India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులు డ్రగ్స్ వాడుతున్నట్లు కేసు నమోదు కావడంతో వర్సిటీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సెక్యూరిటీని పెంచారు. ఇష్టానుసారం విద్యార్థులు తిరగకుండా కట్టడి చేశారు. ముఖ్యంగా రాత్రి 10 గంటల తరువాత ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ను అనుమతించబోమని, అంతేకాక క్యాంపస్లోకి ఐడీ కార్డు లేనిదే అడుగుపెట్టనివ్వడం లేదని సెక్యూరిటీ అధికారి తెలిపారు.
వ్యవసాయ రంగంలో కీలక పరిశోధనలకు నిలయమైన NAARM (నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్) నగరంలో ఏర్పాటై ఈరోజుకు 50 ఏళ్లయింది. రాజేంద్రనగర్లో 1976 సెప్టెంబర్ 1న నార్మ్ ఏర్పాటు చేశారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో నార్మ్ శాస్త్రవేత్తలకు శిక్షణ కూడా ఇస్తోంది. అగ్రికల్చర్కు NAARM ఒక దిక్సూచి అని ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ గోపాల్లాల్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ టికెట్పై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేల విషయంపై కోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై పూర్తి వివరణ ఇచ్చేందుకు తమకు పది రోజుల టైం కావావాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్పీకర్ను అసెంబ్లీ ఆవరణలోని కార్యాలయంలో కలిసి కోరారు.
HYD ఎర్రమంజిల్లోని పంచాయతీరాజ్ శాఖ సమావేశ మందిరంలో మంత్రి సీతక్క అధికారులతో ఈరోజు సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గాల్లో జరుగుతున్న రోడ్లు, వంతెనల నిర్మాణాలు తదితర అభివృద్ధి పనులపై చర్చించారు. పెండింగ్లో ఉన్న పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, పీఆర్ అధికారులు పాల్గొన్నారు.
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. తండోపతండాలుగా ఏకదంతుడి మహారూపం చూడటానికి వస్తున్నారు. దీంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు రద్దీగా మారుతున్నాయి. శనివారం 2 లక్షల మంది, ఆదివారం 4 లక్షల మంది దర్శించుకున్నారు. ఈ సంఖ్య ఈరోజు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఖైరతాబాద్కు వచ్చే బస్సులు, మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్ సర్వీసులు కిటకిటలాడుతున్నాయి.
తెలంగాణ సంప్రదాయ పండుగైన బతుకమ్మ వేడుకల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యంగా HYD హుస్సేన్ సాగర్లో ఫ్లోటింగ్ బతుకమ్మ వేడుకల పేరుతో సరికొత్త కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రముఖులను కూడా వేడుకల్లో భాగం చేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు మంత్రి జూపల్లి త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.
KPHB కాలనీలో రామకృష్ణారెడ్డి, రమ్యకృష్ణ <<17560313>>దంపతులు<<>> ఒకరికొకరు పొడుచుకొని చనిపోవాలని తీసుకున్న నిర్ణయం నిజమా, లేక నాటకమా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇద్దరూ చనిపోవాలనుకుంటే భార్య మాత్రమే ఎలా బతికి ఉంది? అదీ 24 గంటలపాటు భర్త భౌతికకాయం వద్ద ఏం చేసిందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. చికిత్స పొందుతున్న రమ్యకృష్ణ నోరువిప్పితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి.
ఆగస్టులో 31 కేసులు నమోదు చేశామని TG ACB ప్రకటించింది. 15ట్రాప్ కేసులు, 2 DA కేసులు, 3 మిస్ కండక్ట్ కేసులు నమోదయ్యాయి. 20మంది ఉద్యోగులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రూ.2.82లక్షల లంచం సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. DA కేసులో రూ.5.13కోట్లు, అనుమానాస్పద ఆస్తులు గుర్తించారు. 2025 జనవరి-ఆగస్టు వరకు 179కేసులు నమోదు కాగా 167మంది ఉద్యోగులు లంచం కేసుల్లో పట్టుబడ్డారని ACB తెలిపింది.
స్వీపింగ్ మిషన్లకు సంబంధించిన కాంట్రాక్ట్ రద్దు చేసిన GHMC, అద్దె యంత్రాల కోసం మళ్లీ టెండర్లును పిలిచి నవ్వుల పాలవుతుంది. ఎల్బీనగర్, శేర్లింగంపల్లి, ఖైరతాబాద్ జోన్ ప్రాంతాల్లో స్విపింగ్ కోసం దాదాపు రూ.2 కోట్లు చెల్లించేందుకు టెండర్లను పిలిచారు. జీహెచ్ఎంసీ అధికారుల తీరు, తీసుకునే చర్యలపై స్థానిక జోన్ ప్రాంతాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిమజ్జనాల కోసం RTA వాహనాలు అందించేందుకు సిద్ధమైంది. HYD వ్యాప్తంగా 12వాహన కేంద్రాలను నిమజ్జనాల కోసం గుర్తించింది. ఈ కేంద్రాల నుంచి మండపాలకు వాహనాలు తీసుకెళ్లొచ్చు. నెక్లెస్ రోడ్డు, మేడ్చల్, టోలిచౌకి, జూ పార్క్, మలక్పేట, కర్మన్ఘాట్, నాగోల్, గచ్చిబౌలి, మన్నెగూడ, పటాన్చేరు, వనస్థలిపురం, ఆటోనగర్ RTA కేంద్రాల నుంచి వాహనాలను మండపాలకు తరలించునున్నారు.
Sorry, no posts matched your criteria.