Hyderabad

News August 10, 2025

కూకట్‌పల్లి: లవర్‌తో మాట్లాడుతున్నాడని బ్లేడ్‌తో దాడి

image

కూకట్‌‌పల్లి PS పరిధిలో యువకుడిపై బ్లేడుతో దాడి చేసిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. జనతానగర్‌లో వర్ధన్ (33) వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వర్ధన్ తన లవర్‌తో మాట్లాడుతున్నాడని కోపం పెంచుకున్న భాస్కర్ బ్లేడ్‌తో అతడి మెడపైన దాడి చేశాడు. ఈ దాడిలో వర్ధన్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News August 10, 2025

BREAKING: హఫీజ్‌పేట్‌‌లో MURDER

image

HYDలో ఆదివారం దారుణ ఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాలు.. మియాపూర్ PS పరిధి హఫీజ్‌పేట్‌ రైల్వే స్టేషన్ వద్ద భవన నిర్మాణ సామగ్రి, కర్రల వ్యాపారం చేస్తున్న శ్రీనివాస్(36)‌ను హత్య చేశారు. ఇతడి షాపు పక్కనే దుకాణం నడుపుతోన్న సోహెల్(19) మరో వ్యక్తితో కలిసి కత్తితో పొడిచారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన శ్రీనివాస్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News August 10, 2025

HYDలో ఆసియా, ఆఫ్రికా మృగరాజులు

image

HYD నెహ్రూ జూపార్క్‌లో విదేశం నుంచి తీసుకొచ్చిన సింహాలు ఉన్నాయని మీకు తెలుసా..? అవును ఇది నిజమే. జూలో మొత్తం 22 సింహాలున్నాయి. వీటిలో 8 ఆఫ్రికా నుంచి, 14 ఆసియా నుంచి తెప్పించారు. వీటి పర్యవేక్షణకు ఒక్క సింహానికి ఒక్కో సిబ్బందిని నియమించారు. ప్రత్యేక ఎన్‌క్లోజర్లు, వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని ACలను అమర్చాల్సి ఉంటుంది. నేడు World Lion Day సందర్భంగా జూ పార్కులో మృగరాజులు ఆకర్షణగా నిలిచాయి.

News August 10, 2025

HYD: పప్పులోకైనా, నాన్‌వెజ్‌కైనా చింతచిగురు అదుర్స్

image

చింత చిగురు రుచి చూస్తే దాన్ని మరిచిపోరు. ఇందులో కారం, ఉప్పు వేసుకొని తింటే ఆహా అనాల్సిందే. పప్పులోకైనా, నాన్‌వెజ్‌లోకైనా దీని కాంబినేషన్ అదిరిపోతుంది. కాంక్రీట్ జంగల్‌ విస్తరిస్తుండటంతో చింతచెట్ల సంఖ్య నానాటికి తగ్గిపోతుంది. చెట్ల కొరతతో దీని ధర పెరిగింది. శివారు నుంచి తెచ్చి HYDలో విక్రయిస్తున్నారు. కిలో రూ.1,200 వరకు పలుకుతోంది. దీంట్లో ఔషధ గుణాలు ఉంటాయని స్టడీ చెబుతోంది. మీరూ దీన్ని తిన్నారా?

News August 10, 2025

కొంపల్లి: జర భద్రం.. మాయ‘దారి’ మనకొద్దు

image

సుచిత్ర- కొంపల్లి- మేడ్చల్ దారిలో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో లేని దారిని సృష్టించి బైక్‌లను ఫుట్‌పాత్, డ్రైనేజీ మీద నుంచి వెళుతున్నారు. ఇలా వెళ్లడం ప్రమాదకరం అని అధికారులు హెచ్చరిస్తున్నారను. దారి పొడవునా రాకపోకలకు ఇబ్బంది నెలకొందని ఈ తరహా ప్రయాణాలతో ఇతరులకు ప్రమాదం జరిగుతుందని అధికారులు చెబుతున్నారు. జర ఉన్న దారిలో వెళ్లి ఉన్నవారికి తోడుగా ఉండు సోదరా అని పలువురు SMలో కామెంట్లు చేస్తున్నారు.

News August 10, 2025

HYD: రాజగోపాల్‌రెడ్డిపై క్రమశిక్షణా కమిటీ చర్యలు?

image

నాంపల్లిలోని గాంధీ భవన్‌లో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, వరంగల్ నేత కొండా మురళీ వ్యాఖ్యలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. వీరిపై ఏదో రకంగా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

News August 10, 2025

HYD: పెళ్లైన గంటల్లోనే గుండెపోటుతో యువకుడి మృతి

image

వివాహమైన కొద్ది గంటల్లోనే ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల వివరాలిలా.. బడంగ్‌పేట్ లక్ష్మీదుర్గకాలనీకి చెందిన ఈవెంట్స్ మేనేజర్‌ విశాల్ కుమార్ (25)కు ఈ నెల 7న వివాహం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఇంటికి చేరుకోగానే విశాల్ అస్వస్థకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గ్లోబల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.

News August 10, 2025

KCR దాన్ని BREAK చేశారు: TPCC చీఫ్

image

ఎక్కడైనా ప్రజాప్రతినిధి చనిపోతే అక్కడ వారి కుటుంబానికి అవకాశం ఇచ్చే సంస్కృతి గతంలో ఉండేదని, దానికి తిలోదకాలిచ్చింది BRS అధినేత KCR అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప‌ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాగానే తమ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామని గాంధీభవన్‌లో స్పష్టం చేశారు. అక్కడ తమ పార్టీ అభ్యర్థిదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు.

News August 10, 2025

ఆరాంఘర్‌లో RTC టెర్మినల్ ఇక డౌటే!

image

వేలాదిబస్సులు వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. దీంతో ఆర్టీసీ టెర్మినల్ నిర్మించాలని గతంలో సర్కారు నిర్ణయించింది. అయితే ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. అక్కడి ప్రభుత్వ స్థలాన్ని పోలీసుశాఖకు ఇవ్వనున్నట్లు సమాచారం. పోలీసుశాఖ ఆధీనంలోని గోషామహల్ మైదానం ఉస్మానియా ఆస్పత్రికి కేటాయించడంతో ఆరాంఘర్ స్థలం ఆ శాఖకు ఇవ్వాలని నిర్ణయించడంతో బస్ టెర్మినల్‌కు బ్రేక్ పడినట్టేనని తెలుస్తోంది.

News August 10, 2025

HYD: కారు బోల్తా పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

image

కారు బోల్తాపడడంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందిన ఘటన రాయదుర్గం PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. ఛత్తీస్‌ఘఢ్‌కు చెందిన త్రిపాఠి మాదాపూర్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం తన కారులో స్నేహితులతో కలిసి నాలెడ్జి సిటీకి వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో త్రిపాఠికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్నేహితులు క్షేమంగా బయటపడ్డారు. కేసు నమోదైంది.