BNS 163 సెక్షన్ అమల్లో ఉంది. హాల్ టికెట్, పెన్నులు మర్చిపోకండి. ప్రశాంతంగా ఉండండి.
Sorry, no posts matched your criteria.